సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

సాయి‬ నామ మహిమ

సాయి‬ నామ మహిమ

సాయి‬ నామ మహిమ
'అ' కార 'ఉ' కార 'మ' కారములు ఓంకార మనబడును. అటువంటి ఓంకార స్వరూపుడు సాయి. ఈ ప్రపంచమంతా సకల చరాచర జగత్తులో అణువణులోనిండి వున్నది సాయి నామం,సాయి రూపం. సాయి నామం కష్టములు హరించునది, సాయి నామం భవసాగారములోభయాలు, ఆపదలు తొలగించునది, గురువులకే సద్గురువయిన దత్త స్వరూపమయిన సాయి చరణాలను తలుస్తూ సాయి నామాన్ని లిఖిస్తే మన మనస్సు, బుద్ధి, శరీరం తో త్రికరణశుద్ధిగా‬ స్మరణ జరుగుతుంది.
సాయినామము‬
ఓం లయకరా సాయి బాబా నమస్కారములు నమస్కారములు.
శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
( ఈ నామము ఇప్పుడే పంతొమ్మిది సార్లు పలకండి )
గురుర్‌‬ బ్రహ్మ గురుర్‌ విష్ణూః
గురుర్‌ దేవో మహేశ్వరః
గురుర్‌ సాక్షాత్‌ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః
‘గు’ అంటే చీకటి, అజ్ఞానం. ‘రు’ అంటే వెలుగు, జ్ఞానం. తన వద్దకు చేరిన శిష్యూని మనస్సులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును చూపించే వాడు గురువు. అందుేక గరువు సృష్టి. స్థితి, లయ కారులైన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణూ, మహేశ్వరులు ఏకరూపం దాల్చిన పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొనబడినారు. శిరిడీ సారుుబాబా సద్గురువు, గురువులకు గురువు. ఆత్మసాక్షాత్కారాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు. బ్రహ్మజ్ఞానం‬ పొందినవారు, సమాజానికి దూరంగా ఉంటూ, ఏకాంతంలో కాలం గుడుపుతుంటారు. భవ బంధాలతో సంబంధాలను వదల్చుకొంటారు.
శిరిడీ సాయిబాబా అటువంటివారు కాదు. బ్రహ్మ జ్ఞాని అయినా, సమాజంలో ఉంటూ ప్రజలందరితో కలసి మెలసి, వారి సాధక బాధకాలను గ్రమిస్తూ, వారి క్షేమం కోసం పరితపిస్తూ, మంచి మార్గాన నడవడం కోసం సముచిత బోధనలు చేస్తూ, తన మాటల విలువకోసం, విశ్వాసం కోసం కొన్ని అద్భుత కార్యాలను చేసి చూపించారు.ఆయన భూతభవిష్యత్‌ వర్తమాన ‪‎కాలజ్ఞానాన్ని‬ గుప్పిట బట్టినవారు. బాబా జీవితమూ, బోధనలూ, ప్రవర్తనలూ, చేసిన కార్యాలూ అన్నీ నవరస సమ్మిశ్రీతమనపిస్తాయి. సాధారణ మానవునిలో, సహజ గుణాలు, అసహజ విధానాలు, ప్రవర్తనలు ఏ రీతిలో నిక్షిప్తమై ఉండి, ఏయే పరిస్థితుల్లో ఏవిధంగా బహిర్గతమవుతుంటాయో, శక్తు లను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ ఆయన ప్రజాశ్రేయ స్సు కోసం, విశ్వశాంతి నెలకొల్పడం కోసం చేసినవే.సముద్రంలో ప్రయాణం చేసే వారికి మార్గదర్శకంగా ఉండేవి - ఎత్తయిన దీపస్తంభాలు. ఆ దీపస్తంభాల నుం డి వెలువడే వెలుగు, ప్రయాణీకులకు తామేదిశగా పోతున్నామో, ఎటువైపు పోవాలో సరైన మార్గమేదో తెలియజేస్తుంది. ‪‎శిరిడీ‬ సాయిబాబా అలాంటి ఉన్నత దీపస్తంభం లాంటివారు. బాబా గాథలూ, బోధనలూ ప్రపంచమనే మహాసముద్రంలో పయనించే వారందరికీ మార్గనిర్దేశం చేస్తాచి. జీవనసాగర యాత్రను సులభత రం చేస్తాయి.
శిరిడీ సాయిబాబా గాథలు, బోధనలు‬ మన చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశించేటప్పుడు దేహ స్పృహ ను, అహంకారాన్న ద్వంద్వ భావాలనూ నిష్ర్కమించే టట్లు చేస్తాయి. అవి ఆశ్చర్యాన్నీ, అద్భుతాలనూ మన కనుల ముందు ఆవిష్కరిపంజేస్తాయి. మనోవికలత పొందిన వారికి, విచార గ్రస్తులకు, శాంతిని సమకూర్చి ఆనందం కలిగిస్తాయి. ఇహపరాలకు కావలసిన జ్ఞానా న్ని, బుద్ధినీ కలుగజేస్తాయి. బాబా ప్రబోధాలను విని, వానిని మననం చేసుకుంటే, భక్తులు కోరుకొనే బ్రహై్మకయోగం, అష్టాంగ యోగ ప్రావీణ్యం, ధ్యానానం పొందగలరు.శిరిడీ సాయిబాబా వంద సంవత్సరాలప్పుడు అందరి ముందు తిరుగాడిన సజీవమానవతామూర్తి, మనుష్యు‬ లై పుట్టినందుకు సత్యం తెలుసుకొన్నప్పుడే జన్మసార్థక మవుతుంది. సూక్ష్మంగా గమనిస్తే సత్యమే ఈశ్వరుడని తేలుతుంది. నదులన్నీ సముద్రంలో కలసి ఒకటైనట్లు జీవాత్మ పరమాత్మతో కలిస్తే అది సత్యవస్తువే అవుతుం ది. అప్పుడు ‘నేను’ అనే అహంకారం తొలగిపోతుంది. మనకు దేహధారణకు కావలసిన దానికంటె ఎక్కువ గ్రహించడం దొంగతనం అవుతుంది. ఎక్కువ గ్రహిం చకపోవడం అపరిగ్రహం. ఇది వేదాంత నియమం.
శేష నగము జేరి చెలు వార కొలువైన
వేంకటేశ్వరుడవు వెలయ మాకు
కలల పంటవైన యిల వేల్పు నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
తిరుమ లేశు నెదను దీటు గా కొలువైన
అమ్మ- త్రిభువనాల కండ దండ
పరమ సాధ్వి యైన పద్మావతియె నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
తాను విశ్వ మందు తన యందు విశ్వమ్ము
" తామరాకు నీరు " తనరు భంగి
వెలయు విష్ణు రూప ! విశ్వావనీ నాధ !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
పసిడికి నిలువెల్ల భాసురంబగు కొల్వు
శ్రీకరముల నెలవు చిత్త మెల్ల
సిరులు రూపు దాల్చు శ్రీలక్ష్మి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
సకల శుభము లిచ్చి సాయుజ్యముల నిచ్చి
సగము తనువునిచ్చి సత్కరించు
భక్త సులభు డైన పరమేశ్వరుడ వీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
అరయ ప్రాణికోటి కాహార మిచ్చేటి
అమ్మ – త్రిభువనముల కన్న పూర్ణ
సర్వ మంగళ , శుభ , శర్వాణి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
విశ్వ స్రస్ట తాను విశ్వమ్ము సృజియించి
మొదలి జన్మలరసి విధి లిఖించె
బ్రహ్మ నీవె పరమ బ్రహ్మమ్ము నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
వరలు దేహమెల్ల వాగర్ధ విభవమ్ము
భావ సంపదల ప్రభావ మయము
ఎరుక రూపు దాల్చు పర శారదే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
రామ నామ మధుర రస ధార సేవనా
నంద మహిమ లెన్న నాతరంబె
సాయి రాము డనగ సర్వోన్నతుడ వీవె
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
శ్రీ రాము పత్ని , జనకజ ,
గారాముల భూమి పుత్రి , కమనీయ ,దయా
వారాశి , సీత నీవయి
కారుణ్య రసాబ్ధి దేల్చి కావర సాయీ !
శ్రీరాము బంటు , అంజని
గారాముల కూర్మి సుతుడు , కరుణాంబుధి , మా
కారాధ్యు డైన మారుతి
నీరూపున గాంచు వరము నియ్యర సాయీ !
పూర్వాద్రి రూప ! పశ్చిమ
పర్వత రూపాయ ! తే నమామి – యటంచున్
సర్వేశుడవగు దినకరు
సర్వోన్నత మూర్తి ! నీకు సన్నుతి సాయీ !
తివిరి భూజనులకు దేదీప్య మానమై
వెలుగునిచ్చి బ్రోచు వేద వేద్య !
తిమిర సంహరణకు దీప్తి నీవేనురా !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
చలన రధము నీవు సారధి యును నీవు
కొదమ గుర్రములును రధియు నీవు
చరమ పధము నీవు చైతన్యమే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడిరాజ !
మదిని నిన్ను బెట్టి మొదలిడి నట్టి యే
కార్య మైన సఫల కారియగును
యింత కన్న జనులు యేమి కోరేరు రా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !!
‪‎

No comments:

Post a Comment