సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, June 9, 2016

విష్ణు కథ - 11

విష్ణు కథ - 11

లక్ష్మీదేవి వేదవతిగా అవతరించి తపస్సు చేస్తున్నప్పుడు రావణుడు కొప్పు పట్టుకున్న కారణంగా యోగాగ్నితో ఆమె దహించుకు పోయి లంకలో పుట్టింది.
లంకా పట్టణాన్ని అనుసరించుకొని అందమైన గొప్ప సరోవరం ఉన్నది. ఎప్పటిలాగే ప్రాతఃకాలాన్నే రావణుడు ఆ సరోవరంలో స్నాన సంధ్యలువార్చి శివార్చనకు తామరపువ్వుల్ని ఏరుతూండగా, ఒక పెద్ద తామర పువ్వు సరోవర మధ్యంలో ధవళకాంతుల్ని ప్రసరిస్తూ కనిపించింది. దాని దగ్గరికి చేరుతూండగా ఆ పువ్వులో బంగారంలాగ మెరిసి పోతున్న అందమైన స్ర్తీశిశువు క్యారుమంటూ కనిపించింది.

ఆపసిపిల్లను చూసి రావణుడు ముచ్చట పడుతూండగా అశరీరవాణి, ‘‘ఓ రావణా! ఆ బిడ్డ నీకూ, నీ లంకకూ చేటుగా పుట్టిన బిడ్డ!’’ అని వినిపించింది.రావణుడు రాక్షస వీరభటులకు ఆ పసి పాపను చంపిరండని ఉత్తరువు చేశాడు.ఆ పసిపాప ఏం చేసినా చావలేదు. కత్తులు అదృశ్యమైనాయి. అగ్ని ఆరిపోయింది.

రాతిబండలు పూలకుప్పలైనాయి. క్రూరమృగాలు పారిపోయాయి. రాక్షసులు విసిగి ఆ పిల్లను పంచలోహాలతో చేసిన పెట్టెలో పెట్టి గట్టిగా బంధించి సముద్ర మధ్యంలో పడవేశారు.ఆ పెట్టె సముద్రాన్ని దాటి భూమిని చీల్చుకొని భూగర్భంలోకి అలా వెళ్ళింది. మిథిలా రాజ్యాన్నేలే జనకమహారాజు గొప్పజ్ఞాని, రాజర్షి. యజ్ఞం కోసం చదును చేయడానికి భూమిని దున్నిస్తున్నాడు. నాగలి చాలుకు ఖణేల్మని పెట్టె తగిలింది.

 పెట్టెను తీసి అందులో ముద్దులు మూటగట్టే బంగారుపాపను జనకుడు తనకు భూదేవి ప్రసాదించిన కుమార్తెగా ఎత్తుకొన్నాడు. నాగేటిచాలుకు సీత అని పేరు. నాగలిచాలుకు దొరికినందువల్ల ఆ పిల్ల ‘సీత’ అనీ, జనకుని కుమార్తె కనుక ‘జానకి’ అనీ భూమిలో దొరికినందువల్ల ‘భూజాత’ అనీ పిలువబడుతూ అల్లారుముద్దుగా పెరిగింది.
సీత తోటి పిల్ల న్నేహితురాండ్రతో ఆడుతూ, బంతిని వెతుకుతూ పూలతో పూజింపబడి ఉన్న పెద్ద ధనుస్సును బెండు ఎత్తినట్లుగా ఎడమచేత్తో ఎత్తి దాని చాటున వున్న బంతిని తీసుకుంది. తర్వాత ఆ ధనుస్సు ఆటకు బాగుందని అవలీలగా తీసుకువచ్చి బొమ్మరింటి గోడలాగ పెట్టి, సంతోషంగా ఆట సాగించింది. జనకుడు కళ్ళారా అదంతా చూసినిర్వణ్ణుడైపోయాడు.

ఆ ధనుస్సును జనకుడి పూర్వీకులు శివుడి దగ్గర్నుంచి పుచ్చుకొని పూజిస్తూ వచ్చారు. త్రిపురాసుర సంహారంలో శివుడు ఆ వింటితోనే యుద్దంచేశాడు. ఆ శివధనువును ఎత్తాలంటే బలాఢ్యులైన వారు మూడు వందలమంది ఉంటేనే గాని సాధ్యపడదు. అలాంటి వింటిని ఎత్తిన సీత సామాన్యురాలు కాదనీ, ఆ శివధనుస్సును ఎత్తి ఎక్కు పెట్టగలవాడు మాత్రమే సీతకు తగ్గ వరుడనీ జనకుడు అనుకున్నాడు.

సీతకు స్యయంవరం జరిపినప్పుడు ముందు ఆ విషయాన్నే చాటిచెప్పి, అటువంటి వాడికే ఇచ్చి కళ్యాణం జరపాలని నిశ్చయం చేసుకున్నాడు. సీత మిథిలానగరంలో అలాగే పెరిగి పెద్దదైంది. విశ్వామిత్రుడు యాగరక్షణకు, రామ లక్ష్మణులను పంపమని దశరథుణ్ణి అడిగాడు. అందుకు దశరథుడు, ‘‘రాక్షసుల నుండి యాగరక్షణకు పసివాళ్ళను ఎలాగ పంపమంటావు, మహర్షీ! వాళ్ళు, అస్ర్తవిద్యలు ఇంకా నేర్చుకోవలసిన వాళ్ళు!’’ అన్నాడు.

‘‘అందుకేగదా నేను వచ్చినది! రాచబిడ్డలకు ఏ విద్య కావాలో నాకు తెలుసు. ఆ విద్య నేను నేర్పుతాను!’’ అంటూ విశ్వామిత్రుడు వసిష్ఠుడిని సగర్వంగా చూశాడు. వసిష్ఠుడు చిరునవ్వుతో విశ్వామిత్రుణ్ణి మెచ్చుకొని, రామలక్ష్మణుల్ని, అతనితో పంపమని దశరథుడితో చెప్పాడు.

రామలక్ష్మణులు మునులకు మల్లే జుత్తు ముళ్ళు వేసుకొని విశ్వామిత్రుడి వెంట ధనుర్బాణాలు ధరించి బయలుదేరారు. దారిపొడవునా విశ్వామిత్రుడు వారికి ధనుర్విద్యా విశేషాలు బోధిస్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళాడు.

రామలక్ష్మణులు విశ్వామిత్రుడి సునిశిత శిక్షణలో ధనుర్విద్యాపారంగతుల…య్యారు. విశ్వామిత్రుడు ఋషులతో కలిసి యాగం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తూండగా భ…యంకరంగా అరుచుకుంటూ తాటకి పిడుగులాగ ఆశ్రమం మీద పడింది. విశ్వామిత్రుడు తాటకను చంపమని రాముడికి ఆనతిచ్చాడు. రాముడు తాటకపై శరపరంపర కురిపించాడు. ఒంటి నిండా దట్టంగా బాణాలు గుచ్చుకొని తాటకి పెద్ద పర్వతంలాగ భూమిమీద పడి విల విలా తన్నుకొని ప్రాణాలు విడిచింది.

విశ్వామిత్రుడు రాముణ్ణి, అతని బాణప్రయోగ కౌశలానికి మెచ్చుకొన్నాడు. యాగం ప్రారంభమయింది. విశ్వామిత్రుడు రాముడికి అస్తాల్ని ఉపదేశించాడు. రామలక్ష్మణులు ధనుర్ధరులై తిరుగుతూ యాగరక్షణ చేస్తూన్నారు. మారీచుడు, సుబాహుడు ఒక్కుమ్మడిగా విరుచుకు పడ్డారు. రాముడు రెండే బాణాలు విడిచాడు. సుబాహుడు చచ్చాడు. మారీచుడు బాణం దెబ్బతిని కొసప్రాణాలతో సముద్రంలో పడి కొట్టుకు పోతూ ఎలాగో లంక చేరాడు.

యాగం నిర్వఘ్నంగా సాగింది. విశ్వామిత్రుడు …యాగసమాప్తిలో రాముడి చేత హవిస్సులు వేయించి హోమం చేయించాడు. …యజ్ఞకుండం జ్వాలలపై తేలుతూ అర్ధచంద్రాకారం మొనగల ఒక బాణం దివ్యకాంతులీనుతూ వచ్చింది. విశ్వామిత్రుడు, ‘‘రామా! అది నీ బాణం. ‘రామబాణం’ అని పేరొందుతుంది. శత్రువు కంఠం నరికి తిరిగి నీ చేతికి వస్తుంది!’’ అని చెప్పి బాణాన్ని రాముడికి అందించాడు.  రాముడు బాణాన్ని కళ్ళకు అద్దుకొని పొదిలో పెట్టుకొని విశ్వామిత్రుడి పాదాలకు ప్రణమిల్లాడు. యాగం చాలా కాలంగా సాగింది. ఆ కాలంలోనే విశ్వామిత్రుడు రాముడికి మహాస్త్రాలన్నీ ఉపదేశించాడు. ‘‘రామా! నేనూ, నువ్వూ సూర్యవంశంవాళ్ళం. నాకు తెలిసిన అస్ర్తవిద్యనంతా నీకు ఉపదేశించి నందుకు నా కెంతో తృప్తిగా ఉంది.

నీలాంటి వాడికి గురువునని అనిపించుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది!’’ అన్నాడు విశ్వామిత్రుడు. ‘‘గురుదేవా! నీ కృపకు పాత్రుడనైన నేను ధన్యుణ్ణి!’’ అన్నాడు రాముడు. విశ్వామిత్రుడి సిద్ధాశ్రమంలోనే రాముడు, లక్ష్మణుడు అస్ర్తవిద్యలను నేర్చుకుంటూ యౌవనవంతులయ్యారు. ఒకనాడు అస్ర్తాల ప్రయోగ విశేషాంశాలు చెప్తూ విశ్వామిత్రుడు, రాముణ్ణి తనివితీరా చూస్తూ, ‘‘రామా!

నీ విశాల నయనారవిందాలు శాంతిచంద్రికలు వెదజల్లుతూ, నా ఆశ్రమాన్ని శాంతినిలయంగా చేయగా నీవు శాంతరాముడివి; సుందర రాముడివి!’’ అన్నాడు. తన వెంట రమ్మన్నట్లుగా విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. విశ్వామిత్రుడు మిథిలానగరం దారి పట్టాడు. దారిలో గౌతమాశ్రమం మీదుగా వెళ్తూండగా, రాముడి పాదం తగిలి ఒక బండరాయి అహల్యగా మారి రాముడి పాదాలకు ప్రణమిల్లింది.

రాముడు ఆశ్చర్యంతో వెనక్కుజరిగాడు. అదే సమయానికి చిరకాలంగా చేస్తూన్న తపస్సు చాలించి గౌతమ మహర్షి వచ్చాడు. రాముణ్ణి భక్తిగా చూస్తూ, ‘‘రామచంద్రా! నా భార్య శాపం తీరింది. నీవు పావనరాముడివి!’’ అన్నాడు. గడువు తీరి అహల్య శాపవిమోచనం జరిగింది, తనలో ఏముందని? అన్నట్లుగా రాముడు అయోమయంగా చూశాడు. గౌతముడు తదేకంగా రాముణ్ణి చూసి, ‘‘ఔను, రామా!

నీవు నివురుగప్పిన నిప్పువు! మాయా మానుషవిగ్రహుడివి!’’ అన్నాడు. విశ్వామిత్రుడు ఔను! అన్నట్టుగా తలపంకించాడు. ‘‘విష్ణువు అవతారాల్లో రామావతారం తర్వాత కృష్ణావతారంలో, కృష్ణుడు తాను అవతారమూర్తిగా తెలిసే లీలలు చేసి, మాయామానుష విగ్రహుడు అనిపించుకున్నాడు.

రాముడు పరిపూర్ణ మానవుడిగా కర్తవ్యపాలన చేశాడు. మనిషిలాగే సాధించాడు. అదే రామావతార విశేషం!’’ అని సూతుడు వివరించి రామకథను సాగించాడు. గౌతముడు అందర్నీ ఆశ్రమంలోకి తీసుకెళ్ళి, అతిథిసత్కారాలు చేశాడు. విశ్వామిత్రుడు గౌతమాశ్రమం నుండి రామ లక్ష్మణులతో బ…యలుదేరాడు. దూరంగా కోలాహలం వినిపించింది.

జనక మహారాజు సీతాస్వయంవర మహోత్సవానికి మహర్షులందరికీ భక్తి పూర్వకమైన తన ఆహ్వానం అందించి రమ్మని, తన పురోహితుడైన శతానందుణ్ణి పంపించాడు. శతానందుడు అహల్యా గౌతముల కుమారుడు. శతానందుడి పల్లకి వెనక మిథిలారాజ్య లాంఛనాలతో పరివారం వస్తున్నారు. శతానందుడు విశ్వామిత్రుణ్ణి దర్శించడానికి సిద్ధాశ్రమానికి వెళ్తున్నాడు.

దారిలోనే ఎదురైన విశ్వామిత్రుణ్ణి చూసి, శతానందుడు దిగి ప్రణామం చేసి జనకుడి ఆహ్వానం విన్నవించాడు. విశ్వామిత్రుడి వలన అహల్యా శాపవిమోచన వృత్తాంతం విని శతానందుడు మహదానందంతో రాముణ్ణి శతవిధాల కీర్తించి, జననీజనకుల దగ్గిరికి వెళ్ళాడు. రామలక్ష్మణ విశ్వామిత్రులు మిథిలకు చేరారు. సీత, ఉద్యానవనంలో విహరిస్తున్నది. ఆమెతో చెల్లెలైన ఊర్మిళ ఉన్నది. ఆ ఉద్యానవనంలోనుంచి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెళ్తున్నారు. 
సీత, రాముడు ఒకర్నొకరు చూసుకున్నారు. ‘తనవాడు వచ్చాడు!’ అనే ఆనందంతో అడుగులు తడబడుతూండగా, సీత అంతఃపుర మందిరంలోకి పరుగుతీసింది. ఊర్మిళ మనస్సు లక్ష్మణుడిపై లగ్నమైంది. రాజాధిరాజులు, బలసంపన్నులు ఎవ్వరూ శివధనుస్సును ఎత్తలేక పోయారు. జనకుడు నిరాశపడుతూంటే, తండ్రి చెంత ఉన్న సీత, దూరాన ఉన్న రాముడిని ఓరచూపులతో చూస్తూ, ఉత్సాహంగా తండ్రి వంక రాముణ్ణి చూడమన్నట్లుగా చూసింది.

విశ్వామిత్రుడు రాముణ్ణి ముందుకు పంపాడు. ఆచార్యదేవుడి ఆదేశం శిరసావహించి తాను నిమిత్తమాత్రుణ్ణి అన్నట్లుగా వెళ్ళి, శివధనుస్సుకు నమస్కరించి, రాముడు గున్నటేనుగు చెరుకుగడను లాగినట్లు శివధనుస్సును అవలీలగా ఎత్తి పట్టి, నారిని బలంగాలాగి ఎక్కుపెట్టే సరికి, గొప్ప ధ్వనితో భూనభోంతరాళాలు దద్దరిల్లగా, శివధనుస్సు విరిగిపోయింది.

మహాధ్వని తరంగాలు దిగంతాలు వ్యాపించి, దక్షణ మహాసముద్రంలో మహేంద్ర పర్వతం మీద తపస్సులో ఉన్న పరశురాముడి చెవిని సోకాయి. పరుశురాముడు విష్ణువు మారురూపమైన గోలోకవాసియైన కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఇచ్చిన కోదండాన్ని, విష్ణు అంశను రాముడికి అప్పగించడానికి బ…యల్దేరాడు. సీత రాముడి మెడలో మాలవేసి సిగ్గు దొంతరలతో చరచరా తండ్రి చెంత చేరింది. సీతారాముల వివాహానికి దశరుథుడు సకుటుంబ సపరివారంగా మిథిలకు చేరాడు.

పెళ్ళిపీటలపై సీతారాములు తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, సీత కమలం వంటి దోసిట్లో ముత్యాలు పద్మరాగాల్లా ప్రకాశించాయి. రాముడి తలపై జాజిమల్లెల్లాగ తెల్లగా విరిశాయి. రాముడి శ్యామలశరీరంపై జారుతూ, వింతకాంతులతో ఇంద్రనీలాల్లాగ కనిపించాయి. సీతకు చెల్లెళ్ళయిన ఊర్మిళను లక్ష్మణుడికీ, మాండవిని భరతుడికీ, శతరూపను శత్రుఘ్నుడికీ ఇచ్చి వివాహం సీతారామ కళ్యాణ మహోత్సవంలోనే జరిపించారు.

దశరథుడు కొడుకులు కోడళ్ళతో అయోధ్యకు తిరుగుప్రయాణమయ్యాడు   హుటాహుటిగా వస్తున్న పరశురాముణ్ణి చూస్తూనే రథం దిగి ప్రణమిల్లి రాముడికి బదులుగా తన తల నరకమని ప్రాథేయపడ్డాడు. పరశురాముడు, ‘‘ఓ,రామా! ఆ హరవిల్లు విరిచావుట, ఈ వింటిని ఎక్కుపెట్టు!’’ అని తన చేతనున్న కోదండాన్ని అందించాడు. దాన్ని అందుకుంటున్నప్పుడే పరశురాముడిలోని విష్ణు అంశ రాముడికి చేరింది. కోదండాన్ని రాముడు ఎక్కుపెట్టాడు.

విష్ణు కథ - 10

విష్ణు కథ - 10

శ్రీమతి స్యయంవరానికి దేశదేశాల రాజులు, ముల్లోకాల్లోని ప్రముఖులు అంతా వచ్చారు. విష్ణు వేషంతో నారదుడు స్వయంవర మంటపం ప్రవేశించగానే అంతా ఘొల్లున నవ్వారు. తన ముఖం కోతి ముఖంగా మారిందని తెలుసుకొని నారదుడు అవమానంతో ఉడికిపోయాడు.

శ్రీమతి విష్ణువును ధ్యానించింది. విష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు. శ్రీమతి మాలవేసి విష్ణువును వరించి, అతనితో వైకుంఠానికి వెళ్ళింది. అది చూసి నారదుడు మరింత కోపంతో పర్వతుణ్ణి కూడగట్టుకొని అంబరీషుడిపై మండిపడ్డాడు. అడిగినప్పుడు తమకు ఇవ్వకుండా శ్రీమతిని విష్ణువుకు అప్పగించినందుకు అంబరీషుణ్ణి నాశనం చేయదలచి, శపించడానికి సిద్ధపడ్డారు.

అప్పుడు విష్ణుచక్రం వచ్చి వారిని వెంట తరిమింది. పర్వత నారదులిద్దరూ వైకుంఠానికి పరుగెత్తారు. అక్కడ శ్రీమతితో ఉన్న విష్ణువును చూసి నారదుడు మరింత ఉడుకుమోత్తనంతో, ‘‘నువ్వు కూడా నీ శ్రీమతిని - అంటే నీ భార్యామణిని పోగొట్టుకొని విలపిస్తావు! నన్ను కోతిముఖంవాడిని చేసి మోసగించావు. వానరులే నీ సహచరులై సహాయపడతారు గాక!’’ అని విష్ణువును శపించాడు. నారదుడి శాపానికి విష్ణువు మందహాసం  చేశాడు. శ్రీమతి లక్ష్మీదేవిగా నిజరూపం పొందింది. మునులను ఆవరించిన మాయ. తొలగింది. జరిగినదానికి సిగ్గుపడుతూ నారద పర్వతులు విష్ణు పాదాల మీద పడ్డారు. నారదుడు విష్ణు పాదాన్ని కన్నీటితో తడుపుతూ, శపించినందుకు నొచ్చుకొంటూంటే విష్ణువు నెమ్మదిగా మందహాసం చేస్తూ, నార దుడి తల నిమిరి, ‘‘నారదా! త్రికాలవేత్తవైన నువ్వు విచారించడమేమిటి! నీ నోటిమాట అమోఘం.

నువ్వు శపించింది కూడా నా సంకల్పమే! నా రామావతార సమయంలో అలాగే జరుగుతుందిలే! అదీ లోకకల్యాణం కోసమే!’’ అని చెప్పాడు. అప్పటినుంచీ అంబరీషుడికి ఎవరివల్లా ఎటువంటి హానీ జరగకుండా, తన చక్రం అతనికి రక్షణగా ఉండేలాగ విష్ణువు అనుగ్రహించాడు. దుర్వాసుడికి తపోబల గర్వంతో బాటు తామసం ఎక్కువ. ఒకనాడు తన ఆశ్రమం నుండి బయలుదేరబోతూండగా, ఆనంద పారవశ్యంతో కన్నులు మూసి విష్ణుసంకీర్తన పాడుతూ వస్తున్న నారదుడు ఎదురయ్యాడు. ‘‘ఓహో, నారదా!

కలహ భోజనంతో కడుపు నిండినట్టుందే! చాలా ఆనంద పారవశ్యంలో మునిగి ఉన్నావు!’’ అంటూ దుర్వాసుడు నారదుణ్ణి పలకరించాడు. నారదుడు కళ్ళుతెరిచి వంగి వంగి  నమస్కరిస్తూ, ‘‘దుర్వాసుల వారికి ప్రణామాలు! అలాంటి దేమీ పడక నకనకలాడుతున్నది గాని, మహర్షీ! విష్ణుభక్తి తత్పరులైన వారిని చూసినపుడల్లా నాకు పరమానందం పొంగుతూనే  ఉంటుందాయె. అంబరీషుణ్ణి చూసి ఇలా వస్తున్నాగదా మరి...’’ అన్నాడు మరొకసారి వంగి ప్రణామం చేస్తూ.

‘‘అంతటివాడా, అంబరీషుడు?’’ అన్నాడు దుర్వాసుడు. ‘‘ఔను, మహర్షీ! విష్ణువు అనుగ్రహం పొందిన రాజర్షిసత్తముడు, ద్వాదశీ వ్రతం అతని ప్రాణం!’’ అన్నాడు నారదుడు. ‘‘ఏమిటి నారదా! ఆ రాజును తెగపొగిడేస్తున్నావు?’’ అన్నాడు దుర్వాసుడు. ‘‘అతణ్ణి చూస్తే తెలుస్తుంది, పొగడ్తకాదని! నీలాంటి మహర్షీశ్వరుడు అతని సదనాన్ని పావనం చేయడం వల్ల, అతని జన్మ ధన్యమౌతుంది. చరితార్థుడై మరింత వినుతికెక్కుతాడు!’’

అని చెప్పి నారదుడు నారాయణ నామజపం చేస్తూ వెళ్ళాడు. నారదుడి మాటలు దుర్వాసుణ్ణి రెచ్చ గొట్టాయి. అంబరీషుడి దగ్గిరికి బయలుదేరాడు. ఏకాదశి ఉపవాసం చేసి, ద్వాదశీవ్రత  సమాప్తిగా అప్పుడే భుజించడానికి అంబరీషుడు సిద్ధమౌతున్నాడు. దుర్వాసుడి రాకకు పరమానంద భరితుడై, అర్ఘ్యపాద్యాదులతో పూజించి, భోజనానికి ఆహ్వానించాడు.

దుర్వాసుడు నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎంతకూ తిరిగి రాలేదు. ద్వాదశఘడి…ులు మించిపోతున్నవి; ద్వాదశి దాటకుండా భోజనం చే…ుకపోతే వ్రతభంగం అవుతుంది. అతిథి రాకుండా తింటే దోషమౌతుంది! అప్పుడు విజ్ఞులైన పెద్దలు అంబరీషుడితో కొంచెం నీరు చప్పరించితే వ్రతభంగమూ కాదు, అతిథి రాకుండా భుజించిన దోషమూ అంటదు అని చెప్పగా అలాగే అతను జలపారణం చేశాడు.

ద్వాదశి పోయి త్రెూదశి వచ్చినటే్ల హుటా హుటిగా ఆగ్రహావేశంతో పట పట పళ్ళు కొరుకుతూ, జటాజూటాన్ని విప్పి విదలిస్తూ దుర్వాసుడు వచ్చాడు. ‘‘ఓ రాజాధమా! విష్ణుభక్తుడి నంటూ గర్వించి ఆతిథ్యధర్మానికి అపచారం చేస్తావా? నాకే అవమానం తలపెట్టడానికి నీ కెన్ని గుండెలు? నేనెవర్నో తెలుసా? నా పేరు వింటే ముల్లోకాలూ, ముమ్మూర్తులూ గడగడలాడ వలిసిందే! నా శాపానికి తిరుగులేదు, దుర్మరణం పాలౌతావు గాక!’’

అని హుంకరిస్తూన్న దుర్వాసుడి పాదాల మీద తలవాల్చి అంబరీషుడు, ‘‘ఋషీశ్వరా! వ్రతభంగం కాకుండా వుండేందుకు జలపారణం మాత్రమే చేశాను. మన్నించమని వేడుకొంటున్నాను!’’ అన్నాడు విన…ుంగా. దుర్వాసుడు అంబరీషుని తలను తన్ని, ‘‘దుర్వాసుడి కోశంలో మన్నించడం అనేది లేదు! భక్తీ, తపశ్శక్తుల్లో ఏది గొప్పదో నువ్వు స్వ…ుంగా చూద్దువుగాని!’’ అని అంటూ అమిత ఆగ్రహంతో జటాజూటాన్ని సింహంలాగ విదిల్చాడు.

దుర్వాసుడి తపోమహిమ అంతా అతని జడల్లో అనేక శక్తులుగా నిక్షప్తమై వుంది. పొడవైన ఒక జడను తీసి పట్టుకొని మరో చేత్తో ెూగదండాన్ని ఎత్తి ఆడిస్తూ జడను ఝళిపించాడు. జడ నుంచి నిప్పురవ్వలు విరజిమ్ముతూ దట్టమైన నల్లని పొగలు సుడులు తిరుగుతూ ఆకాశానికి లేచాయి ఆ పొగల్లో భ…ుంకరాకారంతో పర్వతంలా కృత్య అనే మహా భూతం ఆవిర్భవించింది. కృత్య ప్రళ…ుభీకరంగా గర్జిస్తూ అంబరీషుడిని చంపడానికి ఉరకబోతున్న మరుక్షƒణంలో అతనికి రక్షణగా విష్ణువు అనుగ్రహించిన చక్రం జ్వాలలు కక్కుతూ రివ్వునవచ్చి కృత్యను ముక్కలు ముక్కలుగా నరికి మటుమా…ుం చేసింది.

అదిచూసి దుర్వాసుడికి ముచ్చెమటలు పోశాయి. కృత్యను నాశనం చేసిన విష్ణుచక్రం అంతటితో ఆగక, అమిత వేగంతో దుర్వాసుడి మీదకు వెళ్ళింది. దుర్వాసుడు మరొక జడను పెరికి విసిరాడు. పర్వతమంత వజ్రపాషాణం అడ్డునిలిచింది. చక్రం దాన్ని తుక్కు తుక్కుగా తూలగొట్టి దుర్వాసుణ్ణి వెంబడించింది. ఇంకొక జడను ఋషి విసిరాడు! ఆకాశమంత మంచు మేఘం ఏర్పడి వెనువెంటనే చక్రజ్వాలల్లో ఆవిర్లు గక్కుతూ హరించిపోయింది.

దుర్వాసుడు పరుగెత్తుతూంటే అతని జటాజూట మంతా వెంట తరిమే చక్ర జ్వాలలు తగిలి మసి మసి అయింది. ఈ విధంగా అతడి తపశ్శక్తి అంతా ఆహుతి అయిపోయింది. చెట్టనక పుట్టనక, అడవులు నదులు పర్వతాలు దాటుతూ, దుర్వాసుడు పరుగెత్తుతున్నాడు. చక్రం తరుముకొంటూ వస్తోంది; మునిని ముల్లోకాలు తిప్పింది. దుర్వాసుడు బ్రహ్మలోకానికి పరుగు తీస్తుంటే నారదుడు ఎదురుపడి ముసి ముసి నవ్వు లతో, ‘‘హా! తపో సంపన్నులు దుర్వాసులవారేనా! ఏమిటా పరుగు?’’ అని అంటూంటే మారు మాటరాక వెన్నెంటి వస్తోన్న చక్రాన్ని చూపిస్తూ దుర్వాసుడు అదే పరుగున బ్రహ్మముందు పడ్డాడు.

‘‘నేను విష్ణునాభికమలంనుంచి వచ్చినవాణ్ణి, నేనేం చె…్యుగలను? చక్రాన్ని ఎలా వారించగలను?’’ అన్నాడు బహ్మ. ‘‘బ్రహ్మవని వస్తే ఇంతేనా నీ పస! నన్ను రక్షంచగల ఆ మహేశ్వరుడున్నాడులే!’’ అన్నాడు ఋషి. ‘‘ఔను, ఔను, దుర్వాసా! ఆ మాటా నిజమే. ఎంత త్వరగా వెళ్తావో కైలాసానికి, వెళ్ళు వెళ్ళు!’’ అన్నాడు బ్రహ్మ చేతులు దులుపుకొంటూ. కైలాసానికి వెళ్ళి దుర్వాసుడు శివుణ్ణి రక్షంచమని మొరపెట్టాడు. ‘‘చక్రం విష్ణువుది. కోరి విరోధం తెచ్చుకో మన్నావా? వెళ్ళు. నీ దురహంకారానికి ఫలితం అనుభవించక తప్పుతుందా మరి! వెళ్ళు, వెళ్ళు!’’ అన్నాడు శివుడు. దుర్వాసుడు వైకుంఠానికి పరుగెత్తి విష్ణువు ముందు పడి, దీనాతి దీనంగా చక్రాన్నినివారించమంటూ శరణు వేడాడు.

‘‘అంబరీషుడికి రక్షగా నా చక్రాన్ని ఎప్పుడో అనుగ్రహించాను. అందువల్ల, ఇప్పుడు నేనేం చేసేది మహర్షీ? అంబరీషుణ్ణే చక్రాన్ని వారించమని అర్థించు!’’ అన్నాడు విష్ణువు.
దుర్వాసుడు హతాశుడై లేచాడు. అతని అహంకారం నశించింది. అతని తల బోసి పోయివుంది. తపశ్శక్తి అంతా తుడుచుకు పోయింది, భక్తిముందు తపశ్శక్తి ఎందుకూ పనికిరాదని తెలిసింది. అంబరీషుడి దగ్గిరకు బ…ులుదేరాడు. చక్రం శాంతంగా వెంట వెళ్తున్నది.

దుర్వాసుడు పాదాలు పట్టుకోబోతూంటే అంబరీషుడు వారించి, లేవనెత్తి చక్రాన్ని ఆగమన్నాడు. చక్రం వెనక్కి మళ్ళి కొంతసేపటికి అదృశ్యమైంది. అగ్రగణ్యులైన విష్ణువు భక్తుల్లో అంబరీషుడుపేరుపడ్డాడు. సూర్యవంశ రాజుల్లో గాధి ఒక ప్రముఖుడు. గాధి కుమారుడు విశ్వామిత్రుడు, కృతాశ్వుడి దగ్గిర ధనుర్విద్య నేర్చాడు. అనేక అస్త్రాల్ని పొందాడు. అస్ర్తవేత్తగా పేరు పొందాడు.

 విశ్వామిత్రుడు రాజ్యపాలనకు వచ్చాక ఒకనాడు సపరివారంగా వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వసిష్ఠ మహర్షి తన హోమధేనువు మహిమ వల్ల అందరికీ సాదరంగా గొప్ప విందు చేశాడు. పదిలక్షల గోవులను తీసుకొని హోమ ధేనువును ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు; వసిష్ఠుడు ఇవ్వనన్నాడు. విశ్వామిత్రుడు బలాత్కారంగా గోవును పరివారంచేత తోలించుకొని వెళ్ళబోతూంటే, వశిష్ఠుడు తన తపోబలంతో హోమధేనువు నుండి అనేక మంది శబరెూధుల్ని పుట్టించాడు.

విశ్వామిత్రుణ్ణి అతని పరివారాన్ని ధేనువు నుండి వచ్చిన ెూధులు చిత్తు చిత్తుగా తరిమికొట్టారు. రాజరికం కంటే తపోబలం మిన్న అని తెలుసుకొని విశ్వామిత్రుడు రాజ్యం విసర్జించి అనేక సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. తపస్సు సాధించి వసిష్ఠుడితో సమానుడనిపించుకున్నాడు. అప్పటినుంచి విశ్వామిత్రుడు వసిష్ఠుడితో పోటిగా వుంటూ వచ్చాడు.

రావణుడి అనుచరులైన రాక్షసులు తమ తమ బలాలతో ఆర్యావర్తం మీద విరుచుకుపడి ధ్వంసం చేస్తూ, మునులను ఋషులను బాధించి, ఆశ్రమాలు తగలబెట్టసాగారు. విశ్వామిత్రుడు గొప్ప తలపెట్టాడు. అది జరగకుండా మారీచుడు, సుబాహుడు అనే రాక్షస ప్రముఖులూ, తాటక అనే రాక్షసీ పట్టుదలతో ధ్వంసం చేస్తున్నారు. విశ్వామిత్రుడు చింతాక్రాంతుడై, హిమాల…ు ప్రాంతంలో ఉన్న తన సిద్ధాశ్రమంలో ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. ఆ ధ్యానసమాధిలో అతనికి మహావిష్ణువు అవతారంగా సూర్యవంశంలో రఘువు సంతతిలో పుట్టి పెరుగుతూన్న రాముడు కనిపించాడు!

లోకకల్యాణం కోసం రాక్షసనిర్మూలన చే…ువలసి ఉన్న రాముడికి వసిష్ఠుడు నేర్పిన శాస్ర్తవిద్యలెందుకూ అక్కరకు రావు! అందుకు అద్భుతమైన అస్ర్త, శస్ర్తవిద్య, ధనుర్విద్యాపాటవంకావాలి! వాటిని అందించగల గురువు అతనికిప్పుడు కావాలి! రాముడికి అస్త్రాలు ఉపదేశించగల సమర్థుడు విశ్వామిత్రుడు ఒక్కడే!

విశ్వామిత్రుడికి ధ్యానసమాధిలో లక్ష్మీదేవి సీతగా జనకుని కూతురుగా పెరుగుతున్నది కూడా కనిపించింది.సీతారాముల కల్యాణం కూడా త్వరలో జరగాలి. రాముడి వల్లనే తన కూడా జరగాలి! తనకు తెలిసిన అస్ర్తవిద్య నంతా రాముడికి ఉపదేశించి, ఆ…ున్ను అస్ర్తవిద్యాకోవిదుణ్ణిగా చే…ువలసిన బాధ్యత తనదిగా గుర్తించి విశ్వామిత్రుడు అెూధ్యకు బ…ుల్దేరాడు.

విష్ణు కథ - 9

విష్ణు కథ - 9

దశరథమహారాజు పుత్రకామేష్ఠియాగం చేసి,  అగ్నిదేవుడిచ్చిన పాయసపాత్ర అందుకుని, ఆనందపారవశ్యంతో కౌసల్యకు, కైకేయికి ఆ పాయసాన్ని పంచి ఇచ్చాడు.
అతినికి కౌసల్య, సుమిత్ర, కైకేయి - ముగ్గురు రాణులు.

కౌసల్యాదేవి, సుమిత్రకుగాను తన కిచ్చినదాంట్లోంచి  కొంత పాయసాన్ని వేరొక పాత్రలోకి తీసింది. అలాగే కైకేయి కూడా ఆ పాత్రలో తనకిచ్చిన పాయసం నుంచి తీసి కొంతవేసింది.

చైత్రశుక్ల నవమినాడు కౌసల్యకు విష్ణువు రాముడుగా నీలమేఘం ఛాయగల శరీరకాంతితో పుట్టాడు. తర్వాత కైకేయికి శంఖపద్మాల అంశతో ముత్యపు తెలుపుగల భరతుడు పుట్టాడు. శేషుని అంశతో నిగనిగలాడే బంగారువన్నెగల లక్ష్మణుడూ, చక్ర గదల అంశతో పగడపు ఎరజ్రీరతో శత్రుఘ్నుడూ, సుమిత్రకు పుట్టారు. చైత్రశుక్లనవమి రామనవమిగా పేరొంది కోసల రాజ్యమంతటా ఆనందోత్సవాలు జరుగుతూండగా మూడో చైత్రం వచ్చింది. అయోధ్యానగరంలో చక్రవర్తి పెద్దకుమారుడి పుట్టినరోజు వేడుకలు, దానధర్మాలు ఘనంగా జరిగాయి.

చైత్రపౌర్ణమినాడు రాజసౌధం మీద విరిసిన వెన్నెట్లో నలుగురు చిరంజీవులతో, ముగ్గురు రాణులతో దశరథుడూ, మంత్రి సుమంత్రుడూ, రాముణ్ణి ఎత్తుకొని తిప్పి ఆడించే రాజబంధువూ, ఆంతరంగికుడూ అయిన భద్రుడూ చిత్రాన్నాలతో విందు చేసుకున్నారు. కౌసల్య రాముణ్ణి ఎత్తుకొని చంద్రుణ్ణి చూపి ఆడిస్తూంటే రాముడు చందమామ కావాలని ఒకటే మారాం పెట్టాడు. ఎవరు  ఎన్ని విధాల బుజ్జగించినా ఏడుపు అసలు  మానలేదు.


అప్పుడు సుమంత్రుడు ఒక అద్దాన్ని తెప్పించి రాముడి ముందుంచి, అందులో చంద్రబింబాన్ని చూపించాడు. రాముడు సంతోషంతో తననూ, చంద్రుణ్ణీ అద్దంలో చూసుకుంటూ, ‘రామచంద్రుడు’ అని ముద్దు ముద్దుగా అంటూ చిరుచేతులతో చప్పట్లు కొట్టాడు. అది మొదలు రామచంద్రుడు అనిపించుకున్నాడు.

తర్వాత భద్రుడు రాముడిని ఎత్తుకొని అద్దంలోకి చూపిస్తూ, ‘‘మరి ఇప్పుడో?’’ అన్నాడు. రాముడు, ‘‘రామభద్రుడు!’’ అన్నాడు. ఆ విధంగా రామభద్రుడు అని కూడా అనిపించుకున్నాడు. పిమ్మట లక్ష్మణ భరత శత్రుఘు్నలు రాముడి పక్కల చేరి అద్దంలో కనిపించారు. పైన నిండు చంద్రబింబం గొడుగులాగ కనిపించింది. అందరికీ ఆ దృశ్యం రామ పట్టాభిషేకాన్ని స్ఫురింపజేసింది. దశరథుడి ఆనందానికి మేరలేదు.

ముగ్గురమ్మలూ మురిసిపోయారు. రాకుమారులు పెరుగుతున్నారు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడి వెన్నంటి వుండేవాడు. ఆ వెనుక, భరత శత్రుఘ్నులిద్దరూ జంటగా వుంటూ ఆడుకుంటూ ఒకే ప్రాణంగా వుండేవారు. అన్న, తమ్ములు నలుగురైనా అంతా ఒకే పరిపూర్ణరూపంగా కనిపిస్తూండేవారు. రాకుమారులు కులగురువైన వసిష్ఠ మహర్షి దగ్గిర విద్యావంతులైనారు.

రాముడు వ…యసుకి పిన్న అయినా పెద్దచదువులే చదివాడు; సర్వశాస్ర్తాలూ, వేద వేదాంగాలూ, ధర్మసూక్ష్మాలు, యోగ రహస్యాలూ తెలుసుకున్నాడు. వసిష్ఠుడు, ‘‘రామచంద్రా! మీ వంశకర్త సూర్యుడు, నీవు రవి రాముడివి! ఇక్ష్వాక కుల తిలకానివి! నీ ముత్తాత రఘుమహారాజూ గొప్ప కీర్తిగాంచిన వాడు. నీవు రఘువంశ సుధాంబుధి చంద్రుడివి!

రఘు రాముడివి!’’ అని పేర్కొంటూ రాముణ్ణి ఆశీర్వదించాడు-అని సూతుడు చెప్పగా, నైమిశారణ్య  మునులు, ‘‘సూత మునీంద్రా! సూర్యవంశ రాజుల చరిత్రలను విపులంగా వినగోరుతున్నాము!’’ అని కోరారు. సూతుడు చెప్పసాగాడు: మహాకల్పారంభంతో వివస్వంతుడు అనే పేరున ప్రకాశించిన సూర్యుడికి కుమారుడైన వైవస్వతుడు మనువు అ…్యూడు.

వైవస్వతమనువుకి ఇక్ష్వాకుడు మొదలైనవారు పదిమంది కుమాళ్ళు. వారందరూ గొప్ప రాజులై ధరణిని ఏలారు. వారి సంతతి బాగా పెరిగింది. ఆ విధంగా సూర్యవంశం శాఖోపశాఖలై విస్తరించింది. ఇక్ష్వాకుడి సంతతివారైన ఇక్ష్వాకుల్లో దిలీపుడు, రఘువు గొప్ప ధర్మపరులైన చక్రవర్తులుగా పేరుపొందారు. దిలీపమహారాజు సంతాన ప్రాప్తికోసం కులగురువైన వసిష్ఠుని ఆదేశానుసారంగా కామధేనువు అంశ అయిన నందినీ ధేనువును భక్తిశ్రద్ధలతో అర్చిస్తూ, అడవుల్లో మేపుతూండగా, ఆవు ఒక గుహలోకి వెళ్ళింది.

ఆ గుహలో ఒక భ…ుంకరమైన సింహం ఆవును పట్టుకొంది. దిలీపుడు సింహాన్ని చంపడానికి ధనుస్సుకు బాణం సంధించబోతే, అతని  యిస్తంభించి అలాగే ఉండిపోయింది. అప్పుడు సింహం అతనితో, ‘‘ఓ రాజా! ఆవు నాకు లభించిన ఆహారం! నన్ను చంపబోవటం అధర్మం కనుకనే, నీ చేయి అలా వుండిపోయింది!’’ అన్నది. అది విన్న దిలీపుడు, ‘‘నన్ను ఆహారంగా తీసుకొని ఆవును విడిచిపుచ్చు,’’ అని ప్రార్థించాడు. సింహం అదృశ్యమైంది.నందినీ ధేనువు అతని భక్తికి సంతసించి, ఆ దృశ్యమంతా తాను కల్పించినదే అని చెప్పి సంతానప్రాప్తి కలిగేలా దిలీపుడికి వరమిచ్చి అనుగ్రహించింది.

దిలీపుడి కుమారుడే రఘుమహారాజు. రఘువు గొప్పదానపరుడుగా కీర్తిగాంచాడు. అతిథిగా వచ్చిన తపస్వి మనోవాంఛితాన్ని గ్రహించి, రఘువు తన రాణిని తపస్వి ఆశ్రమానికి తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చాడు.

తపస్వి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొంది, ఆమెకు సగౌరవంగా మ్రొక్కి రాజమందిరానికి పంపించాడు. దానమిచ్చినదాన్ని తిరిగి పరిగ్రహించడానికి రఘువు సమ్మతించలేదు. రాణి తన్ను నరికి చంపమని భర్తను వేడుకొన్నది. రఘువు ఎత్తిన కత్తి ఆమె మెడ మీద పూలరాశిగా పడింది.

రాజదంపతుల మీద దేవతలు పూలవాన కురిపించారు. రఘు మహారాజు తనది అంటూ ఏదీ మిగుల్చుకోకుండా సంపదనంతనూ దానం చేసినా చాలకపోగా, కుబేరుడి దగ్గరి ధనరాసులు తేవడానికి వెళ్ళాడు.

 యక్షులు రఘువు అలకానగరాన్ని చేరకుండా, …యక్ష మాయలన్నీ అతనిపై ప్రయోగించి విఫలులయ్యారు. కుబేరుడు రఘు మహారాజుకు సాదరంగా అనేక సంపదలనిచ్చి పంపాడు. రఘువు ఆ ధనాన్నంతనూ అర్థించేవారు మిగలకుండా పంచాడు. రఘువు కుమారుడు అజుడు. అజ మహారాజు గొప్ప శూరుడు. స్వయంవరంలో అజుణ్ణి భోజరాజ పుత్రిక ఇందుమతి వరించింది. అజుడు ఇందుమతితో బయలుదేరుతుండగా స్వయంవరానికి వచ్చిన రాజులందరూ ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు.

అజుడు వారినందర్నీ ఎదుర్కొని యుద్ధం చేసి గెల్చాడు. అజుడు ఇందుమతితో ముచ్చటగా ఉద్యానవనంలో విహరిస్తూండగా, ఆకాశ మార్గాన దేవలోకపు పుష్పమాల జారి గాలితో ఎగిరి వచ్చి ఇందుమతి మెడలో పడింది. వెంటనే ఆమె మరణించింది. అజుడు ప్రియసతి వియోగానికి పరితపిస్తూండగా, నారదుడు వచ్చి అతణ్ణి ఓదార్చి ఇందుమతి పూర్వవృత్తాంతాన్ని చెప్పాడు: హరిణి అనే దివ్యాంగన, తృణబిందుడు చేస్తూన్న తపస్సు భంగపుచ్చడానికి ఇంద్రుడు పంపగా ఋషిశాపంవల్ల మనిషిగా పుట్టింది.

శాపవిమోచనం కూడా ఋషి చెప్పాడు. సుర పుష్పమాల పడడంతో ఆమెకు తాను సురకాంతను అనే స్ఫురణ కలిగి మానవ శరీరాన్ని విడిచి, దేవలోకానికి వెళ్ళిపోయింది. అజుని కుమారుడు దశరథుడు. ఇక్ష్వాకు వంశీయులైన రాజులు దేవతలకు, రాక్షసులకు జరిగే యుద్ధాల్లో దేవతలకు సహాయంగా వెళ్ళేవారు. అలాగే దశరథుడు కూడా ఇంద్రుడికి సహాయంగా శంబరాసురుడి మీదకు వెళ్ళాడు. దశరథుడితో కైకేయి కూడా రణరంగానికి వెళ్ళింది. ఆ యుద్ధంలో రథచక్రం ఊడిపడకుండా కైకేయి కాపాడింది.

దశరథుడు సంతోషించి రెండు వరాలు కోరుకోమన్నాడు. తనకు కావలసినప్పుడు ఆ రెండు వరాలు కోరుకుంటాననీ, అప్పుడు ఇవ్వమనీ కైకేయి చెప్పింది. దశరథుడు ఒకనాటి చీకటి రాత్రి, పంటపొలాలు పాడుచేసే ఏనుగులను వేటాడ్డానికి వెళ్ళాడు. ఆ చీకటిలో కమండలంతో నీరు ముంచుకొంటున్న శబ్దాన్ని ఏనుగు నీరు పల్చుతున్నదని భావించి మునిబాలకుణ్ణి బాణంతో చంపాడు.

ఆ బాలుడు పెట్టిన కేకతో నిజం తెలుసుకొని దశరథుడు నీరు తీసుకెళ్ళి, అంధులైన బాలుడి తలిదండ్రుల దప్పిక తీర్చాక జరిగింది చెప్పాడు. ఆ మునిదంపతులు పుత్రశోకంతో, ‘‘నువ్వూ, మాలాగే కుమారుణ్ణి తలంచుకొంటునే ప్రాణాలు విడిచెదవు గాక!’’ అని దశరథుణ్ణి శపించి ప్రాణాలు విడిచారు. సూర్యవంశపు రాజుల్లో శరణాగత రక్షణకు శిబిచక్రవర్తి కీర్తిగాంచాడు.

శిబిని పరీక్షంచడానికి ఇంద్రుడు పావురంగానూ, అగ్ని డేగగానూ వెంట తరుముతూ వచ్చారు. పావురం శిబి తొడమీద వాలింది. పావురం బరువు మాంసాన్ని తన శరీరం నుంచి తీసుకోమని శిబి డేగకు చెప్పాడు. శిబి తన శరీరాన్ని ఎంత కోసి త్రాసులో వేసినా పావురంతో సరితూగలేదు. అప్పుడు శిబి తన్ను పూర్తిగా తీసుకోమని త్రాసు సిబ్బెలో కూర్చున్నాడు. ఇంద్రుడూ, అగ్నీ నిజరూపాలతో కనిపించి శిబికి అనేక వరాలిచ్చి మెచ్చుకొన్నారు.

వసిష్ఠుడితో పోటీపడి గొప్ప తపోబలంతో, వసిష్ఠుడితో సమానంగా మహర్షిగా గుర్తింపు పొందిన విశ్వామిత్రుడు కూడా సూర్యవంశపు రాజే! సూర్యవంశజుడు, ఇక్ష్వాకులకు చెందినవాడే అయిన అంబరీషుడు రాజర్షి. పరమ విష్ణుభక్తుడైన రాజు. అంబరీషుడికి లక్ష్మి తన అంశతో కుమార్తెగా పుట్టింది. ఆమె పేరు శ్రీమతి. ఆమె చిన్నతనం నుంచే విష్ణువును తన భర్తగా భావించి ఆరాధిస్తూ వచ్చింది.

శ్రీమతి సౌందర్యం ముల్లోకాల్లో చెప్పుకోబడింది. నారదుడు తాను మాయాతీతుడననే అహంతో పర్వతుడనే మహామునితో ప్రగల్భాలు పలికాడు. పర్వతుడు కూడా నారదుడితో కలిసి త్రిలోక సంచారం చేస్తూండేవాడు. నారదుడు, పర్వతుడు కలిసి అంబరీషుడి దగ్గరకు వెళ్ళారు. అంబరీషుడు వారిని భక్తితో పూజించి, కుమార్తె శ్రీమతి చేత మునులిద్దరి పాదాలకు మ్రొక్కించి ఆశీర్వదించమన్నాడు. విష్ణుమాయా ప్రభావం నారద, పర్వతుల్ని ఆవరించింది.

శ్రీమతిని చూసి మైమరచి నాకంటే నాకు శ్రీమతితో వివాహం జరిపించమని అంబరీషుణ్ణి కోరారు. శ్రీమతి నాది అంటే నాది అని ఇద్దరూ తమలో తాము వాదులాడుకోసాగారు. వెంటనే తమతో వివాహం నిశ్చయం చేయమని అంబరీషుణ్ణి ఒత్తిడి చేశారు. అంబరీషుడు మునుల వాలకానికి దిగ్భ్రాంతుడై నోటమాట రాకుండా ఉండి పోయాడు. శ్రీమతి తనకు స్వయంవరం ఏర్పాటు చేయమని తండ్రితో చెప్పింది. అంబరీషుడు నారద, పర్వతులతో, ‘‘మీ ఇద్దరికిద్దరూ మహర్షిశ్రేష్ఠులే!

మీ ఇద్దరూ నన్ను ఇరుకులో పెట్టడం భావ్యంకాదు గనుక, నా కుమార్తెకు స్వయంవరం చాటిస్తున్నాను. స్వయంవరానికి మీరిద్దరూ రావలసిందిగా ప్రార్థిస్తున్నాను!’’ అని చెప్పాడు. బిక్కముఖాలు వేసుకొని మునులిద్దరూ వెళ్ళిపోయారు. శ్రీమతిని ఎలాగైనా తనదిగా చేసుకోవాలని నారదుడికి ఊహలమీద ఊహలు, ఉపాయాలమీద ఉపాయాలు తోచాయి.

నారదుడిని శ్రీమతి వరించకుండా ఉంటే చాలు అని పర్వతుడు ఆలోచించసాగాడు. నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి మణికిరీటము, కౌస్తుభమణి, వైజయంతీ మాల మొదలైన విష్ణువేషాన్ని తనకు ఇవ్వమని అడిగాడు. విష్ణువు తన రూపాన్ని అలాగే నారదుడికి ఇచ్చాడు. నారదుడు వెళ్ళాక పర్వతుడు వచ్చి విష్ణువును స్తుతించి, స్వ…యంవరంలో నారదుడి ముఖం కోతిముఖంగా మారేలాగ చే…యమని కోరాడు. విష్ణువు సరే అని చెప్పాడు.

విష్ణు కథ - 8

విష్ణు కథ - 8

పడిపోయిన జమదగ్ని మరణించినట్లే ఉండిపోయాడు. రేణుకాదేవి భర్తమీద పడి ఏడుస్తున్నది. అప్పుడే అరణ్యాల నుండి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. జరిగింది తెలుసుకొని పరశువును ఎత్తి ఝుళిపిస్తూ, మాహిష్మతీ నగరానికి పరుగెత్తాడు. అంతలో భృగుమహర్షి ఎక్కణ్ణించో వస్తూ జమదగ్ని ఆశ్రమం చేరాడు. రేణుకను ఓదార్చి, జమదగ్నిలోంచి పోతున్న ప్రాణాన్ని తన యోగశక్తితో నిలబెట్టి బ్రతికించాడు.

అక్కడ మాహిష్మతీనగరానికి తోలుకుపోయిన ధేనువును కోరిన వాటిని ఆశ్రమంలో ఇచ్చినట్లుగా రాజధానిలో ఇవ్వలేదని సైనికులు కొడుతున్నారు. సరిగా ఆ సమయానికి పరశురాముడు ప్రళయరుద్రుడై వచ్చాడు. సైనికులు పారిపోయారు. ఆవును పరశురాముడు దువ్వి ఆశ్రమానికి వెళ్ళు అన్నట్లుగా తట్టాడు. ధేనువు ఉరకలువేస్తూ వెళ్ళింది. ‘‘ఓ రాజాధమా! సంరక్షకుడై ఉండవలసిన రాజు దుర్మార్గుడైనప్పుడు శిక్షంచక తప్పదు. మేడదిగి ఇవతలికి రా!’’

అని పరశురాముడు రాజప్రాసాదం ముందు కేకవేశాడు. కార్తవీర్యుడు మొదట పరశురాముణ్ణి సాధారణ మునికుమారుడనుకున్నాడు గాని, అతని ధాటి తెలిశాక వెయ్యి చేతులతో ఎదుర్కొన్నాడు. కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన అస్ర్తాలను, శస్త్రాలను పరశురాముడు గొడ్డలితో తుత్తునియలు చేశాడు. అతని వెయ్యి చేతులను చెట్టుకొమ్మలు నరికి నట్లుగా తెగ్గొట్టాడు. కార్తవీర్యుడు మొండి బోదెగా కూలిపోయాడు. అప్పుడు అతనికి తాను శాపవశంతో పుట్టిన చక్రపురుషుడనని గుర్తుకొచ్చింది.

పరశురాముడు విష్ణువే అని తెలిసి మనస్సులోనే దండం పెట్టి దేహం చాలించి వెళ్ళి సుదర్శన చక్రంలో లీనమయ్యాడు. పరశురాముడు ఇంటికివచ్చి తన తండ్రి క్షేమంగా ఉండడం చూసి తాను చేసినది చెప్పాడు. జమదగ్ని, ‘‘నాయనా! నువ్వు చేసినది మునులమైన మనకు తగని పని. అందుకు పరిహారంగా నువ్వు తపస్సు చేయాలి!’’ అన్నాడు.

పరశురాముడు, ‘‘తండ్రీ! రాజు అధర్మ పరుడైనప్పుడు శిక్షంచ వలసిన అర్హత అందరికీ ఉంది! నీ ఆనతి గనుక నేను తపస్సు చేస్తాను. కాని, ప్రాయశ్చిత్తంగా కాదు,’’ అని చెప్పి అరణ్యానికి పోయి తపస్సులోని మగ్నుడయ్యాడు.

కార్తవీర్యుడి వెయ్యిమంది కుమాళ్ళు హైహయ క్షత్రియులందర్నీ కూడగట్టుకొని జమదగ్ని ఆశ్రమం మీదకు విరుచుకు పడ్డారు. అప్పుడు జమదగ్ని నిశ్చలంగా తపస్సమాధిలో ఉన్నాడు. రేణుకాదేవి, ‘‘రామా! రా!’’ అంటూ ఎలుగెత్తి ఇరవై ఒక్కసార్లు పిలిచింది. హైహయులు జమదగ్ని తలను నరికేశారు. రేణుక ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకొంటూ భర్త మొండెం మీద పడి విలవిలా విలపించి సొమ్మసిల్లింది. జమదగ్ని తల దొర్లుకుంటూ దూరంగా పోయి రాళ్ళ మధ్య చిక్కుకుంది. రాజపుత్రులు ఆశ్రమాన్ని తగలబెట్టారు. ఆ మంటల్లో రేణుక, భర్త కళేబరంతో కలిసి కాలిపోయింది. అరణ్యంలో తపస్సు చేస్తున్న పరశురాముడికి ధ్యానభంగం అయింది. తల్లి పిలుపు ఇరవై ఒక్కసార్లు చెవుల్లో మర్మరంగా వినిపించింది. మనస్సు కీడు శంకించింది. అక్కడి నుంచి ఒక్క అంగలో ఆశ్రమం చేరుకున్నాడు.

ఆశ్రమం తగలబడుతున్నది. తల్లీ, తండ్రీ మసి అయ్యారు. హైహయ సైనికులు ఆశ్రమవాసుల్నీ, వారించ వచ్చిన పరిసర జానపద జనుల్నీ అమానుషంగా చిత్రవధ చేస్తున్నారు.

పరశువును ప్రసాదించిన శివుణ్ణి స్మరించి, పరశురాముడు గొడ్డలిని తీసి జ్వాలలాగ లేచాడు. ముళ్ళపొదల్ని నరికినట్లుగా అందినవారినందర్నీ హతమార్చాడు.

రాళ్ళమధ్య పడి ఉన్న జమదగ్ని తలను తీసి రొమ్ముకు అదుముకొని, ‘‘తండ్రీ! కన్నీరు కూడా రాకుండా నా గుండె జ్వలించి పోతున్నది. క్షత్రియుల రక్తంతో నీకు తర్పణం చేస్తాను.

నీ తలను ఆ రక్తపు మడుగుల్లో ముంచి అంత్యక్రియలు చేస్తాను!’’ అని అంటూ పరశురాముడు ఉన్నత శిలాగ్రం మీదకు ఎక్కి పరశువును ఎత్తి, ‘‘ఈ గొడ్డలితో భూమ్మీద రాజన్నవాడు లేకుండా నరుకుతాను!’’ అని ఇరవై ఒక్కసార్లు గర్జిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. దిక్కులు ప్రతిధ్వనించాయి. అతని భీషణ ప్రతిజ్ఞ విని బ్రహ్మ, మహర్షులు వచ్చి శాంత వచనాలు పలికారు. భృగుమహర్షి, ‘‘నాయనా! దుర్మార్గుల్ని ఆ భగవంతుడే శిక్షస్తాడు. సాధుసజ్జనుల్ని రక్షస్తాడు! నువ్వు శాంతించు!’’ అన్నాడు.

పరశురాముడు, ‘‘ఆ భగవంతుడు ఆకాశంనుంచి ఊడిపడడు; మనిషిగా పుట్టి మనుషుల మధ్యే ఉంటాడు. అలాంటి వాడినే నేను అని పితామహులు గ్రహించాలి. శాంతవచనాలతో నాకు పనిలేదు!’’ అంటూ అదే పరుగున హిమాలయానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై పరశురాముణ్ణి శాంతపరచబోయాడు. పరశురాముడు, ‘‘శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదుగదా! లయమూర్తివైన నీకు చెప్పవలసింది లేదు. నా ప్రతిజ్ఞ నెరవేర్చడానికి కావలసిన బలాన్నిఇవ్వు!’’ అన్నాడు. శివుడు అతనికి అన్ని అస్ర్తాలను ఇచ్చి ప్రత్యేకమైన దివ్యాస్ర్తాన్ని ఇస్తూ, ‘‘ఇది భార్గవాస్త్రంగా నీ పేరున నిలుస్తుంది! నీవు కారణజన్ముడివైన అవతార మూర్తివి! వెళ్ళు,  నీకు అడ్డులేదు!’’ అని ఆమోదంతో ఆశీర్వదించాడు.
పరశురాముడు గోలోకంలో విష్ణువు మరొక రూపంగా ఉండే కృష్ణుణ్ణి ధ్యానించి, కృష్ణ కవచాన్ని పొందాడు. కృష్ణుడు అతనికి తన అంశను గొప్ప ధనుస్సుతో కలిపి ప్రసాదించి, రామావతారంలో తిరిగి తీసుకుంటానని చెప్పాడు. పరశురాముడు క్షత్రియులపై విజృంభించాడు. రాజుల దుష్పరిపాలనలో అగచాట్లు పడుతున్న జనానీకం అతని అండ చేరారు. కార్తవీర్యుడి కుమాళ్ళతో సహా హైహయులందరూ నగరం విడిచి పారిపోయారు.  పరశురాముడు ఆగ్నేయాస్త్రాన్ని నగరంపై వేశాడు. పరశురామ ప్రీతిగా మాహిష్మతీ రాజధాని ఇరవై ఒక్క రోజులపాటు జ్వాలల్లో నామరూపాల్లేకుండా దగ్ధమైపోయింది. కార్తవీర్యుడి వెయ్యిమంది కుమాళ్ళూ, హైహయవంశ క్షత్రియులూ, దేశ దేశాల రాజులందరూ కూడగట్టుకొని పరశురాముణ్ణి ఎదుర్కొన్నారు.

బలిపశువుల్ని నరికినట్లుగా పరశురాముడు అందర్నీ తెగటార్చి, వాళ్ళ రక్తాన్ని ఐదు మడుగుల నిండా నింపి, జమదగ్ని తలను వాటిలో ముంచి, ముంచి పితృతర్పణం చేశాక శాంతించి అగ్ని సంస్కారం జరిపాడు. శమంత పంచకం అనబడే ఆ అయిదు రక్తపు మడుగుల ప్రదేశమే తరువాతి కాలంలో కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మరొకసారి బలికోరింది. మహాభారత సంగ్రామంలో అక్కడే రక్తం వరదలై పారింది. పరశురాముడు యజ్ఞం చేసి శుచి చేసుకొని తండ్రికి ఉత్తరక్రియలు జరిపాడు. తరవాత క్షత్రియ.

సంహారానికి బయలుదేరాడు. వెతికి, వెతికి క్షత్రియుల్ని గండ్రగొడ్డలికి ఆహుతి చేశాడు. క్షత్రియ మాతలు వంశాంకురాలైన పిల్లల్ని బ్రాహ్మణుల ఇళ్ళల్లో దాచారు. తాము కూడా బ్రాహ్మణ కాంతలుగా వేషాలు మార్చుకొని, పసివాళ్ళను బ్రాహ్మణ బాలలుగా చేసి తలదాచుకొన్నారు. ఆ విధంగా పరశురాముడు ఇరవైఒక్క సార్లు దేశాలు గాలించి క్షత్రియులనిపించుకోనేవారు కనిపించకుండా దండయాత్రలు చేశాడు.

అతని ప్రతిజ్ఞ తీరింది. క్షత్రియ సంహారం చేశాక తన ఆధీనమైన భూమినంతటినీ కశ్యపుడికి దానంచేసి, వెళ్ళి దక్షణ సముద్రంలో ఉన్న మహేంద్ర పర్వతం మీద తపస్సులో నిమగ్నుడయ్యాడు. బ్రాహ్మణుల ఇళ్ళల్లో, మునుల ఆశ్రమాల్లో పెరిగి పెద్దవారైన క్షత్రియకుమారులందరికీ కశ్యప ప్రజాపతి పరశురాముడిచ్చిన రాజ్యాల భూముల్ని పంచి ఇచ్చాడు. రాజ్యాలు ఏర్పడ్డాయి.

రాజ వంశాలు తలలెత్తాయి. అటువంటి రాజవంశాల్లో ఇక్ష్వాకు సంతతికి చెందిన రఘుమహారాజు గొప్ప కీర్తిగాంచి, రఘువంశానికి మూలపురుషుడయ్యాడు.
రఘువంశంలో విష్ణువు దశరథమహారాజు పెద్ద కుమారుడుగా రామావతారం ఎత్తి, ఆదర్శ మానవత్వాన్ని ఆచరణలో చూపించాడు. రాక్షస సంహారం చేశాడు. రామరాజ్యంగా పేరు పొందేలాగ రాజ్య పాలన చేశాడు. రాజుగా ప్రజాభిమతాన్ని బట్టి ఎలాంటి త్యాగాన్నైనా చేయక తప్పదని నిరూపించాడు.

‘‘దశావతారాల్లో ఏడవది అయిన రామావతారం వాల్మీకిమహర్షి రచనలో రామాయణ మహాకావ్యంగా విశేషవ్యాప్తి పొందింది,’’ అని చెప్పి సూతమహర్షి రామకథను ప్రారంభించాడు. హిరణ్యకశిపుడూ, హిరణ్యాక్షుడూ, విష్ణువుచేత హతులై, రెండో రాక్షస జన్మగా రావణుడూ, కుంభకర్ణుడుగా పుట్టి అడ్డూ అదుపూ లేకుండా, లోకభ…యంకరులై విజృంభించారు. రావణాసురుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మవలన దేవ, …యక్ష, గంధర్వాదులెవ్వరిచేతా హానిలేని వరాన్ని పొందాడు. మానవమాత్రులు తన్నేం చే…యగలరనే నిర్లక్ష్యంతో నరులను కలపలేదు.

కుంభకర్ణుడు పర్వతాకారుడు. తపస్సు చేసి ఆరు నెలలు నిద్ర, ఆరు నెలలు జాగృతిగా వరం పొంది, మనుషుల్ని చంపి తింటూండేవాడు. రావణుడు, కుబేరుడి పుష్పక విమానాన్ని లాక్కొని అతణ్ణి లంకనుంచి వెళ్ళగొట్టి, లంకానగరాన్ని స్వాధీనం చేసుకొని లంకేశ్వరుడై రాక్షసులైన వారినందర్నీ కూడగట్టుకుని, లోకాలు జయించి వీర విహారం చేశాడు. రావణుడు పదితలలవాడు.

కైలాసం వెళ్ళి మితి మించిన అహంకారంతో నందీశ్వరుడి ముఖాన్ని కోతిముఖమని వెక్కిరించి, కోతులవల్లనే లంకకు ముప్పు వాటిల్లుతుందని నందీశ్వరుడి శాపం పొందాడు. ఇరవైభుజాల తీటతీరేలాగ కైలాసాన్ని ఎత్తి, శివుడు కాలి బొటనవ్రేలితో నొక్కే సరికి పర్వతం కింద నలిగి పెద్ద పెట్టున ఆర్తారావం చేసి రావణుడు అనిపించుకున్నాడు. అంతకు ముందు దశకంఠుడని పిలువబడుతూండే రావణుడు ఒక్కొక్క తలను ఖండించుకొని శివుణ్ణి అనేక విధాలుగా స్తోత్రగానాలు చేసి, శివుడి అపార అనుగ్రహం పొందగలిగాడు.

రావణుడు ఎంత గొప్ప శివభక్తుడో, అంత దురహంకారి, ఎంతటి పరాక్రమ వంతుడో అంత దుర్మార్గుడు. పరస్ర్తీలను అపహరించుకు రావడం సాటిలేని ఘనత, ఎదురులేని వీరత్వంగా భావించి స్ర్తీలను చెరపట్టడం అతనికొక పరిపాటి అయింది. ఇష్టపడని కాంతను బలాత్కరించితే పదితలలు వెయ్యిచెక్కలౌతాయని శాపం కూడా సంపాదించుకున్నాడు.
రావణాసురుడి భార్య మండోదరి మయుని కూతురు. భర్త హితవు కోరి తరచూ హితవు చెబుతూండేది. అతని సవతి తమ్ముడు విభీషణుడు ఉత్తముడు.

అవకాశం వచ్చినప్పుడల్లా రావణుడికి మంచి చెబుతూండేవాడు. కాని, రావణుడు ఒకరు చెబితే వినేలాంటి వాడు కాదు. వింధ్యపర్వతానికి దక్షణాన వున్న భూభాగమూ, సముద్రమూ, ద్వీపాలూ రావణరాజ్యంగా, లంకా మహాసామ్రాజ్యంగా రాక్షస సమూహాలు స్థావరంగా చేసుకొని, నరభక్షకులై, ఆర్యావర్తంలో యజ్ఞయాగాదులు జరక్కుండా ధ్వంసం చేస్తూ, ఋషులను చిత్రహింసలు పెట్టి వినోదిస్తూ, ఊళ్ళూ ఆశ్రమాలూ తగలబెడుతూ చెలరేగుతూండేవారుకృశధ్వజుడు అనే రాజర్షి వేదం చదువుతూండగా పుట్టిన వేదవతి అనే కన్య విష్ణువును భర్తగా కోరుతూ తపస్సు చేస్తూండగా రావణుడామెతో విష్ణువు కంటే తానే అధికుడననీ, తనతో వచ్చేయమనీ ఆమె కొప్పు పట్టుకొన్నాడు. వేదవతి, ‘‘దురాత్మా! నీవు తాకిన శరీరం ఇప్పుడే విడుస్తున్నాను.

నీ లంకలోనే నా అంతట నేను పుట్టి నీ సర్వనాశనానికే కారణం ఔతాను! విష్ణువే నన్ను వరిస్తాడు!’’ అని చెప్పి తపోశక్తితో యోగాగ్ని రగుల్చుకొని ఆ క్షణమే దగ్థమైపోయింది. రాక్షస నిర్మూలనం చేసి లోకకల్యాణం చేకూర్చడం కోసం విష్ణువు భూలోకంలో అవతరించవలసిన తరుణం వచ్చింది. విష్ణువు మానవుడుగా, దేవతలు అసంఖ్యాకులైన వానరులుగా జన్మించారు.

విష్ణు కథ - 7

విష్ణు కథ - 7

బలిచక్రవర్తి సుతల లోకానికి చేరుకొని పాతాళసామ్రాట్టుగా ప్రతినిత్యం విష్ణు పాదాలను అర్చిస్తూ ఉన్నాడు. దేవతలకు స్వర్గమూ, దేవేంద్రుడికి స్వర్గాధిపత్యమూ తిరిగిలభించాయి. బలి వుండే సుతలలోక ద్వారాన్ని వేత్ర దండాన్ని పట్టుకొని వామన రూపుడైన విష్ణువు కాపలా కాస్తుండగా, ఒకప్పుడు రావణుడు సుతలాన్ని జయించాలని వెళ్ళాడు. ఈ పొట్టివాడు నన్నేం చే…ుగలడు అని ప్రవేశించబోగా, విష్ణువు మహెూన్నత ప్రమాణానికి భ…ుంకర రూపంతో పెరిగి కాలిగోటితో రావణుణ్ణి చిమ్మాడు.

ఆ విసురుకు రావణుడు లంకలో సొమ్మసిల్లి పడ్డాడు. తాను సుభిక్షంగా పాలించిన భూమ్మీద పంటలూ అవీ ఎలా ఉనాెూ్న పరివేక్షంచ డానికి సంవత్సరానికొకసారి బలిచక్రవర్తి అదృశ్యంగా వస్తాడు. సస్యాలకు పుష్ఠినీ, జీర్ణకారిత్వాన్నీ, బలాన్నీ కలుగజేస్తాడు. కీటక, క్రిమి బాధలు లేకుండా కాపాడు తాడు. అతని రాకకు స్వాగతంగా దీపావళి పండుగ అతి వైభవంగా జరుగుతుంది. మర్నాడు బలి పాడ్యమిగా బలిని భక్తితో పూజిస్తారు.

వామనుడి త్రివిక్రమాకాశ విజ…ూనికి గుర్తుగా ఆనందంతో ఆకాశదీపాన్ని పెడతారు. దక్షణమహాసముద్రంలో బలిచక్రవర్తి భూమ్మీదకు వచ్చే ద్వారంగా ఒక ద్వీపం ఏర్పడింది. అది బలిద్వీపంగా పేరొందింది. బలిచక్రవర్తి వంశీకులైన పల్లవచక్రవర్తులు అతనిపేరున మహాబలిపురాన్ని అత్యద్భుత శిల్ప సంపదలతో నిర్మించారు. కాంచీపురంలో ఉన్నతమైన త్రివిక్రమవామనావతార శిల్పాన్ని నెలకొల్పారు.

బలిచక్రవర్తి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. బలిచక్రవర్తి పాలనలో అణిగి మణిగి ఉండిన క్షత్రి…ుులు క్రమంగా తలలెత్తి విజృంభించారు. బలంగల వాడిదే భూమి అయిపోయింది. రాజుల నిరంకుశ పాలనలో జనులు తల్లడిల్లిపో…ూరు. అప్పుడు విష్ణువు దశావతారాల్లో ఆరోది అయిన పరశురామావతారం ఎత్తి అడవుల్ని  నరికినట్టుగా ఇరవై ఒక్కసార్లు క్షత్రి…ుుల్ని గండ్రగొడ్డలితో నిర్మూలించి, ఎప్పుడు ఏది అవసరమో అది సాధించడానికి అవతరిస్తూంటాడని నిరూపించాడు.

నాటి ధరాతలాన్నేలే రాజులందరిలో మేటీ, నా…ుకుడూ, సామ్రాట్టూ అయిన హైహ…ుచక్రవర్తి కార్తవీర్యార్జునుడు సుదర్శచక్రం అంశతో పుట్టాడు. ఒకానొక సమ…ుంలో విష్ణువు పాలకడలిలో శేషశ…్యుపై ెూగనిద్ర తీస్తూండగా శంఖచక్రాలు తమ తమ గొప్పలు చెప్పుకుని గర్వంతో వాదులాడుకున్నాయి. ‘‘సహస్రకిరణుడైన సూర్యుణ్ణి తరిణ బట్టిన రజంతో విశ్వకర్మ నన్ను రూపొందించాడు. వెయ్యి కోణాలతో గిర్రున తిరుగుతూ బలవంతులైన అనేకమంది రాక్షసుల్ని నేనే కదా ఖండించింది! నన్ను ధరించి విష్ణువు ‘చక్రి’  అని ఖ్యాతి పొందాడు! నీకు వఠ్ఠి ధ్వని తప్పితే మరేదీ చేతకాదు!’’ అని చక్రం పలికింది.

పాంచజన్య శంఖం, ‘‘ఔరా, చక్ర పురుషా! ఎంత పొగరుగా మాట్లాడావు! భూమ్మీద పొగరుబోతైన రాజుగా పుట్టు! విష్ణువు మునికూమారుడై కటె్టలుకొటే్ట గొడ్డలి మాత్రంతో, నీ పొగరు అంత మొందిస్తాడు!’’ అని శాపం పలికింది. శాపం పొందిన చక్రపురుషుడు కార్త వీర్యార్జునుడై పుట్టి హైహ…ుసామ్రాజ్యాన్ని నాలుగు చెరగులా విస్తరింపజేశాడు. అతడు భగవంతుని అవతారమైన దత్తాత్రే…ుుడి భక్తుడు, శిష్యుడు. అతని అనుగ్రహంతో అణిమాది సిద్ధుల్నీ,అనేక శక్తుల్నీ పొందాడు.

అవసరమైనప్పుడు అనేక ఆ…ుుధాలతో వెయ్యి చేతులు వస్తూండేవి ... అని సూతమహర్షి చెప్పగా, నైమిశారణ్య మునులు, ‘‘సూత మునీంద్రా! దత్తాత్రే…ు చరిత్ర వినాలని కుతూహలపడుతున్నాము!’’ అని అన్నారు. సూతుడు మునులకు దత్తాత్రే…ుకథ చెప్పడం ప్రారంభించాడు: అత్రిమహర్షికుమారుడికోసం విష్ణువును తలంచుతూ గొప్ప తపస్సు చేశాడు.

ఇటు అటు బ్రహ్మ, మహేశ్వరులతో కలిసి విష్ణువు ప్రత్యక్షమై, ‘‘అత్రిమహర్షీ! నేను నీకు దత్తుడిని అ…్యూను! మేము ముగ్గురమూ ఒక్కటే కనుక త్రిమూర్తుల అంశలతో నేను నీకు కొడుకునౌతాను! దత్తాత్రే…ుుడిగా పిలువబడతాను!’’ అని చెప్పి బ్రహ్మమహేశ్వర సహితంగా అంతర్థానమ…్యూడు. అదే సమ…ుంలో నారదుడు త్రిమూర్తుల అర్ధాంగులమని గర్విస్తూన్న సరస్వతి, లక్ష్మి, పార్వతుల ముందు అత్రిమహాముని భార్య అనసూ…ు పాతివ్రత్య మహిమ సాటిలేనిదని సహేతుకంగా నిరూపించాడు.

త్రిదేవీమూర్తులకు సాధ్యం కాని పనులు చేసింది ఆమె. అనసూ…ు గంగను పీడిస్తున్న పాప పిశాచాలను నిర్మూలించింది. నారదుడిచ్చిన ఇనుప గుగ్గిళ్ళను కమ్మగా పచనం చేసి ఇచ్చింది. సూర్యుణ్ణి ఉదయించకుండా చేసిన సుమతిని ఒప్పించి, సూర్యోద…ుమైతే చనిపోయిన ఆమె భర్తను అనసూ…ు తిరిగి బ్రతికించింది. దేవీమూర్తులు ముగ్గురికీ అనసూ…ుపై పట్టరాని ఈర్ష్యపుట్టింది.

భర్తలు రాగానే అనసూ…ును భంగపుచ్చి రమ్మని పంపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు  వేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతీభిక్షాందేహి  అని నిలబడ్డారు. అప్పటికింకా అత్రిమహాముని తపస్సు ముగించి ఆశ్రమానికి చేరలేదు. అతిథి సత్కార బాధ్యతలన్నీ అనసూ…ు మీదనే పెట్టి వెళ్ళాడు. అనసూ…ు అతిథులుగా వచ్చిన త్రిమూర్తులకు అతిథి మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది.

అప్పుడు కపట…ుతులు ముగ్గురూ ఏకకంఠంతో, ‘‘ఓ సాధ్వీ! మాకొక విడువరాని ని…ుమమున్నది - అది అది ...’’ అని నసుగుతూ, ‘‘నీవు నగ్నంగా వడ్డిస్తేనే గాని తినేదిలేదు!’’ అని అన్నారు. అనసూ…ు, ‘‘అలాగా! సరే!’’ అంటూ వారిమీద నీళ్ళు చిలకరించింది. ముగ్గురు అతిథులూ ముద్దులొలికే ముగ్గురు పసిపాపలైపో…ూరు. అనసూ…ుకు మాతృత్వం పొంగివచ్చింది. పసివాళ్ళకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది.

ఒడిలో చేర్చుకొని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూ…ు ఒడిలో కమ్మగా నిద్రలోకి జారిపో…ూరు. అనసూ…ు ముగ్గుర్నీ ఉ…్యూలతొట్టిలో పరుండబెట్టి, ‘‘ముజ్జగాలేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. అదృష్టం అంటే నాదే! బ్రహ్మాండమే వీళ్ళకు ఉ…్యూలతొట్టి, నాలుగు వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట!’’  అంటూ అత్యంత మధురంగా జోలపాడింది.

అప్పుడే ఆశ్రమంలోకి ఒక తెల్లని లేగ ఎద్దు ప్రవేశించి ద్వారం ముందు నిలబడి తలాడిస్తూ మువ్వల సవ్వడి చేసింది. పెద్ద గరుడపక్ష రెక్కలల్లార్చుతూ ఆశ్రమం మీద తిరగసాగింది. ఒక రాజహంస వికసిత పద్మాన్ని కరుచుకొని ఎగురుతూ వచ్చి గుమ్మం ముందు వాలింది. ముద్దొచ్చే నాలుగు రంగుల కుక్క పిల్లలు తోకలాడిస్తూ, ఇంట్లోకి చొరబడ్డాయి. వాటికి తోడు ఒక నాగుపడగ విప్పి ఆడుతూ వచ్చింది.

అంతలో మహతి వీణపై నీలాంబరి రాగాన్ని పలికిస్తూ నారదుడూ, అతని వెనుక లక్ష్మి, సరస్వతి, పార్వతి వచ్చారు. నారదుడు అనసూ…ుతో, ‘‘అమ్మా, ఈ ముగ్గురమ్మల భర్తలకు చెందిన ప్రాణులు గుమ్మంలో కనిపిస్తూంటే, వాళ్ళిక్కడే ఉంటారని ఇలా వచ్చారు. ఇప్పటికే భర్తల ఎడబాటు వల్ల విరహంతో తల్లడిల్లిపోతున్నారు. వారి భర్తల్ని వారి కిప్పించు!’’ అన్నాడు. అనసూ…ు ముగ్గురమ్మలకూ నమస్కరించి సవిన…ుంగా, ‘‘తల్లులూ! ఆ ఊ…ులలో పసివారే మీ వారైతే తీసుకెళ్ళండమ్మా!’’ అన్నది. దేవీమూర్తులు ముగ్గురూ నివ్వెరబోయి చూశారు. పసివారు ముగ్గురూ ఒక్కలాగే ఉన్నారు. ఒకటిగా నిద్రపోతున్నారు. లక్ష్మి పార్వతి సరస్వతులు తట పటా ఇస్తూంటే, నారదుడు, ‘‘ఎవరి భర్తను వారు ఎరక్కపోవడమేమిటి? సిగ్గుపడకండమ్మా

త్వరగా తీసుకోండమ్మా!’’ అంటూ తొందరచే…ుగా, ఒక్కొక్కరొక పిల్లవాణ్ణి తీసుకున్నారు. పిల్లవాళ్ళు ముగ్గురూ ఒక్కసారిగా త్రిమూర్తులుగా నిలబడ్డారు. సరస్వతి శివుణ్ణి, లక్ష్మి బ్రహ్మను, పార్వతి విష్ణువును తీసుకున్నట్లు అప్పుడు తెలిసింది. ముగ్గురమ్మలూ సిగ్గుపడుతూ దూరంగా వెళ్ళి నిల్చున్నారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరసగా కలిసిపోేులాగ అంటి పెట్టుకొని నిల్చున్నారు.

అదేసమ…ూనికి అత్రి ఇంటికి చేరుకున్నాడు. తన ఇంట త్రిమూర్తులను చూసి చేతులు జోడిస్తున్నంతలో, బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కలిసిపోయి, ఒకే ఒక మూర్తిగా దత్తాత్రే…ుుడు రూపొందాడు. మధ్య విష్ణువు, ఇటు అటు బ్రహ్మమహేశ్వరుల ముఖాలతో, ఆరు చేతులతో శంఖ, చక్ర, గదా పద్మాలు, త్రిశూలం కమండలంతో, భుజాన వ్రేలాడే జోలెలో భిక్షాపాత్రతో, త్రిమూర్తుల సమ్మేళన మూర్తిగా విష్ణువు దత్తాత్రే…ూవతారంతో అత్రి, అనసూ…ుల కుమారుడైనాడు. నారదుడు నాదనామక్రి…ూ రాగంతో వీణమ్రోగిస్తూ దత్తాత్రే…ుుణ్ణి స్తుతించాడు. శివుని వాహనమైన నంది దూడ ఎద్దుగా అతని వెనుక ఉంటుంది.

నాలుగు వేదాలు నాలుగు కుక్కలరూపుతో వెంట ఉంటాయి. సర్పము, గ్రద్ద, హంస పరిసరాల్లో అనుసరిస్తూంటాయి. దత్తాత్రే…ుుడు మహర్షిగా సదా వనాల్లో తిరుగుతూ ఏకాంతంగా ఆత్మానుసంధానంలో ఉంటాడు. అనేక దివ్యశక్తులను, సిద్ధులను ప్రసాదించే దత్తాత్రే…ుుణ్ణి మునులు, సిద్ధులు, జ్ఞానులు సదా ఆరాధిస్తూంటారు. హైహ…ు రాజవంశానికి ఆరాధ్యదైవంగా పూజింపబడ్డాడు.

కార్తవీర్యార్జునుడు దత్తాత్రే…ుుణ్ణి అర్చించి మహాబలసంపన్నుడై, సైన్యాలతో విజ…ు…ూత్ర బ…ులుదేరాడు. జమదగ్ని మహర్షి కుమాళ్ళలో రాముడు చివరివాడు. ఎప్పుడూ గొడ్డలి పట్టి తిరుగుతూ ఆశ్రమాలూ, జనపదాలూ నిర్మించడానికీ, భూమిని సాగుచే…ుడానికీ అనుకూలంగా అరణ్యాలు నరుకుతూండడమే అతని పని. హిమాల…ూల్లో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు అతనికి గొప్ప ప్రభావంగల పరశువును ప్రసాదించాడు. ఆ గొడ్డలిని ధరించి పరశురాముడు అని పేరుపొందాడు.

భృగుసంతతి వాడవడం వల్ల భార్గవరాముడు అని కూడా పిలువబడ్డాడు. ఒకప్పుడు పరశురాముడి తల్లి  రేణుకాదేవి నదికి వెళ్ళి ఎంతసేపటికీ రాలేదు. జమదగ్ని దివ్యదృష్టితో భార్య ఏం చేస్తూందో చూశాడు. చిత్రరథుడనే ఒక గంధర్వుడు అప్సరసలతో జలక్రీడ చేస్తూంటే, రేణుక ఆ విలాసాన్ని మైమరచి చూస్తూ ఉండిపోయింది. జమదగ్నికి కోపం వచ్చింది. భార్య వచ్చాక కుమాళ్ళను పిలిచి తల్లి తల  నరకమన్నాడు.

పరశురాముని అన్నలు అంత పని చే…ులేక పో…ూరు. అడవి నుంచి వచ్చిన పరశురాముడితో జమదగ్ని, ‘‘నీ అన్నల తలలనూ, మీ అమ్మ తలనూ నరుకు!’’ అని అన్నాడు. పరశురాముడు మారాడకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి, ఒక వేటున అన్నలనూ, తల్లినీ తెగటార్చాడు. జమదగ్ని పరశురాముణ్ణి మెచ్చుకొని ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘‘అన్నల్నీ, అమ్మనూ బ్రతికించు!’’

అన్నాడు పరశురాముడు. జమదగ్ని అలాగే వాళ్ళను బ్రతికించాడు. తన తపోమహిమ పట్ల పరశురాముడికి గల విశ్వాసానికీ, సూక్ష్మబుద్ధికీ జమదగ్ని ఎంతగానో  సంతసించి, ‘‘పరశురామా! నీవు కారణజన్ముడివి. చిరంజీవిగా ఉంటావు!’’ అని ఆశీర్వదించాడు. కార్తవీర్యార్జునుడు విజ…ు…ూత్ర ముగించి తన రాజధాని మాహిష్మతీ నగరానికి వెళ్తున్న దారిలో, జమదగ్ని ఆశ్రమం తగిలింది.

అప్పుడు రాజూ, పరివారమూ, సైన్యాలూ ఆకలితో ఉన్నారు. జమదగ్ని కామధేనువు అంశగల తన హెూమధేనువు మూలంగా వారందరికీ గొప్ప విందుచేశాడు. ఆ ఆవు ఏది కావలిస్తే అది ఎంత మందికైనా ఇస్తుంది. కార్తవీర్యుడు అలాంటిది తన దగ్గర ఉంటే సైన్యాలకు తిండి సమస్య లేకుండా అన్ని విధాలా ఉపకరించుకో వచ్చుననే దురాశతో సైనికులకు ఆవును మాహిష్మతి నగరానికి తోలుకురమ్మని ఆజ్ఞాపించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని ముష్కరులైన సైనికులు నేలకు త్రోసి ఆవును ఈడ్చుకెళ్ళారు.

విష్ణు కథ - 6

విష్ణు కథ - 6

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఆలింగనం చేసుకొని, ‘‘ప్రహ్లాదా! నీ మూలంగా ఇన్నాళ్ళకు విష్ణువుపై పగతీర్చుకొనే అవకాశం లభించింది!'' అని చెప్పి గదను ఎత్తి నరసింహావతారంతో పోరాటానికి తలపడ్డాడు. చివరకు నరసింహం ప్రళ…ు గర్జన చేస్తూ ఎగిరి, హిరణ్యకశిపుడిపై ఉరికి ఒడిసిపట్టుకొని, సభామంటప ద్వారం దగ్గరకు తీసుకువెళ్ళాడు.

లోపలా, వెలుపలా కాని ద్వారం అరుగుమీద, రాత్రీ, పగలూ కాని సంధ్యాసమయంలో, ఆకాశమూ, భూమీ కాని తన తొడల మీద పెట్టుకొని, సజీవములూ, నిర్జీవములూ కాని గోళ్ళతో, బ్రహ్మవలన పొందిన వరాలన్నిటికీ భిన్నంగా, విష్ణువు నరసింహరూపంతో హిరణ్యకశుపుడి రొమ్మునూ, పొట్టనూ భీకరంగా చీల్చి చంపాడు. రాక్షసులు సమూహంగా నరసింహుణ్ణి ఎదుర్కోడానికి రాగా విష్ణుచక్రం వారిని అంతం చేసింది.

నరసింహమూర్తి ప్రేగుల్ని కంఠహారాలుగా వేసుకొని, ఉగ్రంగా చేస్తున్న అట్టహాసానికి దేవతలు భయపడ్డారు. లక్ష్మీదేవి కూడా భయపడింది. అప్పుడు ప్రహ్లాదుడు నరసింహా వతారుణ్ణి స్తుతించి శాంతింపజేశాడు. తండ్రికి ఉత్తరక్రియలు జరిపి, రాజ్యపాలన చేయవలసిందని చెప్పి ప్రహ్లాదుణ్ణి దీవించి, నరసింహావతారుడైన విష్ణువు అంతర్థానమ. జయా విజయాల తొలిజన్మ ముగిసింది.

విష్ణువు ఆనతిప్రకారం ప్రహ్లాదుడు చిరకాలం రాజ్యపాలనచేసి, కుమారుడైన విరోచనుడికి పట్టంకట్టి, విష్ణుభక్తి తత్పరుడై వనాలకు వెళ్ళాడు.

విరోచనుడి తర్వాత అతని కుమారుడు బలి రాజ్యానికొచ్చాడు. క్షరసాగరమథనంలో పుట్టిన ఉచై్చశ్రవాన్ని బలి, తీసుకున్నాడు. రాక్షసులశిల్పి మ…ుుడు అతనికి నేలపైనా, నీటిలోనూ, అంతరిక్షలో పోగల గొప్ప వాహనాన్ని నిర్మించి ఇచ్చాడు.

అమృతం తమకు దక్కకుండా జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దేవతలతో దిగాడు. దేవతలు అమృతం సేవించిన ధైర్యోత్సాహాలతో రాక్షసులను ఎదుర్కొన్నారు. బలి ఇంద్రుడితో గొప్పగా పోరాడాడు. దేవప్రముఖులకూ, రాక్షస ప్రముఖులకూ ముఖాముఖీగా, విడివిడి... సాగాయి. ఆ దేవదానవ సంగ్రామంలో రాక్షసులు చిత్తుగా ఓడిపోయారు. హతులైన రాక్షసులను రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యను ప్రెూగించి తిరిగి బ్రతికించాడు.

ఓటమితో బలి మరింత పట్టుదలతో రాక్షసులందర్నీ కూడగట్టుకొని నా…ుకుడై, భూమండలం అంతటినీ జయించి, కట్టుదిట్టంగా ఆదర్శవంతమైన పరిపాలన సాగిస్తూ, బలిచక్రవర్తి అనిపించుకున్నాడు. శుక్రుడు అతని చేత నూరు అశ్వమేధ యాగాలు చేయించాడు. బలి విజృంభించి స్వర్గం మీదకు దాడి చేశాడు. అతని ధాటికి వెరచి ఇంద్రాది దేవతలు స్వర్గాన్ని వదలి అరణ్యాలు పట్టారు. దిక్పాలకులు బలిచక్రవర్తికి వశవర్తులై మెలగసాగారు. స్వర్గమర్త్య పాతాళ ముల్లోకాలను బలిచక్రవర్తి ధర్మబద్ధంగా పాలిస్తూండగా, ఇంద్రుడి తల్లి అదితి భర్త కశ్యపప్రజాపతితో తన సంతతి వారైన దేవతలు, ఇంద్రుడు, శచీదేవి అరణ్యాల్లో పడుతున్న పాట్లు చెప్పుకొని, వారికి తిరిగి ఎలాగైనా  స్వర్గసామ్రాజ్యం చేకూరే మార్గం చెప్పమన్నది.

అందుకు విష్ణువును గూర్చి వ్రతం చె…్యుమని కశ్యపుడు ఉపదేశించాడు. అదితి విష్ణువును ఆరాధించి మెప్పించింది. విష్ణువు ఆమె కడుపున పుట్టి దేవతలకు స్వర్గం సమకూర్చిపెడతానని చెప్పాడు. ఆ విధంగా విష్ణువు అదితి కశ్యపులకు పొట్టి పిల్లవాడైన కుమారుడుగా పుట్టి, దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని ఎత్తాడు.
వామనుడు ఉపనయనం పొంది వేద విద్య పూర్తిచేసి, ఇంద్రుడి తమ్ముడుగా, అదితి అల్లారు ముద్దుబిడ్డగా పెరిగాడు.  అప్పుడు బలిచక్రవర్తి నర్మదానదీ తీరంలో,..గొప్పదైన విశ్వజిద్యాగాన్ని శుక్రుని అధ్వర్యంలో ప్రారంభించి గొప్పగొప్ప దానాలు చేస్తున్నాడు.

వామనుడు ఒడుగు జందెము, కృష్ణాజినము, కమండలం మొదలైనవాటిని ధరించి గొడుగూ, పావుకోళ్ళూ వేసుకొని, మూర్తీభవించిన బ్రహ్మతే జస్సుతో బలిచక్రవర్తి దగ్గరికి బయలుదేరాడు. బుడి బుడి నడకలతో వస్తున్న వామనుణ్ణి జూసి,..అంతా ముచ్చటపడ్డారు. వామనుడు బలిచక్రవర్తి ఎదుటకు వెళ్ళి జ…ుం పలికాడువామనుణ్ణి చూడడంతో బలిచక్రవర్తికి మహదానందం కలిగింది, ‘‘చిట్టినాయనా! ఎవరునువ్వు? ముక్కుపచ్చలారని సరికొత్త వటువుగా ఎక్కడికి బయల్దేరావు?’’ అని అడిగాడు.

వామనుడు, ‘‘నీ దగ్గిరికే  బయల్దేరి వచ్చాను. ఎవర్నని చెప్పేది, అంతా నావారే! అయినా ఇప్పుడు ఒంటివాణ్ణి; సిరిగలవాడినే, అయినా ఇప్పుడు నీ ముత్తాతలు వీరాధివీరులు, ఇక నీ బలపరాక్రమాలు దిగంతాలు దాటాయి!’’ అని అంటూంటే, బలిచక్రవర్తి నవ్వుతూ, ‘‘నీ మాటలు చిత్రంగావున్నాయి. పరాక్రమం గురించి మాట్లాడుతున్నావు, చేయమనవుగద? నేనిప్పుడు కంకణం కట్టుకొని ఉన్నానాెును, లేదు మరి!’’ అని వినోదంగా అన్నాడు.

వామనుడు, ‘‘ఎంతమాట బలిచక్రవర్తీ! ఏదో నాతో పరిహాసం ఆడావుగాని, మహోన్నత బల విక్రముడివైన నీ ముందర భూమికి అంటుకుపోతున్న పొట్టికుంకను నేనెక్కడ? మేటి దాతవై అంతులేని దానాలు చేస్తున్న నీ కీర్తివిని నిన్ను  దానం పుచ్చుకోవాలని వచ్చాను!’’ అన్నాడు. ‘‘అలాగే పుచ్చుకో, నువ్వు ఏమడిగినా ఇస్తాను!’’ అని బలిచక్రవర్తి అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని పిలిచి, ‘‘వామనుడెవరో కాదు, విష్ణువు! నిన్ను వంచించి, నీ సర్వస్వాన్నీ హరించడానికి వచ్చాడు. అతనికి ఎటువంటి దానప్రదానమూ చే…ువద్దు!’’ అని హెచ్చరించాడు.

బలిచక్రవర్తి, ‘‘విష్ణువంతటి వాడు, దేహీ అని చేయిచాచగా, నా చేయి మీదై దానం ఇవ్వడం గొప్ప అదృష్టమే కాకుండా, నా ఘనవిజయాన్ని చాటుతుంది! అంతేగాకుండా, ఇస్తానని లేదనడం అసత్యదోషం కదా!’’ అన్నాడు.

శుక్రుడు, ‘‘ఆత్మరక్షణకు అది అసత్యం అనిపించుకోదు. తనకు మాలిన ధర్మం ఆత్మహత్యాపాతకంతో సమానం!’’ అన్నాడు. ‘‘ఏది ఏమైనా, అతడు నన్నేమిచేసినా, నేనేమైపోయినా అది నా ఓటమి కాదు, ధర్మవీరమే  అవుతుంది! శిబిప్రముఖుల్లాగ దానశీలుణ్ణి అనిపించుకోవాలనే కీర్తికాంక్ష కూడా నాకులేదు. పిరికితనంతో అడిగినది ఇస్తానని, లేదని తప్పించుకొనే భీరువు అనిపించుకోవడం, నాకు సాధ్యం కాదు,’’ అని బలిచక్రవర్తి అన్నాడు.

ఆ మాటలకు శుక్రుడు కోపంతో, ‘‘గురువుగా నీ హితవుకోరి చెప్పింది వినకుండా ధిక్కరిస్తున్నావు. నీ సర్వస్వాన్నీ, రాజ్యాన్నీ కోల్పోతావు!’’ అని శపించినట్టు అన్నాడు.
బలిచక్రవర్తి, ‘‘గురుదేవా! నన్ను శపించావని వఠ్ఠిమాట పడ్డావేగాని, నేను అన్నిటికి తల ఒగ్గే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాను గదా! గురుధిక్కారం చేసి పొందిన శాపాన్ని విష్ణువు అమలు చేశాడే గాని, అన్యా…ుంగా బలిని వంచించలేదని విష్ణువుకు మాటరాకుండా నీ శాపం మేలు చేసింది! నీ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను!’’ అన్నాడు.
శుక్రుడు తెల్లబోయి నిరుత్తరుడై తల వంచుకున్నాడు. బలి వామనుడి దగ్గిరికి వెళ్ళబోతుండగా శుక్రుడు, ‘‘ఓ దానవనాథా! విష్ణువు బిచ్చానికి వచ్చి నిన్ను బిచ్చగాణ్ణే చేస్తాడో, అథఃపాతాళానికి అణిచేస్తాడో, ఏంచేసినా చె…్యువచ్చు. ఈ త్రిలోకాధిపత్యమూ, సంపదలూ, వైభవమూ దేనికి కష్టించి సంపాదించావు? శరీరం తర్వాతనే కదా ఏ ధర్మసాధన అయినా!’’ అని అన్నాడు.

బలి, ‘‘రాజ్యమూ సంపదలూ సతతము వుండేవి కావు. ఎలా సంపాదించానో అలాగే పోగొట్టుకోవడం సహజమేకదా. శరీరం కూడా శాశ్వతం కాదుగదా!’’ అన్నాడు.
శుక్రుడు, ‘‘నీ వినాశం నీ ఒక్కడిదే కాదు. దానవకులానికే ముప్పూ, అవమానమూ తెస్తుందని తెలుసుకో!’’ అన్నాడు. ‘‘అంతేకాదు, ఒక దానవుడు ధర్మపాలన చేశాడు, విష్ణువుకు భిక్షపెట్టాడు! అని దానవకులాని కంతటికీ ఘనత తెస్తుంది కదా!’’ అని బలిచక్రవర్తి వామనుడి దగ్గిరికి వెళ్ళాడు. భార్య వింధ్యావళి స్వర్ణకలశంతో నీళ్లు పోయ్యగా బంగారు పళ్ళెంలో వామనుడి పాదాలు కడిగిన నీటిని భక్తితో శిరసున చల్లుకొని, బలిచక్రవర్తి వామనుడితో, ‘‘ఓ వామనరూపా! నీవంటి వాడు దానం కోసం రావడం నా సుకృతం! నీకేం కావాలో అడుగు! సిరులు, సంపదలు, భవంతులు, మణులు, సుందరీమణులు, సస్యక్షేత్రాలు, సామ్రాజ్య సర్వమూ, నా తనువు - అన్నీ నీవే!’’ అన్నాడు.

వామనుడు, ‘‘మహాబలీ! నీవ్వు వల్లించినవన్నీ నా కెందుకు? కృష్ణాజినం పరుచుక్కూర్చొని బ్రహ్మనిష్ఠ జరుపుకోడానికి నా చిట్టిపాదాలతో మూడు అడుగుల చోటు చాలు! మూడడుగుల నేల, నీ దిగంతపర్యంతమైన సామ్రాజ్యంలో స్పల్పాతి స్వల్పమే అయినా, నాకు అదే ముల్లోకాల సాటి!’’ అన్నాడు. ‘‘ఆ మూడడుగులే పుచ్చుకో!’’ అని బలిచక్రవర్తి జలకలశం వంచి ధారాదత్తం చే…ుబోతే నీరుపడలేదు. శుక్రుడు సూక్ష్మరూపంతో జలకలశం తొండంలో అడ్డుపడి జలధార పడకుండా చేశాడు.

వామనుడు దర్భపుడక తీసి దాంతో తొండంలోకి పొడిచాడు. శుక్రుడు కన్ను పోయి ఒంటికన్ను వాడ…్యూడు. అడ్డు తొలగి  జలధార బలిచక్రవర్తి చేతి మీదుగా వామనుడి దోసిటపడ్డది. దానవిధి పూర్తి కాగానే, ‘‘ఇహ  నీ అడుగులతో మూడు అడుగులు నేల కొలిచి తీసుకోవడమే తరవాయి!’’ అన్నాడు బలి.

వామనుడు అమాంతంగా అలా అలా పెరిగి విశ్వరూపం ధరించి పొడవు, వెడల్పు, ఎత్తులతో క్రింద, మధ్య, మీద అనే మూడింటినీ ఆక్రమించాడు. ఒక పాదంతో భూమి నంతటినీ కొలిచాడు. త్రివిక్రముడైన విష్ణువు పాదం నీడలో భూతలమంతా క్షణకాలం పాటుగా గాఢాంధకారం క్రమ్ముకొన్నది. ఆ తరువాత ఆకాశాన్నంతటినీ కొలిచాడు. సూర్య చంద్రాదిగ్రహాలు, నక్షత్రమండ లాలన్నీ అతని పాదానికి అంటుకొన్న రేణువులుగా కనిపించాయి.

అప్పుడు బ్రహ్మ తన కమండలంలోని జలంతో విష్ణుపాదాన్ని అభిషేకించాడు. విష్ణుపాదం నుంచి జారిన నీరు ఆకాశగంగగా స్వర్గసీమలో మందాకినిగా ప్రవహించింది.
‘‘బలిచక్రవర్తీ! మూడో అడుగు ఎక్కడ వెయ్యమంటావు?’’ అని త్రివిక్రముడు అడిగాడు. బలిచక్రవర్తి, ‘‘ఏ త్రివిక్రమా! ఇదిగో నా శిరస్సు, దీనిపై మోపు!’’ అని తల వంచాడు.
విష్ణువు విశ్వరూపాన్ని చాలించి ప్రకారంగా వామనుడై అతని తలపై పాదాన్ని వేసి, ‘‘బలీ! భూమ్యాకాశాల్ని సంపూర్ణంగా కొలుచుకొన్న నా పాదం నీ తలను పూర్తిగా కొలవలేక పోతున్నది సుమీ!’’ అన్నాడు.

అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, ‘‘నా మనుమడు బలి నీకు శత్రువు కాడు, అతణ్ణి అనుగ్రహించు!’’ అని వామనుణ్ణి వేడుకున్నాడు. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి, చేతులు జోడించి నమస్కరించి, ‘‘వామనావతారా! నా భర్తకు ఎటువంటి హానీ జరక్కుండా అనుగ్రహించడం నీకు ఉచితం!’’ అని భక్తితో ప్రార్థించింది. వామనుడు, ‘‘అమ్మా! నీ భర్తకు హాని తలపెట్టడం ఎవ్వరికీ ఎప్పుడూ శక్యం కాని పని.

అందువల్లనేకదా నేవచ్చి దానం పుచ్చుకున్నాను! అతని ధర్మబలం అలాంటిది!’’ అని చెపుతూ ప్రహ్లాదుడి వంకచూసి, ‘‘బలి నాకు ఎంత ప్రి…ుతముడో తెలుసా?’’ అని అంటూ వామనుడు విష్ణుకళతో విరాజిల్లుతూ పొడవైన వేత్రదండాన్ని పట్టుకుని కనిపించాడు. ‘‘ఓ బలిచక్రవర్తీ! నీ సాటి ఇదివరకు లేడు, ఇకముందు ఉండబోడు. ఆదర్శ పాలకులైన చక్రవర్తులలో నీ పేరే మొదటిది. నిన్ను సుతలానికి పంపుతున్నాను. పాతాళలోకాలకు అధిపతిగా శాంతిసుఖాలతో చిరంజీవిగా వుంటావు. నీ భార్య, నీ తాత ప్రహ్లాదుడు నీతోనే వుంటారు. నీ సుతల ద్వారాన్ని, నేనిప్పుడు కనబడుతున్నటే్ల దండపాణినై కాపలాకాస్తూ, నీకు రక్షƒగా ఉంటాను,’’ అని చెప్పి అంతర్థానమ…్యూడు.
విష్ణు కథ - 5


విష్ణువు జయవిజయులతో, ‘‘మహా మునుల శాపం మీరరానిది. నా పట్ల మిత్రభావంతో ఏడు జన్మల్లో తరించి వస్తారా? లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై మూడు జన్మల్లో నాచేత అంతమొంది ఇక్కడికి వస్తారా?'' అని అడిగాడు. జయవిజయులు విష్ణు సన్నిధానాన్ని త్వరగా చేరుకోడానికి మూడు జన్మలే కోరుకున్నారు.

అప్పుడు సనకసనందనాది మునులు జయవిజయుల్ని మెచ్చుకుంటూ విష్ణువుతో, ‘‘రాగద్వేషాలు రెండూ నీకు సమానమనీ, నిన్ను ద్వేషించేవారు మరింత త్వరగా నీకు దగ్గరవుతారనీ ఇప్పుడు తెలుసుకున్నాం! కర్తవ్య నిర్వహణలో మమ్మల్ని అడ్డుకున్న నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గు పడుతున్నాం. మమ్మల్ని మన్నించు!'' అని చెప్పి, లక్ష్మీనారాయణులను అనేక విధాల మనసార స్తుతిస్తూ సేవించి వెళ్ళారు.

జయవిజయులు కశ్యపప్రజాపతి భార్య దితి కడువున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా పుట్టారు. అన్నదమ్ములు గొప్ప పరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మను మెప్పించి గొప్ప వరాలు పొందారు. విష్ణువుపై కత్తికట్టి విజృంభించారు. హిరణ్యకశిపుడు రాక్షసులకు రాజై, విష్ణువును ఎదుర్కొని సాధించడానికి కంకణం కట్టుకున్నాడు. హిరణ్యాక్షుడు విష్ణువును కవ్వించే ఘోరకృత్యాలు చేసి చేసి, భూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రంలోకి తోశాడు. భూమి రసాతలం అడుగున మునిగిపోయింది. భూదేవి విష్ణువును తలంచి తన్ను ఉద్ధరించమని మొరపెట్టింది.

విష్ణువు భూదేవి మొర ఆలకించి దశావతారాల్లో మూడవది అయిన వరాహావతారాన్ని ఎత్తాడు. బ్రహ్మ హోమం చేస్తూండగా యజ్ఞకుండం నుంచి తెల్లని కాంతితో ఒక నలుసు వెలువడింది. ఆ నలుసు క్రమ క్రమంగా పెద్దదై అడవి పందిగా రూపొందింది. ఆ ఏదు పందిని విష్ణువు అవతారంగా ఎంచి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహంగా, శ్వేత వరాహంగా, ఆదివరాహంగా కీర్తిస్తూ స్తుతించారు.

యజ్ఞవరాహము అలా అలా పెరిగి, బ్రహ్మాండమైన ఆకృతి పొందింది; బలిష్ఠమైన కాళ్ళతో, ఉక్కుకవచం లాంటి పైచర్మంతో, వజ్రాల్లాంటి పొడవైన వాడి కోరకొమ్ములతో, ఎరన్రికాంతి ప్రసరించే కన్నులతో, మెడ నుంచి తోకవరకూ నిక్కబొడుచుకొని బంగారంలా మెరుస్తున్న వెంట్రుకల జూలుతో, విశ్వమంతా ఘూర్ణిల్లేలాగ వరాహము హుంకార ధ్వనులు చేసింది. యజ్ఞవరాహం ముట్టెలపై ఖడ్గంలాంటి కొమ్ము ధగధగా మెరుస్తున్నది.

వరాహావతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది. ఆ వేగానికి దిక్కులు అదిరాయి, ప్రళయవాయువులు భీకరంగా వీచాయి. రసాతల సముద్రంలోకి చొచ్చుకొని వెళ్ళి, అడుగున మునిగి ఉన్న భూమిని తన కొమ్ముతో గుచ్చి యజ్ఞవరాహము మీదకు ఎత్తింది. అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడిచేసి పోరాటానికి పిలిచాడు.
వరుణుడు, ‘‘వీరాధి వీరుడివైన నీవు పోరాడవలసినది నాతో కాదు రసాతలం నుంచి భూమిని ఉద్ధరిస్తున్న యజ్ఞవరాహంతో!’’ అని అన్నాడు.

హిరణ్యాక్షుడు హుటాహుటిని వెళ్ళి యజ్ఞ వరహావతారాన్ని ఢీకొన్నాడు. వరాహరూప విష్ణువుతో హిరణ్యాక్షుడు గొప్ప పరాక్రమంతో పోరుతూ గదతో విష్ణువు గదను తృళ్ళగొట్టి కొంతసేపు అలాగే నిల్చున్నాడు. విష్ణువు అతని యుద్ధనీతిని మెచ్చుకొని తిరిగి గదను ధరించాక, ఇరువురికీ సంగ్రామం ఘోరంగా సాగింది. చివరకు వరాహావతారం తన కొమ్ముతో హిరణ్యాక్షుణ్ణి పొడిచి చంపింది.

వరాహావతారుడైన విష్ణువును భూదేవి వరించింది. వరాహమూర్తి భూదేవిని సందిట చేర్చుకొని తొడపై కూర్చుండ బెట్టుకున్నాడు. బ్రహ్మాది దేవతలు పూలవాన కురిపిస్తూ, జగపతిగా విష్ణువును అనేక విధాలుగా స్తోత్రం చేశారు.

పందిరూపంతో తన తమ్ముణ్ణి చంపిన విష్ణువుపై పగ సాధించడానికి తీవ్ర సంకల్పంతో, ముందు బ్రహ్మవల్ల వరాలు పొందడానికి హిరణ్యకశిపుడు తపస్సుకు బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నది. ఆమె గర్భవాసాన్ని హతమార్చడానికి ఇంద్రుడు మాయోపాయంతో లీలావతిని చెరగొని, ఆకాశమార్గాన పోతూండగా, నారదుడు ఎదురై, ‘‘దేవేంద్రా! ఎంత పనికి ఒడిగట్టావు! నీ ప్రయత్నాన్ని విరమించు. సర్వకాల సర్వావస్థలలో హిరణ్యకశిపుడు పగతో విష్ణువు గురించే తలంచుతూండే వాడవడంవల్ల, లీలావతి గర్భస్థుడైన శిశువుకు ఆ విష్ణుచింతన సంక్రమించి, పగ భక్తిగా అతనిలో రూపాంతరం పొందింది. ఇదే విష్ణుమాయ అయిన ప్రకృతి విశేషాల్లో ఒకటి.

లీలావతి గొప్ప విష్ణుభక్తుణ్ణి కనబోతూన్నది. అంచేత లీలావతిని విడిచిపుచ్చి. నీ దారిన నువ్వు వెళ్ళు!’’ అని చెప్పి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు.

ఆశ్రమంలో నారదుడు ఉన్నతమైన  వేదాంత విషయాలనూ, విష్ణు దివ్య కల్యాణ గుణగణాలను వర్ణిస్తూన్నప్పుడు, లీలావతి గర్భంలో ఉన్న బిడ్డ అమిత ఆసక్తితో వింటూ, ఊకొడుతూండే వాడు. లీలావతి కుమారుణ్ణి ప్రసవించింది. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. భూమ్మీద గాని, ఆకాశంలోగాని, రాత్రిగాని పగలు గాని, ఇంటగాని, బయటగాని, మృగంచేత గాని మనిషిచేతగాని, దేవతలు మొదలైన వారివలన గాని, ప్రాణమున్న దానిచేత గాని లేనిదానిచేతగాని, నిప్పు, నీరులాంటి పంచభూతాల చేతగాని సృష్టిలో ఉన్న ఏరూపంచేత గాని, ఇంకా ఎన్నో విధాలుగా తనకు చావులేని వరాల్ని కోరాడు; బ్రహ్మ అతను కోరిన వరాలన్నిటినీ ఇచ్చాడు.

వరాలను పొందిన విజయగర్వంతోహిరణ్యకశిపుడు వస్తూండగా, నారదుడి వలన జరిగినది విని, నారదాశ్రమానికి వచ్చి, కుమారుడి పేరు ప్రహ్లాదుడు అని నామకరణ మహోత్సవం జరిగాక, భార్యనూ, కుమారుణ్ణీ తన రాజధానికి తీసుకువెళ్ళాడు. ఇంద్రుడిపై ప్రతీకారంగా హిరణ్యకశిపుడు స్వర్గం మీదకు దండయాత్ర చేసి, స్వర్గ సింహాసనం ఆక్రమించాడు.

దిక్కులన్నిటినీ జయించి, అష్ట దిక్పాలకుల్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాడు. దేవతల్ని పశువుల్ని బాదినట్లుగా బాదాడు. శచీదేవిని అవమానించబోతే లీలావతి అడ్డుకొంది.

హిరణ్యకశిపుడు విజృంభించి మునుల ఆశ్రమాల్ని తగలబెట్టించాడు. విష్ణు విశ్వాసకుల్ని చిత్రవధలు చేయించాడు. విష్ణువును ఎదుర్కోవడమే అతని ధ్యేయం. విష్ణువును కవ్వించడానికి చేయవలసినవన్నీ చేశాడు. అయినా విష్ణువు అతనికి తారసపడలేదు. వైకుంఠానికి దాడి వెళ్ళాడు. అక్కడా విష్ణువు అతనికి కనపడలేదు. ‘‘నాకు భయపడి అదృశ్యంగా దాగున్నాడు. పిరికిపంద!’’ అని హిరణ్యకశిపుడు తిరిగివచ్చాడు.

ప్రహ్లాదుడు దినదిన ప్రవర్థమానంగా ఎల్లప్పుడు విష్ణుస్మరణ చేస్తూ పెరుగుతూన్నాడు. తనకు అటువంటి కులద్రోహి ఎందుకు పుట్టాలి! అని హిరణ్యకశిపుడు చింతించి, గురుపుత్రులైన చండామార్కులకు ప్రహ్లాదుణ్ణి అప్పగించి, విద్యాబుద్ధులు నేర్పమన్నాడు. ప్రహ్లాదుడు గురుకులంలో హరిధ్యానంతోనే చదువంతా పూర్తిచేశాడు. తోటి బాలురకు విష్ణుభక్తి ప్రబోధంచేసి మోక్ష మార్గంపట్ల ఆసక్తికలవారిగా చేశాడు.

చండామార్కులు ప్రహ్లాదుణ్ణి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి ఆప్యాయంగా తొడపై కూర్చుండబెట్టుకొని, ‘‘నాయనా! నువ్వు నేర్చిన విద్యతెలిసేలాగ మంచి పద్యం ఒకటి చెప్పు!’’ అన్నాడు. ప్రహ్లాదుడు, ‘‘తండ్రీ! గురువులు చెప్పిన చదువంతా క్షుణ్ణంగా నేర్చాను. చదువులన్నిటి కంటె గొప్పదైన చదువు విష్ణువునందు మనసు నిల్పడం ఒక్కటే! విష్ణువును స్మరించే జన్మే జన్మ!’’ అన్నాడు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి చప్పున క్రిందకు తోసి పట్టరాని ఆగ్రహంతో చండామార్కులతో, ‘‘ఇదా మీరు నేర్పిన చదువు?’’ అన్నాడు.

చండామార్కులిద్దరూ గజగజలాడుతూ, ‘‘మా తప్పేమీ లేదు, మహాప్రభూ! మాపై ఆగ్రహించకు!’’ అని వేడుకుంటూ, గురుకులంలో ప్రహ్లాదుడేవిధంగా ప్రవర్తించినదీ వివరంగా విన్నవించుకున్నారు. హిరణ్యకశిపుడు కొడుకుతో, ‘‘విష్ణువు పందిగా నీ పినతండ్రిని చంపాడు. మన రాక్షస కులానికి పరమశత్రువు. నీవు విష్ణువును పొగడ్డం క్షమించరాని కులద్రోహం. విష్ణుభక్తి మాను, ఈ క్షణమే వాణ్ణి మర్చిపో!’’ అన్నాడు.

‘‘దానవేశ్వరుడవైన నీవు అన్నివిధాలా నన్ను శాసింపతగినవాడివే! కాని ఇనుముముక్క అయస్కాంతాన్ని ఏవిధంగా అంటుకుంటుందో, అలాగే నా మనస్సు విష్ణువుపైనే లగ్నమై ఉన్నది; మందార పువ్వు మకరందాన్ని తుమ్మెద ఎలాగ విడిచి పెట్టలేదో, అలాగే విష్ణువును మర్చిపోవడం నా వశంలో లేదు. నాలో జీవము ఉన్నంతవరకూ విష్ణుచింతన పోదు, ఆ జీవము కూడా విష్ణువే!’’ అన్నాడు వినయంగా.

ముక్కుపచ్చలారని బాలుడైన ప్రహ్లాదుడి మాటలకు విస్తుపోతూ హిరణ్యకశిపుడు కోపంతో అగ్నిలా ప్రజ్వరిల్లి, ‘‘అయితే నీవు చావక తప్పదు, ఆహార పానాలు లేకుండా మలమల మాడి చావు!’’ అంటూ ప్రహ్లాదుణ్ణి వెలుతురు చొరని కారాగారంలో పెట్టించాడు. పుత్రప్రేమతో లీలావతి తల్లడిల్లి పోయింది.

రోజులు గడుస్తున్నాయి. లీలావతి శోకం చూడలేక హిరణ్యకశిపుడు కారాగారం తెరిపించి, తన్మయుడై విష్ణుసంకీర్తన చేస్తూ నవనవలాడుతూన్న ప్రహ్లాదుణ్ణి చూసి, చాలా రోజులుగా అన్న పానాలు లేకుండా ఎలా బతికి ఉన్నాడా అని ఆశ్చర్యపడుతూనే, పట్టరాని ఆగ్రహంతో ప్రహ్లాదుణ్ణి ఏనుగులచేత మట్టించమన్నాడు. ప్రహ్లాదుణ్ణి చూడగానే ఏనుగులు సింహాన్ని చూసినట్లు బెదిరాయి. మావటివాళ్లు పొడిచి అతి ప్రయత్నం మీద నడిపించితే, అతనిమీద నుంచి వెళ్ళాయిగాని, అతనికే అపాయమూ కలగలేదు.

పాములచేత కరిపించబోతే, కాటువేయకుండా ముద్దాడి, పడగలు విప్పి గొడుగులుపట్టి ఆడాయి. కొండశిఖరం నుంచి తోయించాడు, మంటల్లో వేయించాడు, సముద్రంలో పడవేయించాడు, కాలకూట విషం త్రాగించాడు. ఎన్నిచేసినా, ప్రహ్లాదుడు సురక్షతంగా ఉండటం చూసి, హిరణ్యకశిపుడు, ‘‘నువ్వు, చావకున్నా వెందుచేత? ఆ రహస్యమేమిటో చెప్పు!’’ అని అడిగాడు.

ప్రహ్లాదుడు నవ్వుతూ, ‘‘ఇందులో రహస్యం ఏదీలేదు; ఏనుగుల్లో, పాముల్లో, రాళ్ళలో, అగ్నిలో, సముద్రాల్లో, విషంలో అన్నిట్లో, నీలో, నాలో ఉన్నది విష్ణువే అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు! నన్ను చంపాలనుకుంటున్నదీ, నేను బతుకుతూన్నదీ, అతని లీలావినోదమే, నాన్నా!’’ అన్నాడు.ఆ మాటలకు హిరణ్యకశిపుడు కోపావేశంతో ప్రహ్లాదుణ్ణి బరబరా ఈడ్చుకు వెళ్ళి సభామంటపం మధ్య నిలబెట్టి, తన గదను తీసి పట్టుకొన్నాడు. లీలావతి మూర్ఛపోయింది. చుట్టూరా రాక్షస ప్రముఖులు నిర్విణ్ణులై బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు.

సభామంటపానికి ఎదురుగా లోహనిర్మితమైన పెద్ద జయస్తంభం ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ఆ స్తంభాన్ని చూపుతూ, ‘‘ఓరీ కులద్రోహీ! అది, నా విజయ స్తంభం! నా తమ్ముణ్ణి చంపిన విష్ణువుతో పోరాడి, నీ ముందే సంహరించి పగతీర్చుకుంటాను, అందులో ఉన్నాడా?’’ అని అడిగాడు. ‘‘ఆసందేహమే వద్దు నాన్నా. అంతటా ఉన్నాడు, అందులోనూ ఉన్నాడు,’’ అన్నాడు ప్రహ్లాదుడు.

హిరణ్యకశిపుడు చరచరా వెళ్ళి గదతో స్తంభాన్ని కొట్టాడు. ప్రళయధ్వనితో భూన భోంతరాలు దద్దరిల్లాయి, పొగల మేఘాలు అంతటా విరజిమ్ముకున్నాయి. స్తంభం రెండుగా చీలిపోతూండగా వెలువడిన మిరుమిట్లుగొలిపే మెరుపుల మధ్య దశావతారాల్లో నాలుగవది అయిన నరసింహావతారంగా విష్ణువు ఆవిర్భవించాడు. సింహం తల, మనిషి శరీరము, చేతులకు సింహం గోళ్ళతో సృష్టిలో లేని అద్భుత రూపం గల నరసింహమూర్తి ప్రళయభీకరంగా గర్జించాడు. పాంచజన్యశంఖధ్వని వినిపించింది. సుదర్శనచక్రం అతని చుట్టూ తిరుగుతూ కనిపించింది.

విష్ణు కథ - 4

విష్ణు కథ - 4

క్షరసాగరమథన సమ…ుంలో, రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ, తమ భుజబలం అంతా చూపిస్తూ లాగారు. దేవతలు కూడా మా తక్కువేమీ లేదని లాగారు. మథనం మహావేగంతో సాగింది. ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం విషాన్ని కక్కింది. హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది. రాక్షసులు చాలామంది మలమలమాడి మసి అ…యూరు. హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది.

అదే సమ…ుంలో మందరపర్వతం సముద్రంలోకి కృంగిపోయింది. అందరూ హరహరా అని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు హాలాహలాన్ని మ్రింగి, గొంతు లోనే ఉంచి లోకాల్ని రక్షంచాడు, గరళ కంఠు డనిపించుకున్నాడు. గండంతప్పిందిగాని, పర్వతం మునిగిపోయింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం తాల్చి సముద్రంలో కృంగిపోయిన మందరపర్వతాన్ని మూపున మోస్తూ మీదకు తెచ్చాడు.

తాబేలై మందరగిరిని మోస్తూ క్రిందనూ, పర్వతం అటూ ఇటూ బెసక్కుండా పర్వతాగ్రంపై కూర్చొని పాదంతో అదిమిపెట్టుతూ మీదనూ, ఇంకోవంక దేవతలతో కలిసి సముద్రం చిలుకుతూ బహురూపాలతో విష్ణువు కనిపించాడు సాగర మథనం సక్రమంగా సాగింది. క్షరసాగరం నుంచి చంద్రుడు, లక్ష్మి, కల్పవృక్షƒం, కామధేనువు, ఐరావతం ఏనుగు, ఉచై్ఛశ్వం గుర్రం, సుర అనే మత్తూ, ఉత్తేజమూ కల్గించే పానీ…ుమూ, ఇంకా ఎన్నెన్నో ఉద్భవించడం జరిగింది.

చల్లని చంద్రుణ్ణి శివుడు కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనంగా తలపై ధరించి, చంద్రశేఖరుడ…్యూడు. లక్ష్మీదేవి శ్రీవత్సకౌస్తుభ మణులతో కూడిన వైజ…ుంతిమాలను వేసి విష్ణువును వరించింది. విష్ణువు లక్ష్మీ కాంతుడ…్యూడు. సురను దేవతలు స్వీకరించి సురులు అనిపించుకున్నారు. చిట్ట చివరకు అమృతం సిద్ధించింది. విష్ణువు ఆ…ుుర్వేదానికి మూల విరాట్టు అయిన ధన్వంతరి అవతారంతో, అమృత కలశాన్నీ, అనేక ఓషధులనూ ధరించి, పద్మాసనంపై కూర్చొని, సముద్రం నుంచి వచ్చాడు.

అమృతం కోసం పాలసముద్రాన్ని తరిస్తే ప్రారంభంలో హాలాహల విషం పుట్టింది. ఎన్నెన్నో విశేషాలు, దైవసహా…ూలు జరిగాక అమృతం సిద్ధించి లక్షయసాధన అయింది. అందుకే ఏదైనా శమదమాదులతో కూడిన కార్యసాధనకు ‘సాగర మథనం' అనే మాట పర్యా…ుపదంగా నిలిచింది. ధన్వంతరి చేతనున్న అమృత కలశాన్ని రాక్షసులు ఎగరేసుకుపోయి అంతా మాదే అన్నారు. దేవతలు వాళ్ళతో పెనగులాడారు.

దేవదానవుల పెనగులాట ముమ్మరంగా సాగుతున్న ఆ సమ…ుంలో, ముజ్జగాలను సమ్మోహపరిచే జగన్మోహిని అక్కడకు వచ్చింది. ఆమెను చూసి రాక్షసులు పరవశించిపో…ూరు. మోహిని రాక్షసులతో, ‘‘అమృతాన్ని ఇలా తెండి, నేను పంచుతాను!'' అంది. జగన్మోహిని తమతో మాట్లాడినందుకే రాక్షసులు ఉప్పొంగిపోతూ, అమృత కలశాన్ని ఆమెకు అందించారు. రాక్షసులు ఒక వరసను, దేవతలొకవరసను కూర్చున్నారు.

ఉభ…ుశ్రేణుల నడుమ జగన్మోహిని నృత్యం చేస్తున్నట్లు అడుగులు వేస్తూ, అమృతకలశాన్ని నడుమున ఆనించి పంచడానికి త…ూరైంది. ఏమి జరుగుతుందో అని దేవతలు నిశ్చేష్టులై చూస్తున్నారు. ఉన్మత్తులై రాక్షసులు మోహిని సౌందర్య విలాసాలను చూస్తూ తన్మ…ుులౌతున్నారు. దేవతలు కూడా జగన్మోహిని ఎవరో మొదట తెలుసుకోలేక పోయినా, రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే పోస్తున్నప్పుడు, ఆ విశ్వమోహిని విష్ణువే అని గ్రహించి, గుట్టుచప్పుడు కాకుండా అమృతాన్ని తాగుతున్నారు.

జగన్మోహినీ విలాసమంతా విష్ణువు చిద్విలాసమే అని తెలిసిన దేవతలు, నిర్లిప్తంగా అమరత్వం పొందుతూంటే, దైత్యులు జగన్మోహిని మోహజాలంలో పడి ఉన్మత్తులై అమృతాన్ని కోల్పో…ూరు. జగన్మోహిని వంచన చేస్తున్నదని రాహువు అనే ఒకే ఒక తెలివైన రాక్షసుడు కనిపెట్టాడు. అతడు జలరాక్షసి సింహిక కుమారుడు, బహు మా…ూవి. జరుగుతూన్న మోసాన్ని చెప్పినా వినిపించుకొనే స్థితిలో రాక్షసులు లేకపోవడం జూసి, రాహువు దేవతల రూపు ధరించి దేవతల వరుసలో చేరి, అమృతాన్ని త్రాగాడు.

సూర్యచంద్రులు అది గమనించి, మందర పర్వతాగ్రంపై విష్ణువు గానే ఉన్న బహురూపిెున విష్ణువుతో చెప్పారు. విష్ణువు తన చక్రాన్ని రాక్షసుడి పైకి పంపాడు. రాహువు చక్రాన్ని తప్పించుకోవాలని గ్రహాలు తిరిగే అంతరిక్షానికి ఎగిరాడు.

విష్ణుచక్రం వెంబడించి రాక్షసుడి తలను ఖండించి, తలనూ మొండేన్నీ వేరు చేసింది. అమృత ప్రభావం వల్ల తలా, మొండెమూ రెండూ సజీవంగా ఉండి తల రాహువుగా, మొండెం కేతువుగా రెండుగ్రహాలుగా మారి, గ్రహకూటమిలో చేరాయి. రాహుకేతు గ్రహాలతో గ్రహాలు తొమ్మిది అ…్యూయి. సూర్యచంద్రులపై కసితో అమావాస్య, పూర్ణిమ పర్వదినాలలో, రాహుకేతువులు వారిని పట్టి పీడించ సాగారు. ఆ విధంగా సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి.

అమృతాన్నంతా దేవతలకు ఇచ్చి జగన్మోహిని అంతర్థానమైంది. రాక్షసులు తమ తెలివిమాలినతనానికి చింతించి, అప్పట్నించి విష్ణువుకూ, దేవతలకూ బద్ధశత్రువులైనారు. అమృతమథన సందర్భంగా విష్ణువు కూర్మావతారాన్నీ, ధన్వంతరి అవతారాన్నీ, జగన్మోహినీ అవతారాన్నీ ధరించాడు. ధన్వంతరి అమృతంతోబాటు ఓషధులనూ, ఓషధివేదాన్నీ తెచ్చాడు. ధన్వంతరి వైద్యశాస్ర్తానికి అధిదేవతగా, వైద్యుల కులదైవంగా అర్చింపబడ్డాడు.

జగన్మోహిని విశ్వమోహినిగా కీర్తించబడి సౌందర్య విలాసాలకు ప్రమాణంగా చెప్పుకోబడింది. నారదుడు జగన్మోహిని అవతారాన్ని కీర్తిస్తూ, జగన్మోహినీరాగం మహతివీణపై పలికిస్తూ, కైలాసానికి వెళ్ళాడు. పార్వతి అది విని, ‘‘పామరులైన రాక్షసులను వంచించగలిగినంత మాత్రాన జగన్మోహిని అనిపించుకుంటుందా?'' అని అన్నది.

‘‘ఔనమ్మా, ఎంతటివారినైనా రంజింప జేసి ఈ విశ్వాన్నే ఉర్రూగించే విశ్వమోహిని!'' అని అంటూ నారదుడు వెళ్ళాడు. పార్వతి ఆ విష…ూన్ని శివుడితో చెప్పింది. శంకరుడు చిరునవ్వుతో ఆలకించి ఊరుకున్నాడు. తరువాత పార్వతితో కలిసి నందివాహనంపై వైకుంఠానికి వెళ్ళి, విష్ణువుతో, ‘‘నీ జగన్మోహినీ అవతారాన్ని మరొకసారి చూపుతావని వచ్చాము!'' అన్నాడు.

‘‘ఏదో అవసరానికి ఏ వేషమైనా వె…్యుక తప్పదు గదా! నీలాంటి వాడి ముందర అదేమాత్రం లెద్దూ!'' అని అంటూ విష్ణువు మాట్లాడుతూనే అంతర్థాన మ…్యూడు. అంతలో అల్లంత దూరాన పూల బంతితో ఆడుతూ, పాడుతూ జగన్మోహిని కనిపించింది. శివుడు సర్వమూ మరిచి ఆమె వెంట పడ్డాడు. జగన్మోహిని అందకుండా విశ్వాకాశంలోకి దారి తీసింది. శివుడు చేతులుచాచి ఆమె వెంట పడుతున్నాడు.

పార్వతి నిర్విణ్ణురాలై చూస్తూండి పోయింది. శివమోహినీ లీలావినోదాన్ని బ్రహ్మాది దేవతలు కన్నుల పండుగగా తిలకిస్తున్నారు. నంది నివ్వెరపోతున్నాడు. నారదుడు మహతి వీణపై శివరంజని రాగాన్ని మారుమ్రోగిస్తున్నాడు. ముందు జగన్మోహినీ, వెనుక శివుడూ విశ్వాంతరాల్లోకి పరుగులు తీస్తూ కొంత సేపటికి కనిపించలేదు. పార్వతి కైలాసం చేరుకుంది. జగన్మోహిని తేజోమండలాల మధ్య నుంచి దూసుకుపోతూ శివుణ్ణి విశ్వమంతా తిప్పి, తిప్పి, కైలాసానికి చేరుతూ, తన్ను తాకవద్దని శివుణ్ణి వారిస్తూ పార్వతి చెంతకు చేరుతూండగా, శివుడు ఆమె నడుము చుట్టి మోకరిల్లాడు.

‘‘చూశావుటమ్మా, నీ ప్రాణేశ్వరుడి ఆగడం!'' అని అంటూ జగన్మోహిని, శివుడు ఇంకేమి చేస్తాడో అని భ…ుపడుతూ పార్వతి చెంత నిలిచింది. వెనువెంటనే జగన్మోహినీ రూపాన్ని చాలించి విష్ణువు పార్వతి ఎదుట సాక్షాత్కరించాడు. ‘‘అన్నా! నీవు విశ్వమోహన జగన్మోహినీ కేశవస్వామివి! అంతా మీ శివకేశవుల లీలా నాటకమే కద!'' అన్నది పార్వతి విష్ణువుతో. ‘‘అంతేనమ్మా, అంతే లే!'' అంటూ నారదుడు మహతి వాయించుతూ అక్కడికి వచ్చి జగన్మోహిని, శివరంజని రాగాల్లో హరి, హరుల లీలావిలాసాన్ని గానం చేస్తూ ముల్లోకాలూ తిరిగాడు.

శివుడు విష్ణువుతో, ‘‘అమృతం సంగతే మరిచి, నీ జగన్మోహినీ విలాసాన్ని కళ్లారా గ్రోలిన రాక్షసుల్ని మెచ్చుకుంటున్నాను! రసపిపాస అసురుల సొత్తు!'' అని అన్నాడు మందహాసం చేస్తూ. విష్ణువు చిరునవ్వు నవ్వి పార్వతితో, ‘‘అమ్మా, మున్ముందు శివరంజనిగా మా గంగాదేవి దివి నుంచి భువికి అవతరించే వేళ కూడా, ఈ మహాశివుడు ఇలాగే పరవశించి నీకు సవతిని తెచ్చేలాగుంది!''

అని అంటూ అంతర్థానమై వైకుంఠానికి చేరాడు. తరువాతి కాలంలో విష్ణువు కర్దమ ప్రజాపతికి, దేవహూతికి పుత్రుడుగా కపిలావతారం ఎత్తాడు. చిన్నతనం నుంచే గొప్ప జ్ఞానసంపన్నుడై తపస్సు చేసి కపిల మహామునిగా పేరు పొందాడు. కపిలుడు తల్లి దేవహూతికి చెప్పిన అనేక తత్వబోధలు సాంఖెూ్యగంగా ప్రసిద్ధి పొందింది. కపిలమహర్షి పాతాళంలో ఒక గుహలో తపస్సు నిర్విరామంగా చేస్తూన్న కాలంలో, భూమ్మీద సగర చక్రవర్తి నూరవ అశ్వమేధ  తలపెట్టాడు.
ఇంద్రుడు మా…ుచేసి కపిలమహర్షి తపస్సు చేస్తున్న గుహలో దాచాడు. సగరుడి వెయ్యి మంది కుమారులు గుర్రాన్ని వెతుకుతూ పాతాళానికి బిలం త్రవ్వుకొని వెళ్ళి, కపిలమహర్షి గుహలో చూశారు. కపిలుడే గుర్రాన్ని అపహరించి దాచి, దొంగజపం చేస్తున్నాడని విరుచుకు పడ్డారు.

కపిలుడు కళ్ళు తెరిచి చూసే సరికి వారంతా బూడిద అ…్యూరు. ఆ భస్మరాసులపై విష్ణుపాదాల నుంచి పుట్టి స్వర్గంలో మందాకినిగా ప్రవహిస్తున్న గంగను ప్రవహింపజేసి పితరులను తరింప జే…ుడానికి సగరుడి మునిమనమడైన భగీరథుడు గొప్ప తపస్సు చేసి, గంగా దేవిని ప్రసన్నం చేసుకున్నాడు.

గంగ ధాటిని తట్టుకొని భరించగల శివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. గంగావతరణంలో శివుడు గంగాదేవిని చూసి పరవశించి గంగను తన జటాజూటంలో గాఢంగా బంధించేసుకున్నాడు. తరువాత భగీరథుడి ప్రార్థనపై ముడిసడలించి కొద్దిగా గంగను వదిలాడు. గంగ భగీరథుడి వెంట వెళ్ళి,అతని పితరుల భస్మరాసులపై ప్రవహించి తరింపజేసింది. పరమశివుడు గంగాధరుడై రంజిల్లాడు. ఆ విధంగా గంగ పార్వతికి సవతి అయింది.

సనకసనందనాది మునులు అనబడే సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనే నలుగురూ బ్రహ్మ మానసపుత్రులు. ఎప్పుడూ బాలురవలెనే ఉంటారు, విష్ణుభక్తి తత్పరులై విష్ణువును కీర్తిస్తూ, అన్నిలోకాలూ నిరాటంకంగా తిరుగుతూంటారు. వారు విష్ణువును చూడగోరి వైకుంఠానికి వెళ్ళారు. అన్ని ద్వారాలూ దాటి విష్ణు మందిర ద్వారం చేరుకున్నారు. అక్కడ విష్ణువుతో సరిసమానమైన రూపంతో నాలుగు చేతులతో శంఖ, చక్ర, గద, అభ…ు ముద్రలు పట్టి ద్వారపాలకులై ఉన్న జ…ుుడు, విజ…ుుడు ఇది సమ…ుం కాదని మునులను వారించారు.

సనకసనందనాదులు, ‘‘మాకు విష్ణు సందర్శనానికి సమ…ూసమ…ూలు లేవు,'' అంటూ జ…ువిజ…ుులను లక్ష్య పెట్టకుండావిష్ణుమందిరంలోనికి వెళ్ళబోతూంటే, ద్వారపాలకులు గదలు ఎత్తివారిని అడ్డగించారు. సనకాది మునులు, ‘‘మీరు విష్ణు ద్వారపాలకులుగా ఉండతగరు.

రాక్షసులై పుట్టండి!'' అని శపించారు. ద్వారం దగ్గిర కలకలం విని, లక్ష్మి వెంట రాగా విష్ణువు తలుపులు తెరుచుకొని అక్కడికి వచ్చాడు. జ…ువిజ…ుులు మునులు తమకిచ్చిన శాపాన్ని చెప్పుకొని ఆక్రోశించారు. మునులు తొందరపడి శపించినందుకు లోలోన చాలా విచారించారు.

విష్ణు కథ - 3

విష్ణు కథ - 3

సూతుడు మునులకు నారదుడి గురించి చెప్పసాగాడు: ముందు జన్మలో నారదుడు ఒక దాసికి కొడుకై జన్మించాడు. ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంటిపని చేస్తుండేది. ఆ ఇంట సదా మునులు, జ్ఞానులు అతిథిసత్కారాలను పొందుతూండేవారు. పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్ళు అందిస్తూ, సపర్యలు చేస్తూ, వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విష…ూలను, విష్ణుమహిమలను శ్రద్ధగా ఆలకిస్తూండేవాడు.

నీరు ఇచ్చేవాడని వారు పసివాడికి నారదుడు అని పేరు పెట్టి, ఎంతో ఆప్యా…ుంగా ‘‘నారదా!'' అని పిలుస్తూండేవారు. అంతలో అతని తల్లి పాముకాటుతో మరణించింది. పసివాడికి తండ్రి ఎవరో, ఏమైనాడో తెలియదు. తోటిపిల్లలు నారదుణ్ణి దాసిదాని కొడుకనీ, దిక్కుమాలినవాడనీ అంటూండేవారు. కొద్ది రోజులకే ఇంటి …యజమాని భాగవతోత్తముడు కూడా గతించాడు.

నారదుడు నిరాశ్రుయుడై తిరుగుతూ, ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతణ్ణి దొంగను చూసినట్టు చూసి తరిమేవారు. తండ్రి ఎవరో తెలీని పాపిష్టివాడని హీనంగా తిటే్టవారు. నారదుడు పరమసాధువు అవడం చూసి దుడుకుపిల్లలు రాళ్ళు రువ్వీ, కొట్టీ, ఏడిపించి ఆనందిస్తూండేవారు. ‘‘నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను? నేనేం తప్పు చేశానని నన్నింత అన్యా…ుంగా చూస్తున్నారు? క్రిమి కీటకాలు, అడవులో మృగాలు హాయిగా బతుకుతున్నాయి!''

అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవిపట్టాడు. అతనికి మునులు, జ్ఞానులు చెప్పుకొనే విష…ూలు గుర్తుకొచ్చాయి. ‘‘నేనెందుకు తపస్సు చె…్యుకూడదు! గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి!'' అని అనుకుంటూ తపస్సు మొదలు పెట్టాడు నారదుడు. ‘‘దిక్కులేనివాడికి ఎవడు దిక్కో, ఈ లోకానికంతకూ ఎవడు తండ్రో అతడే నాకు అన్నీ! నన్ను అతడేంచేసినా సరే, అంతా అతని ఇష్టం!'' అంటూ కాలం గుర్తు లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు.

నారదుడి తపస్సు పరిపక్వమైంది. అతనిపై గొప్ప తేజస్సు పడి అతణ్ణి ఆవరించింది. జ్యోతిరూపంలో ప్రసన్నుడైన విష్ణువు, ‘‘వత్సా నారదా! నీవు నాలో కలిసిపోతున్నావు, నీవు బ్రహ్మ మానసపుత్రుడవై జన్మిస్తావు. నీలో నా అంశ వుంటుంది. చిరంజీవిగా త్రికాలవేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తుంటావు!'' అని చెప్పాడు. నారదుడు విష్ణు అంశతో బ్రహ్మకు కుమారుడై, దేవమునిగా పూజింపబడ్డాడు. విష్ణువు యెక్క లీలావతారాల్లో నారదుని అవతారం ఒకటిగా చెప్పబడింది.

అటువంటి నారదుడి వల్ల ఉపదేశం పొంది ధ్రువుడు చరచరా వెళ్తూంటే, ‘‘అన్నా, ఆగు! అడవికి వెళ్ళొద్దు!'' అంటూ పరుగు పరుగున ఉత్తముడు ఏడుస్తూ వచ్చి ధ్రువుడికి అడ్డంగా చేతులు సాచి నిల్చుని, ‘‘నువ్వు, అడవికి పోతే నే నెవరితో కలిసి హరిభజన చేసేది? ఆడించడానికి నీలాంటి అన్న…య్య ఎక్కడ దొరుకుతాడు? మా అమ్మ, నిన్ను అన్ని మాటలన్నదని, నా మీద నీకెందుకు కోపం? వెళ్ళకు, రా!''

అంటూ వలవలా ఏడ్చాడు. ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగలించుకొని, ‘‘తమ్ముడూ! నన్ను కన్నందుకు మా అమ్మ కూడా గొప్పది అనిపించుకోవద్దా? అందుకే వెళ్తున్నాను!'' అన్నాడు. ఉత్తముడు, ‘‘అయితే, నేనూ నీతో అడవికి వస్తాను, నువ్వు తపస్సులో ఉంటే నేను పళ్ళు అవీ తెస్తుంటాను!'' అన్నాడు. ధ్రువుడు, ‘‘అలా అయితే, మీ అమ్మ ఏడుస్తుంది, తమ్ముడూ!

నేను అన్నను, నా మాట వినాలి, వెళ్ళు!'' అన్నాడు ఆప్యా…ుంగా. ఆ మాటతో ఉత్తముడు అలాగే చతికిలబడి ఏడుస్తూంటే సురుచి వచ్చి బుజ్జగించబోతే, ‘‘అమ్మా! నన్ను ముట్టుకోకు. నీ మూలాన్నే అన్న…్యు వెళ్ళిపోతున్నాడు!'' అన్నాడు.

సురుచి లజ్జతో తలవంచుకొని, ‘‘నేను పాషిష్ఠిదాన్ని, అంతా నా మూలానే జరిగింది!'' అని అంటూంటే ఉత్తానపాదుడు, ‘‘ధ్రువా! ధ్రువా! ఆగు, నా…ునా! ఇదంతా నా మందబుద్ధివల్లనే జరిగింది. నా సింహాసనం నీది! రా నా…ునా!'' అంటూ ఎలుగెత్తి పిలుస్తూ అక్కడికి వచ్చాడు. అప్పటికే ధ్రువుడు చాలా దూరం వెళ్ళి పో…యాడు. నారదుడు సునీతితో, ‘‘అమ్మా! నీవు రత్నగర్భవు! నీ కుమారుడి గురించి విచారించకు, నారాయుణుడే అతనికి రక్ష!'' అని చెప్పి ఉత్తానపాదుడితో, ‘‘రాజా!

ఇది మనం అందరమూ సంతోషించవలసిన సమయుం, నీకు తండ్రీ, ధ్రువునికి తాతా అయిన స్వా…యుంభువ మనువు వంశానికి ధ్రువుడు ఎనలేని కీర్తితెస్తాడు. ఇందులో ఎవరు చేసిందీ ఏమీ లేదు, అంతా సర్వరక్షకుడైన ఆ నారా…యణుని సంకల్పమే!'' అని చెప్పి అందరినీ ఊరడించి శాంతపర్చాడు. ధ్రువుడు మధువనంలో ఓం నమో నారా…యణ అని తపస్సు చేస్తూంటే …యమునానది జల జల పారుతూ శృతి కలుపుతూన్నది. క్రూరమృగాలు అతని చుట్టూ ఆప్తమిత్రుల్లా తిరుగుతున్నాయి.

అతని తపస్సుకు ముల్లోకాలు గజగజలాడాయి. ఎవరెక్కడ తపస్సు చేస్తున్నా ఇంద్ర పదవి కోరతారనుకుని భయపడే ఇంద్రుడు ధ్రువుడి తపోభంగానికి భీతికలిగించే ఇంద్రజాలం చాలా చేశాడు. వజ్రాయుధం ఝళిపించి ఉరుములు, మెరుపులు, పిడుగులు రాల్చి బీభత్సం చేశాడు. ధ్రువుడు దేనికీ చలించలేదు. ఇంద్రుడు రాళ్ళ వర్షం కురిపించాడు. విష్ణుచక్రం ధ్రువుడిపై తిరుగుతూ అన్నిటినీ తూలగొట్టింది.

అప్పుడు నారదుడు ఇంద్రుడితో, ‘‘ధ్రువుడు సామాన్య బాలుడని అనుకున్నావు, అతణ్ణి నువ్వేమీ చే…ులేవు. అనవసరంగా బెంగపడకు, ఇంద్రపదవి అతనికి గడ్డిపరక లాంటిది, తెలుసా!'' అని బుద్ధిచెప్పాడు.

ధ్రువుని తపస్సుకు మెచ్చుకొని విష్ణువు ప్రత్యక్ష మ…్యూడు. ధ్రువుడు విష్ణువు కాళ్ళుచుట్టేసి విష్ణువు ముఖాన్ని తదేకంగా చూస్తూ పట్టరాని ఆనందం వల్ల నోటమాట రాకుండా వుండిపో…యాడు.

‘‘నిన్ను నోరారా స్తుతించాలని వుంది, నేను బాలుడను, స్తోత్రపాఠాలు తెలి…యవు,'' అని మనస్సులో అనుకుంటూ ఆనందబాష్పాలు రాలుస్తున్నాడు. విష్ణువు తన శంఖాన్ని ధ్రువుడి చెక్కిళ్ళకు తాకించాడు. వెనువెంటనే వేదవేదాం తాలసారం నిండిన గొప్ప స్తోత్రాన్ని అమిత భక్తితో ఏకధారగా సామగానం చేశాడు ధ్రువుడు.

విష్ణువు మందహాసం చేస్తూ, ‘‘ధ్రువా, ఏం కావాలో చెప్పు!'' అన్నాడు. ధ్రువుడు, ‘‘ఓ పరమపురుషా! తుమ్మెద పద్మాన్ని అంటి పెట్టుకొని వుండేలాగా సదా నీ మధుర మందహాసవదనపద్మాన్ని చూస్తూ వుండాలనే తప్ప నాకు, మరే కోరికా లేదు!'' అన్నాడు. ‘‘అలాగే వుందువుగానిలే! నీరాజ్యానికి వెళ్ళి రాజ్యంచేసి ధర్మపాలన నిర్వర్తించు. పిమ్మట నువ్వు నా రూపమైన విశ్వానికి శిరోభాగంగా వుండే ధ్రువపదాన్ని చేరుతావు. కల్పాంతరాలు గతిస్తూన్నా చెక్కు చెదరని అచలపదాన్ని అలంకరించి వెలుగుతూంటావు!''

అని చెప్పి అంతర్థాన మ…్యూడు విష్ణువు. ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణు అవతరణం ధ్రువనారా…ుణావతారం అని చెప్పబడింది. ధ్రువుడు మాహిష్మతీపురానికివచ్చాడు. ఉత్తానపాదుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపో…యాడు. ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తూన్నాడు. ఉత్తముడు ఇంకా వివాహితుడు కాలేదు. రాజధర్మం అనుసరించి ప్రజలకు వన్యమృగబాధ లేకుండా చే…ుడానికి వేటకు వెళ్ళాడు.

హిమాల…ు పర్వత అరణ్యంలో దుష్ట స్వభావులైన.. విరుచుకుపడి అతణ్ణి చంపారు. సురుచి పుత్రశోకంతో అక్కడకు వెళ్ళి అరణ్యంలో రగుల్కొన్న కార్చిచ్చులో కాలిపోయింది. ధ్రువుడు …యక్ష నిర్మూలనం చేయడానికి …యక్షనగరమైన అలకానగరాన్ని ముట్టడించాడు. మా…యల మారులైన... క్షుక్షుద్రమైన మా…ూజాలాన్ని ప్రెూగించారు. ధ్రువుడు నారా…ుణాస్ర్తంతో మా…యల్ని పటాపంచలు చేసి విజృంభించాడు.

కుబేరుడు శరణాగతుడై ధ్రువుణ్ణి మంచి చేసుకుని భ…ుభక్తులతో అనేక సంపదలిచ్చి పంపాడు. ధ్రువుడు పలువురు కుమారులను కన్నాడు. ఆదర్శ రాజ్యపాలనచేసి స్వాయుంభువ మనువంశానికి కీర్తి తెచ్చాడు. చిరకాలం రాజ్యం చేసి కుమారుడికి పట్టం కట్టి ధ్రువుడు బదరికావనానికి వెళ్ళాడు. విష్ణువును ధ్యానిస్తూ కొన్నాళ్ళకు బంగారు శరీరాన్ని పొందాడు.

విష్ణు ఆదేశంతో విష్ణుభటులు విమానం తెచ్చారు. వారు నాలుగు చేతులతో విష్ణువులాగే ఉన్నారు. ధ్రువుడు వారితో, ‘‘మా అమ్మకు లేని ఉన్నతపథం నాకు అవసరంలేదు!'' అన్నాడు. విష్ణు దూతలు ముందుగా ఒక దివ్య విమానంలో ధ్రువమండలానికి వెళ్తూన్న సునీతిని చూపించారు. అప్పుడు ధ్రువుడు సంతోషించి విమానం ఎక్కి గ్రహమండలాల్నీ నక్షత్ర మండలాల్నీ సప్తర్షి మండలాన్నీ దాటి ధ్రువపదానికి చేరాడు.

ధ్రువపదాన్నే విష్ణుపదము అనీ, ధ్రువక్షతి అనీ అంటారు. విష్ణువు నివాసమైన వైకుంఠము అక్కడే ఉంటుంది. ధ్రువక్షతిలోనే గోలోకము ఉంటుంది. గోలోకములో విష్ణువు రెండు చేతులతో కృష్ణుడుగా ప్రకృతి స్వరూపిణిెున రాధాదేవితో కలిసి వేణువును ఊదుతూ ఆనందిస్తూ ఉంటాడు. గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది. ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడై వెలుగుతూ ఉంటాడు.

ధ్రువుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశించాడు. గుంజకు కట్టిన ఆవులాగ సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షణం చేస్తూంటే, సమస్త నక్షత్ర గ్రహ గణాలతో నిండిన శింశు మార చక్రం అతని క్రిందుగా తిరుగుతూంటుంది.

గోలోకానికి దిగువ బ్రహ్మ ఉండే సత్యలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్లోకము, భువర్లోకము, భూలోకము అనే ఊర్థ్వలోకాలు ఏడూ; భూలోకానికి దిగువ అథోలోకాలనబడే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు ఏడూ కలిసి పధ్నాలుగు లోకాలకు మీదుగా విశ్వశిఖరాగ్రంపై ధ్రువుడు దిక్కులకు దిక్కుగా అచలపద నక్షత్రంగా ప్రకాశిస్తున్నాడు.

దీక్ష ఉండాలేగాని, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎంతటిదైనా సాధించలేనిదంటూ ఉండదు. అందుకు ఐదేండ్ల ప్రాయుంలోనే తపస్సుకు వెళ్ళిన బాలధ్రువుడే చక్కని తార్కాణం! అని సూతుడు ధ్రువచరిత్ర ముగించి తిరిగి చెప్పడం ప్రారంభించాడు: మత్స్యం కేవలం జలచరమైతే తాబేలు నీటిలోనూ, భూమిపైనా చరిస్తుంది. నీటిలో నుండి ప్రాణి నేల మీదకు వచ్చింది; అంటే జలచరదశనుంచి భూచరదశకు పరిణామం జరిగిందన్న మాట. అలాంటి తాబేలుగా విష్ణువు అవతరించాడు.

అదే దశావతారాల్లో రెండవదైన కూర్మావతారం! అంటూ సూతుడు మునులకు అద్భుతమైన కూర్మావతారగాథ చెప్పడం ప్రారంభించాడు: దేవతలు, రాక్షసులు కలిసి క్షరసాగరాన్ని మధించి, అమృతాన్ని సాధించటానికి త…ూర…్యూరు. అమృతం సిద్ధించనీ, అది అంతా మనదే అవుతుంది! అని భుజబలంతోనూ, సంఖ్యలోనూ అధికులైన రాక్షసులు ఎత్తుగడ వేసుకున్నారు. రాక్షసులకూ అమృతంతో అమరత్వంసిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది?

అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు. పాలసముద్రంలో మందరపర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి,చిలకటానికి నిర్ణ…ుం జరిగింది. కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికీ శక్యం కాని పని! విష్ణువు అనుగ్రహించి, ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు. రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి, చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. క్షరసాగర మథనం ప్రారంభమైంది.

విష్ణు కథ - 2

విష్ణు కథ - 2

సత్యవ్రతుని మాటలు విని చేప సముద్ర మధ్యానికి చేరి, మహాపర్వతంలాగ సాగరం పొడవునా పెరిగి, ‘‘సత్యవ్రతా! నీ వాక్కు అమోఘంగా పని చేసింది. చూశావా! ఇంకా పనిచేస్తూనే ఉంది. ఇలా ఇంకా, ఇంకా పెరిగిపెరిగి ఏమైపోతానో!'' అన్నది. అప్పుడు సత్యవ్రతుడు రెండు చేతులెత్తి మ్రొక్కుతూ, ‘‘మత్స్యరూపంలో ఉన్న ఓ నారా…ుణుడా! రక్షణ కోరుతున్నటే్ట వచ్చి, నన్ను రక్షంచడానికే మత్స్యావతారం ఎత్తావు.

నీ లీలలు తెలుసుకోవడానికి నేనేమాత్రం!'' అంటూ ఎన్నో విధాల స్తుతించాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు, ‘‘ఓ రాజా! ఏడు దినాలకు కల్పాంతం కాబోతున్నది. ప్రళ…ు జలాల్లో అంతా మునిగిపోతుంది. జ్ఞానం, ఓషధులు, విత్తులు నశించకూడదు. ముందొచ్చే కల్పానికి అవి లేకపోతే ఎలాగ? అందుచేత అవి రక్షంపబడాలి. నీ కోసం పెద్ద నౌక గాఢాంధకారంలో దీపంలాగ వెలుగుతూ వస్తుంది.

అందులో సప్తర్షులు ఉంటారు, ఆ వెలుగు వారిదే! ఓషధుల్నీ, విత్తనాల రాసుల్నీ, నీతో బాటు నౌకలోకి చేర్చు! నా మీద ఉండే కొమ్ము చివరతో, మీరుండే నావను పట్టి ఉంచి మునిగిపోకుండా అన్ని విధాలా నేను రక్షంచుతూ, ఉంటాను. అందుకే నేను ఇలాగ అవతరించాను. బ్రహ్మ మేల్కాంచేవరకూ నావ ధ్రువుణ్ణి దిక్సూచిగా పెట్టుకొని ప…ునిస్తూంటుంది.

రాబోయె కల్పంలో నువ్వు వైవస్వతుడు అనే పేరున మనువుగా ఉంటావు!'' అని ఆదేశించాడు. సత్యవ్రతుడు విష్ణువు ఆనతిని తల దాల్చి వినమ్రుడై మ్రొక్కాడు. మత్స్యావతారం నాలుగు రెక్కలు ఊపుతూ, తోకతో త్రుళ్ళగొడుతూ, ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలను చీల్చుకొని, సముద్రంలోకి వెళ్ళింది.

బ్రహ్మ మంచి నిద్ర తీస్తున్నాడు. అంధకారంలో విల…ుకాండ జరుగుతూన్నది. హ…ుగ్రీవుడు అనబడే సోమకాసురుడు తలాతలం నుండి సముద్రం మీదకు వచ్చి, గబ్బిలంలాగ బ్రహ్మ ఉండే సత్యలోకానికి ఎగిరాడు. నిద్ర వచ్చి బ్రహ్మ ఆవులిస్తున్నప్పుడు, అతని నాలుగు ముఖాల నుండి తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో ప్రకాశిస్తున్న నాలుగు వేదాలు వెలుపలికి వచ్చి పక్కనే పడి ఉన్నాయి.

హ…ుగ్రీవుడు వాటిని తస్కరించుకొనిపోయి, సముద్రం అట్టడుగు శిలల పొదల్లో దాచాడు. హ…ుగ్రీవాసురుడు దేవతలకు, విష్ణువుకు ప్రబల విరోధి. వేదాలు లేకుండా బ్రహ్మ సృష్టి చే…ులేడు. కల్పకల్పానికి మంచినీ, ప్రగతినీ పెంపొందించాలనే విష్ణువు సంకల్పం చెడగొట్టడమే వాడి ఉద్దేశం. ప్రళ…ు సముద్రం భూమిని ముంచుతున్న సమ…ుంలో, ఎదురు చూస్తూన్న సత్యవ్రతుడికి అంధకారంలో దూరంగా చిన్న వెలుగు, చుక్కలా కనిపించి పెద్దదౌతూ సమీపిస్తున్నది; అదే సప్తర్షుల కాంతితో నిండిన నావ!

ఓషధులనూ, నానావిధ బీజ సంపదనూ నౌకలోకి చేర్చి సత్యవ్రతుడు అత్యంత భక్తితో నారా…ుణ సంకీర్తనం చేస్తూ నావలో ప్రూయాణిస్తున్నాడు. మత్స్యావతారం ముక్కుపై నిలువుగా పెద్ద కొమ్ము ఉంది. నక్షత్రంలాగ మెరుస్తున్న ఆ కొమ్ము చివరను చుట్టుకొని ఒక మహాసర్పం పెద్ద త్రాటితో కట్టినట్లు ఓడను కలిపి పట్టుకొని, పడగవిప్పి ప్రళ…ు ప్రభంజనాలను పీల్చి దిగమ్రింగుతూన్నది. మత్స్యావతారం తన రెక్కలతో కెరటాలను తూలగొడుతూ సముద్రాన్ని చీల్చుకొని, నావను భద్రంగా తీసుకెళుతూన్నది.

ధ్రువతార గుర్తుగా నౌక పువ్వులాగ తేలుతూ పుయనిస్తూన్నది. సముద్రం అడుగున దాచిన వేదాలను కాపలా కాస్తూ సోమకాసురుడు సముద్రం లోపల తిరుగుతున్నాడు. నాలుగు వేదాలు నలుగురు శిశువులుగా మారి క్యారు మంటూన్న ఆర్తనాదం లీలగా వినవస్తున్నది. మత్స్యావతారం వేదాలను వెతుకుతూ వెళ్ళింది. మహామత్స్యాన్ని చూసి సోమకాసురుడు భీతిల్లుతూనే మొండిధైర్యంతో ముళ్ళగద నెత్తి ఎదుర్కొన్నాడు.

అప్పుడు విష్ణువు నడుము వరకు మత్స్యంగా చతుర్బాహువులతో అవతరించాడు. మత్స్యమూర్తికీ, సోమకాసురుడికీ ఘోరసంగ్రామం జరిగింది. సోమకాసురుడు సముద్రం అట్టడుగు చేరి పారిపోతూంటే విష్ణువు చక్రం ప్రెూగించి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి హత మార్చాడు. విష్ణువు పసిబిడ్డల రూపంలో ఉన్న వేదాలను ఎత్తుకొని, ఇద్దరేసి పిల్లల్ని చెరో సందిట చేర్చుకొని నీటి మీదికి వచ్చాడు.

పిల్లలు విష్ణువు కంఠహారంలోని శ్రీవత్స, కౌస్తుభ మణులను చిట్టి చేతులతో ఆడుకుంటూ కిలకిలా నవ్వుతూ కేరింతాలు కొడుతున్నారు. నలుగురు పిల్లలూ తెలుపు, ఎరుపు, పసుపు, నీలం కాంతితో మెరుస్తున్నారు. విష్ణువు మీది చేతుల్లో శంఖచక్రాలు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నవి. విష్ణువు మత్స్యావతార మూర్తిని చూసి ఋషులు, సత్యవ్రతుడు మహదానందంతో మైమరిచి చేతులెత్తి మ్రొక్కుతూ స్తోత్రం చేశారు.

ప్రళ…ు సముద్రం శాంతించి భూభాగం ఏర్పడుతూన్నది; నౌక క్రమంగా గమ్యం చేరుకొంది. బ్రహ్మకు పగటి ప్రమాణం ఎంతో రాత్రీ అంతే. అతని నిద్రాకాలం పూర్తికావస్తున్నది. సరికొత్త కల్పం ఆరంభమౌతూన్నది. సరస్వతీదేవి ముందుగా లేచి వీణ సవరించి భూపాలరాగాన్ని పలికిస్తూన్నది. బ్రహ్మ మేలుకొని నాలుగు తలల్లో ఏదో కలత, వెలితి అనిపించి పరికించి చూస్తే వేదాలు లేవు!

వేదాలు పోగొట్టుకొని దిగులుగా ముఖాలు వేలాడదీసుకుని విచారిస్తుండగా, విష్ణువు మత్స్యావతారంతో వేదాలను తెచ్చి అతనికి ఇచ్చాడు. బ్రహ్మ విష్ణువు మత్స్యావతార రూపాన్ని కన్నుల పండుగగా తిలకించి చేతులు జోడించి
నాలుగు నోళ్ళతో కీర్తించాడు. ‘‘ఓ నారా…యణా! నీ మత్స్యావతారాన్ని ధ్యానించిన వారికి ప్రళ…ుంలాగ విరుచుకు వచ్చిన ఆపదలన్నీ తొలగిపోతవి, అజ్ఞానాంధకారం పటాపంచ లౌతుంది!''

అని బ్రహ్మ అన్నాడు. మత్స్యావతారం ఎత్తిన కార్యం పూర్తిగా నెరవేరింది. విష్ణువు అంతర్థానమై, తన నివాసమైన వైకుంఠాన్ని చేరాడు. బ్రహ్మ వేదాలు తీసుకొని ఉత్సాహంతో సృష్టి మొదలుపెట్టాడు. కొత్త కల్పానికి వివస్వంతుడనే పేరున ఉదయించిన సూర్యుడికి పుత్రుడుగా సత్యవ్రతుడు శ్రార్ధ దేవుడు-వైవస్వతుడు అనే పేరున మనువైనాడు.

సప్తఋషులు ఆకాశానికి చేరుకొని తమ తమ స్థానాల్లో సప్తర్షిమండలంగా ప్రకాశిస్తూ ధ్రువునికి ప్రదక్షణం చేస్తూ, తిరగసాగారు - అని సూతుడు చెప్పగా మునులు, ‘‘సూత మునీంద్రా! ధ్రువుని చరిత్ర వినగోరుతున్నాము!'' అన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు: ఈ మహా విశ్వంలో ఉన్నతోన్నతమైన స్థానమే ధ్రువమండలం. అదే విశ్వస్వరూపుడైన విష్ణు శిరస్సుండే తావు.

అంతటి అత్యున్నత పదాన్ని పొందిన ధ్రువుడు ఉత్తానపాదుడు అనే రాజు కొడుకు. ధ్రువుడి తల్లి సునీతి ఉత్తానపాదుడి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. రాజుకు చిన్న భార్య సురుచి మీద మక్కువ ఎక్కువ. ఒకనాడు ఉత్తానపాదుడు సురుచికొడుకు ఉత్తముణ్ణి తన తొడపై కూర్చో బెట్టుకొని ముద్దుచేస్తుండగా, ధ్రువుడు అక్కడకు వచ్చి, తాను కూడా తండ్రి తొడపై కూర్చోవాలని తండ్రి దగ్గిరగా చేరి ఎంతో ఆశతో చూశాడు. సురుచి అక్కడే ఉన్నది.

రాజు ఆమెకు జడిసి ధ్రువుణ్ణి చూసీచూడనట్టు ఊరుకున్నాడు. తమ్ముణ్ణి కూర్చోబెట్టుకొన్నటే్ల తండ్రి తన్ను కూడా ఎత్తి కూర్చోబెట్టుకుంటాడని ఆశించిన ధ్రువుడు బిక్కమొహం వేసి గుడ్ల నీరుపెట్టుకొన్నాడు. పసివాడి బుగ్గలపై కన్నీటి ముత్యాలు మెరిశాయి. అది చూసి సురుచి ఫక్కున నవ్వి, ‘‘దిక్కుమాలిన దానికి పుట్టినవాడా! నువ్వు ఎంత తపస్సుచేసినా, నా కొడుకుతో సమానంగా తండ్రి తొడ మీద కూచునే ెూగం నీకు అబ్బదురా, అబ్బీ!

నా కడుపున పుట్టాలి; నీకా భాగ్యం కలగాలి! అంతే! అన్నట్టు నువ్వు మహా గొప్పగా నారా…ుణ సంకీర్తనం చేస్తూంటావేమో, తపస్సు చేసి, ఆ భాగ్యం కల్గిస్తాడేమో ఆ నారా…ుణుడినే అడిగి చూడు,'' అని హేళన చేసింది. పసివాడి మనస్సు కుతకుతలాడింది; దుఃఖం పెల్లుబికింది, ఉక్కురోషం ముంచుకొచ్చింది. కొరడా తీసుకొని సురుచిని చావబాదాలనిపించింది. కత్తితో నిలువునా చీరె…్యూలనిపించింది. మరుక్షణంలోనే సురుచి, ‘‘నా…ునా! నారా…ుణుడిని నమ్ముకో! తపస్సు చెయ్యి,'' అని ఉపదేశించిన, సద్గురువులాగ కనిపించింది.

అంతటి మహత్తరమైన ఉపదేశానికి నోచుకోని ఉత్తముడు అభాగ్యుడైన వఠ్ఠి అమా…ుకుడిలాగ కనిపించాడు. ఉత్తాన పాద మహారాజు చీకటివలలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న దుప్పిలాగ కనిపించాడు. ధ్రువుడు సురుచికి గురూపదేశం పొందిన శిష్యుడిలాగ నమస్కరించి, అక్కడినించి వెళ్ళాడు.

ధ్రువుడి చేష్ట అర్థం కాని సురుచి మొదట నివ్వెర పోయింది. తరవాత, ‘‘కుర్రాడు మంచి వాడే! నాలుగు తిట్టినా మ్రొక్కుతూ వెళ్ళాడు, ఐనా మ్రొక్కకేం జేస్తాడు, నా ఎదట నోరు మెదపడం వాడి తరమా? వాడి తల్లి తరమా?!'' అని అమితగర్వంగా తనలో తాను విపరీతంగా పొంగిపోతూ సరిపెట్టుకుంది. కన్నీటి చారలతో వచ్చిన ధ్రువుణ్ణి చూసి జరిగింది దాసీలవల్ల విన్న సునీతి బావురుమంటూ, ‘‘ఔను, నా…ునా!

దాసీ దానికన్న హీనంగా బతుకుతున్న నా కడుపున ఎందుకు నువ్వు పుట్టాలి? నలుగురెదుట అవమానపడాలి? నీ సవతి తల్లి మాటలు ముమ్మాటికీ నిజం, నీకూ నాకూ ఆ నారా…ుణమూర్తి తప్ప వేరే దిక్కులేదు!'' అన్నది. ఆ మాటలకు ధ్రువుడు ధైర్యంగా లేచి నిలబడి, ‘‘అమ్మా! నేను తపస్సుకు వెళ్తున్నాను!'' అన్నాడు. ‘‘ఏమిటీ! తపస్సు చేస్తావా? సురుచి కడుపున పుట్టాలని వరంకోరుకో!'' అన్నది సునీతి. ‘‘అమ్మా, ఆగు!

మళ్ళీ ఆ మాటే అనకు; నేను నీ కొడుకును. మరెవరికో కొడుకునై పుట్టాలని ఎందుకు కోరతాను? మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అది ఆత్మహత్యతో సమానం. ధ్రువుడి తల్లి ఎంత భాగ్యశాలి అనేలాగ, దిక్కులకు దిక్కుగా ఉండేలాగ నారా…ుణుణ్ణి కోరుకుంటాను, వస్తాను!'' అని చెప్పి ధ్రువుడు బ…ులుదేరాడు. నారదుడు ఎదురుగా వస్తూ, ‘‘ఓ హెూ, ధ్రువకుమారా! ఆడుకోడానికి బ…ులుదేరినట్టుంది, ఔనా?'' అన్నాడు.

‘‘తపస్సుకు వెళ్తున్నాను, స్వామీ!'' అన్నాడు ధ్రువుడు. ‘‘తపస్సు అనే ఆట ఒకటి ఉందన్న మాట, అలాగే చక్కా ఆడుకో నా…యనా!'' అన్నాడు నారదుడు. ‘‘ఆటకాదు. నిజంగానే శ్రీమన్నారా…యణుణ్ణి గూర్చి తపస్సు చే…ుడానకి వెళుతున్నాను. మునీంద్రా,'' అన్నాడు ధ్రువుడు. ‘‘అలాగా! ఇంత పసిప్రా…యoలో ఏమికోరి తపస్సు చేయబోతున్నావు?'' అని అడిగాడు నారదుడు ఆశ్చర్యంగా.

‘‘మా తండ్రి తొడ మీద కూర్చోబోతే, మా సవతి తల్లి అడ్డుపడి హేళనగా మాట్లాడింది,'' అంటూ జరిగింది వివరించాడు ధ్రువుడు. ‘‘అదా సంగతి, ఓష్‌! ఈమాత్రం దానికి తపస్సెందుకోయి ధ్రువా! నాతో రా, నీ తండ్రి నిన్ను తొడ మీద ఎందుకు కూర్చోబెట్టుకోడో చూస్తాను!'' అన్నాడు నారదుడు. ‘‘ఎవరి ద…యాధర్మాలూ నాకు వద్దు, స్వామీ! అన్నిటికంటె ఉన్నతమైన నారా…యణుని అనుగ్రహం నాకు కావాలి!

అందుకే తపస్సు చేుయడానికి వెళ్తున్నానుఅన్నాడు ధ్రువుడు. ‘‘తపస్సంటే మాటలు కాదు, నా…ునా! అరణ్యంలో పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలుంటాయి. ఎండా వానా చలీ అన్నీ బాధగానే ఉంటాయి. నా మాట విను, తిరిగి ఇంటికి పద!'' అన్నాడు నారదుడు. నారదుడి మాటలకు ధ్రువుడు, ‘‘నేను క్షత్రిుయుణ్ణి, పరాభవం సహిస్తూ బతకలేను. నాకు పిరికిమందు నూరిపో…యడానికివచ్చారా, స్వామీ?'' అన్నాడు వినుయoగా. ‘‘నా…యనా, ధ్రువా! నీ దీక్ష తెలుసుకోడానికే అలాగ అన్నాను.

ఒకప్పుడు నేను కూడా దిక్కులేని బాలుడనై ఎన్నెన్నో అవమానాలూ, అగచాట్లూ పడి అడవి చేరి తపస్సు చేసినవాడినే! నువ్వు మధువనానికి వెళ్ళి, ‘ఓం నమో నారా…ుణ' అని జపిస్తూ తపస్సుచెయ్యి. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, కృతార్థు డివై రా!'' అని నారదుడు అన్నాడు-ధ్రువుడు ఉత్సాహంగా మధువనం కేసి నడవసాగాడు, అని సూతుడు చెప్పగా విన్న మునులు, ‘‘మునీంద్రా! నారదుడు ఎందుకు అగచాట్లు పడ్డాడు? నారదుడి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది!'' అన్నారు.

విష్ణు కథ -1

విష్ణు కథ -1

పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వ తానికి ఇనుము, వెండి, బంగారాల మూడు శిఖరాలు; ఆ శిఖరాల నడుమ ఫలవృక్షాలతో నిండిన మహారణ్యం. ఆ వనంలో గజేంద్రం అనే మదపుటేనుగు తన భార్యలైన దశలక్షకోటి ఆడ ఏనుగులతో విహరిస్తూ దాహం తీర్చుకోడానికి మహావనం మధ్యనున్న సరోవరానికి బ…యలుదేరింది.

దాహం తీరాక జలవిహారంపై బుద్ధిపుట్టి, తన ఆడ ఏనుగులతో సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తూ విజృంభించి జలకేళిలో లీనమై ఉన్న గజేంద్రాన్ని, గొప్ప మొసలి కోరలు గుచ్చి ముందరి కాలొకటి పట్టుకొన్నది. బాధతో గజేంద్రం చేసిన ఘీంకారానికి ఆడ ఏనుగులు బెదిరి చెల్లాచెదరుగా సరోవరం చుట్టూరా ఒడ్డు చేరుకొని, గజేంద్రం పడుతూన్న బాధ చూసి ఏడుస్తూ నిలబడాేు్డగాని, మొసలి పట్టునుండి ఎలా తప్పించాలో వాటికి తోచలేదు.

గజేంద్రం మొసలి బారినుంచి తప్పించుకోడానికి ఎన్ని ప్రయుత్నాలు చె్యాలో అన్నీ చేస్తూ తల్లడిల్లిపోసాగింది. ఏనుగులు శోకాలు పెడుతూనే, ఆకలి తీర్చుకుంటూ, వేరే జలాశ్ర…యాలకు వెళ్ళి నీరు తాగి వస్తూపోతూ సరోవరం చుట్టా తిరుగుతూ కన్నీరు కారుస్తున్నాయి.

సరోవరంలో నిర్విరామంగా కరిమకరాల పోరాటం సాగుతూనే ఉన్నది. ఏనుగు దంతాలతో మొసలిని పొడిచేది. మొసలి ఎగిరి మీదపడి ఏనుగు శరీరమంతా రక్తధారలు కారేట్లుగా వాడిగోళ్ళతో బలంగా రక్కేది. ఏనుగు తొండంతో మొసలి వీపు బాదేది, మొసలి కరుకుల తోకతో ఏనుగును ఎడాపెడా కొటే్టది.

ఏనుగు మొసలి మీద పడి నాలుగు కాళ్ళతో కుమ్మే…యాలని చూస్తే, మొసలి నీటి అడుగున దాగి ఉండేది. ఏనుగు ఎంతకూ మొసలి జాడ లేకపోవడం చూసి ఒడ్డు చేరబోతూంటే, తటాలున మకరం ఏనుగును పట్టుకొని లాక్కుపోయి నీట ముంచేది. అలాగ ఎన్నిసార్లో ఏనుగును ముప్పతిప్పలు పెట్టింది. ఏనుగుకూ మొసలికీ నిర్విరామంగా పోరాటం వెయ్యి సంవత్సరాలు సాగింది.

గజేంద్రం స్వశక్తిని నమ్ముకొని ఎంత సాహసించి పోరాడినా క్రమక్రమంగా శక్తి సన్నగిల్లింది. మొసలి జలగ్రహం! నీటిలో దాని బలం ఎక్కువ. ఏనుగు రక్తం పీలుస్తూ అది మరింత బలంతో బాగా ఒళ్ళు పెంచింది. మొసలి పట్టునుంచి మోక్షం పొందడం మరింక దానికి సాధ్యం కాదు! ‘‘దాహం తీర్చుకోడానికి ఈ సరోవరానికి నేరక వచ్చాను. దాహం తీర్చుకొని వెళ్ళిపోకుండా సరస్సులో ఎందుకు దిగాను? నా పాడుబుద్ధే నన్ను మొసలికి పట్టి ఇచ్చింది!''

అంటూ గజేంద్రం చింతించరసాగింది. ‘‘నన్నెవరు రక్షిస్తారు? ఎవరిని పిలవాలి? నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నా, నా మనస్సులో ఏ మూలనో నేను కాపాడబడగల అవకాశం ఏదో ఉన్నదనే ఆశ! ఆ ఆశవల్లనే రక్షణ కోరుకుంటున్నాను! అంటే నా ఆశకు ఆధారం ఏదో ఉండి తీరాలి! అదే దేవుడని పిలుస్తున్నాను! దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు అనే భావనకు ఆదిమూలమైన ఓ దేవుడా! కారణాలన్నిటికీ నువ్వే కారణానివి! నాలాంటి మదగర్వితులైన మంద మదమతి జీవులు ఆపద రానంతవరకు నిన్ను తలవరు!

బాధపడితేనేగాని నీ అవసరం బోధపడదు. ఉన్నాడు ఉన్నాడు అనేవాడు ఉన్నాడో, లేడో అనే ఆందోళన పడందే నువ్వు కనిపించవు!'' అని పరిపరి విధాల చింతనలోపడ్డ గజేంద్రానికి మొసలి పెడుతున్న బాధ కొంత తగ్గినట్లు అయింది. ఎప్పుడైతే గజేంద్రుడు చింతన మొదలు పెట్టాడో, ఆ క్షణంలోనే మొసలి కోరల కుదుళ్ళలో సలుపు పుట్టింది. గుండెదడ చురుక్కుమనిపించింది. అయినా అది మరింత రోషంతో గజేంద్రం కాలిని నొక్కి, నొక్కి పిప్పి చేస్తూనే ఉన్నది. ‘‘జీవుల చెడ్డనూ, బాధనూ హరించే వాడివి! అంతటా ఉండేవాడివి, వ్యాపిస్తూనే ఉండేవాడివి!


దేవుళ్ళకు మూలమైన దేవుడా! ఈ జగత్తు జనించే హేతువుకు నువ్వే మూలహేతువు! నన్ను రక్షంచమని ఎంత బలంగా నిన్ను కోరుతానో అంత వేగంగా నన్ను నీవు రక్షంచుతావని నమ్ముతున్నాను, రక్షంచితీరగలవు! అన్నీ నువ్వే అవుతూ మాటకూ, మనస్సుకూ అందనివాడివిగా ఉండే ఓ సర్వేశ్వరుడా! నాలాంటి దీనులను ఆదుకునే బాధ్యత నీదే కదా!

జీవశక్తులన్నీ నశించిపోయిన నాలో, ఇప్పుడు కన్నీరు హరించిపోయింది. నిన్ను ఎలుగెత్తిపిలవలేను సరికదా, నా నుంచి చిన్న మూలుగు కూడా రాదు, స్పృహ కూడా తప్పుతున్నది. నన్ను రక్షంచినా మానినా అంతా నీ ఇష్టం! నీవు తప్పితే నాకు ఇంకేదిక్కూ, ధ్యాసా లేదు!'' అంటూ గజేంద్రుడు శక్తినంతా కూడదీసుకొని తొండాన్ని ఎత్తి పిలుస్తున్నట్లుగా తిన్నగా చూశాడు. మొసలికి మెల్లమెల్లగా బలం తగ్గిపోతున్నదని పించింది, నోరు జారుతున్నట్లు, చేతులు ఆడనట్లు కంఠం బిగుసుకుంటున్నట్లు తోచింది.

తాను ఉన్నదీ లేనిదీ తెలి…ుని స్థితిలో ఏనుగు కళ్ళు మూత పడుతూంటే, అలాగే ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయింది. అప్పుడు విష్ణువు వచ్చాడు. ఆకాశమంతా అతని రూపంతో నిండి పోయింది. తానొక సూక్ష్మమైన అణువును అని గజేంద్రానికి అనిపించింది. వస్తూనే విష్ణువు చేతనున్న చక్రాన్ని విడిచాడు. అభ…ుముద్రగా పతాక హస్తం పట్టాడు. ప్రచండ వేగంతో గిర్రున తిరుగుతూ వచ్చి విష్ణుచక్రం మొసలి తల నరికింది.

మొసలి ఒక గంధర్వుడు, హుహూ అనేది అతడి పేరు. దేవలుడు అనే ఋషి నీటిలో నిల్చుని ఉండగా నీటిలోంచి కనపడకుండా వెళ్ళి మొసలిలాగ, ఋషి కాలు పట్టుకున్నాడు. ఋషి ఆ గంధర్వుణ్ణి మొసలిగా పడి ఉండు అని శపించాడు.

విష్ణు చక్రంతో ఆ శాపం తీరింది. మొసలి బారినుంచి విముక్తి పొందిన గజేంద్రాన్ని సరస్సు నుంచి వెలుపలకు లాగి విష్ణువు అరచేత్తో దాని కుంభస్థలాన్ని ఆప్యా…ుంగా నిమిరాడు. దేవదేవుడి ఆ స్పర్శకు గజేంద్రం పోయిన జవసత్వాల్నీ, శరీరపుష్ఠినీ తిరిగిపొందింది. తన పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగింది. గజేంద్రం వెనకటి జన్మలో విష్ణుచింతనా తత్పరుడైన ఇంద్ర ద్యుమ్నుడనే మహా రాజు.

విష్ణుధ్యానంలోవున్న అతను అగస్త్య మహర్షి రాకను గమనించలేదు. ఋషి కోపగించి మదగజమై పుట్టుదువు గాక అని శపించాడు. ఆ రాజే గజేంద్రంగా పుట్టి మోక్షణపొందాడు. గజేంద్రమోక్షణ కథను సూతమహర్షి నైమిశారణ్యంలో జరుగతున్న సత్ర…ూగానికి వచ్చిన శౌనకాదిమునులకు వివరంగా చెప్పాడు. మునులు సూతుడితో, ‘‘మునీంద్రా! గజేంద్రమోక్షణ కథ కేవలం ఒక ఏనుగుకు చెందినదిగా లేదు.

జీవకోటి అంతకూ ముఖ్యంగా అనేక బంధాలతో బాధలో చిక్కుకుని సతమతమే్యు మానవజీవికి వర్తించే కథలాగ వున్నది,'' అని అన్నారు. సూతుడు, ‘‘ఔను, గజేంద్రమోక్షం అంతరార్థంతో కూడినదే! ఎవరు ఎలాగ అన్వయించుకున్నా సరిపోతుంది. కాలం విష్ణువు అధీనంలోనే ఇమిడి వున్నది. కాలచక్ర భ్రమణంలో ఎన్నో సమస్యలూ బాధలూ కష్టాలూ సమసిపోతూంటాయి,'' అని చెప్పాడు.

మునులు, ‘‘మునివర్యా! గజేంద్రమోక్షాన్నిబట్టి కారణకారణుడు, సర్వేశ్వరుడు విష్ణువు అని తెలుస్తున్నది. అటువంటి విష్ణుకథను పూర్తిగా వినాలని ఉవ్విళ్లూరుతున్నాం. నీ ముందు మేము పిల్లలవంటి వాళ్ళం. కనుక విష్ణువును గూర్చిన విశేషాలన్నీ మాకు సులభంగా బోధపడేలాగ వినిపించ ప్రార్థిస్తున్నాం. వ్యాసమహర్షి వలన సమస్తపురాణాలనూ ఇతిహాసాలనూ, వాటిలోని విశేషార్థాలనూ ఎరిగిన నీవు ఒక్కడివే మమ్మల్ని కృతార్థుల్ని చేయగలవు!'' అని అన్నారు.

సూతుడు వారి మాటలకు ఎంతగానో సంతసించి, ‘‘అలాగే విందురుగాని. వ్యాసమహర్షి విష్ణువును గురించిన అనేక లీలావతార విశేషాంశాలతో ప్రత్యేకంగా మహాభాగవతాన్ని రచించి, తనకుమారుడైన శుకునికి బోధించాడు.

విష్ణుకథను విని తరింపగోరిన పరీక్షత్తు మహారాజుకు శుకెూగి దాన్ని చెప్పాడు. గజేంద్రాన్ని రక్షంచ వచ్చిన విష్ణువు అవతరణ ‘ఆదిమూలావతారం' అని పేర్కొనబడింది. విష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. వాటిలో పరిణామ దశలను అనుసరించే దశావతారాలు అనబడే పది అవతారాలు ముఖ్యమైనవి. నారము అంటే నీరు. నీటికి మూలమైనవాడు కనుకనే విష్ణువు నారా…యణుడైనాడు.

నారాయణుడి నుంచి నీరుపుట్టింది. నీటినుంచి జీవం పుట్టింది. విష్ణువు జలచరమైన చేపగా అవతరించాడు. అదే మత్స్యావతారం! విష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. విష్ణువు నీటితో నిండిన నీలమేఘం రంగులో ఉంటాడు. మేఘంలో మెరుపువున్నటే్ట విష్ణువు తేజోమయుడు. అతని నుంచి వచ్చిన జలం కూడా తేజస్సుతో నిండి తెల్లని వెలుగు చిమ్ముతూంటుంది. ఆ జలమే కారణోదక క్షరసాగరం!

క్షరసాగరంలో అనంతమైన కాలం శేషసర్పం రూపంతో చుట్టలు చుట్టకొని ఉంటుంది. శేషువుకు వెయ్యి పడగలు. చివర అంటూలేని శేషువుపై శేషశాయిగా విష్ణువు పవ్వళించి వుండగా, అతని బొడ్డు నుంచి నాళంతో గొప్పపద్మం పైకిలేచింది. ఆ పద్మంలో బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మ అన్నిటినీ సృజించాడు. అనంతమైన కాలం …యుగాలుగా సాగుతూంటుంది. కృత-త్రేతా-ద్వాపర-కలియుగాలు కలిసి ఒక మహా…యుగం.

వెయ్యి మహా…యుగాలు కలిసి ఒక కల్పం. కల్పం బ్రహ్మకు ఒక పగలు. పగలు పూర్తికాగానే అతనికి నిద్రముంచుకొస్తుంది. అదే కల్పాంతం. అప్పుడు అంతటా గాఢాం ధకారం అలుముకొంటుంది. విష్ణువు నుంచి వెలువడిన సంకర్షణాగ్ని వేడిమి అన్నిటినీ మాడ్చివేస్తుంది. పెనుగాలులు వీస్తుంటే కారుమేఘాలు గుంపులు గుంపులుగా ఏనుగుతొండాల్లాంటి జలధారలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి.

మహాసముద్రం ఆకాశాన్నంటి పొంగుతుంది. భూ, భువర్‌, స్వర్లోకాలు మునిగి పోతాయి. ఎటు చూసినా జలబీభత్సం తప్పితే మరేమీవుండదు. ఆ విధంగా ప్రళయo. సంభవిస్తుంది. బ్రహ్మ నిద్రపోేు రాత్రి అంతా మహా ప్రళ…ుకాలం! అది కల్పాంతం దగ్గిరవుతూన్న సమ…యo: సత్యవ్రతుడు అనే రాజర్షి నదిలో స్నానం చేసి నారా…ుణ ధ్యానం చేసి, అర్ఘ్యం ఇవ్వబోయేటప్పుడు, అతని దోసిట్లోకి బంగారం రంగులో వున్న చిన్న చేప వచ్చింది.

సత్యవ్రతుడు దాన్ని నదిలో విడిచిపెట్ట బోతూంటే, ఆ చిన్నారి చేప, ‘‘ఓ రాజా! మా చేపజాతి మంచిదికాదు. చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తాయి. వాటి నుంచి తప్పించుకున్నా, జాలర్లు వలపన్ని పట్టి చంపుతారు. అందుచేత, నీ రక్షణకోరి నీ దోసిలిలోకి వచ్చాను, నిర్ద…యగా నన్ను విడిచిపెట్టకు!'' అని పలికింది. సత్యవ్రతుడు చేపను తన కమండలంలో వుంచి తన నగరికి తీసుకువెళ్ళాడు.

సత్యవ్రతుడు మహారాజుగా రాజ్యపాలన చేస్తూనే గొప్ప తపస్సుచేసిన రాజఋషి. నిరంతర విష్ణుభక్తితత్పరుడు, గొప్ప జ్ఞానసంపన్నుడు. కమండలంలో ఉంచిన చేపపిల్ల, మర్నాటికే నిండుగా పెరిగి అందులో ఇమడలేక ఉక్కిరి బిక్కిరవుతూ, ‘‘రాజా! నన్ను ఇందులోంచి తీసి, కాస్త పెద్ద చోటులో చేర్చు!'' అంటూ ఆర్తనాదం చేసింది. ఆ చేపను పెద్ద నీటి తొటె్టలో విడిచిన కొద్దిసేపటికే చేప ఎదిగి అది కూడా చాలకపోగా, సత్యవ్రతుడు దాన్ని చిన్న మడుగులో వేశాడు.

చేప పెరిగిపోతూనే ఉంది.మడుగు నుంచి పెద్ద సరోవరానికీ, సరోవరం నుంచి మహాజలాశ్ర…ూనికి చేర్చినా, అలా పెరిగిపోతున్న మహామత్స్యాన్ని సముద్రానికి చేర్చగా, ‘‘ఓ రాజర్షీ! నీ రక్షణ కోరిన నన్ను సముద్రంలో వదిలిపోతావా? ఇది న్యా…యమేనా? మొసళ్ళు, తిమింగిలాలు నన్ను మింగవా?'' అని మత్స్యం నిలదీసి అడిగింది. సత్యవ్రతుడు, ‘‘ఓ మహామీనమా! ఇంతకంటే నేను చే…యగల్గిందేముందో నువ్వే చెప్పు! క్షణానికి శత ెూజనాలు పెరిగేలా ఉన్న నిన్ను ఏదీ మింగలేదు కదా!'' అన్నాడు.