శివానందలహరి1..
శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు.
#ఓం నమఃశివాయ
శివశక్తే నమస్తుభ్యం
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే।
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥
శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని కళలు శిరసులపై అలంకరించుకున్నారు. ఒకరి తపఃఫలాలను మరొకరు అందుకొనుచున్నారు. శబ్ధార్ధములవలె కలిసియున్నారు. భక్తుల భక్తికి తగినఫలాలు అనుగ్రహిస్తున్నారు. సర్వప్రాణికోటి ఆత్మపీఠాలపై శివశంకరులై ప్రకాశిస్తున్నారు. వారుసర్వసృష్టికి మంగళస్వరూపులు. ఆత్మవిద్యకు జ్యోతులు. అద్యాత్మభక్తులకు అనుభవానందము ప్రసాదించేవారు. అఖిలజగతికి జననీజనకులైన ఉమామహేశ్వరులకు నమస్సులు.
గాధాప్రవాహం
గళంతీశంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్।
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ॥
శంభో! మహాదేవా! జగత్పతీ! మేఘాలు జడలుగాగల శివా! భక్తుల ఆర్తి హరించేవాడా! పాపహరా! మహైశ్వర్యధుర్యా! విశ్వాత్మా సౌందర్యమూర్తీ! దేవప్రియా! భక్తజన కల్పకమా! నీచరితం అమృతప్రవాహం.పరమపావనం. శివానందలహరీ! ఇది నీహృదయక్షేత్రాన్ని పండించుకాక!
మహదేవుడు
త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్।
మహాదేవం దేవం మయి సదనభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే॥
చిదాలంబా! సాంబా! నీఘనత వేదాలవల్లనే తెలుస్తుంది. నీరూపం మనోహరం. రాక్షసమాయాశక్తులకు నిలయాలైన త్రిపురాలను జయించావు. దానితో దేహభ్రాంతిని దూరంచేసిన వాడవైనావు. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్యచంద్రాగ్నులు అనే మూడుమూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకుజడలు. ఆజడలే నీకు కిరీటాలు. ఔదార్యమునకు నీది ఆచార్యపీఠం. ఫణిరాజులు మణిహారాలై నిన్నుసేవిస్తుంటాయి. అందమైన హరిణబాల చెలువం చిందిస్తుంటుంది. నీవు మహదేవుడవు. అమరులందరికీ అధిపతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచే దయామయుడవు. అనవరతం ఆనందం ప్రసాదించేవాడవు. పార్వతీపతివి. పశుపతివి. పరమపతివి. జ్ఞానమూర్తివి.శివుడవు. కళ్యాణమూర్తివి. నిన్ను సదా నాహృదయచంక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానందలహరిలో ఓలలాడుతుంటాను.
"వేదశ్శివః శివో వేదేః" సర్వవిద్యలకు శివుడే అధిపతి.
విద్యాయోగం కలగాలి అంటే శివారాధన చేయాలి...
''మకార మననం ప్రాహుస్త్ర కారస్త్రాణ ఉచ్యతే
మనన త్రాణ సమ్యుక్తో మంత్ర ఇత్యభిధీయతీ!!
దైవాధీనం జగత్సర్వం
మంత్రాధీనంతు దైవతం!!
కితస్య బహుభిర్మం త్రై:
కింతిర్థై: కిం తపోధ్వరై:
యస్య నమశ్శివాయేతి!!
‘మా కారం అంటే మననం చేయడం. అంటే పదేపదే ఉచ్ఛరించడం. ‘ త్ర ‘ కరం అంటే త్రాణము. అంటే రక్షించేది. కాబటి మంత్రమంటే పదే పదే ఏకాగ్రతతో ఉచ్ఛరించేవారిని రక్షించేదని అర్థం. సాధనకు, కార్యసిద్ధికి ప్రత్యేకమైన ఫలితాలకు సిద్ధిత్వాని కలిగించేదే మంత్రం.
జగత్తంతా దైవానికి ఆధీనమై ఉంటుంది. అట్టి దైవం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. ఈ సూక్తిననుసరించి మంత్రోపాసనకు దైవం వశమవుతోందని తెలుస్తోంది. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రాల లోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. అది మన ఊహకందనిది.
ఉదాహరణకు, ‘ఓం నమ: శివాయ ‘ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని పెద్దల వాక్కు.
ప్రమాదల నుంచి రక్షించే #మహా మృత్యుంజయ మంత్రం
''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మ్రిత్యోర్ముక్షియ మమ్రితాత్ ఓం!!
మంత్రో హృదయ గోచర: అని అన్నారు. అంటే, ఎవరి హృదయంలో నిరతరం “ఓం నమ: శివాయ” అనే మంత్రం జపించబడుతుంటుంతో, వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో, యజ్ఞయాగాదులతో పని లేదని భావం. ఓం నమశ్శివయ (షడక్షరీ) నమశ్శివాయ
ఓమ్ నమశివహోః
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః
శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5
ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే) సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు.
శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు.