సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 16, 2014

ఆంజనేయ‬ స్వామికి...సిందూర వర్ణం

ఆంజనేయ‬ స్వామికి...సిందూర వర్ణంRamudu Thota Venkataramana's photo.
దెైవానికి మనలాగ కొన్ని రంగులంటే ఇష్టమనీ, మరికొన్ని రంగులంటే అయిష్టమనీ ఉండదు.
అయితే దెైవాన్ని ఉపాసన చేసిన ఋషులు ‪‎దేవుని‬ యొక్క నిజరూపాన్ని దర్శించి, ఆయన ఏయే వర్ణాలతో ఉన్నాడో తెలి పారు. పసుపురంగు విష్ణువుకు సంకేతం. అందువల్లనే ఆయనను ‘పీతాంబరుడు’ అన్నారు.ఎరుపు రంగు శంకరునికి సంకేతం. అందుకే ఆయనను ‘నీలగ్రీవో విలోహిత’ అన్నారు. నీలిరంగుమెడా, ఎరగ్రా ఉండే రూపమే శంకరునిది.
పసుపు రంగూ చిక్కని ఎరుపురంగూ కలి స్తే మరో రంగుగా మారుతుంది. దానినే సిందూరవర్ణం అన్నారు. శివకేశవుల రంగు కలిసి సిందూరవర్ణం అన్నారు. ఈ రంగు ఆంజనేయునిది. అంటే, విష్ణువు యొక్క మేధాశక్తి, శివుని యొక్క తప్పశ్శక్తి కలిగి ఉన్నవాడు ఆంజనేయుడు. గుడిలో‬ప్రతిదెైవానికీ ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది కదా! ఆ ధ్వజస్తంభానికి కింద మరో దెైవరూపం ఉంటుంది. అది గుడిలో ఉన్న ‪‎మూలదెైవానికి‬ నమస్కరిస్తున్నట్లు ఉంటంది.విష్ణువు మూలవిరాట్టుకు ఎదురుగా ధ్వజస్తంభం కింద ఎవరున్నారో చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ విష్ణు దేవునికీ, శివ దేవునికీ ఎదురుగా ఉండే ఒకే ఒక దెైవం ఆంజనేయస్వామి. విష్ణువు దృష్టిని ఎవరెైనా భరించగలరు గానీ, రుద్రుడి తీక్షణ దృష్టిని తట్టుకోగల శక్తి ఏ దేవతకూ లేదు. ఆ శక్తి‬ ఒక్క ఆంజ నేయస్వామికి మాత్రమే ఉంది. ఎందుకం టే రుద్రుని అంశంతో పుట్టిన వాడు ఆంజనేయుడు కనుక.ఈ విషయాన్ని తెలుపడానికే శివ‬ కేశవులిద్దరి రూపవర్ణ మిశ్రమము కలిగిన ఆంజనేయుడు అని వివరణ చెప్పబడింది. అందువల్లనే శివకేశవుల రంగులు కలిసిన సిందూర వర్ణం ఆంజనేయుడికి ఇష్టం.

‪‎ఆంజనేయస్వామి‬ జననo

ఆంజనేయస్వామి‬ జననo {బుద్ధి, బలం, కీర్తి ప్రదాతుడు}
ఒకసారి హనుమంతుడు శ్రీరామచంద్రునితో
''దేమదృష్ట్యాతు‬ దాసోహం
జీవదృష్ట్యాతు దంశకః
వస్తుతస్తు త్వమేవాహ
మితి నిశ్చయతే మతిః| '' ''రామా!'' దేహ దృష్ట్యా నేను దాసుడను. నేను ‪‎జీవరూపంలో‬ మీ అంశను. కానీ పరమార్థ దృష్టిలో చూడగా నేనూ మీరూ ఒక్కటే'' అని హనుమంతుడు‪ ‎శ్రీరామునితో‬ పలికాడు. కనుక ఆంజనేయుడు శ్రీరాము నితో సమానము.
''వైశాఖే మాసికృష్ణాయాః దశిమీ మంద సంయుతా పూర్వ ప్రోష్ఠ పదాయుక్తా అధనైదృత సంయుతా తస్యాం మధ్యాహ్నవేళాయాః జనయా మానవైసుతమ్‌' వైశాఖ మాస, కృష్ణపక్ష, దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీనామ యోగం, గ్రహాలన్నీ శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ‪‎ఆంజనాదేవి‬గర్భయుక్త ఫల ఆంజనేయస్వామి జన్మించాడు. ఆ పరమ శివుడే ఆంజనాదేవి గర్భాన జన్మించాడని తెలిసి, ఆ రుద్రావతారుని చూడడానికి వెళ్లిన సప్తబుుషులు‬ వానర కుమారుని చూసి ఆంజనీగర్భాన ఉదయించిన ఈ బాలుడు 'ఆంజనేయు'డని పిలువ బడుతాడని సెలవిచ్చాడు.సాక్షాత్తు ‪‎ఈశ్వరాంశ‬ సంభూతుడైన ఆంజనేయుడు త్రేతా, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో నేటికి తన లీలలు చూపుతూ చిరంజీవిగా విలసిల్లుతున్నాడు.‪‎బాలాంజనేయుడు‬ ఒకనాడు ఆకలిగా ఉన్నదని తల్లినికోరగా, ఫలముల కొరకు ఆంజనవనమున కేగిన సమయాన ఉదయించుచున్న సూర్యుని చూచి ఫలమని భ్రమించి సూర్య మండలానికి ఎగసి సూర్యుని‬ గ్రహించబోగా, అది గ్రహించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో చీల్చబడిన 'హనుమ (దౌడలు) కారణంగాగా నాటి నుండి ''ఆంజనేయుడు'' ''‪‎హనుమంతుడు‬'గా ప్రసిద్ధి చెందాడు.
శ్రీరాముని‬ కరుణా సాగరంలో పునీతుడైనవాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుని మహిమను లోకానికి చాటుటకై రామసేవకై జన్మించిన కారణ జన్ముడు. హనుమ శ్రీరామచంద్రుని సర్వోత్తమ దాసభక్తుడు. ‪‎రామనామ‬ సాధనం హను మంతుని జీవనం. హనుమంతుడు వేదాధ్యయన శీలుడు, వ్యాకరణాధ్యయన సంపన్నుడు. సంస్కార క్రమ సంప న్నుడు. శాస్త్రబద్ద వాగుచ్ఛారణుడైన హనుమ నోట వెలువడిన ‪‎వాక్కు‬ వేద వాక్కువలే కల్యాణి రూపిణిగా శ్రీరామునికి తోచింది.
''‪‎అధ‬ సంస్కార సంపన్నో, హనుమాన్‌ సచివోత్తమః ఉవాచ వచనం శ్లక్ష్ణ మర్ధవన్మధురం లఘ'' సంస్కార సంపన్నుడైన సచివోత్తముడుగా వాల్మీకి చెప్పినాడు.
శ్రీరాముని హనుమ ఒక వరమడిగాడు ''రామాయణం లోకంలోగానం చేయబడినంత కాలం నేను జీవించాలి' అని, శ్రీరాముడు అందుకు ఆంగీకరించగా
'యత్ర‬ యత్ర రఘనాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్‌
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతి సమతా రాక్షసాంతకమ్‌''అని హనుమతుండే స్వయంగా ‪‎రామభక్తి‬ పరాయణతను వ్యక్తం చేసాడు. తదాదిగా దేశంలో ఎక్కడ చూసినా ప్రతిచోట ప్రతి గ్రామంలో హనుమంతుని ఆలయాలు వెలసి, హనుమ రణముచే‬ సకల భూత, ప్రేత, పిశాచ, రాక్షస బాదల నుండి ఆశ్రితులను సర్వకాల సర్వావస్థల నుండి రక్షించుచున్నాడు. హనుమ స్మరణ వల్ల మానవులకు బుద్ది, బలం, యశము, ధైర్యం, నిర్భయత్వము, ఆరోగ్యము‬, వివేకము, వాక్పటుత్వము గుణములు సిద్దిస్తాయి.
నవగ్రహాలలో శనిగ్రహం‬ కష్టాలు కలిగించేదిగా అందరూ భావిస్తారు. అయితే రావణాసురుని చెరలో నవగ్రహాలు ఉన్నప్పుడు శనని ఆంజనేయుడు తప్పించి, రక్షించినందుకు కృతజ్ఞతా పూర్వకంగా #ఆంజనేయస్వామి భక్తుల జోలికి తాను వెళ్లనని శని మాట ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
జన్మలగ్నాత్తు శని మహార్థశ జరుగుతున్నవారు అర్థాష్టమ, మరియు అష్టమశని, ఏలినాటిశని, జాతకాల్లో ప్రతీవారికి ఏదో విధంగా ప్రవేశించినప్పుడు వచ్చే విపత్తుల బారినుండి రక్షణ పొందటానికి శనివారం నాడు ఆంజనేయుని పూజ చేస్తే ‪‎శనిదోష‬ సాంద్రత తగ్గుతుంది. అంతేకాక అంగారక దోషం వల్ల కుటుంబంలో ఏర్పడ్డ కలతలు పోయి అనుకూల దాంపత్యాన్ని‪‎శ్రీస్వామివారికి‬ పూజ, ప్రదక్షిణ చేయడం వల్ల వెంటనే ఫలితం లభిస్తుంది.
''‪‎మనోజవం‬ మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్‌|
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామ‬ దూతం శిరసా నమామి!! 'ఆంజనేయస్వామి మనసుకున్నంత వేగం, ఇంద్రియ నిగ్రహం, శ్రేష్ఠమైన బుద్ధి ఉన్నాయని చెప్పడం మనసును గురించి చెబుతున్నట్లే అనిపిస్తుంది. మనసుకు స్థిరమైన సంకల్పాలను, ఆదర్శ జీవనం, నియమాలు తదితరములైనవి సక్రమంగా అవి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయని, అవి కొరవడితే మనసు చంచలమై పోతుందని,''బుద్ధిర్భలం‬ యశోధైర్యం నిర్భయత్వ మరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా ద్భవేత్‌'‪ ‎ఆంజనేయుని‬ ప్రార్థిస్తే బుద్ది, బలం, కీర్తి, ధైర్యం, భయం లేకపోవడం,వాక్కులో‬ స్పష్టత, రోగం లేకపోవడం మొదలైనవన్నీ వస్తాయి. మనో వాక్కాయములచే ఎవరు హనుమంతుని ధ్యానింతురో వారిని అతడు సమస్త బాదల నుండి విముక్తుల్ని చేస్తాడు.
''న‬ కాలస్యన శక్రస్య న విష్ణో ర్విత్త పస్యచ| కర్మాని తాని శ్రూయంతేయాని యత్తే హనుమతః'' శ్రద్దా భక్తితో ఆరా ధించిన వారికి అష్టసిద్దులతోపాటు ఆత్మోద్ధరణము జరుగును. హనుమంతుని వలె పరాక్రమ శాలియై నిష్కాముడైన వాడే ధర్మాన్ని రక్షించగలడు.

ఏకైక ఆదర్శం-#హనుమంతుడు..
''#ధర్మ ఏవ హతో హన్తి’! అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన #పరిష్కారం ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.
#ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. #ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం #హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని #రామసేవకుడని చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘'#రామో విగ్రహవాన్ ధర్మః’అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది #ధర్మసేవే. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ #చిరంజీవి ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.
ఏకైక ఆదర్శం-హనుమంతుడు‬..
''ధర్మ‬ ఏవ హతో హన్తి’! అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన ‪‎పరిష్కారం‬ ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.
ధర్మం‬ అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. #ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం #హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని‪ ‎రామసేవకుడని‬ చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘'రామో‬ విగ్రహవాన్ ధర్మః’అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది ధర్మసేవే‬. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ చిరంజీవి‬ ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.





శ్రీ‬ ఆంజనేయ సుప్రభాతమ్

శ్రీ‬ ఆంజనేయ సుప్రభాతమ్
శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో!
సుగ్రీవ మిత్ర! దనుజాంతక! వాయుసూనో!
లోకైక వీర! పురపాల! గదాప్తపాణే!
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్
ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్ధం
దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్
దూరీకురుష్వ భువి సర్వభయం సదామే
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్!!








రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా

వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!
రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా
ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా
వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!..ఇతి శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ సంపూర్ణమ్..

‎అన్నపూర్ణ‬

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు. అన్నపూర్ణ‬ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు.సర్వమంగళకారిణి‬, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత ‪‎అన్నపూర్ణాదేవి‬, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.
శ‌ర‌న్నవ‌రాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా ద‌ర్శన‌మిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ త‌ల్లిగా‬ కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. అన్నపూర్ణ‌.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము…అమ్మవారు మన‌కు ఇస్తుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది. అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం‬ దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.
సకల ప్రాణులలో చైతన్య ‪‎స్వరూపిణి‬ అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. ‪‎భూమియే‬- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును ‪‎సూర్యరశ్మి‬ ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు‬ కలిగి కీర్తిమంతుడవుతాడు.
అన్నం‬ ఎలా పుడుతుందనే విషయాన్నికూడా ‪#‎వేదం‬ వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము‬ ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు)‪ ఓషధులనుండి‬ అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా‪ పరబ్రహ్మతత్త్వము‬. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి #అన్నపూర్ణాదేవి.
దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన‬ అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం‬- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన ‪‎పుష్టివంతులగా‬ నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘‪‎బిక్షాందేహి‬ కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.
‘‘పూర్ణ‬ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే‬’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

శ్రీఆంజనేయం‬

Ramudu Thota Venkataramana's photo.
శ్రీఆంజనేయం‬ 
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం 
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం 
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం 
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీదాసదాసనుదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నామొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయాదేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివైజూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిచియున్ దొల్లిసుగ్రీవు కున్మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటుగావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూ మిజంజూచియానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్న మున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్‌గూడి
యాసేతువున్ దాటి వానరుల్‌మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‌వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‌దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమైయుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‌జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్నుసేవించి నీకీర్తనల్ చేసినన్ పాపముల్‌ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గుసంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీరహనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టిఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‌చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
— 

శ్రీహనుమాన్‬ ద్వాదశ నామాలు


Ramudu Thota Venkataramana's photo.
శ్రీహనుమాన్‬ ద్వాదశ నామాలు
హనుమనంజనా సునురి వాయుపుత్రో మహాబలః 
రామేష్ట : ఫల్గుణ సఖః - పింగాక్షో మిత విక్రమః 
ఉదధిక్రమణశ్చైవ - సీతా శోక వినాశక : 
లక్ష్మణ ప్రాణ దాతా చ - దశగ్రీవస్య దర్పహా ||
ద్వాదశైతాని నామాని -కపింద్రస్య మహాత్మన :
స్వాప్నకలే పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషిత :
తస్య మృత్యు భయం నాస్తి - సర్వత్రా విజయీ భవేత్ ||

శారదాంబాష్టకమ‬


#శారదాంబాష్టకమ
 సువక్షోజ కుంభాం - సుధాపూర్ణ కుంభాం
 ప్రసాదావలంబాం – ప్రపుణ్యావలంబామ్ |
సదాస్యేందు బింబాం – సదానోష్ఠ బింబామ్
 భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
కటాక్షే దయర్ర్దాం – కరేజ్ఞానముద్రాం
 కళా భిర్వినిద్రాం – కలాపై స్సుభద్రామ్ |
పురంధ్రీం వినిద్రాం - పురస్తుంగ భద్రాం
 భజే శారదాంబా – మజస్రం మదంబామ్ ||
లలామాంకఫాలాం - లసద్గానలోలాం
 స్వభక్తైకపాలాం - యక్షక్ష్ర్శీ కపోలామ్ |
కరే త్వక్షమాలాం - కనద్రత్నలోలాం
 భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
సుమీమంత వేణీం – దృశనిర్జితైణీం
 రమత్కీరవాణీం – నమద్వజ్రపాణీమ్ |
సుధా మందరాస్యాం - ముదాచిన్య్త్వవేణీం
 భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
సుశాంతాం సుదేహాం - దృగంతే కచాం తాం
 ల సత్సల్లతాంగీ - మనన్తామచిన్త్యామ్ |
స్మృతాం తాపసై: - సర్గ పూర్వ స్టితాం తాం
 భజే శారదాంబా -  మజస్రం మదంబామ్ ||
కురంగే తురంగే - మృగేంద్రే  ఖగేంద్రే
 మరాళే మదేభే - మహాక్షాధి రూఢామ్ |
మహాత్యాం నవమ్యాం - సదా సామరూపాం
 భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
జ్వలత్కాంతి వహ్నీం - జగన్మోగనాంగీం
 భజన్మాన సాంభోజ - సుభ్రాంత భృంగీమ్ |
నిజస్రోత్ర సంగీత – నృత్య ప్రభాంబామ్
 భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
భవాం భోజ నేత్రాజ – సంపూజ్యమానాం
 లసన్మందహాస ప్రాభా – వక్త్ర చిహ్నామ్ |
చలచ్చంచలా చారు – తాటంక కర్ణాం
 భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
శారదాంబాష్టకమ‬
సువక్షోజ కుంభాం - సుధాపూర్ణ కుంభాం
ప్రసాదావలంబాం – ప్రపుణ్యావలంబామ్ |
సదాస్యేందు బింబాం – సదానోష్ఠ బింబామ్
భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
కటాక్షే దయర్ర్దాం – కరేజ్ఞానముద్రాం
కళా భిర్వినిద్రాం – కలాపై స్సుభద్రామ్ |
పురంధ్రీం వినిద్రాం - పురస్తుంగ భద్రాం
భజే శారదాంబా – మజస్రం మదంబామ్ ||
లలామాంకఫాలాం - లసద్గానలోలాం
స్వభక్తైకపాలాం - యక్షక్ష్ర్శీ కపోలామ్ |
కరే త్వక్షమాలాం - కనద్రత్నలోలాం
భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
సుమీమంత వేణీం – దృశనిర్జితైణీం
రమత్కీరవాణీం – నమద్వజ్రపాణీమ్ |
సుధా మందరాస్యాం - ముదాచిన్య్త్వవేణీం
భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
సుశాంతాం సుదేహాం - దృగంతే కచాం తాం
ల సత్సల్లతాంగీ - మనన్తామచిన్త్యామ్ |
స్మృతాం తాపసై: - సర్గ పూర్వ స్టితాం తాం
భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
కురంగే తురంగే - మృగేంద్రే ఖగేంద్రే
మరాళే మదేభే - మహాక్షాధి రూఢామ్ |
మహాత్యాం నవమ్యాం - సదా సామరూపాం
భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
జ్వలత్కాంతి వహ్నీం - జగన్మోగనాంగీం
భజన్మాన సాంభోజ - సుభ్రాంత భృంగీమ్ |
నిజస్రోత్ర సంగీత – నృత్య ప్రభాంబామ్
భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||
భవాం భోజ నేత్రాజ – సంపూజ్యమానాం
లసన్మందహాస ప్రాభా – వక్త్ర చిహ్నామ్ |
చలచ్చంచలా చారు – తాటంక కర్ణాం
భజే శారదాంబా - మజస్రం మదంబామ్ ||

‎హనుమత్పంచరత్నం‬


#హనుమత్పంచరత్నం
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
 సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || 1 ||

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
 సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || 2 ||

శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్
 కంబుగళమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 3 ||

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
 దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || 4 ||

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
 దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || 5 ||

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
 చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి || 6 ||‪‎హనుమత్పంచరత్నం‬
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || 1 ||
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || 2 ||
శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్
కంబుగళమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 3 ||
దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || 4 ||
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || 5 ||
ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి || 6 ||

హనుమ‬ మంత్రం


#హనుమ మంత్రం
యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః
శ్రీ మారుతే సెవన తత్పరాణం
భోగ శ్చ ,మోక్షశ్చ కరస్త ఏవ
పూజ ఏ త్పుస్తకం ధన్యః సమర్త్యో ముక్తిమాన్ భవేత్
హనూమాన్ మహా విద్య ఒక్కటే మోక్ష మార్గం అని పరాశర సంహిత చెప్పింది .హనుమ‬ మంత్రం
యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః
శ్రీ మారుతే సెవన తత్పరాణం
భోగ శ్చ ,మోక్షశ్చ కరస్త ఏవ
పూజ ఏ త్పుస్తకం ధన్యః సమర్త్యో ముక్తిమాన్ భవేత్
హనూమాన్ మహా విద్య ఒక్కటే మోక్ష మార్గం అని పరాశర సంహిత చెప్పింది .

‘‪సత్యమేవ‬ జయతే''

‘#సత్యమేవ జయతే.. 
అని సర్వసాధారణంగా అనేస్తుంటాం! సత్యమేవ జయతే అనే ఈ వాక్యం మండకోపనిషత్ (హిందూమత తాత్త్విక గ్రంధం) నుంచి గ్రహించబడింది. భారత ప్రభుత్వ చిహ్నమైన అశోకస్తంభంతో పాటు ఈ వాక్యం కూడా ఉంటుంది. సత్యం ఒక్కటే జయిస్తుందని దీని అర్థం. సత్యం మన జీవితంలో ఒక భాగం కాదని, #సత్యమే జీవితంగా గడపాలని ముఖ్య ఉద్దేశ్యం. సత్యమేవ జయతే’కు అసలైన అర్థం.

#సత్యమేవ జయతే నానృతం!
సత్యేన పంథా వితతో దేవయానః!
యేనా క్రమం త్రుషయో హ్యప్తకామా!
యాత్ర తత్సత్యస్య పరమం నిదానం!!
#భావము_సత్యమే జయించును. అసత్యము పరాస్తమగును. సత్యము వలననే దేవతల మార్గము విస్తరించి యున్నది. సత్యము చేతనే మహర్షులు అప్తరాములై ఈశ్వరుని పొందుచున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.
సత్యమేవ‬ జయతే..
అని సర్వసాధారణంగా అనేస్తుంటాం! సత్యమేవ జయతే అనే ఈ వాక్యం మండకోపనిషత్ (హిందూమత తాత్త్విక గ్రంధం) నుంచి గ్రహించబడింది. భారత ప్రభుత్వ చిహ్నమైన అశోకస్తంభంతో పాటు ఈ వాక్యం కూడా ఉంటుంది. సత్యం ఒక్కటే జయిస్తుందని దీని అర్థం. సత్యం మన జీవితంలో ఒక భాగం కాదని, ‪‎సత్యమే‬ జీవితంగా గడపాలని ముఖ్య ఉద్దేశ్యం. సత్యమేవ జయతే’కు అసలైన అర్థం.
సత్యమేవ జయతే నానృతం!
సత్యేన పంథా వితతో దేవయానః!
యేనా క్రమం త్రుషయో హ్యప్తకామా!
యాత్ర తత్సత్యస్య పరమం నిదానం!!
‪‎భావము_సత్యమే‬ జయించును. అసత్యము పరాస్తమగును. సత్యము వలననే దేవతల మార్గము విస్తరించి యున్నది. సత్యము చేతనే మహర్షులు అప్తరాములై ఈశ్వరుని పొందుచున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

‪‎ఆంజనేయుడు‬

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
‪‎ఆంజనేయుడు‬
తాత్త్వికదృష్టితో‬ రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది.
ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి. ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతీకార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే.
‪‎శ్రీ‬ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు 
మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు.
'వాయు‬'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు.
‪‎పంచముఖాంజనేయ‬ స్వరూపం - ‪‎పంచభూతముల‬ సమన్వయతకు సూచనం.
వానరరూపం - వాయుతత్త్వం.
గరుడరూపం - ఆకాశతత్త్వం.
నరసింహరూపం - అగ్నితత్త్వం.
వరాహరూపం - భూమితత్త్వం.
హయగ్రీవరూపం - జలతత్త్వం.
ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు
ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.
''యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ!
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి!!
సాధకునికి‬ నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం).
నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం '‪#‎దృఢ‬ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'.
సాధకునికి తన లక్ష్యాన్ని‬ సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని‬ కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన‬ అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు‬.

‎అఖిలలోకోపకారి‬ ఆంజనేయుడు

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
అఖిలలోకోపకారి‬ ఆంజనేయుడు..
యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా‪ ‎రామకార్యమునకై‬, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ‪‎ఆంజనేయుడు‬.
అష్టసిద్ధులు‬-
అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము‬'. 
పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును,    ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును‬, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.
అణిమా‬ మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః!!
అణువులా సూక్ష్మరూపాన్ని‬ పొందడం "అణిమా"సిద్ధి.
అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.
పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.
ఇష్టపదార్థాలను‬ పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.
లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి.
భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం".
అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ‪‎ఈశ్వరుని‬ వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం‬"!!
లక్ష్యాలక్ష్యేణ‬ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా!
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్!!
తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ‬ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?
ఆ#ధ్యాత్మిక కోణంలో..
ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ ‪‎మనఃప్రవృత్తులు‬, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే‬ రాత్రి.
గీతలో‬ కృష్ణపరమాత్మ చెప్పినట్లు..
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ!
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే:!!
భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి‬.
అనగా ‪‎అజ్ఞానంధాకారములో‬ నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి‪ జాగురుకుడై‬ యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది‪ ‎ఆత్మావలోకనం‬ చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు‬ ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును.

‪‎పార్వత్యువాచ‬:

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
‪‎పార్వత్యువాచ‬:
అన్నపూర్ణా మహాదేవీ త్రైలోక్య జీవదారిణీ /
నమ్నాంసహస్రంస్యాస్తు కథయస్వ మహాప్రభో //
‪‎శ్రీ‬ శివ ఉవాచ:
శృణుదేవి వరారోహో జగత్కారణ కౌళినీ /
ఆరాధితా చ సర్వేషాం సర్వేషాం పరిపృచ్చసి //
సహస్రైర్నామభిమర్దివ్యై స్రైలోక్య ప్రాణపూజితైః /
అన్నదాయాస్త్సవందివ్యం యత్సురైరపివాంచితమ్ //
కథయామి తవ స్నేహ త్సావధానావధారయ /
గోపనీయం ప్రయత్నేవ స్తవరాజ మిదంశుభమ్ //
న ప్రకాశంత్వమా భద్రేదుర్జనేభ్యోవిశేషతః /
న దేయం పరశిష్యేభ్యో భక్తిహీనాయ పార్వితీ //
దేయం శిష్యాయ శాన్తాయ గురుదేవరతాయ చ /
అన్నపూర్ణాస్తవం దేయం కైళికాయ కుళేశ్వరీ
‪‎అన్నపూర్ణ‬ స్తోత్రం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |1|
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |2|
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |3|
కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |4|
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |5|
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |6|
ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |7|
దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |8|
చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ |
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |9|
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |10|
అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ |11|
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ |12|
సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే |13|

జొన్నవాడ ‪‎కామాక్షితాయి‬

భక్తుల పాలిట కల్పవల్లి... జొన్నవాడ #కామాక్షితాయి
పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అక్కచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి. శ్రీ పొట్టిశ్రీ రాము లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం #జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు ఈడేర్చు తూ భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతోంది. 
ప్రజాపతులలో శ్రేష్ఠుడైన శ్యప ప్రజాపతి #యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్విహంచారు. పవిత్ర పినాకినీ (పెన్న) నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షణాగ్ని, #ఆహావనియాగ్ని, ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు. శ్యపుని యజ్ఞయాగానికి పరవశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించినట్లు స్కందపురాణంలో చెప్పబడివుంది. అప్ప టి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి గాంచింది. #స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతిదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది. అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో వుండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శిలారూపం దాల్చింది. అనంత కాలంలో జాల ర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించి సేవించనారంభించా రు. నాలుగోశతాబ్దంలో హిమాలయాల్లోని #కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న #అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లిఖార్జున స్వామి గాను పార్వతి దేవి #కామాక్షితాయిగాను భక్తకోటి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురా ణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న విత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన #సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ద్వారపయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృశపర్వుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరినఇంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడ వ్వడమేకాకుండా రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడైనాడు. #త్రేతాయుగంలో కుష్ఠువ్యాధిగ్రస్తుడైన #అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్తత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమ యాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడి నుంచే ప్రారంభించి నట్లు చెబుతారు. పురాణ కాలం నుంచి ప్రసిద్ధిచెందిన #జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్ధాలు పూజాపునస్కారాలకు నోచు కోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది. 13వ శతాబ్ధంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించి నట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగత మవుతుంది. 1969 ఏఫ్రిల్‌ మాసంలో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖ రేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో #అమ్మ వారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి జొన్నవాడక్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది.శైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి #వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపం డువగా జరగుతాయి. 9 రోజుల పాటు నిర్వ హించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల ల నుండే గాక పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, మహారాష్ట్ర, ఒడిషాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తు న్నారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన #పినాకినిలో తీర్థ మాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్నప్ప దర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు ఈడేరుస్తారని భక్తుల నమ్మిక. 
#కొడిముద్ద లేదా ధ్వజప్రసాదం
ఈ సందర్భంగా పూజారులు ధ్వజస్తంభానికి అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు. వీరు సమర్పించే ధ్వజప్రసాదం లేదా కొడిముద్ద తిన్న వారికి ఆయురారోగ్యాలు పెంపొందుతాయని, సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కొడిముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా #బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. ఆరోతేదీన గిన్నెభిక్ష జరుగుతుంది. శివుడు భవతీభిక్షాందేహీ అంటూ భిక్షాటన చేసినందుకు గుర్తుగా ఈ గిన్నెభిక్ష ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అంశమైన రథోత్సవం ఏడోతేదీ ఉదయం జరగనుంది. అదేరోజు రాత్రి గజసింహవాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఎనిమిదో తేదీ ఉదయం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. తొలుత #స్వామివారిని ఓ వైపు, అమ్మవారిని ఓ వైపు ఉంచి ఎదుర్కోలమహోత్సవాన్ని నిర్వహిస్తారు. అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కల్యాణ సంకల్పం గావిస్తారు.
భక్తుల పాలిట కల్పవల్లి... జొన్నవాడ ‪‎కామాక్షితాయి‬
పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అక్కచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి. శ్రీ పొట్టిశ్రీ రాము లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ‬ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు ఈడేర్చు తూ భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతోంది. 
ప్రజాపతులలో శ్రేష్ఠుడైన శ్యప ప్రజాపతి ‪‎యజ్ఞమాచరించాలని‬ దక్షిణ భారత యాత్ర నిర్విహంచారు. పవిత్ర పినాకినీ (పెన్న) నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షణాగ్ని, ‪‎ఆహావనియాగ్ని‬, ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు. శ్యపుని యజ్ఞయాగానికి పరవశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించినట్లు స్కందపురాణంలో చెప్పబడివుంది. అప్ప టి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి గాంచింది. ‪‎స్వామి‬ కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతిదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది. అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో వుండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శిలారూపం దాల్చింది. అనంత కాలంలో జాల ర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించి సేవించనారంభించా రు. నాలుగోశతాబ్దంలో హిమాలయాల్లోని‪ కైలాసగిరికి‬ వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న ‪‎అమ్మవారిని‬లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లిఖార్జున స్వామి గాను పార్వతి దేవి కామాక్షితాయిగాను‬ భక్తకోటి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురా ణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న విత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వ‬ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ద్వారపయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృశపర్వుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరినఇంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడ వ్వడమేకాకుండా రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడైనాడు. ‪‎త్రేతాయుగంలో‬కుష్ఠువ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ‬ పినాకినిలో స్నానం చేసి స్వస్తత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమ యాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడి నుంచే ప్రారంభించి నట్లు చెబుతారు. పురాణ కాలం నుంచి ప్రసిద్ధిచెందిన #జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్ధాలు పూజాపునస్కారాలకు నోచు కోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది. 13వ శతాబ్ధంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించి నట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగత మవుతుంది. 1969 ఏఫ్రిల్‌ మాసంలో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖ రేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ‪‎అమ్మ‬ వారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి జొన్నవాడక్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది.శైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ‬ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపం డువగా జరగుతాయి. 9 రోజుల పాటు నిర్వ హించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల ల నుండే గాక పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, మహారాష్ట్ర, ఒడిషాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తు న్నారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినిలో‬ తీర్థ మాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్నప్ప దర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు ఈడేరుస్తారని భక్తుల నమ్మిక. 
కొడిముద్ద‬ లేదా ధ్వజప్రసాదం
ఈ సందర్భంగా పూజారులు ధ్వజస్తంభానికి అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు. వీరు సమర్పించే ధ్వజప్రసాదం లేదా కొడిముద్ద తిన్న వారికి ఆయురారోగ్యాలు పెంపొందుతాయని, సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కొడిముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా ‪‎బ్రహ్మోత్సవాలకు‬ తరలివస్తారు. ఆరోతేదీన గిన్నెభిక్ష జరుగుతుంది. శివుడు భవతీభిక్షాందేహీ అంటూ భిక్షాటన చేసినందుకు గుర్తుగా ఈ గిన్నెభిక్ష ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అంశమైన రథోత్సవం ఏడోతేదీ ఉదయం జరగనుంది. అదేరోజు రాత్రి గజసింహవాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఎనిమిదో తేదీ ఉదయం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. తొలుత ‪‎స్వామివారిని‬ ఓ వైపు, అమ్మవారిని ఓ వైపు ఉంచి ఎదుర్కోలమహోత్సవాన్ని నిర్వహిస్తారు. అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కల్యాణ సంకల్పం గావిస్తారు.