ఆంజనేయ స్వామికి...సిందూర వర్ణం

దెైవానికి మనలాగ కొన్ని రంగులంటే ఇష్టమనీ, మరికొన్ని రంగులంటే అయిష్టమనీ ఉండదు.
అయితే దెైవాన్ని ఉపాసన చేసిన ఋషులు దేవుని యొక్క నిజరూపాన్ని దర్శించి, ఆయన ఏయే వర్ణాలతో ఉన్నాడో తెలి పారు. పసుపురంగు విష్ణువుకు సంకేతం. అందువల్లనే ఆయనను ‘పీతాంబరుడు’ అన్నారు.ఎరుపు రంగు శంకరునికి సంకేతం. అందుకే ఆయనను ‘నీలగ్రీవో విలోహిత’ అన్నారు. నీలిరంగుమెడా, ఎరగ్రా ఉండే రూపమే శంకరునిది.
అయితే దెైవాన్ని ఉపాసన చేసిన ఋషులు దేవుని యొక్క నిజరూపాన్ని దర్శించి, ఆయన ఏయే వర్ణాలతో ఉన్నాడో తెలి పారు. పసుపురంగు విష్ణువుకు సంకేతం. అందువల్లనే ఆయనను ‘పీతాంబరుడు’ అన్నారు.ఎరుపు రంగు శంకరునికి సంకేతం. అందుకే ఆయనను ‘నీలగ్రీవో విలోహిత’ అన్నారు. నీలిరంగుమెడా, ఎరగ్రా ఉండే రూపమే శంకరునిది.
పసుపు రంగూ చిక్కని ఎరుపురంగూ కలి స్తే మరో రంగుగా మారుతుంది. దానినే సిందూరవర్ణం అన్నారు. శివకేశవుల రంగు కలిసి సిందూరవర్ణం అన్నారు. ఈ రంగు ఆంజనేయునిది. అంటే, విష్ణువు యొక్క మేధాశక్తి, శివుని యొక్క తప్పశ్శక్తి కలిగి ఉన్నవాడు ఆంజనేయుడు. గుడిలోప్రతిదెైవానికీ ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది కదా! ఆ ధ్వజస్తంభానికి కింద మరో దెైవరూపం ఉంటుంది. అది గుడిలో ఉన్న మూలదెైవానికి నమస్కరిస్తున్నట్లు ఉంటంది.విష్ణువు మూలవిరాట్టుకు ఎదురుగా ధ్వజస్తంభం కింద ఎవరున్నారో చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ విష్ణు దేవునికీ, శివ దేవునికీ ఎదురుగా ఉండే ఒకే ఒక దెైవం ఆంజనేయస్వామి. విష్ణువు దృష్టిని ఎవరెైనా భరించగలరు గానీ, రుద్రుడి తీక్షణ దృష్టిని తట్టుకోగల శక్తి ఏ దేవతకూ లేదు. ఆ శక్తి ఒక్క ఆంజ నేయస్వామికి మాత్రమే ఉంది. ఎందుకం టే రుద్రుని అంశంతో పుట్టిన వాడు ఆంజనేయుడు కనుక.ఈ విషయాన్ని తెలుపడానికే శివ కేశవులిద్దరి రూపవర్ణ మిశ్రమము కలిగిన ఆంజనేయుడు అని వివరణ చెప్పబడింది. అందువల్లనే శివకేశవుల రంగులు కలిసిన సిందూర వర్ణం ఆంజనేయుడికి ఇష్టం.