సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, August 13, 2016

శ్రావణ మాసంలో సకల సౌభాగ్యాలనంధించే మంగళగౌరీ వ్రతం..నియమాలు!!

శ్రావణ మాసంలో సకల సౌభాగ్యాలనంధించే మంగళగౌరీ వ్రతం..నియమాలు!! 

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో 'శ్రావణ మాసం' అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన "ఐదవతనం" కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి "అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప" మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే "మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు - అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.మంగళ గౌరి వత్రం విశిష్టత మరియు వ్రతంలో పాటించాల్సిన నియమాలు.. శుభాలు కలిగే .. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు? శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు? శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మంగళగౌరీ వ్రత నియమాలు తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి. మంగళగౌరీ వ్రత నియమాలు వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. మంగళగౌరీ వ్రత నియమాలు వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. మంగళగౌరీ వ్రత నియమాలు వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును) మంగళగౌరీ వ్రత నియమాలు ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. మంగళగౌరీ వ్రత నియమాలు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. మంగళగౌరీ వ్రత నియమాలు పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి. మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు : పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : పైన చెప్పినటువంటివే ప్రస్తుతం 'మంగళగౌరీ' విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు.పూజా పీఠాన్న ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు.ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.

మృత్యువును జయించి, అతీత శక్తులు పొందడానికి మహా మృత్యుంజయ మంత్రం.!

మృత్యువును జయించి, అతీత శక్తులు పొందడానికి..
           మహా మృత్యుంజయ మంత్రం.!

 జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకువస్తుందో ఊహించలేం. అలాగే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు ఈ శరీరంపై దాడిచేస్తుందో తెలియదు. ఆ వ్యాధి జీవుడిని ఈ లోకం నుంచి వెంటనే తీసుకువెళుతుందో, లేదంటే జీవించినంత కాలం బాధపెడుతుందో కూడా తెలియదు. ఇలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోనవ్వడం జరుగుతూ వుంటుంది. అయితే ఎలాంటి దుర్ఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదిగా 'మహా మృత్యుంజయ మంత్రం' చెప్పబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం అసమానమైనది. ఈ మంత్ర ప్రభావం దుర్ఘటనలకు దూరంగా ఉండేలా చేస్తూ సదా రక్షిస్తూ వుంటుంది. మరి అంతట మహిమాన్నిత్వాలున్న మహా మృత్యుంజయ మంత్రం గురించి, పఠించడం వల్ల పొందే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం... అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి మహా #మృత్యుంజయ మంత్రంను మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రంను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహా మృత్యుంజయ మంత్రం లార్డ్ శివునికి అంకితం మహా మృత్యుంజయ మంత్రం లార్డ్ శివునికి అంకితం చేయబడింది. ఋషి మార్కండేయ ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడెను. మార్కండేయ మంత్రం అనే పేరు ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం ... "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"!! మంత్రం యొక్క అర్ధం అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంద భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా అని అర్ధం. మహా మృత్యుంజయ మంత్రం శివుని యొక్క రెండు అంశాలను వివరిస్తుంది. ఒక అంశం ఏమిటంటే మండే మూడు కనులతో ఉన్న దేవుడుని చూపిస్తుంది. రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని ఇంకా రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి, యముడు మానవుల మరణం తీసుకుని మరియు ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి భాద్యతను తీసుకొనెను. భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను. ఈ కారణంగా మానవులకు భూమి మీద మరణం గురించి బాధ ఎక్కువైనది. అన్ని రకాల భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను. ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది. మంత్ర జపం ఎలా చేయాలి? మంత్రం జపించటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని ఎప్పుడు పఠించాలి రెండవది,ఒక వ్యక్తి అసహజ మరణం లేదా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు పూజారి ఈశ్వరునికి పూజ ఏర్పాట్లు మరియు ఈ మంత్రాన్ని పఠించును. ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది. మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది మనస్సు మరియు శరీరంనకు ఒక స్వస్థత బలంగా పనిచేస్తుంది. మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు. ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రాఅణికమయిన మంత్రం. దీనిని త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది. మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత: మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. గాయత్రి మంత్రం వలె మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది. క్షీర సాగన మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఈ మంత్రం ఒక విధమైన మృత సంజీవని అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆపదలు కలిగినపుడు కూడా చదువుకోవచ్చు. సాధారణంగా మూడుసార్లు కానీ, తొమ్మిది సార్లు గానీ బేసి సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.

నవగ్రహ ప్రదక్షిణలో పాటించాల్సిన నియమాలు.. ప్రదక్షిణతో పొందే విశేషమైన ఫలితాలు!!

నవగ్రహ ప్రదక్షిణలో పాటించాల్సిన నియమాలు..
ప్రదక్షిణతో పొందే విశేషమైన ఫలితాలు!!

నవగ్రహాలు అంటే.. చాలా మందికి సందేహాలు ఎక్కువ. ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొంతమం దికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొందరు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు. అందుకే.. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని.. అక్కడ పూజ చేయడానికి కూడా సంకోచిస్తారు. శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..? అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహలస్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. వాటిని బట్టే మానసిక పరిస్థితి, ఆరోగ్యం ఆధారపడి వున్నాయి.నగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. చాలామందికి ఈ పద్దతులు గురించి అవగాహన వుండదు. అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? గ్రహస్థితుల నుంచి మనకు ఎదురయ్యే కష్టనష్టాల నుంచి బయటపడేందుకు తగిన మార్గం నవగ్రహ ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణను ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? కొంతమంది ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? 'ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:'‘ అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ప్రార్థనలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? మొదటి ప్రదక్షిణలో... జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యామిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభమృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.