సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, October 21, 2014

శ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామావళిః

ఓం‬ లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమః 
Ramudu Thota Venkataramana's photo.
శ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామావళిః
001 ఓం హయగ్రీవాయ నమః
002 ఓం మహావిష్ణవే నమః
003 ఓం కేశవాయ నమః
004 ఓం మధుసూదనాయ నమః
005 ఓం గోవిందాయ నమః
006 ఓం పుండరీకాక్షాయ నమః
007 ఓం విష్ణవే నమః
008 ఓం విశ్వంభరాయ నమః
009 ఓం హరయే నమః
010 ఓం ఆదిత్యాయ నమః
011 ఓం సర్వవాగీశాయ నమః
012 ఓం సర్వాధారాయ నమః
013 ఓం సనాతనాయ నమః
014 ఓం నిరాధారాయ నమః
015 ఓం నిరాకారాయ నమః
016 ఓం నిరీశాయ నమః
017 ఓం నిరుపద్రవాయ నమః
018 ఓం నిరంజనాయ నమః
019 ఓం నిష్కలంకాయ నమః
020 ఓం నిత్యతృప్తాయ నమః
021 ఓం నిరామయాయ నమః
022 ఓం చిదానందమయాయ నమః
023 ఓం సాక్షిణే నమః
024 ఓం శరణ్యాయ నమః
025 ఓం సర్వదాయకాయ నమః
026 ఓం శ్రీమతే నమః
027 ఓం లోకత్రయాధీశాయ నమః
028 ఓం శివాయ నమః
029 ఓం సారస్వతప్రదాయ నమః
030 ఓం వేదోద్ధర్త్రే నమః
031 ఓం వేదనిధయే నమః
032 ఓం వేదవేద్యాయ నమః
033 ఓం ప్రభూత్తమాయ నమః
034 ఓం పూర్ణాయ నమః
035 ఓం పూరయిత్రే నమః
036 ఓం పుణ్యాయ నమః
037 ఓం పుణ్యకీర్తయే నమః
038 ఓం పరాత్పరాయ నమః
039 ఓం పరమాత్మనే నమః
040 ఓం పరంజ్యోతిషే నమః
041 ఓం పరేశాయ నమః
042 ఓం పరగాయ నమః
043 ఓం పరాయ నమః
044 ఓం సర్వవేదాత్మకాయ నమః
045 ఓం విదుషే నమః
046 ఓం వేదవేదాంతపరగాయ నమః
047 ఓం సకలోపనిష్ద్వేద్యాయ నమః
048 ఓం నిష్కలాయ నమః
049 ఓం సర్వశాస్త్రకృతే నమః
050 ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః
051 ఓం వరప్రదాయ నమః
052 ఓం పురాణాయ నమః
053 ఓం పురుషశ్రేష్ఠాయ నమః
054 ఓం శరణ్యాయ నమః
055 ఓం పరమేద్వరాయ నమః
056 ఓం శాంతాయ నమః
057 ఓం దాంతాయ నమః
058 ఓం జితక్రోధాయ నమః
059 ఓం జితామిత్రాయ నమః
060 ఓం జగన్మయాయ నమః
061 ఓం జన్మమృత్యుహరాయ నమః
062 ఓం జీవాయ నమః
063 ఓం జయదాయ నమః
064 ఓం జాడ్యనాశనాయ నమః
065 ఓం జనప్రియాయ నమః
066 ఓం జపస్తుత్యాయ నమః
067 ఓం జాపకప్రియకృతే నమః
068 ఓం ప్రభవే నమః
069 ఓం విమలాయ నమః
070 ఓం విశ్వరూపాయ నమః
071 ఓం విశ్వగోప్త్రే నమః
072 ఓం విధిస్తుతాయ నమః
073 ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః
074 ఓం శాంతిదాయ నమః
075 ఓం క్షాంతిపారగాయ నమః
076 ఓం శేయఃప్రదాయ నమః
077 ఓం శ్రుతిమయాయ నమః
078 ఓం శ్రేయసాంపతయే నమః
079 ఓం ఈశ్వరాయ నమః
080 ఓం అచ్యుతాయ నమః
081 ఓం అనంతరూపాయ నమః
082 ఓం ప్రాణదాయ నమః
083 ఓం పృథివీపతయే నమః
084 ఓం అవ్యక్తాయ నమః
085 ఓం వ్యక్తరూపాయ నమః
086 ఓం సర్వసాక్షిణే నమః
087 ఓం తమోహరాయ నమః
088 ఓం అజ్ఞాననాశకాయ నమః
089 ఓం జ్ఞానినే నమః
090 ఓం పూర్ణచంద్రసమప్రభాయ నమః
091 ఓం జ్ఞానదాయ నమః
092 ఓం వాక్పతయే నమః
093 ఓం యోగినే నమః
094 ఓం యోగీశాయ నమః
095 ఓం సర్వకామదాయ నమః
096 ఓం మహాయోగినే నమః
097 ఓం మహామౌనినే నమః
098 ఓం మౌనీశాయ నమః
099 ఓం శ్రేయసాంపతయే నమః
100 ఓం హంసాయ నమః
101 ఓం పరమహంసాయ నమః
102 ఓం విశ్వగోప్త్రే నమః
103 ఓం విరాజే నమః
104 ఓం స్వరాజే నమః
105 ఓం శుద్ధస్ఫటికసంకాశాయ నమః
106 ఓం జటామండలసంయుతాయ నమః
107 ఓం ఆదిమధ్యాంతయహితాయ నమః
108 ఓం సర్వవాగీశవరేశ్వరాయ నమః
||ఇతి శ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణ||

‪‎ఉపనిషత్తులు‬

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
1.సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
2.బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
3.అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
4.ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.
"దైవాధీనం‬ జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం" ఈ జగత్తుకి కారణమైన పరమాత్మని వంచేది ఆయన నామం. నామాన్ని కలిగినవి మంత్రాలు. మననం చేయగా మనల్ని రక్షిస్తాయి. ఇట్లా భగవంతుని మంత్రాలను అందించిన మహానుభావులు మన ఋషులు. భగవంతుణ్ణి చూడాలి అనే ఆరాటంలో అడవులని చేరి కోరికతో తిండి, నిద్రలు మాని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సుని చేస్తే ఏదో ఒక దివ్య అనుభూతిని వారు పొందారు. దాన్ని లోపల ఇమడ్చుకోలేక మనందరితో అభివ్యక్తం చేస్తారు. పరతత్వాన్ని దర్శించిన ఋషులు ప్రేమతో అప్రయత్నంగా, అసంకల్పితంగా దివ్య వాక్కు ఏర్పడింది. ఇలా ఒకరి నుండి మరొకరు ఆ దివ్య తత్వాన్ని దర్శించగలిగారు దానికి ఉప-నిషద్ అని పేరు పెట్టారు. ఉప- దగ్గరగా, నిషణ్ణా అంటే చూపునది. అట్లా ఉపనిషత్తు అని పేరు ఏర్పడింది. దేన్ని చూపుతుంది ? కావల్సిన పరం బ్రహ్మ తత్వాన్ని. ఇతరత్ర లభించే చోటికంటే దగ్గరగా తెచ్చి చూపగలవు.
ఉపనిషత్తులు వేదాలలోంచి వచ్చాయి. వేదాలు అపౌరుషేయాలు. ఎవరో కూర్చోని రచించినది కాదు. వేదాన్ని ఎవ్వరూ వ్రాయలేదు. ఆది అనేది తెలియకుండా లోకంలో ప్రవర్తిస్తూ వచ్చిన అఖండమైన అనంతమైన విజ్ఞాన రాశి, అలౌఖికమైన వాంగ్మయం వేదం. దోశాలు లేనివి. మనిషి చేసే వాటికి లోపాలు ఉండవచ్చు. నాలుగు రకాల లోపాలు ఉంటాయి. ఒకటి బ్రమ. ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవచ్చు. బొమ్మను చూసి మనిషి అనుకోవచ్చు. తాడును చూసి పాము అనుకోవచ్చు. ఒకదాన్ని మరొకటిగా గుర్తించడమే బ్రమ. రెండోది ప్రమాద. ప్రమాద అంటే తెలుగులో ప్రమాదం వేరు. సంస్కృతంలో ప్రమాదం అంటే పరాక్కు. పరాక్కు వల్ల కొన్ని విషయాలని పట్టించుకోలేక పోవచ్చు. మూడవది విప్రలంబ. అంటే ఏదో మెప్పు కోసం చేసేవి. లేనివి ఆరోపించి చెప్పడం. పొగడ్తల కోసం విషయాలు మార్చి వ్రాయడాన్ని విప్రలంబం. నాలుగవది అశక్తి. ఉంటుంది ఒకటి కానీ చెప్ప చేతకాదు. తెలిస్తే చెప్పకుండా ఎలా ఉండగలం ? కొన్ని చెప్ప చేత కాదు. తీపిగా అంటే ఏమి అంటే చెప్పడం చేతకాదు. అనుభవించగలం కానీ చెప్పే యోగ్యత లేదు. మానవ నిర్మిత గ్రంథాలు ఈ నాలుగు రకాల దోశాలతో నిండి ఉంటాయి. కనుక పౌరుషేయ గ్రంథాల్లో వలె దోషం లేని దాన్ని వేదం అని అంటారు. ఏది చెబితే అది దోషరహితం. అది ఎప్పుడో వ్రాసినది కాదు కనుక ఎప్పటికీ ఉంటుంది అందుకే నిత్యం అంటారు.
వేదాలు మన తత్త్వాన్ని గురించి, పరమాత్మ తత్త్వాన్ని గురించి, ప్రకృతి తత్త్వాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు చెబుతాయి. ఇక్కడ ఉన్నాం, ఇక్కడి తత్త్వం ఏమిటో తెలియకుంటే సుఖంగా ఏట్లా ఉండగలం. ఈ శరీరం వచ్చింది, శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి, జ్ఞానాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఆ విషయాలనన్నింటిని వేదరాశి వెలువరించింది. వేదంలో మన శరీరానికి కావల్సిన సాధనాలను చెప్పే భాగం పూర్వ భాగం అంటారు. చేయాల్సిన పనులు, ఫలితాలు చెబుతుంది. అయితే పనిచేస్తే ఫలితం ఎట్లా వస్తుంది ? మనం చేసే పని మనకు జీతం ఇస్తుందా కాదు ఆ పనిని చూసే వాడు జీతాన్ని ఇస్తాడు. అట్లానే మనకి శరీరాన్ని ఇచ్చి మనం దానితో సక్రమంగా నడుతుంటే చూసి సంతోషించి ఫలితం ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడు ఫలితాన్ని ఇచ్చేవాడు. వేదం మొత్తం పరమాత్మ తత్త్వాన్ని చెప్పేదే కానీ ఉత్తర భాగం అంతా పరమాత్మ తత్త్వాన్ని స్పష్టంగా చెబుతుంది. ఉత్తర భాగం పరమాత్మని చూపునది కనుక "ఉప", ఎలా దగ్గరిగా "నిషణ్ణ", అది అట్లా తనలో నింపుకొని ఇచ్చునది కనుక ఉపనిషద్ అని పేరు పెట్టారు.

ధక్షిణాకాశి‬ ధర్మపురి క్షేత్రం

ధక్షిణాకాశి‬ ధర్మపురి క్షేత్రం 
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి క్షేత్రాన్ని దర్శించిన వారికి యమపురి ఉండదు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రాచీన ‪‎శ్రీ‬ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాంగ ణంలో ప్రధాన దేవాలయంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేణుగో పాల స్వామి, యమధర్మరాజు‬, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామిల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన బ్రహ్మ పుష్కరిణితో పాటు సత్యవతి ఆలయానికి ఇసుక స్తంభం ప్రాశ స్త్యము. క్షేత్రం గుండా ప్రవహిస్తున్న గోదావరి నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, యమ గుండం, పాల గుండం, చక్ర గుండములు కలవు.
క్షేత్ర మహాత్యం : రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లోని నవనారసింహా క్షేత్రాల్లో ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీనృసిం హాస్వామి వారి క్షేత్రం ఒకటిగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రమును పూర్వం ‪‎ధర్మవర్మ‬’ అనే మహారాజు పరిపాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రం క్రీ.శ 850- 928 సంవత్సరం కంటే పూర్వం అయినప్పటికీ క్రీ.శ 1422-1436 కాలంలో బహుమనీ సుల్తానుల దండ యాత్రలో ధ్వంసమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయం పునరుద్ధరింప బడినట్లు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. ఈ క్షేత్రంలో ప్రధాన మూర్తి అయిన #శ్రీ యోగా నంద లక్ష్మీనర సింహాస్వామి సాలగ్రామ శిలగా వెలసియున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవిహస్తోంది. అందుకే ఈ క్షేత్రం దక్షిణకాశీగా, తీర్థరాజముగా, హరిహర క్షేత్రముగా పిలువబడుతోంది. స్వామివారి ఆలయ ప్రాంగ ణంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మ రాజు ఆలయం ఉంది.
స్వామి వారిని దర్శించుకునే భక్తులు అనంతరం యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ఉంది. ధర్మపురి క్షేత్రం ఆలయాలతో పాటు వేదాలకు ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యానికి, కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచింది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. ఈ బ్రహ్మోత్స వాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి వారికి నిత్య కళ్యాణంతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకో సారి వచ్చే గోదావ రి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.
‪‎క్షేత్రంలో‬ ఏడాది పొడుగునా ఉత్సవాలు:
చైత్ర మాసం ః- ఉగాది, శ్రీరామనవమి, చిన్న హన్మాన్‌ జయంతి.
వైశాఖ మాసంః- నరసింహ నవరాత్రోత్సవాలు, పెద్ద హన్మాన్‌ జయంతి ఉత్సవం
జ్యేష్ట మాసంః- పౌర్ణమి – వటసావిత్రి పౌర్ణమి.
ఆషాఢ మాసంః- శుద్ధ ఏకాదశి, గురు పౌర్ణమి ఉత్సవాలు,
శ్రావణమాసంః- శ్రీ కృష్ణాష్ఠమి, మరుసటి రోజున ఉట్ల పండుగ, శుద్ద పౌర్ణమిన శ్రావణ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి, శుద్ధ పంచమిన నాగుల చవితి, రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, పొలాల అమావాస్య ఉత్సవాలు,
భాద్రపదం మాసం ః- శుద్ధ చవితిన వినాయకచవితి, శుద్ధ పంచమిన ఋషి పంచమి ఉత్సవాలు.
‪‎ఆశ్వీయుజం‬ మాసం ః- దసరా నవ రాత్రోత్సవాలు, దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశిమి, కోజగిరి పౌర్ణమి, పాలలో చంద్ర వీక్షణ, బహుళ త్రయోదశిన ధన త్రయోదశి, చతుర్దశిన నరక చతుర్దశి, అమవాస్య రోజున దీపావళి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిన పంచసహస్ర దీపాలంకరణ.
మార్గశిర మాసంః- మార్గశిర శుద్ధ పౌర్ణమిన దత్తాత్రేయ జయంతి, పుష్యమాసంః- ఆదివారాలు- పర్వదినాలు.
‪‎మాఘమాసంః‬- శుద్ధపంచమిన వసంత పంచమి, శుద్ధ సప్తమిన రథసప్తమి.
ఫాల్గుణ మాసంః- శుద్ధ ఏకాదశి నుండి 13 రోజుల పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఏకాదశిన అంకురార్పణ, ద్వాదశిన కల్యాణం, పౌర్ణమిన తెప్పోత్సవము, డోలోత్సవము, బహుళ పంచమిన రథోత్సవము కార్యక్రమా లు నిర్వహిస్తారు.
‪‎రవాణా‬ సౌకర్యాలు : ధర్మపురి క్షేత్రం హైదరాబాద్‌ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన కరీంనగ ర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఈ క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల రైల్వే స్టేషన్‌, 130 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఉంది. ఆయా స్టేషన్‌లకు రైళ్ల ద్వారా చేరుకుని అక్కడి నుంచి బస్సు సౌకర్యం ద్వారా ధర్మపురికి చేరుకోవచ్చు.

ఉపనిషత్తులు వేదాంతము‬

ఉపనిషత్తులు వేదాంతము‬..
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo. 
అని మనము పిలుచుకొనేదే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరిగా ఉండడంవలన వీటిని వేదాంతముఅంటారు.శ్రీ భగవద్గీత కు మూలాలు ఉపనిషత్తులే. వేదాలలో ఎక్కువ భాగం కర్మకాండకు (అనగాయజ్ఞయాగాలు,పూజలు మొదలగునవి) ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వగా ఉపనిషత్తులలో జ్ఞానమునకే ప్రాముఖ్యతనుఇచ్చి కర్మకాండను పట్టించుకొనలేదు. "ఉపనిషత్" అను పదానికి అర్థం సమీపములో ఉండడం. సత్యాలను గురువుదగ్గర తెలుసుకోవడం లేక ఆత్మ(పరమాత్మ) కు సమీపములో ఉండడం అని అర్థం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు మనకు తెలుసు. ఈ 108 లో 10 ఉపనిషత్తులకు ఆదిశంకరాచార్యులు భాష్యం వ్రాసారు. వీటినే దశోపనిషత్తులు అంటారు.
దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి.వేదములవలె‬ ఉపనిషత్తులు కూడా శ్రుతులుగా అందించబడినవి. అనగా గురు ముఖతః శిష్యుడు విని నేర్చుకున్నవి.ఆనాడు వేదాంతమును ఉపదేశించే అశ్రమాలకు (పాఠశాలలకు) ప్రధానమైన అంశాలు 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మ సూత్రములు.‪‎ఉపనిషత్తులలో‬ జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా రెండు రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ మరియు పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం. అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వ స్వతంత్రుడు, కర్త. జీవాత్మ నిమిత్త మాతృడు.భారతదేశంలోని వివిధ వేదాంత పాఠశాలలు ఈ సిద్ధాంతాలనే బోధించాయి. అందు ప్రముఖంగా అద్వైతమును ‪‎శంకరాచార్యుడు‬, ద్వైతమును మధ్వాచార్యుడు‬ తమ తమ వేదాంత పాఠశాలలో బోధించి ఆయా సిద్ధాంతాంలను ప్రచారం చేశారు.అలాగే మరికొన్ని సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమును రామానుజుడు, ద్వైతాద్వైతమును నింబార్కుడు, శుద్ధాద్వైతమును వల్లభుడు‬ తమ వేదాంత పాఠశాలలో బోధించి ప్రచారం చేసారు.
ముఖ్య ఉపనిషత్తులు
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ‪‎ఉపనిషత్తులను‬ దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)
2. కేనోపనిషత్తు
3. కఠోపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరేయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
11. శ్వేతాశ్వతరోపనిషత్తు
12. కౌశీతకి ఉపనిషత్తు
13. మైత్రాయణి ఉపనిషత్తు
14. బ్రహ్మోపనిషత్తు
15. కైవల్యోపనిషత్తు
16. జాబలోపనిషత్తు
17. హంసోపనిషత్తు
18. ఆరుణికోపనిషత్తు
19. గర్భోపనిషత్తు
20. నారాయణోపనిషత్తు
21. పరమహంసోపనిషత్తు
22. అమృతబిందూపనిషత్తు
23. అమృతనాదోపనిషత్తు
24. అథర్వశిరోపనిషత్తు
25. అథర్వాశిఖోపనిషత్తు
26. బృహజ్జాబాలోపనిషత్తు
27. నృసింహతాపిన్యుపనిషత్తు
28. కళాగ్నిరుద్రోపనిషత్తు
29. మైత్రేయోపనిషత్తు
30. సుబాలోపనిషత్తు
31. క్షురికోపనిషత్తు
32. మంత్రికోపనిషత్తు
33. సర్వసారోపనిషత్తు
34. నిరలాంబోపనిషత్తు
35. శుకరహాస్యోపనిషత్తు
36. వజ్రసూచ్యుపనిషత్తు
37. తేజోబిందూపనిషత్తు
38. నృసిందబిందూపనిషత్తు
39. ధ్యానబిందూపనిషత్తు
40. బ్రహ్మవిద్యోపనిషత్తు
41. యోగతత్వోపనిషత్తు
42. ఆత్మబోధోపనిషత్తు
43. నారదపరివ్రాజకోపనిషత్తు
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు
45. సీతోపనిషత్తు
46. యోగచూడామణ్యుపనిషత్తు
47. నిర్వాణోపనిషత్తు
48. మండల బ్రాహ్మణోపనిషత్తు
49. దక్షిణామూర్త్యుపనిషత్తు
50. శరభోపనిషత్తు
51. స్కందోపనిషత్తు
52 మహానారాయణోపనిషత్తు
53. అద్వయతారకోపనిషత్తు
54. రామరహస్యోపనిషత్తు
55. రామతాపిన్యుపనిషత్తు
56. వాసుదేవోపనిషత్తు
57. ముద్గలోపనిషత్తు
58. శాండిల్యోపనిషత్తు
59. పైంగలోపనిషత్తు
60. భిక్షుకోపనిషత్తు
61. మహోపనిషత్తు
62. శారీరకోపనిషత్తు
63. యోగశిఖోపనిషత్తు
64. తురియాతీతోపనిషత్తు
65. సన్యాసోపనిషత్తు
66. పరమహంస పరివ్రాజకోపనిషత్తు
67. అక్షమాలికోపనిషత్తు
68. అవ్యక్తోపనిషత్తు
69. ఏకాక్షరోపనిషత్తు
70. అన్నపూర్ణోపనిషత్తు
71. సూర్యోపనిషత్తు
72. అక్ష్యుపనిషత్తు
73. అధ్యాత్మోపనిషత్తు
74. కుండికోపనిషత్తు
75. సావిత్ర్యుపనిషత్తు
76. ఆత్మోపనిషత్తు
77. పశుపతబ్రహ్మోపనిషత్తు
78. పరబ్రహ్మోపనిషత్తు
79. అవధూతోపనిషత్తు
80. త్రిపురతాపిన్యుపనిషత్తు
81. శ్రీదేవ్యుపనిషత్తు
82. త్రిపురోపనిషత్తు
83. కఠరుద్రోపనిషత్తు
84. భావనోపనిషత్తు
85. రుద్రహృదయోపనిషత్తు
86. యోగకుండల్యుపనిషత్తు
87. భస్మజాబలోపనిషత్తు
88. రుద్రాక్షజాబలోపనిషత్తు
89. గణపత్యుపనిషత్తు
90. దర్శనోపనిషత్తు
91. తారాసారోపనిషత్తు
92. మహావాక్యోపనిషత్తు
93. పంచబ్రహ్మోపనిషత్తు
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు
95. గోపాలతాపిన్యుపనిషత్తు
96. కృష్ణోపనిషత్తు
97. యాజ్ఞవల్క్యోపనిషత్తు
98. వరాహోపనిషత్తు
99. శాట్యానీయోపనిషత్తు
100. హయగ్రీవోపనిషత్తు
101. దత్తాత్రేయోపనిషత్తు
102. గరుడోపనిషత్తు
103. కలిసంతారణోపనిషత్తు
104. బాల్యుపనిషత్తు
105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు
106. సరస్వతీ రహస్యోపనిషత్తు
107. భహ్వృచోపనిషత్తు
108. ముక్తికోపనిషత్తు
‪‎దశోపనిషత్తులను‬ చెప్పే ప్రామాణిక శ్లోకం:
ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా

సాయి‬ సద్గురువు.

సాయి‬ సద్గురువు..
#ఓమ్ శ్రీ శిరిడి సాయినాథయనమః
''నా నుంచి నా వాడిని దూరమేనాటికీ కానివ్వను ! "  
ఈ సంసారములోని సంతోషము ,విచారమూ,సత్యమైనవి కావు.జనన మరణాల చక్రం లో పరిభ్రమించడమే దుఃఖము.దాని నుండి విముక్తి పొందడమే నిజమైన ఆనందము.

మానవా మేలుకో – ఈ రోజు మనిషి తాను మనిషిని అనే విషయాన్ని మరిచిపోయాడు.  “నేడు విశ్వంలో మానవులకు కొదవలేదు,కాని మానవత్వము మాత్రము కనిపించుటలేదు. గమ్యం చేరే వరకు విశ్రమించకు.మానవుడు దారి తప్పిపరితపిస్తున్నాడు మనసును ప్రేమతో నింపి ఈ జీవిత ప్రయాణం సాగించాలి.అమృతం గ్రోలుదాo. నిర్మలుడు,సరలుడు.సులభుడు ఐన భగవంతునితో యోగం చెందుదాం.నా తోడు నీడ నీవే అని స్మరించుదాం.#శంకరాచార్య భజగోవిందం లో చెప్పినట్లు అజ్ఞానంలో వున్న  మానవుడు భగవంతునికి దూరమై భంగపడుతున్నాడు.#గోవిందునితో ఐక్యమవ్వటానికి  యోగమవ్వటానికి కృషి చేయమని స్పూర్తినిస్తుంది.ఈ సత్య సందేశం సత్య యుగం , ద్వాపర యుగం,త్రేతాయుగం,కలియుగం లోనూ మహానీయులచే ఇవ్వబడుతుంది.దాన్ని ఆచరించి జన్మను సార్ధకం చేసుకుందాం. 

మనిషిగా పుట్టాక,మానవత్వమే లేకపోతే ఇక భక్తుడిగా చెప్పుకొనే అర్హత ఏ మనిషికి లేదు. అందుచేతనే, దానవత్వం నుండి మానవత్వం వైపుకు,మానవత్వం నుండి దైవత్వం వైపుకు మనిషి చేసే ప్రయాణమే జీవితం,దానికి దోహదపడేదే భక్తి, అట్టి భక్తిని తెలిపేటటువంటి వాడే #సాయి సద్గురువు.
#మానవుడు తను ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి, కాని నేడు సజీవ నరకాన్ని సృష్టించుచున్నాడు.ఆనందం కోసం ఎక్కడో వెతుకుతున్నాడు, తను ఆనంద స్వరూపుడైనప్పటికి.నేడు మానవుని దుఖానికి కారణం మనతో మనకు పరిచయము  
లేకపోవడము.అందరితో పరిచయాలు పెంచుకుంటున్నాము, కాని మనతో మనకు పరిచయము మాత్రము చేసుకోవటములేదు.#సాయి సద్గురువు బ్రహ్మ జ్ఞానాన్నిచ్చి, మనతో మనకు పరిచయము చేసారు.మనకొరకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించారు.  ఈ ప్రపంచములో ఈర్ష ద్వేషాలకు తావులేదు,వుండకూడదు. ప్రేమ, దయ, సహనము వంటి గుణాలకు మాత్రమే స్థానం వుంది.వుంటుoది,వుoడాలి.
.........................జై సద్గురు సాయినాథయనమః.....................ఓమ్‬ శ్రీ శిరిడి సాయినాథయనమః
''నా నుంచి నా వాడిని దూరమేనాటికీ కానివ్వను ! "
ఈ సంసారములోని సంతోషము విచారమూ,సత్యమైనవి కావు.జనన మరణాల చక్రం లో పరిభ్రమించడమే దుఃఖము.దాని నుండి విముక్తి పొందడమే నిజమైన ఆనందము.
మానవా మేలుకో – ఈ రోజు మనిషి తాను మనిషిని అనే విషయాన్ని మరిచిపోయాడు. “నేడు విశ్వంలో మానవులకు కొదవలేదు,కాని మానవత్వము మాత్రము కనిపించుటలేదు. గమ్యం చేరే వరకు విశ్రమించకు.మానవుడు దారి తప్పిపరితపిస్తున్నాడు మనసును ప్రేమతో నింపి ఈ జీవిత ప్రయాణం సాగించాలి.అమృతం గ్రోలుదాo. నిర్మలుడు,సరలుడు.సులభుడు ఐన భగవంతునితో యోగం చెందుదాం.నా తోడు నీడ నీవే అని స్మరించుదాం.‪ శంకరాచార్య‬ భజగోవిందం లో చెప్పినట్లు అజ్ఞానంలో వున్న మానవుడు భగవంతునికి దూరమై భంగపడుతున్నాడు.‪ ‎గోవిందునితో‬ ఐక్యమవ్వటానికి యోగమవ్వటానికి కృషి చేయమని స్పూర్తినిస్తుంది.ఈ సత్య సందేశం సత్య యుగం , ద్వాపర యుగం,త్రేతాయుగం,కలియుగం లోనూ మహానీయులచే ఇవ్వబడుతుంది.దాన్ని ఆచరించి జన్మను సార్ధకం చేసుకుందాం.
మనిషిగా పుట్టాక,మానవత్వమే లేకపోతే ఇక భక్తుడిగా చెప్పుకొనే అర్హత ఏ మనిషికి లేదు. అందుచేతనే, దానవత్వం నుండి మానవత్వం వైపుకు,మానవత్వం నుండి దైవత్వం వైపుకు మనిషి చేసే ప్రయాణమే జీవితం,దానికి దోహదపడేదే భక్తి, అట్టి భక్తిని తెలిపేటటువంటి వాడే‪ ‎సాయి‬ సద్గురువు.
మానవుడు‬ తను ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి, కాని నేడు సజీవ నరకాన్ని సృష్టించుచున్నాడు.ఆనందం కోసం ఎక్కడో వెతుకుతున్నాడు, తను ఆనంద స్వరూపుడైనప్పటికి.నేడు మానవుని దుఖానికి కారణం మనతో మనకు పరిచయము
లేకపోవడము.అందరితో పరిచయాలు పెంచుకుంటున్నాము, కాని మనతో మనకు పరిచయము మాత్రము చేసుకోవటములేదు.#సాయి సద్గురువు బ్రహ్మ జ్ఞానాన్నిచ్చి, మనతో మనకు పరిచయము చేసారు.మనకొరకు ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించారు. ఈ ప్రపంచములో ఈర్ష ద్వేషాలకు తావులేదు,వుండకూడదు. ప్రేమ, దయ, సహనము వంటి గుణాలకు మాత్రమే స్థానం వుంది.వుంటుoది,వుoడాలి.
.........................జై సద్గురు సాయినాథయనమః.....................