గాయత్రి దేవి ఆలంకారం

''ముక్తా విద్రుమ హేమనీలధవళచ్చాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాంతత్త్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళంహసైర్వహం తీం భజే"
దసరా ఉత్సవాలలో నాల్గవరోజున అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తిస్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రీదేవిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందు కుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
అలంకారం : అమ్మవారిని మెరూన్ (వక్కపొడి) వర్ణంతో ఉన్న పట్టుచీరతో అలంకరిస్తారు.
మంత్రం: ''ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మను ధ్యానించాలి.
నైవేద్యం: అల్లపు గారె నివేదన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి. అలాగే గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి.
సకల దేవతా స్వరూపం ...... గాయత్రీ మాత
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజు జగన్మాతకు గాయత్రి అలంకారం ఎంతో విశిష్టమైనది. వేదమాత గాయత్రి వేదములచేత విధింపబడిన కర్మలను ఆచరించుటయే ధర్మము. ''ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని మనము రక్షిస్తే మనలను ధర్మము రక్షిస్తుంది. ధర్మమువలననే ధనం, సుఖం, సర్వశుభాలు కలుగుతాయి. ప్రాతఃకాలమున తూర్పుదిశగా తిరిగి నిలబడి గాయత్రి మంత్రమును జపించాలి. సాయంకాలం పడమటి దిశ తిరిగి కూర్చుని గాయత్రి మంత్రమును జపించాలి. ప్రాణాయామం ప్రధానమైన ప్రక్రియ. ప్రాణాయామం వల్ల రక్త ప్రసరణ, కార్యసిద్ధి కలుగుతాయి. గాయత్రి మంత్రము వల్ల, గాయత్రి అలంకార దర్శనం వల్ల మంచిబుద్ధి, ఆయురా రోగ్య, ఐశ్వర్యములు కలిగి శ్రేష్ఠత్వము, ఉత్తముడుగా మనిషిమారతాడు.''నగాచుత్య్రా: పరం మంత్రం--నమాతు: పరదైవతమ్-శ్రీదేవి భాగ వతంలో చెప్పబడింది. దేవతలలో గాయత్రిమాత ప్రధానమైనది. గాయత్రి అలంకార దర్శనం వలన సర్వపాతకములు నశిస్తాయి. గాయత్రిమాత దర్శనం వల్ల ముసలితనం, మృత్యువు బాధింపవు. వినాశనములేదు. బలం, దివ్యత్వము కలుగు తాయి. సుఖాలను, మోక్షాన్ని కలుగచేసే గాయత్రిమాతను దర్శించటం శ్రేయస్కరం. త్రిమూర్తు లకు అతీతమైనది గాయత్రీమాత. గాయత్రీ అష్టోత్తరంలో శ్రీ గాయత్రీనమః త్రివేదరూపాయైనమ:, ఆదిశక్తైనమ:, అని చెప్పబడింది.
కాబట్టి గాయత్రిదేవిని పూజించి, ఆమె దర్శనం చేసుకొని తరించుదాం. సమస్త ప్రపంచం, ఈ చరాచరసృష్టి అంతయూ జగన్మాత ప్రేరణచే నడుపబడుతున్నది. వేదవేదాంగాలలో గాయత్రిమాత ప్రాశస్త్యము చెప్పి ఉన్నారు. గాయత్రిమాత దర్శనం, గాయత్రి మంత్ర పఠనం అమోఘ మైనది. శాంతిమూర్తిగా, సవితామూర్తిగా, సరస్వతి మూలంగా గాయత్రి దర్శనం ఇస్తుంది. గాయత్రి మాతకు కొబ్బరి అన్నము ప్రీతికరము. అన్నం పరబ్రహ్మస్వరూపము. కాబట్టి అన్నం నివేదన పెట్టాలి. గాయత్రి మాతను పరబ్రహ్మ స్వరూపిణిగా భావిస్తారు. సూర్య మండలంలో మధ్య నివసించుచున్నదని వేద ప్రమాణం. హంసవాహనం అధిరోహించి ఉంటారు. (తెలుపు) హంసకీర్తికి ప్రతినిధి. శుభాలు కలిగించే మాత. ''పంచశీర్షములు అయిదు తలలు కలిగిన దేవతామూర్తి. దశహస్తములు కలిగినది. పది ఆయుధాలు కలిగినది. బ్రహ్మచే పూజింపబడేది. సత్యానికి ప్రతీక. శుద్ధవస్త్రములు, శుద్ధ విద్యలను కలిగినది. యజ్ఞమునకు ప్రియమైనది. అగ్ని ముఖముకలిగి, సహస్రదళపద్మములు ఉన్నటువంటి వేదమాత గాయత్రీదేవిని దర్శించి, అమ్మ కృపాకటాక్షవీక్షణములను పొంది తరించుదాం. గాయత్రీమాత బ్రహ్మజ్ఞానమునకు అధిదేవత. ఆ మాతను ప్రార్ధిస్తే సులభంగా మోక్షాన్ని సాధించవచ్చు.
''సర్వేజనా సుఖినోభవంతు!!

''ముక్తా విద్రుమ హేమనీలధవళచ్చాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాంతత్త్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళంహసైర్వహం తీం భజే"
దసరా ఉత్సవాలలో నాల్గవరోజున అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తిస్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రీదేవిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందు కుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
అలంకారం : అమ్మవారిని మెరూన్ (వక్కపొడి) వర్ణంతో ఉన్న పట్టుచీరతో అలంకరిస్తారు.
మంత్రం: ''ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మను ధ్యానించాలి.
నైవేద్యం: అల్లపు గారె నివేదన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి. అలాగే గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి.
సకల దేవతా స్వరూపం ...... గాయత్రీ మాత
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజు జగన్మాతకు గాయత్రి అలంకారం ఎంతో విశిష్టమైనది. వేదమాత గాయత్రి వేదములచేత విధింపబడిన కర్మలను ఆచరించుటయే ధర్మము. ''ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని మనము రక్షిస్తే మనలను ధర్మము రక్షిస్తుంది. ధర్మమువలననే ధనం, సుఖం, సర్వశుభాలు కలుగుతాయి. ప్రాతఃకాలమున తూర్పుదిశగా తిరిగి నిలబడి గాయత్రి మంత్రమును జపించాలి. సాయంకాలం పడమటి దిశ తిరిగి కూర్చుని గాయత్రి మంత్రమును జపించాలి. ప్రాణాయామం ప్రధానమైన ప్రక్రియ. ప్రాణాయామం వల్ల రక్త ప్రసరణ, కార్యసిద్ధి కలుగుతాయి. గాయత్రి మంత్రము వల్ల, గాయత్రి అలంకార దర్శనం వల్ల మంచిబుద్ధి, ఆయురా రోగ్య, ఐశ్వర్యములు కలిగి శ్రేష్ఠత్వము, ఉత్తముడుగా మనిషిమారతాడు.''నగాచుత్య్రా: పరం మంత్రం--నమాతు: పరదైవతమ్-శ్రీదేవి భాగ వతంలో చెప్పబడింది. దేవతలలో గాయత్రిమాత ప్రధానమైనది. గాయత్రి అలంకార దర్శనం వలన సర్వపాతకములు నశిస్తాయి. గాయత్రిమాత దర్శనం వల్ల ముసలితనం, మృత్యువు బాధింపవు. వినాశనములేదు. బలం, దివ్యత్వము కలుగు తాయి. సుఖాలను, మోక్షాన్ని కలుగచేసే గాయత్రిమాతను దర్శించటం శ్రేయస్కరం. త్రిమూర్తు లకు అతీతమైనది గాయత్రీమాత. గాయత్రీ అష్టోత్తరంలో శ్రీ గాయత్రీనమః త్రివేదరూపాయైనమ:, ఆదిశక్తైనమ:, అని చెప్పబడింది.
కాబట్టి గాయత్రిదేవిని పూజించి, ఆమె దర్శనం చేసుకొని తరించుదాం. సమస్త ప్రపంచం, ఈ చరాచరసృష్టి అంతయూ జగన్మాత ప్రేరణచే నడుపబడుతున్నది. వేదవేదాంగాలలో గాయత్రిమాత ప్రాశస్త్యము చెప్పి ఉన్నారు. గాయత్రిమాత దర్శనం, గాయత్రి మంత్ర పఠనం అమోఘ మైనది. శాంతిమూర్తిగా, సవితామూర్తిగా, సరస్వతి మూలంగా గాయత్రి దర్శనం ఇస్తుంది. గాయత్రి మాతకు కొబ్బరి అన్నము ప్రీతికరము. అన్నం పరబ్రహ్మస్వరూపము. కాబట్టి అన్నం నివేదన పెట్టాలి. గాయత్రి మాతను పరబ్రహ్మ స్వరూపిణిగా భావిస్తారు. సూర్య మండలంలో మధ్య నివసించుచున్నదని వేద ప్రమాణం. హంసవాహనం అధిరోహించి ఉంటారు. (తెలుపు) హంసకీర్తికి ప్రతినిధి. శుభాలు కలిగించే మాత. ''పంచశీర్షములు అయిదు తలలు కలిగిన దేవతామూర్తి. దశహస్తములు కలిగినది. పది ఆయుధాలు కలిగినది. బ్రహ్మచే పూజింపబడేది. సత్యానికి ప్రతీక. శుద్ధవస్త్రములు, శుద్ధ విద్యలను కలిగినది. యజ్ఞమునకు ప్రియమైనది. అగ్ని ముఖముకలిగి, సహస్రదళపద్మములు ఉన్నటువంటి వేదమాత గాయత్రీదేవిని దర్శించి, అమ్మ కృపాకటాక్షవీక్షణములను పొంది తరించుదాం. గాయత్రీమాత బ్రహ్మజ్ఞానమునకు అధిదేవత. ఆ మాతను ప్రార్ధిస్తే సులభంగా మోక్షాన్ని సాధించవచ్చు.
''సర్వేజనా సుఖినోభవంతు!!