సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, October 27, 2014

రధ‬ సప్తమి పూజ మహిమ

రధ‬ సప్తమి పూజ మహిమ

#రధ సప్తమి పూజ మహిమ  
అనేకానేక హిందూ పురాణాలూ,గ్రంధాలలో పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ స్వామిని ప్రత్యక్ష దైవంగా అభివర్నించాయీ అంటే కారణం ఆయనొక్కడే ప్రతినిత్యం దర్శనమిచ్చేది కనుక.
కాని మారిన యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన,మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అలా నిర్ణయించిన  వాటిల్లో #రధ సప్తమి పూజ ఒకటి.
#అదితి, కశ్యప మహర్షి దంపతులకు జన్మించిన #ఆదిత్యుడు లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు.దానినే దక్షిణాయనం,ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి[15 జనవరి]జులై పదిహేను వరకు దక్షిణాయనం,జూలై నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే  రధ  సప్తమి అని లేదా సూర్య జయంతి అని  అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయంగా వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.

#పురాణగాధ:
రధ  సప్తమి నాడు నిర్వర్తించే  పూజకు సంభందించి  ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.
పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా బిడ్డ అనారోగ్యంవలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించేవారు.
తన  పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ  చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.

#రధ సప్తమి పూజా విధానం:
సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా  కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద,పాదాల మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని  స్నానమాచరించి,గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.
అనంతరం గృహములో తూర్పుదిశగా రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.నైవేద్యముగా #పొంగలిని సమర్పించాలి.
ఆ రోజంతా #ఉపవాసముండి, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో  దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి  ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు  మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.
అనేకానేక హిందూ పురాణాలూ,గ్రంధాలలో పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ స్వామిని ప్రత్యక్ష దైవంగా అభివర్నించాయీ అంటే కారణం ఆయనొక్కడే ప్రతినిత్యం దర్శనమిచ్చేది కనుక.
కాని మారిన యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన,మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అలా నిర్ణయించిన వాటిల్లో #రధ సప్తమి పూజ ఒకటి.
‪‎అదితి‬, కశ్యప మహర్షి దంపతులకు జన్మించిన ఆదిత్యుడు‬ లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు.దానినే దక్షిణాయనం,ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి[15 జనవరి]జులై పదిహేను వరకు దక్షిణాయనం,జూలై నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే రధ సప్తమి అని లేదా సూర్య జయంతి అని అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయంగా వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.
పురాణగాధ‬:-
రధ సప్తమి నాడు నిర్వర్తించే పూజకు సంభందించి ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.
పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా బిడ్డ అనారోగ్యంవలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించేవారు.
తన పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.
రధ సప్తమి పూజా విధానం:-
సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద,పాదాల మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని స్నానమాచరించి,గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.
అనంతరం గృహములో తూర్పుదిశగా రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.నైవేద్యముగా పొంగలిని‬ సమర్పించాలి.
ఆ రోజంతా ఉపవాసముండి‬, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.

‎శ్రీ‬ వేంకటేశ్వర వజ్రకవచం

శ్రీ‬ వేంకటేశ్వర వజ్రకవచం 

నారాయణ పరబ్రహ్మ, సర్వకారణ కారణం,
ప్రపద్యే వేంకటేశాఖ్యం, తదేవ కవచం మమ |
సహస్ర శీర్షాపురుషో, వేంకటేశః శిరోవ్రతు,
ప్రాణేశః ప్రాణ నిలయః, ప్రాణం రక్షతు మే హరిః |
ఆకాశరాట్ సురానాథ! ఆత్మానం మే సదావతు,
దేవ దేవోత్తమః పాయాత్, దేహం మే వేంకటేశ్వరః |
సర్వత్ర సర్వకాలేషు, మంగాంబాజాని రీశ్వరః
పాలయే న్మామకం కర్మ, సాఫల్యం నః ప్రయచ్ఛతు |
శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ వజ్రకవచం పుమాన్,
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్బయః ||

శ్రీవెంకటేశ్వర‬ స్వామి పూజావిశేషాలు

శ్రీవెంకటేశ్వర‬ స్వామి పూజావిశేషాలు
Ramudu Thota Venkataramana's photo.ప్రతిరోజు ప్రప్రధమంగా ‪‎శ్రీవారి‬ దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి ‪‎గొల్ల‬'. ఆదిలో శ్రీ‪‎వేంకటేశ్వర‬ స్వామి వారి చే మొదటి దర్శన భాగ్యాన్ని వరం గా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతం లో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గొవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాఢావీధి లో ని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు.
శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను(12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం(నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్‬, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు.
ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు ‪‎కుంచకోల‬' అనబడే తాళాలతో ‪‎కౌసల్యా‬ సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, తాంబూలం‬ గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు‪ అన్నమయ్య‬ కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ ‪‎శ్రీనివాసమూర్తి‬ స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారి కి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది‬ దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్ధం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, ‪‎భక్తులు‬ లోనికి వచ్చి శ్రీవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు.

జటాయుకృతం‬ రామస్తోత్రమ్

‪‎జటాయుకృతం‬ రామస్తోత్రమ్..
#జటాయుకృతం రామస్తోత్రమ్..
జటాయురువాచ
అగణితగుణమప్రమేయమాద్యం సకలజగత్స్థితిసంయమాదిహేతుమ్|
ఉపరమపరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోఽస్మి రామచన్ద్రమ్||1||

నిరవధిసుఖమిన్దిరాకటాక్షం క్షపితసురేన్ద్రచతుర్ముఖాదిదుఃఖమ్|
నరవరమనిశం నతోఽస్మి రామం వరదమహం వరచాపబాణహస్తమ్||2||

త్రిభువనకమనీయరూపమీడ్యం రవిశతభాసురమీహితప్రదానమ్|
శరణదమనిశం సురాగమూలే కృతనిలయం రఘునన్దనం ప్రపద్యే||3||

భవవిపినదవాగ్నినామధేయం భవముఖదైవతదైవతం దయాలుమ్|
దనుజపతిసహస్రకోటినాశం రవితనయాసదృశం హరిం ప్రపద్యే||4||

అవిరతభవభావనాతిదూరం భవవిముఖైర్మునిభిః సదైవ దృశ్యమ్|
భవజలధిసుతారణాఙ్ఘ్రిపోతం శరణమహం రఘునన్దనం ప్రపద్యే||5||

గిరిశగిరిసుతామనోనివాసం గిరివరధారిణమీహితాభిరామమ్|
సురవరదనుజేన్ద్రసేవితాఙ్ఘ్రిం సురవరదం రఘునాయకం ప్రపద్యే||6||

పరధనపరదారవర్జితానాం పరగుణభూతిషు తుష్టమానసానామ్|
పరహితనిరతాత్మనాం సుసేవ్యం రఘువరమమ్బుజలోచనం ప్రపద్యే||7||

స్మితరుచిరవికాసితాననాబ్జమతిసులభం సురరాజనీలనీలమ్|
సితజలరుహచారునేత్రశోభం రఘుపతిమీశగురోర్గురుం ప్రపద్యే||8||

హరికమలజశమ్భురూపభేదాత్త్వమిహ విభాసి గుణత్రయానువృత్తః|
రవిరివ జలపూరితోదపాత్రేష్వమరపతిస్తుతిపాత్రమీశమీడే||9||

రతిపతిశతకోటిసున్దరాఙ్గం శతపథగోచరభావనావిదూరమ్|
యతిపతిహృదయే సదా విభాతం రఘుపతిమార్తిహరం ప్రభుం ప్రపద్యే||10||

ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నోఽభూద్రఘూత్తమః|
ఉవాచ గచ్ఛ భద్రం తే మమ విష్ణోః పరం పదమ్||11||

శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠేత్|
స యాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్||12||

ఇతి రాఘవభాషితం తదా శ్రుతవాన్ హర్షసమాకులో ద్విజః||
రఘునన్దనసామ్యమాస్థితః ప్రయయౌ బ్రహ్మసుపూజితం పదమ్||13||

||ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే అరణ్యకాణ్డేఽష్టమే 
                    సర్గే జటాయుకృతం శ్రీరామస్తోత్ర||
జటాయురువాచ
అగణితగుణమప్రమేయమాద్యం సకలజగత్స్థితిసంయమాదిహేతుమ్|
ఉపరమపరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోఽస్మి రామచన్ద్రమ్||1||
నిరవధిసుఖమిన్దిరాకటాక్షం క్షపితసురేన్ద్రచతుర్ముఖాదిదుఃఖమ్|
నరవరమనిశం నతోఽస్మి రామం వరదమహం వరచాపబాణహస్తమ్||2||
త్రిభువనకమనీయరూపమీడ్యం రవిశతభాసురమీహితప్రదానమ్|
శరణదమనిశం సురాగమూలే కృతనిలయం రఘునన్దనం ప్రపద్యే||3||
భవవిపినదవాగ్నినామధేయం భవముఖదైవతదైవతం దయాలుమ్|
దనుజపతిసహస్రకోటినాశం రవితనయాసదృశం హరిం ప్రపద్యే||4||
అవిరతభవభావనాతిదూరం భవవిముఖైర్మునిభిః సదైవ దృశ్యమ్|
భవజలధిసుతారణాఙ్ఘ్రిపోతం శరణమహం రఘునన్దనం ప్రపద్యే||5||
గిరిశగిరిసుతామనోనివాసం గిరివరధారిణమీహితాభిరామమ్|
సురవరదనుజేన్ద్రసేవితాఙ్ఘ్రిం సురవరదం రఘునాయకం ప్రపద్యే||6||
పరధనపరదారవర్జితానాం పరగుణభూతిషు తుష్టమానసానామ్|
పరహితనిరతాత్మనాం సుసేవ్యం రఘువరమమ్బుజలోచనం ప్రపద్యే||7||
స్మితరుచిరవికాసితాననాబ్జమతిసులభం సురరాజనీలనీలమ్|
సితజలరుహచారునేత్రశోభం రఘుపతిమీశగురోర్గురుం ప్రపద్యే||8||
హరికమలజశమ్భురూపభేదాత్త్వమిహ విభాసి గుణత్రయానువృత్తః|
రవిరివ జలపూరితోదపాత్రేష్వమరపతిస్తుతిపాత్రమీశమీడే||9||
రతిపతిశతకోటిసున్దరాఙ్గం శతపథగోచరభావనావిదూరమ్|
యతిపతిహృదయే సదా విభాతం రఘుపతిమార్తిహరం ప్రభుం ప్రపద్యే||10||
ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నోఽభూద్రఘూత్తమః|
ఉవాచ గచ్ఛ భద్రం తే మమ విష్ణోః పరం పదమ్||11||
శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠేత్|
స యాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్||12||
ఇతి రాఘవభాషితం తదా శ్రుతవాన్ హర్షసమాకులో ద్విజః||
రఘునన్దనసామ్యమాస్థితః ప్రయయౌ బ్రహ్మసుపూజితం పదమ్||13||
||ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే అరణ్యకాణ్డేఽష్టమే
సర్గే జటాయుకృతం శ్రీరామస్తోత్ర||