సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 21, 2014

విన్నపాలు‬ విన్నవించ వచ్చినాము బాబా


విన్నపాలు‬ విన్నవించ వచ్చినాము బాబావిన్నపాలు‬ విన్నవించ వచ్చినాము బాబా..
విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా ||విన్న||
మురిపెము తో నువు తిరిపెము నెత్తి మురిసినావు బాబా
కరములతో శ్రీకరముగ మమ్ము బ్రోచినావు బాబా ||మురి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
కరి మొరలే విని మకరిని ద్రుంచిన వాడవు కావా బాబా
మా మొరలే వినరావా బాబా ఓ సాయిబాబా ||కరి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
రావణంతకా ఇనకుల తిలకా రామ సాయిబాబా
దశరథ పుత్ర కోమల గాత్రా పరమ పవిత్రా బాబా ||రావ||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా

‎సాయిబాబా‬ హారతి అర్థాలతో


#సాయిబాబా హారతి అర్థాలతో..
''#ఆరతి సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా||1||
బాబా నీకు ఆరతి చేస్తున్నాము. జీవులందరికీ సంతోషము నొసగి, నీ పాద రేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు నిచ్చే నీకు ఆరతి చేస్తున్నాము.

జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా||2||
కోరికలను దహింప జేసి, తనను తాను తెలుసుకొన గోరే వారికి, మోక్షమును పొందే మార్గము బోధించి, తమ కళ్ళతో తాము విష్ణువుని (శ్రీరంగని) చూడ గలిగెట్లు చేసిన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,ఆరతి సాయి బాబా||3||
ఎవరెవరికెంత నమ్మకము, భక్తి ఉన్నదో, వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే, ఓ దయామయా నీవు చూపే మార్గము అదే ఓ దయామయా, నీకు ఆరతి చేస్తున్నాము. (దీనికి సామ్యం గా అన్నమాచార్యులు కూడా ఇలా చెప్పారు: "ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు, అంతరాంతరము లెంచి చూడ పిందంటే నిప్పటి అన్నట్లు" అని.)

తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ, ఆరతి సాయి బాబా||4||
నీ నామ స్మరణము ఈతి బాధలను హరిస్తుంది. నీ చర్యలు అగాధమంత లోతైనవి (అంతు పట్టనివి). అవి అనాథలకు దారి చూపుతాయి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా 
అవతీర్ణ  ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర, ఆరతి సాయి బాబా||5||
ఈ కలియుగంలో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి. నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి పత్నియైన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి  మూడు తలలు గల దత్తాత్రేయునిగా జన్మించాడు)   

ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద  పహావాయా భవభయ నివారీ, ఆరతి సాయి బాబా||6||
ప్రతి గురు వారం భక్తులు షిరిడీ వచ్చి ఈ ప్రభువు చరణములను దర్శించుకుని, తమ ఇహలోక భయమును పోగొట్టు కొందురు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము. 

మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా, ఆరతి సాయి బాబా||7||
నాకు కావలసిన సంపద అంతా నీ పాద సేవ చేయడమే. ఓ! ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక ఆరతి సాయి బాబా||8|| 
చాతక పక్షి ఎలా అయితే నిర్మలమైన నీరు త్రాగాలను కుంటుందో, ఓ! ప్రభూ, నాకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రసాదించు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
సాయిబాబా‬ హారతి అర్థాలతో..
''ఆరతి‬ సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా||1||
బాబా నీకు ఆరతి చేస్తున్నాము. జీవులందరికీ సంతోషము నొసగి, నీ పాద రేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు నిచ్చే నీకు ఆరతి చేస్తున్నాము.
జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా||2||
కోరికలను దహింప జేసి, తనను తాను తెలుసుకొన గోరే వారికి, మోక్షమును పొందే మార్గము బోధించి, తమ కళ్ళతో తాము విష్ణువుని (శ్రీరంగని) చూడ గలిగెట్లు చేసిన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,ఆరతి సాయి బాబా||3||
ఎవరెవరికెంత నమ్మకము, భక్తి ఉన్నదో, వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే, ఓ దయామయా నీవు చూపే మార్గము అదే ఓ దయామయా, నీకు ఆరతి చేస్తున్నాము. (దీనికి సామ్యం గా అన్నమాచార్యులు కూడా ఇలా చెప్పారు: "ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు, అంతరాంతరము లెంచి చూడ పిందంటే నిప్పటి అన్నట్లు" అని.)
తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ, ఆరతి సాయి బాబా||4||
నీ నామ స్మరణము ఈతి బాధలను హరిస్తుంది. నీ చర్యలు అగాధమంత లోతైనవి (అంతు పట్టనివి). అవి అనాథలకు దారి చూపుతాయి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా
అవతీర్ణ ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర, ఆరతి సాయి బాబా||5||
ఈ కలియుగంలో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి. నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి పత్నియైన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి మూడు తలలు గల దత్తాత్రేయునిగా జన్మించాడు)
ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద పహావాయా భవభయ నివారీ, ఆరతి సాయి బాబా||6||
ప్రతి గురు వారం భక్తులు షిరిడీ వచ్చి ఈ ప్రభువు చరణములను దర్శించుకుని, తమ ఇహలోక భయమును పోగొట్టు కొందురు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా, ఆరతి సాయి బాబా||7||
నాకు కావలసిన సంపద అంతా నీ పాద సేవ చేయడమే. ఓ! ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక ఆరతి సాయి బాబా||8||
చాతక పక్షి ఎలా అయితే నిర్మలమైన నీరు త్రాగాలను కుంటుందో, ఓ! ప్రభూ, నాకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రసాదించు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

‎మెరె‬ ఘర్ కె ఆగే సాయినాథ్

మెరె‬ ఘర్ కె ఆగే సాయినాథ్
మెరె‬ ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
జబ్ ఆరతి హో తేరీ, ముఝే ఘంటీ సునాఈ దే (2)
ముఝే రోజ్ సవారె సాయినాథ్ తెరి సూరత్ దిఖాఈ దే (2)
జబ్ భజన్ కరె మిల్కర్ బస్ కానోం మేం గుల్జాయీ (2)
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే (2)
ఆతే జాతే బాబా తుమ్ కో మైం ప్రణామ్ కరూం (2)
జో మేరే లాయక్ హొ కుఛ్ ఐసా కామ్ కరూం (2)
తెరీ సేవా కర్ నే సే మేరీ కిస్మత్ ఖుల్ జాయే (2)
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే (2)
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే (2)
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెర మందిర్ బన్ జాయే
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
నజ్ దీక్ రహేంగే తో ఆనా జానా హోగా (2)
హమ్ భక్తోం కా బాబా మిల్నా జుల్నా హోగా (2)
కబ్ సాథ్ రహే బాబా జల్దీ వో దిన్ ఆయే (2)
కబ్ సాథ్ రహే బాబా జల్దీ వో దిన్ ఆయే (2)
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
~ ~~~!!శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!~~~~

‎సాయి‬ బాబా దినచర్య..

సాయి‬ బాబా దినచర్య..
సాయిబాబా సాధు‬ జీవితం ఎంతో పరిశుద్ధమైనది. అందులోని పవిత్రతే ఎందరో భక్తులను ఎక్కడెక్కడి నుంచో షిరిడీకి లాక్కొచ్చేది. బాబా దినచర్యను గమనించినవారికి ఆయన జీవితం ఎంత ‪‎పవిత్రమైనదో‬ తేలికగా అర్థమవుతుంది.
బాబా తెల్లవారు జామునే నిద్రలేచేవారు. ధుని‬ దగ్గర స్తంభానికి ఆనుకుని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిల్చుని విచిత్రమైన భంగిమలను ప్రదర్శించేవారు. నెమ్మదిగా 'యాదేహక్‬'(దైవాన్ని ఎప్పుడూ స్మరించాలి) వంటీ అరబ్బీ పదాలు పలికేవారు. ఆ సమయంలో తమ వద్దకు ఎవరినీ రానిచ్చేవారు కారు. ఆ లోగా‪ ‎మాధవ్‬ ఫస్లే అనే సేవకుడు మసీదును చక్కగా ఊడ్చి, బకెట్లతో నీటిని సిద్ధం చేసేవాడు. #సాయి ఆ నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలించి, ముఖం, కాళ్లు చేతుల్ని ఎంతో నాజుకుగా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు. మధ్యలో ధునిలోని కట్టెల్ని సవరిస్తూ, భక్తులతో‬ ఆ ముందటి రాత్రి తామెక్కడికి వెళ్లిందీ, ఎవరినెలా కాపాడిందీ, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తానెలా తీసుకెళ్లిందీ వివరించేవారు. ఆ సమయంలోనే వేర్వేరు భక్తులకు కలిగిన అనుభవాలను అక్కడ ‪‎కలబోసుకునేవారు‬.
అనంతరం కుష్ఠురోగ‬ భక్తుడు భాగోజీ షిండే బాబా చేతి(ఆ చేతిని ధునిలో పెట్టే బాబా ఎక్కడో దూరంగా ఉన్న ఒక కుమ్మరి బిడ్డను కాపాడారు. అప్పుడు ఆ చేతికి కాలిన గాయమైంది)కి‪ శ్రద్ధగా‬ కట్టు కట్టేవాడు. నిజానికి బాబాకు అతని సేవతో పని లేకపోయినా అతన్ని ఆనందపరిచేందుకే ఆ అవకాశం ఇచ్చేవారు. అప్పటికి ‪ ‎ఉదయం‬ ఏడున్నర అయ్యేది. షిరిడీకి వచ్చిన మొదటి రోజుల్లో బాబా మూడు నాలుగు రోజులకు ఒకసారి ఈ సమయంలోనే బావి వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కుని నీరు పుక్కిలించి ఉమ్మేవారు. తర్వాత కొంత కాలానికి భక్తులు ‪‎బాబా‬ కోసం రెండు పెద్ద రాగి పాత్రలలో వేడి నీళ్లు, రెండు బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. బాబా వేడి, చన్నీళ్లు కలుపుకుని సుమారు గంటసేపు స్నానం చేసేవారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో #బాబా భుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలెగా కట్టుకుని కుడిచేతిలో రేకు డబ్బా పట్టుకుని ‪‎షిరిడీలోని‬అయిదిళ్లకు భిక్షకు వెళ్లేవారు.
భిక్ష‬ తీసుకుని తిరిగి మసీదుకు చేరిన వెంటనే ఒక రొట్టె, కొద్దిగా అన్నం ధునికి ఆహుతిగా వేసేవారు. ఆ తరువాత మిగిలినవన్నీ ఒక మట్టి పాత్రలో వేసి మూత పెట్టకుండా ఉంచేవారు. ఎవరికి కావాల్సినవి వారు అందులోంచి తీసుకెళ్లేవారు. కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్లు,సేవకులు‬ ఎవరెంత తీసుకున్నా బాబా ఏమీ అనేవారు కారు. అందరూ తీసుకోగా మిగిలిన పదార్థాలన్నిటినీ కలుపుకుని #బాబా తినేవారు. పగలెన్నడూ వెన్ను వాల్చేవారు కారు. గోడకు జానెడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిలించే వారు. ‪‎భిక్షాన్నం‬ మాత్రమే తినేవారు.
భిక్షకు వెళ్లి వచ్చిన తరువాత బాబా పాదరక్షలు ధరించి లెండీ వనానికి బయలుదేరేవారు. భక్తులు దారి పొడవునా బాబాకు గొడుగు పట్టేవారు. తిరిగి పదిన్నర ప్రాంతంలో బాబా మసీదుకు చేరుకునేవారు. గాయకులు, నర్తకీ నర్తకులు, గారడీ వాళ్లు... ఇలా ఎవరో ఒకరు కొద్దిసేపు బాబా ఎదుట తమ కళలను ప్రదర్శించేవారు‬. అటువంటి ప్రదర్శనలు లేకపోతే బాబానే మధ్యాహ్నం వరకు భక్తులకు హితోపదేశాలు, ‪‎నీతి‬ బోధకమైన కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు. అనంతరం భక్తులందరితో కలిసి బాబా మధ్యాహ్న భోజనం చేసేవారు. భోజనాలయ్యాక సగుణమేరు నాయక్‬ మసీదును శుభ్రం చేసేవాడు. సాయి యథాస్థానంలో కూర్చున్నాక తాంబూలం, తర్వాత గ్లాసెడు మంచినీళ్లు, రెండు రూపాయల దక్షిణ ఇచ్చేవాడు. కొంతసేపు సాయి ఏకాంతంగా గడిపేవారు. సాయంత్రం‬ అయిదు గంటల సమయంలో బాబా మళ్లీ లెండీ వనానికి వెళ్లి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవ్ మసీదు ఎదుట సన్నాయి వాయించేవాడు. ఎందుకో #బాబా అతనిపై ఆవేశంగా ఎగిరిపడేవారు.
తరువాత కొద్దిసేపు మసీదు‬ చావడికి మధ్య పచార్లు చేసేవారు. తరువాత ఆరు గంటలకు హారతి కార్యక్రమం పూర్తయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. ఆ తరువాత తనకు దక్షిణ రూపంలో వచ్చిన పైకాన్నంతా బాబా అందరినీ పిలిచి పంచేసేవారు. రాత్రి భక్తులందరూ భోజనాలకు తమ ఇళ్లకు వెళ్లినప్పుడు తొమ్మిది గంటల ప్రాంతంలో తాత్యా‬ కొన్ని రొట్టెలు తెచ్చి బాబాకు ఇచ్చేవాడు. #బాబా వాటిని తీసుకుని అతనికి ముప్ఫయ్ అయిదు రూపాయలు ఇచ్చేవారు. బాబాకు తాంబూలం అంటే మహా ఇష్టం‬. రాత్రీ పగలూ వాటిని తరుచుగా తీసుకునేవారు. అవి తిన్నాక బాగా నీళ్లు తాగేవారు. అనంతరం పవళింపు(శేజారతి) హారతి జరిగేది. ‪‎హారతి‬ పూర్తవగానే బాబా నిద్రకు ఉపక్రమించేవారు.

ఎంతెంత‬ దయనీది ఓ సాయి

#ఎంతెంత దయనీది ఓ సాయి..
                          ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను 
                          ఏమని పొగడను సర్వాంతర్యామి                  || ఎంతెంత ||
                          ఎంతెంత దయనీది ఓ సాయి

                          తొలగించినావు వ్యాధులు ఊదితో
                          వెలిగించినావు దివ్వెలు నీటితో                    |  తొలగించి  |
                          నుడులకు అందవు నుతులకు పొంగవు         | నుడులకు |
                          పాపాలు కడిగేసే పావన గంగవు                  || ఎంతెంత ||

                          భక్త కబీరే నీ మతమన్నావు 
                          భగవానుడే నీ కులమన్నావు                    | భక్త కబీరే |
                          అణువున నిండిన బ్రహ్మాండంలా 
                          అందరిలో నీవే కొలువున్నావు                    || ఎంతెంత ||

                          ప్రభవించినావు మానవమూర్తివై 
                          ప్రసరించినావు ఆరని జ్యోతివై                     | ప్రభవించి |
                          మారుతి నీవే గణపతి నీవే 
                          సర్వ దేవతల నవ్యాకృతి నీవే                     || ఎంతెంత ||
                          బాబా సాయిబాబా, బాబా సాయిబాబా
                          బాబా ఆఆఆఅ షిరిడి బాబా!!
~~~~~~!!శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!~~~~~~
ఎంతెంత‬ దయనీది ఓ సాయి..
ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను
ఏమని పొగడను సర్వాంతర్యామి || ఎంతెంత ||
ఎంతెంత దయనీది ఓ సాయి
తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో | తొలగించి |
నుడులకు అందవు నుతులకు పొంగవు | నుడులకు |
పాపాలు కడిగేసే పావన గంగవు || ఎంతెంత ||
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు | భక్త కబీరే |
అణువున నిండిన బ్రహ్మాండంలా
అందరిలో నీవే కొలువున్నావు || ఎంతెంత ||
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై | ప్రభవించి |
మారుతి నీవే గణపతి నీవే
సర్వ దేవతల నవ్యాకృతి నీవే || ఎంతెంత ||
బాబా సాయిబాబా, బాబా సాయిబాబా
బాబా ఆఆఆఅ షిరిడి బాబా!!
~~~~~~!!శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!~~~~~~

ఓం సాయి నమాయ


ఓంసాయి‬ నమాయ
ఓంసాయి‬ నమాయ ఓం సాయి నమాయ..
హర హర బోలే సాయి నమాయ
ఓం సాయి నమాయ ఓం సాయి నమాయ
హర హర బోలే సాయి నమాయ
అనంత కోటి బ్రహ్మాండ నాయక
రాజాధి రాజ యోగి రాజ
పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద
సద్గురు సాయి నాథ నమాయ "ఓం సాయి"
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు
గురుర్ దేవో మహేశ్వరాయ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమాయ "ఓం సాయి"
శ్రీమద్ పరబ్రహ్మ గురు స్మరామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు నమామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు యజామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు భజామి "ఓం సాయి"
ఓం శ్రీ సాయి నాథాయ నమః
లక్ష్మీ నారాయణాయ నమః
ఓం కృష్ణరామ్ శివ మారుత్యాది రూపాయ
ఓం శేష సాయినే నమో నమాయ "ఓం సాయి"
ఓం గోదావరీతట శీలధివాసినే
భక్త హృదాలయాయ నమో నమాయ
యోగేశ్వరాయ నమో నమాయ
ఓం భగవతే నమో నమాయ "ఓం సాయి"
ఓం తీర్థాయ నమో నమాయ
వాసుదేవాయ నమో నమాయ
ఓం కాలతీతాయ కాలాయ నమః
కాల కాలాయ నమో నమాయ "ఓం సాయి"
ఓం ప్రీతి వర్ధనాయ ప్రియాయ నమః
ఓం అంతర్యామినే నమో నమాయ
ఓం సచ్చిదాత్మనే నిత్యానందాయ 
పరమ సుఖదాయ నమో నమాయ "ఓం సాయి"

శ్రీసాయి‬ పల్లకి

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
కదిలింది ‪‎శ్రీసాయి‬ పల్లకి నూటొక్క సంవత్సరాల క్రిందట..
షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ ‪‎సాయి‬ ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ‪ పల్లకి‬ ఉత్సవం లో పాల్గొనేవారు.
అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా‬ బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు. అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు‪ ‎ద్వారకామాయిలోను‬, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909 లో జరిగింది. అంటే ప్రస్తుతానికి దాదాపు 101 ఏళ్ళముందు జరిగిందన్నమాట. ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "‪‎చావడి‬ ఉత్సవం" గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివుని లా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా ‪‎పాదుకలను‬పల్లకీలో ఉంచుతారు. బాబా కు బహూకరించిన గుర్రం "‪‎శ్యామకర్ణ‬" ను అలంకరించి తెచ్చేవారు.‪‎తాత్యా‬‪‎మహల్సాపతి‬, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు.
ఇప్పటికీ షిరిడీలో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిర్డీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు. ‪‎సాయిబాబావారి‬ ఆశ్శీస్సులు అందరికి పదికాలాపాటు కలకాలం చల్లగా చూడాలి.
~~~~~!!శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై హో!!~~~~~~
ప. కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
అది శుభ కారిణి ఆత్మ విహారిణి
ఆనంద పద సంచారిణి || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చ. సాయి పాదుకలు ఎదపై నిలిపి (2)
సాగెను పల్లకి నేడు
పల్లకి వెంటా చల్లగా కదిలెను
బాబా పదములు చూడు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చ. ద్వారక దాటి తరలిన పల్లకి (2)
చేరెను చావడి ముందు
ప్రమథుల నడుమా పరమ శివునిలా
బాబా వేసెను చిందు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చ. అటు తాళాలు, యిటు మేళాలు
ఆడే భక్త గణాలు (2)
పల్లకి ఉత్సవం చూసిన చాలు
కరుగును పాషాణాలు (2) ||కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !

-సబ్ కా మాలిక్ ఏక్ హై


శిరిడిసాయి‬-సబ్ కా మాలిక్ ఏక్ హై...
సబ్ కా మాలిక్ ఏక్ హై
భక్తులైన అందరిలో ఉండ వలసినది ఆ భగవంతుడి పట్ల భక్తి, శ్రద్ధ, చక్కటి అవయవ సౌష్టవంతో ఆయన దేహాన్ని మనకు సంప్రాప్తింప జేసినందుకు ఆయనకు వెల్లండిం చాల్సింది మన ‪‎కృతజ్ఞత‬మాత్రమే. ఏ ఒక్కరి ఆలోచనల ప్రకారం ఆయన ‪‎నామధేయం‬ ఏదయినప్పటికీ, ఆయన భావ‪ ‎స్వరూపాలు‬ ఏవైనప్పటి కీ వాస్తవానికి ఆయన ఒక్కడే. మన ఆలోచనలు మాత్రమే వేరు. మన దృక్పథాలు మాత్రమే వేరు. మన దృష్టి వేరు. ఉన్న వ్యత్యాసమంతా మనలోనే ఉంది కానీ ఆ యనలో ఎలాంటివ్యత్యా సం లేదు.
"సబ్‬ కా మాలిక్ ఏక్ హై
ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు...
రాముడే దేవుడని కొలిచింది మీరు
ఏసునే దైవమనీ తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు!!
కాషాయ ధ్వజమునెత్తి
ప్రణవ గంగ గలగలలను
హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను
ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్లతో ఎదను తడిసి
క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే
పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా!!
॥చరాచర॥
రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలీ
అది దేవదేవునీ జాలీ
పసిడి మేడనీ పూరి గుడిసనీ
బేధమెరిగి కురియబోదు వానా
అది లోకేశ్వరేశ్వరునీ కరుణా
సాటి మానవాళి హృదయ ఆలయాల
కొలువుదీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా!!
॥చరాచర॥

ఓటమి‬ నుండి ఓంకారమునకు 
#ఓటమి నుండి ఓంకారమునకు :

నిజానికిదంతా సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు. అలనాడు శ్రీ కృష్ణుడు జరాసంథునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకొన్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు.
నిజానికిదంతా సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు. అలనాడు శ్రీ కృష్ణుడు జరాసంథునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకొన్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు.


సద్గురు‬ నాథ సంకట హరణ సాయి దేవా..

సద్గురు‬ నాథ సంకట హరణ సాయి దేవా
సద్గురు‬ నాథ సంకట హరణ సాయి దేవా..
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !
ప. సద్గురు నాథ సంకట హరణ సాయి దేవా!
నీ తేజముకై హారతి ఇచ్చే సూర్య కిరణాలతో
పత్రి గ్రామమున పుట్టిన దేవా నీకే హారతి | పత్రి |
వెంకోసా గురు దీవెన లందిన నీకే హారతి | వెంకోసా | || సద్గురు ||
చ. షిరిడీలోనా మసీదు చేరిన సాయి హారతి
నీటి దివ్వెలు వెలిగించిన నీ మహిమకు హారతులు | షిరిడీ |
సన్నుతించిన శరణము పొందిన సాయీ నీ కథా | సన్నుతి |
ఇహ పరమొసగే వరదుని కేమో దివ్య హారతి | ఇహ పర | ||సద్గురు ||
చ. పాదములందే పావన గంగను చూపిన దేవా!
త్రివేణి సంగము తీర్థము ఇచ్చిన నీకే హారతి | పాదము |
సత్య వాక్యమే నిత్యము నిలిపే షిరిడీ వాసము | సత్య వాక్య |
చల్లని చూపుల కన్నులు దాల్చెను చంద్ర కిరణాలను | చల్లని | || సద్గురు ||
చ. భక్తుల కోసము ప్రాణము సైతము విడిచిన సాయి
సమాధి నుండి సమాధానము వచ్చినదీ నిరతము | భక్తుల | దత్తగరువును చూడగోరిన గురువునే చూపితివి
రాముని చూడగ భక్తుడు కోరిన నీలో నిలిపితివి | రాముడు | ||సద్గురు ||
చ. షిరిడీవాసా మృదు దరహాసా సాయిదేవా
కోపము, తాపము రెండూ లేక చిందు చిరునవ్వులు | షిరిడీ |
శత్రులు మిత్రులు పరమపవిత్రులు సాయీ దయవుంటే | శత్రులు |
దుష్ట శిక్షణే చేయను నేనని కలిలో చాటితివి | దుష్ట | || సద్గురు ||
చ. జపమూ, తపమూ, నియమ-నిష్టలు లేనే లేవు
పత్రీ, పుష్పము, ఫలమూ, నీరము ఇస్తే చాలంట | జపమూ |
చండక చండ మార్థాండునిచే మంగళ హారతీ | చండక |
దైవశక్తికి, సత్కర్మమునకు నిరతము హారతి | దైవశక్తికి | || సద్గురు ||

శ్రీసాయి‬ అమృత వచనములు

#శ్రీసాయి అమృత వచనములు..
శిరిడికి ఎవరు వస్తారో వారందరి కష్టాలు దూరమవును.
పాదాల కింద మీ దుఖల సాగరమును పెట్టి సమాది మెట్లు ఎకండి. 
శరీరమును వదిలి వేల్యను కానీ నా భక్తులు పిలిచినా వెంటనే వస్తాను.
మనస్సులో ధృడ విశ్వాసం పెట్టండి, ఆశలను సర్వనాశనం చేయండి. 
నేను ఎపట్టికి అమరుడను అని తెలుసుకో, అనుబూతిపొంది నిజాన్ని గుర్తించు.
నన్ను శరణు అని, ఒట్టి చేతులతో ఎవరైనా వెళ్లుంటే నాకు చెప్పు.
ఎవరి భావము ఎ రీతిలోవుందో అలాగే ఉంటుంది నా మనసుయొక్క రూపము.
నీ బాధ్యత నాది, నా ఈ మాట ఎప్పటికి అబద్దం కాదు. 
నీవు అడిగేవి దూరంలేదు వచ్చి తీసుకో. 
నాలో లీనం అయ్యే వచనములు మనసులో తలుచుకున్నవారి రుణం ఎపట్టికి తిర్చుకోలేను. 
నన్ను శరణుకోరి వచ్చిన భక్తుడే ధన్యుడు ధన్యుడు అనన్యము.శ్రీసాయి‬ అమృత వచనములు..
శిరిడికి ఎవరు వస్తారో వారందరి కష్టాలు దూరమవును.
పాదాల కింద మీ దుఖల సాగరమును పెట్టి సమాది మెట్లు ఎకండి. 
శరీరమును వదిలి వేల్యను కానీ నా భక్తులు పిలిచినా వెంటనే వస్తాను.
మనస్సులో ధృడ విశ్వాసం పెట్టండి, ఆశలను సర్వనాశనం చేయండి. 
నేను ఎపట్టికి అమరుడను అని తెలుసుకో, అనుబూతిపొంది నిజాన్ని గుర్తించు.
నన్ను శరణు అని, ఒట్టి చేతులతో ఎవరైనా వెళ్లుంటే నాకు చెప్పు.
ఎవరి భావము ఎ రీతిలోవుందో అలాగే ఉంటుంది నా మనసుయొక్క రూపము.
నీ బాధ్యత నాది, నా ఈ మాట ఎప్పటికి అబద్దం కాదు.
నీవు అడిగేవి దూరంలేదు వచ్చి తీసుకో.
నాలో లీనం అయ్యే వచనములు మనసులో తలుచుకున్నవారి రుణం ఎపట్టికి తిర్చుకోలేను.
నన్ను శరణుకోరి వచ్చిన భక్తుడే ధన్యుడు ధన్యుడు అనన్యము.


!!సాయిబాబాను ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి!!
''పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. 

మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని అని బాబా అన్నారు. అందుచేత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునేందుకు సాయిబాబాను తలచుకుని ప్రయత్నాలు చేస్తూపోతే సత్ఫలితాలుంటాయి. 
సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
!!సాయిబాబాను ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి!!
''పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి.

మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని అని బాబా అన్నారు. అందుచేత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునేందుకు సాయిబాబాను తలచుకుని ప్రయత్నాలు చేస్తూపోతే సత్ఫలితాలుంటాయి.
సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. అలాగే సాయిబాబాను మనసులో నిరంతరం తలుచుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

‎సర్వం‬ సాయిమయం

సర్వం‬ సాయిమయం 
ఉదయం నీవే సందేపొద్దువి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి
పగలు నీవే రేతిరివి నీవే సాయి 
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి
రాధవి నీవే రమణుడివి నీవే సాయి
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి
భాష నీవే భావానివి నీవే సాయి
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి
కవనం నీవే కవితాగానానివి నీవే సాయి
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి
ఆత్మవి నీవే ఆత్మారాముడివి నీవే సాయి
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి
జగానివి నీవే జగన్నాధుడివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి
ప్రభువి నీవే ప్రభలవెలుగువి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి
గౌరివి నీవే గంగానాధుడివి నీవే సాయి
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి
వేదన నీవే వేడుకవి నీవే సాయి
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి
గమ్యం నీవే గమనం నీవే సాయి
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి
#సర్వం సాయిమయం 
ఉదయం నీవే సందేపొద్దువి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి 

పగలు నీవే రేతిరివి నీవే సాయి 
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి 

రాధవి నీవే రమణుడివి నీవే సాయి 
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి 

భాష నీవే భావానివి నీవే సాయి 
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి 

కవనం నీవే కవితాగానానివి నీవే సాయి 
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి 

ఆత్మవి నీవే ఆత్మారాముడివి నీవే సాయి 
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి 

జగానివి నీవే జగన్నాధుడివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి 

ప్రభువి నీవే ప్రభలవెలుగువి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి 

గౌరివి నీవే గంగానాధుడివి నీవే సాయి 
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి 

వేదన నీవే వేడుకవి నీవే సాయి 
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి 

గమ్యం నీవే గమనం నీవే సాయి 
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి 

సర్వం నీవే సకలం నీవే సాయి 
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి!!
ఎవరికి వారు, ''#నేను ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది?  అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ, ఆదర్శప్రాయంగా #జీవించాలని షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు.
ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం #ఆలోచించడం  మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ #భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ #చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పాడు. 
#దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పాడు. తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే #దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని #స్పష్టం చేశాడు.
సర్వం నీవే సకలం నీవే సాయి
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి!!
ఎవరికి వారు, ''‪‎నేను‬ ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది? అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ, ఆదర్శప్రాయంగా ‪‎జీవించాలని‬ షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు.
ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం ‪‎ఆలోచించడం‬ మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ ‪‎భక్తులు‬ ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే‬ దేవుడని గుర్తించాలని చెప్పాడు. 
దేవునికోసం‬ అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పాడు. తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే ‪‎దేవునికి‬ దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం‬ చేశాడు.

సాయి‬ భక్తి విలాస మంజరి..

సాయి‬ భక్తి విలాస మంజరి
సాయి‬ భక్తి విలాస మంజరి..
ప్రవిమలాత్ముల మానసాబ్జము వాసమై యలరారు నిన్
సవినయమ్ముగ నేఁ దలంతును సాధుబృంద సుసేవితా!
శ్రవణపేయము నీ కథాసుధ సారసద్గుణ భూష! నీ
స్తవ మొనర్తు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి! నాన్
గేయమంజరి మంజులమ్ముగ కీర్తనమ్మొనరించుచో
శ్రేయమాదృతి కూర్చుచుందువు శిష్ట కోటికి నిత్యమున్
సాయమౌచు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
స్మరణ మాదృతి భవ్య నామ ప్రశస్త తత్త్వ విశిష్టతల్
నిరతమున్ బొనరింప చిత్తము నిర్మలత్వము నొందుచున్
దురితముల్ తొలగున్ భవార్తియు దూరమౌ నని చేయుదున్
స్మరణమేను సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
పాదసేవ నొనర్చు భాగ్యమె భాగ్యమెల్లర కబ్బునే?
ఆదిదేవు కృపావిశేష మహాఫలంబుగ కాక, నీ
పాదసేవనచే భయమ్ములు వాయు, చేకురు మోక్షమున్
సాదరాన సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ! .
ధ్యాన ముఖ్య సమర్చనా నియమాళితో షిరిడీశ్వరా!
మానసాబ్జము సాదరాన సమర్పిత మ్మొనరింపగా
దీనులయ్యును వేగ గాంతురు దివ్యతేజము సత్కృపన్
జ్ఞానసిద్ధి సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
పాదయుగ్మము బట్టి భక్తులు వందనమ్ము లొనర్చుచున్
ఆది శక్తివి, ఆది దేవుడ వచ్యుతుండ వటంచు నిన్
మోదమందుచు గొల్వ వారికి పూర్ణ యోగము కూర్పవే?
సాదరాన సమర్థ సద్గురు సాయినాథ మహప్రభూ!
ద్వారకామయి పాద దాస్యము, దాస దాస్య పరంపరన్
భూరి మోదమునొందు దాసుల భూతి వెల్గగ వారిపై
భారమంతయు నీవె గొందువు భక్త కోటి కొసంగి చిత్
సారమెల్ల సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
శిష్ట రక్షక! దుష్టశిక్షక! చేరి సఖ్యముతోడ నిన్
హృష్ట చిత్తముతో భజించిన నెల్ల సిద్ధులు చేకురున్
పుష్టి, తుష్టియు నీవె సమ్మతి భుక్తి ముక్తి ప్రదాతవున్
స్రష్ట వీవె సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
నాదు దేహము నాదు గేహము నాదు సంపదలంచు నే
వేదనల్ పడనేల ఆత్మ నివేద నంబొనరించుచో
ఆదిదేవుడ వీవె కూర్చెద వక్షయమ్ముగ యోగముల్
సాదరాన సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
ఫలశ్రుతి‬
సాయి భక్తి విలాస మంజరి సత్ఫలమ్ములొసంగుచున్
హాయిగొల్పును ఆలకించిన ఆలపించిన నెమ్మదిన్
జ్ఞేయమౌచును ధ్యేయమౌచును నేయమౌచును మోక్షమున్
సాయి కూర్చు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!

శ్రీసాయినాథ‬ చాలీసా

శ్రీసాయినాథ‬ చాలీసా
శ్రీసాయినాథ‬ చాలీసా..
జయ సాయినాథ పరాత్పర రూపా
జయ షిరిడీశ చిన్మయ రూపా
తల్లిదండ్రులు ఎవరో తెలియదు
కులమత వివరములసలే తెలియవు
దర్శనమిచ్చెను బాల ఫకీరుగా
భావనకందని భగవంతునిగా
మహాల్సాపతి మది పిలచిన దైవము
షిరిడీ పురమున వెలసిన దైవము
గుఱ్ఱము జాడ తెలిపినందుకు
నీరూ నిప్పు చూపిన తీరుకు
చాంద్ పాటి ల అచ్చెరువొందెను
భక్తునిగా శరణాగతి వేడెను
రవితేజస్సును కలిగిన యోగీ
రాగ ద్వేషములు లేని విరాగీ
చంద్రుని బోలిన చక్కని సాయి
చల్లని దీవెన ఇచ్చును హాయి
యోగిరూపధర హే మహిమాన్విత
పావన చరిత ఋషి జన సేవిత
భక్త జనావన హృదయ విహారీ
భవభయహారీ కఫ్నీ ధారీ
భగవద్గీతకు భాష్యము చప్పెను
ఖురాను పదముల అర్ధము చెప్పెను
నరనరాలను శుధ్ధి పరచెను
ఖండ యోగమున ఘనుడని చాటెను
గురు కటాక్షమును పొందిన ఘనుడు
సద్గురువై దయ చూపే ఘనుడు
అన్నదాతా హే అభయ ప్రదాతా
ఆశ్రితులకు ఆనంద ప్రదాతా
ఆశాపాశము లేని పవిత్రుడు
అగణిత గుణగణ దివ్య చరిత్రుడు
భక్త రక్షణ దీక్షావ్రతుడు
భుక్తి ముక్తి ఇచ్చే దేవుడు
మృతుడై మళ్ళీ జీవముపొందెను
మాధవ మహిమను మహిలొ చూపెను
నీళ్ళతోవెలిగె దీప కాంతులు
నివ్వెర పోయిరి షిర్డీ ప్రజలు
పంచభూతముల అధి దేవతవు
భూత భేతాళ నిరోధకుడవు
బిక్షమడిగెను తన భక్తులను
కర్మ ఫలితములను తనకిమ్మనెను
కుష్టు రోగమే కనుమరుగాయెను
భాగోజీ నీ దాసుడాయెను
బాయిజా మాతకు మోక్ష దాతవు
తాత్యా కేమో ప్రాణ దాతవు
శ్యామా నమ్మిన హితుడవు నీవే
రాధామాయికి స్వామివి నీవే
చందోర్కరుడే నీ దరి చేరెను
దాసగణుడు నీ ఘనతను చాటెను
గౌలిబువాకు విఠల దేవుడవు
ఖోజోకరునకు దత్త దేవుడవు
బాంద్రవనితకు నీవే గణపతి
నిమోన్కరునకు నీవే మారుతి
రాముడే నీవని డాక్టరు చెప్పెను
సత్య దేవుడని గణుడు పలికెను
మేఘా నమ్మిన శివుడవు నీవే
ఫాల్కే నమ్మిన అల్లా నీవే
సకల దేవతా రూపము నీవే
సకల చరా చర జగత్తు నీవే
యోగ శక్తితో వెలిగించిన ధుని
పాపాలను కాల్చేసే పావని
మైనాతాయిని రక్షించినది
ఇహపరాలకు ఔష ధమైనది
భక్తుల కిచ్చెను బాబా ఊది
ధుని అందించిన దివ్య విభూది
గోధుమ పిండితో కలరా ఆగెను
అన్నాసాహెబు అచ్చెరువొందెను
బాబా లీలలు కధగా వ్రాసెను
హేమాద్రిపంత్ అని బిరుదు పొందెను
మసీదు మారెను ద్వారకా మాయిగా
మహిలోవెలిగెను పుణ్య తీర్ధముగా
సమాధి కోవెల బూటీ కట్టెను
ఆశ్రితులకు అది అభయము నిచ్చును
అందమైన సమ్మోహన మూర్తీ
సచ్చిదానంద చిన్మయ మూర్తీ
జైజై జై అను దివ్య కీర్తనలు llజైll
భక్తులు పాడే నాల్గు హారతులు
ఈ చాలీసా సాయీశునిది
సుఖ సంపదలను అందిచేది
రాజేంద్రుని మదిలో పలికించెను
తన లీలగా భక్తులకు అందించెను llజయ ll
మానవ రూపము దాల్చిన ఈశా
మంగళ కరుడగు షిర్డీశా
సదా హృదయ మందిరమున నిలిచే
సామరూపధర సాయిశా!!

‎శ్రీసాయి‬ నక్షత్ర మాలిక..

‎శ్రీసాయి‬ నక్షత్ర మాలిక
శ్రీసాయి‬ నక్షత్ర మాలిక..
||శ్రీ సాయి రామ||రాగం-కానడ తాళం-ఆది
ప|శ్రీ సాయి నక్షత్రమాలికను సదా
చదివేడివారికి సకల శుభములు 
సందేహమేలేదు సందేహమేలేదు||శ్రీ||
చ|సాయేస్వయముగ ఆశిర్వదించిన
సచ్చరితము ఈ నక్షత్రమాలిక
కోరినవారి కోర్కెలు తిర్చేది
కల్పతరువు ఈ నక్షత్రమాలిక || శ్రీ ||
౨|దిర్ఘవ్యాధులను పారద్రోలేడి
దివ్యొషధమీ నక్షత్రమాలిక
పాపారణ్యమును, భస్మము చేసెడి
దావానల మీ నక్షత్రమాలిక||శ్రీ||
౩|సతతము దీనిని శ్రద్ధగ చదువండి
భావము గ్రహియించి భక్తితో పాడండి
చక్కని సాయికి హారతులివ్వండి
సకల సంపదలు సమకూరునండి||శ్రీ||
~~~~~~||శ్రీ సాయి ప్రణామా||~~~~~~~~~

సాయి‬ నామం

సద్గురువు‬ షిర్డీ సాయి బాబా
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు.
హృదయములో‬ దేవుడు..
సామాన్య దీపం బాహ్యాంధకారాన్ని పోగొడుతుంది. భగవంతుడు ఇచ్చే జ్ఞానము అనే దీపం అంతఃకరణ యందలి మోహరూప తమస్సును నశింపజేస్తుంది. దుఃఖ నివారణమునకు ప్రతి జీవియు నిర్మల హృదయముతో అచంచల భక్తితో భగవతారాధన చేయవలెను. ప్రతి మనిషి హృదయములో దేవుడు ఉన్నాడని తెలిసింది కాబట్టి, దైవకార్య ధర్మ కార్య నిరతుడై యుండవలెను.
సాయి‬ నామం
సాయి‬ నామం ఎక్కడ వినిపిస్తుందో అదే శాంతి ధామం..
శిరిడీ సాయి నామం'అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన‬ అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవదం ఒక్కటే చక్కని ‪‎మార్గం‬.
శ్రీసాయి‬ నామ స్మరణ ఓం సాయి రామ్
ఓం సాయి శ్రీ సాయి శ్రీ సద్గురు సాయినాథ్
శరణు శరణు శరణం - గురు సాయినాథ శరణం
సాయి కథా శ్రవణం - సకల పాప హరణం
సాయి దివ్య చరణం - భాగీరథి సమానం
సాయి దివ్య నామం - భవ తారక మంత్రం
సద్గురు సాయి నమో నమో నమః!!
ఓం శ్రీ సాయి నాథాయ నమః
హే సాయి రామ్ హే సాయి రామ్
హరే హరే కృష్ణ రాదే రాదే శ్యాం
ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః
జై జై సాయి నమో నమః శ్రీ సాయి రామ్
సద్గురు సాయి నమో నమో నమః!!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే సాయి హరే సాయి సాయి సాయి హరే హరే
హరే బాబా హరే బాబా బాబా బాబా హరే హరే
హరే దత్త హరే దత్త దత్త దత్త హరే హరే
సద్గురు సాయి నమో నమో నమః!!