సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

సూర్యభగవానుడు‬

సూర్యభగవానుడు‬

‪‎ఆదర్శ‬ ప్రత్యక్ష దైవం... ‪‎సూర్యభగవానుడు‬
ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందుతుంటారని తెలిపే కథాంశం మత్స్యపురాణంలో కనిపిస్తుంది. ఈ కథాంశంలో ‪#‎సూర్యుడు‬ తన శక్తినే చంద్రుడికిచ్చి అతని వల్ల లోకాలన్నింటికీ మేలు చేయిస్తుంటాడనే ఖగోళ సంబంధమైన శాస్త్ర విషయం ఇమిడి ఉంది. సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో‬ దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. ఆ అమృతమే చంద్రుడిలో కళాక్షయ రూపంలో కనిపిస్తుంటుంది.అమృతాన్ని‬ తాగటం వల్ల దేవతలకు కలిగే తృప్తి పదిహేను రోజులపాటు మాత్రమే ఉంటుంది. మనిషి మిగిలిన కాలంలో స్వాహాకారాలతో దేవతలను, స్వధాకారాలతో పితృదేవతలను‬ తృప్తి పరచాల్సి ఉంటుంది. దీనికోసం అన్నం అవసరం అవుతుంది. యజ్ఞం చేసేటప్పుడు స్వాహా అని మంత్రాలకు చివర పలకటం, పితృదేవతలకు సమర్పించేటప్పుడు స్వధా అని మంత్రాల చివర పలకటం వల్ల యజ్ఞ సమయంలో కుండంలో నుంచి హవ్యం దేవతలకు, కవ్యం పితృదేవతలకు చేరుతుంటుంది. సూర్యుడు భూమి మీద అన్నానికి సంబంధించిన పంటలు పండించటానికి తన కిరణాలను ప్రసరింపచేసి ధాన్యం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంటాడు. ఈ కారణం వల్లే సూర్యుడు దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు ఆరాధ్యుడవుతున్నాడు. సూర్యుడు తన కిరణాల్లో నిలుపుకొన్న దేవ, పితృ, మనుష ఆహార జన్యతృప్తే సూర్య రథానికి ఉన్న చక్రం అని చెబుతారు. ఆ చక్ర శక్తి వల్లే సకల సృష్టి‬ చైతన్యం ప్రాప్తిస్తోంది. సూర్యుడు పచ్చని ‪‎గుర్రాలను‬పూన్చిన రథంలో ప్రయాణిస్తుంటాడు. ఈ పచ్చదనం లోకకల్యాణ సూచకం. దినస్పతి అని కీర్తిని అందుకుంటున్న సూర్యుడు అహోరాత్రులు‬ తన ఏక చక్ర రథంపై సప్త ద్వీప సమస్త సముద్ర ఘటికమైన ఈ పృథ్వీ చక్రాన్ని అంతటిని చుట్టి వస్తుంటాడు. ఆయన అధిరోహించిన రథానికున్న గుర్రాలు సప్త ఛందోరూపాలుగా ఉంటాయి. సూర్యుడి సంకల్పాన్ని‬ అనుసరించి కామరూపంతో, కామగమనంతో ఆ గుర్రాలు మనోవేగంతో ప్రయాణిస్తాయి. ఒకసారి రథానికి పూన్చితే మళ్లీ మళ్లీ ఆ గుర్రాలను విప్పటం, పూన్చటం చేయాల్సిన పని ఉండదు. నిరంతరం అవి అవిశ్రాంతంగా లోకకల్యాణం కోసం సూర్యభగవానుడితో పాటు సంచరిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ గుర్రాలు కొద్దిగా ఎర్రడాలు‬ రంగుతో కనిపిస్తాయి. ఎన్ని యుగాలు గడిచినా ఈ గుర్రాల్లో మాత్రం మార్పు ఉండదు. వాటికి వేద విజ్ఞానం అంతా అవగతమై ఉంటుంది. సృష్టిలో కర్మఫలాలను అనుసరించి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వారికి ఎలాంటి మేలు చేసిపెట్టాలో వాటికి తెలిసి ఉంటుంది. ఈ గుర్రాల్ని కల్పం ప్రారంభంలో ఒకసారి పూన్చితే మళ్ళీ ‪‎కల్పాంతంలో‬మహాప్రళయం సంభవించే వరకూ అవి అలా సూర్యరథాన్ని మోసుకుని పోతూనే ఉంటాయి. సూర్యుడు తన కిరణాల శక్తికి మారు రూపాలైన వాలఖిల్యులు అనే చేతి బొటనవేలు అంత పరిమాణంలో ఉండే రుషులు తన వెంట నడుస్తుండగా ఆ వెనుక మిగిలిన మహర్షులంతా వేద మంత్రాలను స్తుతిస్తుండగా గంధర్వ, ‪#‎అప్సరస‬ గణాలు గీత, నృత్యాలతో సేవిస్తుండగా తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు. ఆ ప్రయాణమంతా ఓ అద్భుత సుందర దృశ్యంగా ఉంటుంది. ఈ సూర్యుడి ప్రయాణ క్రమాన్ని వివరించి చెప్పటంలో ఒక అవిశ్రాంత సేవాతత్వం భగవానుడిలో ఇమిడి ఉందని తెలిపే ఈ కథాంశం ఆవిర్భావ లక్ష్యం.
భగవంతుడు‬ లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి‬, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసా నికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.
ప్రత్యక్ష నారాయణుడైన‬ సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. #సూర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు‬ తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన.
పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా ‪‎సూర్యుడే‬ అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, ‪‎విద్యావిజ్ఞానాలకు‬ ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందన డానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ‪‎ధర్మ‬ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు‬అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.
వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. ‪‎బుద్ధిని‬ ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది‪ గాయత్రీమంత్రం‬. ఇహా నికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే లభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు #సూర్యుడు. ఆధ్యా త్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు.
సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే ‪ ‎జ్ఞానం‬ సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు ‪‎చక్రాలను‬ వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి‬ ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.
ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమ స్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకో వడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, #సమస్థితి కలుగుతాయి.
సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు.సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి . సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని #మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది.
మన #ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు #సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే #జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.

ఓ౦ శ్రీ సూర్య నారాయణాయ నమో నమ:

"ఆదిదేవ నమస్తుభ్య౦ ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్య౦ ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధమారూఢమ్ ప్రచ౦డ౦ కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధర౦ దేవ౦ త౦ సూర్య౦ ప్రణమామ్యహమ్"

భా:- ఆది దేవుడైన శ్రీ సూర్య నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. ఏడు గుర్రాలు గల రధాన్ని ఎక్కినట్టివాడు, ప్రచ౦డుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరి౦చినట్టివాడు అయిన ఆ సూర్యభగవానుడికి ప్రణామములు అర్పిస్తున్నాను.

శ్లో" రశ్మిమ౦త౦ సముద్యన్త౦ దేవాసుర నమస్కృతమ్!
పూజయస్వ వివస్వన్త౦ భాస్కర౦ భువనేస్వరమ్ !!

భా:- ప్రశస్తములైన కిరణములు కలవాడు, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయి౦చువాడు,సురాసురలులచే నమస్కరి౦పబడువాడు, తేజముచే ఇతరములగు తేజస్సును కప్పివేయువాడు, కా౦తులను కలిగి౦చువాడు, భువనేశ్వరుడు అయిన ఆదిత్యుణ్ణి పూజి౦పుము.


Ramudu Thota Venkataramana's photo.
‪‎సూర్యభగవానుడి‬ సర్వరోగ నివారణకు స్తోత్రం
శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు |1|
ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !
నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ |2|
అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !
కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ|3|
కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !
త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ |4|
సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస - నీవే
శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి |5|
శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!
త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు |6|
చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ |7|
చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !
యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః |8|
వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !
యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే |9|
ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.
వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి |10|
వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.
ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః |11|
ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !
త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ |12|
సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

‪‎ఫలశ్రుతి‬............
ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||
ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

No comments:

Post a Comment