సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

గౌరీశివ కల్యాణం

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం!!
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం!!
గౌరీశివ కల్యాణం

మేనక, హిమవంతులు పార్వతీదేవిని శివుడికిచ్చి వివాహం చేయాలని తలపెట్టారు. హిమవంతుడు గర్గమహామునిని సగౌరవంగా పిలిపించాడు. తారాబలాన్ని, చంద్రబలాన్ని చూసి శుభముహూర్తాన్ని నిర్ణయించి మాఘశుద్ధ ఏకాదశి తెల్లవారుజామునల శివపార్వతుల పెళ్ళి ముహూర్తం సప్త రుషులు నిర్ణయించారని హిమవంతుడికి గర్గమహాముని చెప్పాడు. పర్వతరాజు లగ్నపత్రికను రాయించి మునీంద్రుడికి ఇచ్చి మైనాకుడుని పిలిచి లగ్న పత్రికను శివుడికి ఇచ్చి రమ్మని చెప్పాడు. గర్గమైనాకులు వెంటనే శివుడి వద్దకు బయలు దేరారు. శివుడు ఆ ఇద్దరినీ ఘనంగా సత్కరించాడు. వెంటనే వాయుదేవుడిని పిలిపించి నారదుడిని తీసుకుని రమ్మని శివుడు ఆజ్ఞాపించాడు. నారదుడు శివుని ముందు రెక్కలు కట్టుకుని వాలాడు. శివగౌరీ కల్యాణం ఇంకా 14 రోజులే ఉందని అన్ని లోకాల వారిని వివాహానికి ఆహ్వానించమని శివుడు నారదుడికి చెప్పాడు. కల్యాణ వైభవ సూచికంగా బంగారు తోరణాలను, ధవళ కాంతులతో ప్రకాశించే మంచుకొండలకు అలంకరించారు. ముత్తయిదువులు పసుపు, జవ్వాది, కస్తూరి, పచ్చకర్పూరం తదితర పరిమళ ద్రవ్యాలను పన్నీటితో కలిపి కళాపి చల్లారు. కెంపులు, గరుడపచ్చలు, ఆణిముత్యాలను రంగురంగుల రంగవల్లులుగా తీర్చి దిద్దారు. హిమవంతుడు వివాహానికి కావాల్సిన సమస్త వస్తువులను పదార్థాలను సిద్ధం చేశాడు. యాజ్ఞికానికి కావాల్సిన ద్రవ్యాలన్నింటిని తెప్పించాడు. విశాలమైన పందిళ్ళు, వాటికి కళాత్మకంగా అరటిస్తంభాలు ఏర్పాటు చేసి మామిడి తోరణాలను ఘుమఘుమలాడే పూల దండలను పందిళ్ళకు అలంకరించారు. విడిది గృహాలు చక్కగా అలంకరించి బ్రహ్మ, విష్ణు తదితర దేవతలకు వసతి ఏర్పాటు చేశారు. పార్వతీ దేవిని సువాసినులు మంగళస్నానం చేయించి సాంబ్రాణి పొగతో తడి ఆర్పి తల దువ్వి జడ అల్లి తెల్లని పట్టు చీరను కట్టారు. సువాసనలను వెదచల్లే పూల మాలలను జడలో తురిమారు. తిలకాన్ని దిద్ది కలువరేకుల వంటి కన్నులకు కాటుక రేఖలను తీర్చారు. సప్త మాతృకలు, లక్ష్మి, సరస్వతులలు, శచీదేవి, అరుంధతి, మునికాంతలు, సప్త రుషులు, ముక్కోటి దేవతలు, నవ గ్రహాలు, గరుడ, గంధర్వలు, అప్సరసలు, కిన్నెరలు అంతా ఈశ్వరుడిని పెళ్లికొడుకుగా చూడటానికి తరలి వచ్చారు. పెళ్లి కొడుకు అలంకారంలో శివుడు పూర్తిగా మారిపోయి కనిపిస్తున్నాడు. ప్రమధ గణాలు కూడా గుర్తు పట్టలేని విధంగా శృంగార మూర్తిలాగా పరమశివుడు అలంకారం చేసుకుని కూర్చున్నాడు. నాగహారాలు, మణిహారాలు, విభూది రేఖలతో పరిమళ, హరిచందనమైన పూతలతో అలరారుతున్న శివుడిని చూడటానికి దేవతలెంతో ముచ్చటపడ్డారు. పులితోలుకు బదులుగా పట్టువస్త్రాలు ఉన్నాయి. జటాజూటం బంగారు, రత్నకిరీటాలతో అలరారుతోంది. సిగలో పువ్వులాగా ఉన్న చంద్రుడి కాంతులతో కిరీట రత్నకాంతులు చూసేవారి కన్నులకు పండుగను చేస్తున్నాయి. త్రిశూలం బంగారపు బెత్తంలాగా మారింది చేతిలో పుర్రెకు బదులుగా పారిజాత పుష్పం విరాజిల్లుతోంది. నుదుటన ఉన్న కన్ను వికృతంగా లేక అందంగా కనిపిస్తోంది. శివుడికి సూర్యుడు తెల్లని ముత్యాల గొడుగును పట్టాడు. చంద్రుడు వింజామర వీస్తున్నాడు. అష్ట సిద్ధులు నృత్యం చేస్తున్నాయి. గంగా యమునలు పన్నీటిని చిలకరిస్తూ బ్రహ్మ, విష్ణు, ఇంద్ర తదితర దేవాతా బృందాలకు జయమని పలుకుతున్నాయి. శివుడికి రెండు వైపులా హంస గరుడ ఉచ్ఛైశ్రవాలను ఎక్కి భార్య సమేతులై దేవతా గణాలు పయనించసాగాయి. మునులు యోగులు శివపంచాక్షరిని పఠిస్తూ అకాశమార్గంలో శివకల్యాణానికి బయలుదేరి వస్తున్నారు. విశ్వాసనుడు, హహా హుహూ మొదలైన గంధర్వులు శివభక్తి గీతాలాపనలను చేస్తున్నారు. రంభ తదితర దేవకాంతలు ఆనందంతో నృత్యం చేసుకుంటూ శివకల్యాణానికి బయలుదేరారు. ఈ విధంగా శివుడు వైభవోపేతంగా వివాహ వేదిక వద్దకు బయలుదేరి వస్తుండగా గమనించిన హిమవంతుడు వేదాచల, గరుడాచల, నారాయణాచల, భద్రాచల, వింధ్యాచల, సహ్యచలాలను వెంటపెట్టుకుని ఉత్సాహంతో శివుడికి ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు. హిమవంతుడు పార్వతీ కల్యాణానికి వచ్చిన వారికి స్వాగత సత్కారాలు చేశాడు. శివుడు కల్యాణ వేదిక వద్దకు రాగానే బ్రహ్మ శివుడి కల్యాణానికి పౌరోహిత్యం వహించాడు. గర్గముని వేద స్వస్తి చేశాడు. శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. పార్వతీదేవి పరమేశ్వరుని భార్య అయింది. లోకాలన్నీ ఎంతో సంతోషించాయి. తారకాసురుడి బాధకు విముక్తి కలిగేందుకు శివపార్వతుల కల్యాణం ప్రథమ సోపానమని అనుకొని దేవతలంతా ఎంతగానో ఆనందించారు.
పార్వతీ దేవి మహాగౌరి అవతారంలో అష్టమిరోజు విశేషంగా పూజలందుకుంటుంది. ఆది పరాశక్తి పార్వతీదేవి మహాకాళరాత్రిగా దుష్ట సంహారం చేసి, లోకంలోని అమంగళాలలను, అశుభాలను పారద్రోలి మంగళ గౌరియై సాక్షాత్కరిస్తుంది.

'శ్వేత వృషే సమారుఢా శ్వేతాంబర ధరాశుతిః
మహాగౌరీ శుభం దద్యాన్మహా దేవా ప్రమోదద'!!

ధవళకాంతితో మెరిసే వృషభాన్ని అధిరోహించి, శ్వేత వర్ణ శోభితయై, తెల్లని వస్త్రాలను ధరించి, త్రిశూలం చేబూని, శతకోటి దివ్యకాంతులను ప్రసరింపచేస్తూ భక్త జనకోటకి అభయప్రదానం చేస్తూ శోభిల్లుతుంది గౌరీదేవి. ధన వైభవ శక్తులకు ఈ తల్లి అధిష్ఠాత్రి. ఉన్నతమైన మనో భూమికల నుంచి, ఆనందమయమైన ఉన్నత లోకాల నుంచి మా బ్రతుకనే యజ్ఞ ఫలంగా సదా శుభాన్ని ప్రసాదించమని గౌరీదేవిని ప్రార్థిస్తే తన కరుణా కటాక్ష సంజనితమునందించి ఆశీర్వదిస్తుంది.
పార్వతీ దేవి మహాగౌరి అవతారంలో అష్టమిరోజు విశేషంగా పూజలందుకుంటుంది. ఆది పరాశక్తి పార్వతీదేవి మహాకాళరాత్రిగా దుష్ట సంహారం చేసి, లోకంలోని అమంగళాలలను, అశుభాలను పారద్రోలి మంగళ గౌరియై సాక్షాత్కరిస్తుంది.
'శ్వేత వృషే సమారుఢా శ్వేతాంబర ధరాశుతిః
మహాగౌరీ శుభం దద్యాన్మహా దేవా ప్రమోదద'!!
ధవళకాంతితో మెరిసే వృషభాన్ని అధిరోహించి, శ్వేత వర్ణ శోభితయై, తెల్లని వస్త్రాలను ధరించి, త్రిశూలం చేబూని, శతకోటి దివ్యకాంతులను ప్రసరింపచేస్తూ భక్త జనకోటకి అభయప్రదానం చేస్తూ శోభిల్లుతుంది గౌరీదేవి. ధన వైభవ శక్తులకు ఈ తల్లి అధిష్ఠాత్రి. ఉన్నతమైన మనో భూమికల నుంచి, ఆనందమయమైన ఉన్నత లోకాల నుంచి మా బ్రతుకనే యజ్ఞ ఫలంగా సదా శుభాన్ని ప్రసాదించమని గౌరీదేవిని ప్రార్థిస్తే తన కరుణా కటాక్ష సంజనితమునందించి ఆశీర్వదిస్తుంది.

No comments:

Post a Comment