సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, October 4, 2014

గాయత్రి దేవి ఆలంకారం

గాయత్రి దేవి ఆలంకారం

గాయత్రి దేవి ఆలంకారం
''ముక్తా విద్రుమ హేమనీలధవళచ్చాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాంతత్త్వార్ధ వర్ణాత్మికామ్‌
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళంహసైర్వహం తీం భజే"

దసరా ఉత్సవాలలో నాల్గవరోజున అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తిస్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రీదేవిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందు కుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

అలంకారం : అమ్మవారిని మెరూన్‌ (వక్కపొడి) వర్ణంతో ఉన్న పట్టుచీరతో అలంకరిస్తారు.

మంత్రం: ''ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మను ధ్యానించాలి.
నైవేద్యం:  అల్లపు గారె నివేదన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి. అలాగే గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి.

సకల దేవతా స్వరూపం ...... గాయత్రీ మాత
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజు జగన్మాతకు గాయత్రి అలంకారం ఎంతో విశిష్టమైనది. వేదమాత గాయత్రి వేదములచేత విధింపబడిన కర్మలను ఆచరించుటయే ధర్మము. ''ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని మనము రక్షిస్తే మనలను ధర్మము రక్షిస్తుంది. ధర్మమువలననే ధనం, సుఖం, సర్వశుభాలు కలుగుతాయి. ప్రాతఃకాలమున తూర్పుదిశగా తిరిగి నిలబడి గాయత్రి మంత్రమును జపించాలి. సాయంకాలం పడమటి దిశ తిరిగి కూర్చుని గాయత్రి మంత్రమును జపించాలి. ప్రాణాయామం ప్రధానమైన ప్రక్రియ. ప్రాణాయామం వల్ల రక్త ప్రసరణ, కార్యసిద్ధి కలుగుతాయి. గాయత్రి మంత్రము వల్ల, గాయత్రి అలంకార దర్శనం వల్ల మంచిబుద్ధి, ఆయురా రోగ్య, ఐశ్వర్యములు కలిగి శ్రేష్ఠత్వము, ఉత్తముడుగా మనిషిమారతాడు.''నగాచుత్య్రా: పరం మంత్రం--నమాతు: పరదైవతమ్‌-శ్రీదేవి భాగ వతంలో చెప్పబడింది. దేవతలలో గాయత్రిమాత ప్రధానమైనది. గాయత్రి అలంకార దర్శనం వలన సర్వపాతకములు నశిస్తాయి. గాయత్రిమాత దర్శనం వల్ల ముసలితనం, మృత్యువు బాధింపవు. వినాశనములేదు. బలం, దివ్యత్వము కలుగు తాయి. సుఖాలను, మోక్షాన్ని కలుగచేసే గాయత్రిమాతను దర్శించటం శ్రేయస్కరం. త్రిమూర్తు లకు అతీతమైనది గాయత్రీమాత. గాయత్రీ అష్టోత్తరంలో శ్రీ గాయత్రీనమః త్రివేదరూపాయైనమ:, ఆదిశక్తైనమ:, అని చెప్పబడింది.
కాబట్టి గాయత్రిదేవిని పూజించి, ఆమె దర్శనం చేసుకొని తరించుదాం. సమస్త ప్రపంచం, ఈ చరాచరసృష్టి అంతయూ జగన్మాత ప్రేరణచే నడుపబడుతున్నది. వేదవేదాంగాలలో గాయత్రిమాత ప్రాశస్త్యము చెప్పి ఉన్నారు. గాయత్రిమాత దర్శనం, గాయత్రి మంత్ర పఠనం అమోఘ మైనది. శాంతిమూర్తిగా, సవితామూర్తిగా, సరస్వతి మూలంగా గాయత్రి దర్శనం ఇస్తుంది. గాయత్రి మాతకు కొబ్బరి అన్నము ప్రీతికరము. అన్నం పరబ్రహ్మస్వరూపము. కాబట్టి అన్నం నివేదన పెట్టాలి. గాయత్రి మాతను పరబ్రహ్మ స్వరూపిణిగా భావిస్తారు. సూర్య మండలంలో మధ్య నివసించుచున్నదని వేద ప్రమాణం. హంసవాహనం అధిరోహించి ఉంటారు. (తెలుపు) హంసకీర్తికి ప్రతినిధి. శుభాలు కలిగించే మాత. ''పంచశీర్షములు అయిదు తలలు కలిగిన దేవతామూర్తి. దశహస్తములు కలిగినది. పది ఆయుధాలు కలిగినది. బ్రహ్మచే పూజింపబడేది. సత్యానికి ప్రతీక. శుద్ధవస్త్రములు, శుద్ధ విద్యలను కలిగినది. యజ్ఞమునకు ప్రియమైనది. అగ్ని ముఖముకలిగి, సహస్రదళపద్మములు ఉన్నటువంటి వేదమాత గాయత్రీదేవిని దర్శించి, అమ్మ కృపాకటాక్షవీక్షణములను పొంది తరించుదాం. గాయత్రీమాత బ్రహ్మజ్ఞానమునకు అధిదేవత. ఆ మాతను ప్రార్ధిస్తే సులభంగా మోక్షాన్ని సాధించవచ్చు.
           ''సర్వేజనా సుఖినోభవంతు!!   

దేవ దర్శనం గాయత్రీ మంత్రం

దేవ దర్శనం గాయత్రీ మంత్రం 
గాయత్రీ మంత్రం ఒక జీవన దర్శనం, ఒక ఫిలాసఫీ. అది జీవించే కళ. అది ఒక ఆలోచనా విధానం, ఒక జీవన సరళి, సమాజ నిర్మాణానికి ఒక పద్ధతి. అది విశ్వ శాంతికి మూల మంత్రం. గాయత్రీ మంత్రం ఒక దివ్య జ్ఞానం. గాయత్రి దేవమాత. గాయత్రీ ఉపాసన వల్ల మనిషి దేవత అవుతాడు. గాయత్రిలోని 24 అక్షరాలతో నిండి ఉంది ధర్మం, నీతి, జీవితం, కళ, సామాజిక వ్యవహరణలను గురించిన బోధ. మనిషి యొక్క ఆలోచనలనూ, భావనలనూ, లక్ష్యాన్నీ, దృక్పథాన్నీ క్షాళన చేస్తే అతడి శారీరక, మానసిక క్రియలలో సత్వగుణమూ, ధర్మ నిష్టా పెంపొందుతారుు.
గాయత్రీ మంత్రం


గాయత్రిలోని అక్షరాలు చేసే మహాబోధలను అనుసరిస్తే - 2 ప్రక్రియ అమలు జరుగుతుంది. కనుకనే గాయత్రి వేద శాస్త్రాల సారం.

ఓం
ప్రకృతి అంతరాళంలో ‘ఓం’ వంటి ధ్వని ప్రతి క్షణం ఉత్పన్నం అవుతోంది. ఈ పరమేశ్వర నామాన్ని సూక్ష్మ ప్రకృతి ప్రతి క్షణం జపిస్తోంది, నినదిస్తోంది. కనుక ఈ నామం అకృ త్రిమం, స్వయం వ్యక్తం, సర్వశ్రేష్టం అయినది. ఆస్తికత అంటే అర్థం - సత్వగుణాన్నీ, దైవీయ, ఈశ్వరీయ, పారమార్థిక భావనలనూ హృదయంలో నింపుకోవడం. నాస్తికత అంటే అర్థం - తామసంతో, అసురత్వంతో, భోగవాదంతో, స్వార్థంతో కూడిన వాసనలలో మునిగిసోవడం.

ఓంలో అ ఉ మ్‌ అనే మూడు అక్షరాలు కలసి ఉన్నాయి. ‘అ’ అంటే అర్థం ఆత్మపరాయణత్వం; మనస్సును శారీరక విషయాల నుండి తప్పించి, ఆత్మానందంలో ఓలలాడడం. ‘ఉ’ అంటే అర్థం ఉన్నతి. శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, ఆత్మిక సంపదలతో మనల్ని నింపుకోవడం. ‘మ్‌’ అంటే అర్థం మహానత, గొప్పతనం, క్షుద్రతనూ, సంకుచితత్వాన్నీ, స్వార్థపరత్వాన్నీ, ఇంద్రియ చాపల్యాన్నీ వదులుకోవడం ఆదర్శాలు; ప్రేమ, దయ, ఉదారత, సేవ, త్యాగం సంయమనం ఆధారంగా జీవితాన్ని నిర్మించుకోవడం.

భూః
మనం శరీరాలను కాము - ప్రాణములము, ఆత్మలము. శరీరానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఆత్మను ఉపేక్షించడం భౌతికవాదం. ఆత్మకు ప్రాధాన్యాన్ని ఇస్తూ, శరీరాన్ని తగు విధంగా రక్షించడం ఆధ్యాత్మవాదం. మనం ఆత్మలమనీ, కనుక మన శ్రేయస్సు ఆత్మపరాయణత్వంలో ఉన్నదనీ గాయత్రి చెపుతుంది. మనం ఆత్మవాదులం కావాలి. ఆత్మ కల్యాణానికీ, ఆత్మచింతనకూ, ఆత్మోన్నతికీ, ఆత్మగౌరవానికీ అగ్రప్రాధాన్యం ఇవ్వాలి. వాటి కోసం కృషి చేయాలి. సమాజ సేవ ద్వారా విరాట్‌ పురుషుడూ, విశ్వ మానవుడూ అయిన పరమాత్మను ఆరాధించాలి.

భువః
ఈ అక్షరం మనకు కర్మయోగ సందేశాన్ని ఇస్తోంది. ఎందుకంటే - కర్మయోగం ఆధారంగానే మనం అన్ని రకాల దుఃఖాల నుండి విడువల పొందగలుగుతాము. సత్ఫలితాలను సాధించాలంటే మన జీవనం వికాసం పొందాలంటే చేయవలసిన పనిలో మనం పూర్తిగా నిమగ్నం కావాలి. ఇలా నిర్ణయించుకోవడంలో బుద్ధికుశలత, దూరదృష్టి, వివేకం ఇమిడి ఉన్నాయి. మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు - వైఫల్యానికి క్రుంగిపోవడంలో, సాఫల్యానికి పొంగిపోవడంలో అర్థం లేదు. ఫలితాన్ని ఇచ్చే శక్తి వేరొకటి. మనం మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. ఈ భావనయే అనాసక్త యోగం. ఈ దృక్పథం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. దుఃఖంలో, కష్టంలో విచారించవలసిందేమీ అతడికి కనిపించదు.

స్వః
మనస్సును నీలోపల స్థిరంగా ఉంచుకో, నీవు లోలోపల దృఢంగా ఉండు. ‘సంఘటనలనూ, పరిస్థితులనూ నీటి అలలుగా పరిగణించు. వాటితో ఆడుకుని ఆనందించు. అనుకూల పరిస్థితులలోని స్వారస్యాన్నీ, ప్రతికూల పరిస్థితులలోని స్వారస్యాన్నీ ఆస్వాదించు. అయితే - వాటివల్ల ఉద్విగ్నుడవు కావద్దు, అస్థిరుడవు కావద్దు, నీ సమతూకాన్ని కోల్పోవద్దు. సంతోష దుఃఖాల ఈ బాల్య క్రీడలలో మనం మునిగిపోకూడదు. మనం ఆత్మపరాయణులం కావాలి. ‘స్వః’ను తెలుసుకోవాలి. ఆత్మ చింతనలో, ఆత్మ విశ్వాసంలో, ఆత్మ గౌరవంలో, ఆత్మ నిష్టలో, ఆత్మ సాధనలో, ఆత్మోన్నతిలో, ఆత్మ నిర్మాణంలో మనం మన ఇచ్ఛా శక్తినీ, ఊహా శక్తినీ, క్రియా శక్తినీ వినియోగించాలి. ఎందుకంటే లోపలి మూల కేంద్రం, జన్మ స్థలి ఆత్మయే. ఆత్మ - స్థితుడయిన మనిషి యొక్క అంతరంగం ఆరోగ్యకరంగా ఉంటుంది. కనుక అతడు సదా సంతోషంగా ఉంటాడు.

తత్‌
జీవన, మరణాల రహస్యాన్ని తెలుసుకో. భయమూ, ఆసక్తీ లేకుండా జీవించు. వాస్తవికత అనే గట్టి ఆధారంపై నీ కార్యకలాపాలను రూపుదిద్దుకో. జీవితంలోని క్షణాలను సద్వినియోగపరచుకుంటే, ఆత్మలాభం అనే నిజమైన ప్రయోజనం కోసం వాటిని ఉపయోగిస్తే - నేడో రేపో మృత్యువు ఎదురైనప్పుడు మనం పశ్చాత్తాప పడవలసిన, దుఃఖించవలసిన అవసరం ఉండదు.

సవితుః
సూర్యుని వలె తేజస్విగా మారు. సప్త బలాలనూ నీ జీవిత రథానికి కట్టివేయి. మన అదృష్టానికీ, మన పరిస్థితులకూ నిర్మాతలం స్వయంగా మనమే. మన సామర్థ్యం ఆధారంగా మన ప్రతి ఇచ్ఛనూ, ప్రతి అవసరాన్నీ పూర్తి చేసుకునే బలం మనకు పూర్తిగా ఉంది. శరీర బలం, బుద్ది బలం, విద్యా బలం, ధన బలం, సంఘటన బలం, శీల బలం, ఆత్మ బలం - ఈ ఏడూ జీవితంలో వెలుగునూ, ప్రతిష్టనూ, సంపదనూ, స్థిరత్వాన్నీ నింపడానికి అవసరం అవుతాయి.

వరేణ్యమ్‌
మనం దురాలోచనను వదిలి సదాలోచనను స్వీకరించాలి. అమంగళకరమైన ఆలోచనను వదిలి మంగళకరమైన ఆలోచనను స్వీకరించాలి. అందువల్ల మనస్తాపం, అసంతృప్తి అంతమవుతాయి; అంతటా అన్ని పరిస్థితులలో ఆనందం తాండవిస్తుంది. ఒక మనిషి యొక్క అంతరిక ఉన్నతియే అతడి శేష్టత్వానికి కారణం అవుతుంది. మనం గొపావాళ్లం కావాలి, శ్రేష్టులం కావాలి, సంపన్నులం కావాలి. అయితే భౌతిక వస్తువు కాక, ఆంతరిక పరిస్థితి వాటికి పునాధి కావాలి.

భర్గో
మనుషులు పాపరహితులు కావాలి; పాపాల పట్ల మెలకువ వహించాలి; పాపాల వల్ల కలిగే దుష్ఫలితాలను గుర్తించి, వాటిని ఏవగించుకోవాలి; వాటిని నాశనం చేయడానికై నిరంతరం సంఘర్షణ జరుపుతూ ఉండాలి. పవిత్రత కోసమై మన కృషి కొనసాగితే - ప్రపంచంలోని కష్టాల నుండీ, భవ బంధనాల నుండీ విముక్తి పొంది, మనం జీవన్ముక్తునిలో ఉండే స్వర్గమయ ఆనందాన్ని చూరగొనగలుగుతాము.

దేవస్య
మలినమైన దృక్పథాన్ని వదిలి, విశుద్ధమైన ఆలోచనా విధానాన్ని అవలంభించాలి. అసురత్వపు విధానాన్ని వదిలి దేవత్వపు కార్యకలాపాలను చేపట్టాలి. భవిష్యత్తులో దుఃఖాన్ని కలిగించే, ఆత్మను పతనం చెందించే క్షణిక సుఖాలకూ, ఆకర్షణలకూ, ప్రలోభాలకూ దూరంగా ఉండాలి. మనం దేవతత్వాన్ని వికసింపజేసు కోవాలనీ, దేవత్వాన్ని ప్రోత్సహించాలనీ, దైవీయమైన ఆత్మ సంకేతాలను అనుసరించాలనీ గాయత్రి బోధిస్తోంది.

ధీమహి
మనం మనలోపల సద్గుణాలను నింపుకోవాలి. నమ్రంగా, మధురంగా, శిష్టంగా, భయరహితంగా, దయాళువుగా, పురుషార్థ పూరితంగా, అలసత్వరహితంగా, శ్రమశీలంగా మన స్వభావాన్ని మలచుకోవాలి. మన వ్యవహరణలో ఉదారత, సత్యసంధత, నిజాయితీ, కపటరాహిత్యం, సహృదయత, న్యాయపరాణత్వం, సమానత్వం, ఉద్యమించే గుణం ప్రతిబింబించాలి. ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్ట, ఉన్నత పదవి, ధనం, వైభవం మున్నగు వాటిని అందించే గుణాలనూ, విశేషతలనూ, అర్హతలనూ మనం గడించాలి. భగవద్గీతలో 26 దేవీ గుణాలు పేర్కొనబడ్డాయి. వాటి సారాంశం - ఉద్వేగం లేకపోవడం, స్వచ్ఛత, వివేకశీలత, సహనశీలత, సంయమనం, శక్తి సమీకరణ, ఉదారత, కర్తవ్య పరాయణత, ఈ గుణాలను మన స్వభావంలో, అభ్యాసంలో ఇమడ్చడం అంటే - శిఖరాగ్ర స్థాయి సంపదను ఉత్పత్తి చేయడమే.

ధియో
ఏ గ్రంథం కన్న, ఏ వ్యక్తికన్న వివేకం మరింత ప్రధానమైంది. కనుక బుద్ధి సంగతమూ, వివేక సమ్మతమూ, మనకు యోగ్యమూ, సముచితమూ అయిన దానిని మాత్రమే గ్రహించాలి. వివేకం అనే గీటురాయి మీద గీయడం ద్వారా మనం ప్రతి సందర్భంలో మంచి చెడ్డలను కనుగొనగలుగుతాము. మనం వివేకవంతులం కావాలి. వివేకాన్ని అవలంభించాలి. వివేకమనే గీటురాయిపై గీసి, మనం మన ఆలోచనలనూ, పనులనూ, నిర్ణయించుకోవాలి.

యోనః
మన శక్తులలో సాధనాలలో - అవి తక్కువగా ఉన్నా, హెచ్చుగా ఉన్నా - అతి కనీసమైన భాగాన్ని మన అవసరాల కోసం వినియోగించాలి; మిగతా భాగాన్ని నిస్వార్థ భావంతో అసమర్థులకు పంచాలి. కూడబెట్టడం, అనుభవించడం అనే ఎండమావుల వెంట పరుగులు తీయకూడదు. మన అవసరాలను కనీస స్థాయికి తగ్గించుకోవాలి. వాటిని పూర్తి చేసుకున్న తరువాత మిగిలి ఉన్న శక్తిలో అత్యధిక భాగాన్ని బలహీనూలనూ, పేదలనూ, అమాయకులనూ, చదువురాని వారినీ పైకి తేవడానికై ఖర్చు చేయాలి. ఈ పని దైవ కార్యంలో పాల్గొనడమే. మన బుద్ధి కుశలతనూ, దూరదృష్టినీ, కర్తవ్య పరాయణతనూ నిరూపించడమే ఇది. ఆత్మ సంయమనంతో, పరమార్థంతో కూడిన ఈ దైవ మార్గాన్ని ‘యోనః’ మనకు చూపుతుంది. ఈ మార్గంలో పయనించే గాయత్రీ ఉపాసకుడు జీవన లక్ష్యాన్ని సాధించి తీరుతాడు.

ప్రచోదయాత్‌
ఓ భగవంతుడా! మాకు ప్రేరణను ప్రసాదించు. మా బుద్ధికి స్ఫూర్తిని ఇవ్వు. బుద్ధిలో ప్రేరణ జనిస్తే - ధనం, వైభవం అన్నీ స్వయంగా మన కాళ్ల వద్ద మోకరిల్లుతాయి. ఈ ప్రేరణ లేకపోతే కుబేరుని ఖజానాను పొందినప్పటికీ, సోమరులు దాన్ని వృథా చేస్తారు. గాయత్రిలోని ‘ప్రచోదయాత్‌’ శబ్ధంతో సద్భుద్ధికి మాత్రమే ప్రేరణ ఇవ్వవలసిందని మనం పరమాత్మను యాచన చేస్తున్నాము. మీరు ఎవ్వరినీ నిరుత్సాహపరచవద్దు. ఆత్మవిశ్వాసాన్ని కూలద్రోసే మాటలను, నిరాశ అనే కూపంలో కూరుకుపోయేటట్లు చేసే మాటలను మీరు ఎవరికీ చెప్పవద్దు. ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. మనిషిలోని ఆలోచనలను ఉన్నతం ఉదాత్తం చేసేదీ, సన్మార్గంలో పయనించడానికి మనిషి ఆత్మను ప్రోత్సహించేదీ అయిన జ్ఞానాన్ని ఇవ్వడం అన్నింటినీ మించిన దానం. మీరు మిమ్మల్ని ప్రాణవంతులను చేసుకోండి; ఇతరులతో ప్రాణ శక్తిని నింపండి.

గాయత్రి వల్ల భయరాహిత్యం
అంపశయ్యపై పడిఉన్న భీష్మ పితామహుణ్ణి యుధిష్ఠిరుడు అడిగాడు - ఏ మంత్రాన్ని జపిస్తే మనిషికి శాంతి, పుష్టి, రక్షణ, నిర్భయత్వం లభిస్తాయని. భీష్మ పితామహుడు ఇలా జవాబిచ్చాడు - ‘ఓ యుధిష్ఠిరా! గాయత్రి జపం చేసే వ్యక్తికి ధనం, గృహం, ఇతర భౌతిక వస్తువులన్నీ లభిస్తారుు. దుష్టూలు, రాక్షసులు, అగ్ని, జలం, వాయువు, సర్పాలు - వేటి వల్లా అతడికి భయం ఉండదు. నాలుగు వర్ణాలవారు, నాలుగు ఆశ్రమాల వారు దీన్ని జపించి సఫలత పొందవచ్చు. ఈ మంత్ర జపం జరిగే చోట్ల పిల్లల అకాల మరణం ఉండదు; ఎవరికీ ఎలాంటి కష్టమూ ఉండదు’.

గాయత్రీ మంత్రద్రష్ట విశ్వామిత్ర
హిమాలయాలలో తపస్సు చేస్తున్న ఋషి విశ్వామిత్రునికి సూర్య భగవానుడు ప్రత్యక్షం అయాడు. సవిత నారాయణుని రూపంలో ఆయనకు దివ్య దర్శనం ప్రసాదించాడు. పరమతత్వ స్వరూపి అరుున సవితా భగవానుని దర్శనం జరగడం వల్ల ఆయనకు పరమచేతన లభించింది, పరమ ప్రేరణ లభించింది. దాని ప్రభావం వల్ల ఆయన ముఖ మండలం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆయన నోటి నుండి మూడు మంత్రాలు వెలువడ్డారుు. దానిలో మెుదటిది గాయత్రీ మహా మంత్రం. ఋగ్వేదంలో పది మండలాలు ఉన్నారుు. మూడవ మండలంలోని 617 మంత్రాలకు ద్రష్ట విశ్వామిత్ర మహర్షి. ఆ మంత్రాలలో అనాది అరుునదీ, శ్రేష్టమైనదీ గాయత్రీ మంత్రం

''శ్రీ''





స్త్రీలు చాలా మంది ఉపాసన పధ్ధతులు ఏమిటి? ఋతుకాలం వలన మాకు గల నిషిధ్ధాలు ఎందుకు? ఇలాంటివి తరచు అడుగుతూ ఉంటారు.
స్త్రీలకు ఉపాసన ,ఆర్గం అనాదిగా యున్నది. తపస్సు ఏ ఒక్కరి ఆచరణకే పరిమితం కాదు.గోధ అనే ఋషి (స్త్రీ) యఙ్ఞంలో పశు బలిని విరోధించినట్లు తెలుస్తున్నది.
భారతం లోని సంభవ పర్వం లో చక్కని మాటలున్నాయి. దుష్యంతుని దగ్గరకు శకుంతల భరతుని తీసుకుని వెళ్లినప్పుడు ఆకాశవాణి స్త్రీల విషయంలో కొన్ని మాటలు వినిపించింది:
శ్లో:  స్త్రియ: పవిత్రమతులమేతద్ దుష్యంత ధర్మత:
      మాసి మాసి రజో హ్యాసాం దుష్కృతాన్యపకర్షతి
స్త్రీలు అనుపమానముగా పవిత్రులు. ఇది ధరమత: చెప్పబడినది. ప్రత్యేక మాసంలో వీరికి ఋతుస్రావం ఏదైతే జరుగునో అది వీరి సమస్త దోషములను దూరం చేస్తుంది!
ఆత్మావై పుత్ర నామాసి- భార్య ద్వారా పుత్రుని పొందినపుడు పుత్రుడు తండ్రి యొక్క మరో రూపమే. తండ్రి మరల భార్య ద్వారా జన్మించు చున్నాడు. అందు చేత భార్య ఆ విషయంలో తల్లితో సమానమని శాస్త్రం. ఆమె ‘జాయ ‘ అనబడుతుంది.
శ్లో: భార్యో పతి: సంప్రవిశ్య స యస్మాజ్జాయతే పున:
  జాయాయాస్తధ్ధి జాయాత్వం పౌరాణా: కవయో విదు:
ఋతు కాలం ప్రకృతి సహజమైన ఒక ప్రక్రియ. ఇది సంతాన ప్రాప్తికి ముడి పడిన విషయం. సామాన్యంగా ప్రకృతితో ఏకమయ్యి చేయు తపస్సుకు, ఇండ్లలో జరుపు పూజా విధానాలకు గల వ్యత్యాసం వలన ఇబ్బందులు ఉంటాయి. పూజా విధానాలు చాలా మటుకు శౌచం తోనే ముడి బడి ఉంటాయి. మల మూత్ర విసర్జన తరువాత విధానం ప్రకారం శుచిర్భూతులవటం కర్తవ్యం. కాకపోతే ఋతుస్రావం మీద నియంత్రణ ఉండదు కాబట్టి ఆ సమయంలో అవరోధం ఏర్పడును కాబట్టి పూజా విధానాలకు దూరంగా ఉంచటం జరిగింది. ఇది స్త్రీలను హేళన చేయుటకు కాదు. వారికి ఊరట కోసం, పూజలో స్వేఛగా పాల్గొనలేనందుకు ఒక ఏర్పాటు చేయటం.
స్త్రీలు సంధ్యావందనం చేయవచ్చా? అనునది పలువురు అడుగుతూ ఉంటారు.
సంధ్యోపాసన స్త్రీలు ఆచరించేవారు. రామాయణం లో సుందరకాండలో సీత సంధ్య వేళ సంధ్యావందనం చేసినట్లు తెలుస్తున్నది.
రామాయణం లోనే సీత ఒక విశేషమైన మాట చెప్పి యున్నది.
పతి సేవ తప్ప స్త్రీలకు ప్రత్యేకంగా శాస్త్రాలు ఏ ఉపాసనా పధ్ధతి చెప్పలేదన్నది. లేదని నిర్ధారించింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
స్త్రీకి ఉన్న గొప్ప అవకాశం అది. పతి ద్వారా సూటిగా ఆమెకు మోక్షం-షార్ట్ కట్! పురుషునికి రక రకాల కర్మలను ఆచరించవలసి యున్నది.ఆయన చేస్తున్నవన్నీ భార్యకు చెందేవే! ఆయనను విస్మరించి ఏదో వ్రతాలు చేపట్టటమంత మూర్ఖత్వం మరొకటి లేదు. అలా చేయు వారు అసలు ఉపాసన అనే మాటకు అర్థం మరచి లోఉకికమైన ఖ్యాతి కోసం తపిస్తున్నారని అర్థం.

జాగ్రత్తగా ఆలోచిస్తే స్త్రీకి వివాహం తోనే మోక్షం! అక్కడితోనే సరి! భగవంతుని చింతన ఎవరైనా చేసుకొన వచ్చును. అందు చేత నిజమైన పతివ్రత పతి కంటే శక్తి కలది! నిజమైన పతివ్రత ధర్మాన్ని కూడా ఎదిరించి నిలబడగలదని పురాణాలు చెబుతున్నాయి.ఇది సామాన్యమైన విషయం కాదు.
గాయత్రీ ఉపాసన సంగతి ఏమిటి? అని అనుకున్నప్పుడు ఒక విషయం మనవి చేయాలి. బ్రహ్మోపదేశం అనేది సంధ్యావందనం, సూర్యోపాసన వైపు తీసుకుని వెళ్లునది. సూర్యుడు కర్మలను చేయమని ప్రేరేపించు వాడని శృతులు చెబుతున్నాయి. అట్టి కర్మలను ఉపాసించి పురుషార్థం సాధించుట పురుషుని కర్తవ్యం కాబట్టి మార్గం ఆ దిశగా నిర్మించబడినది. భార్య ఆతనిని అనుసరించునపుడు ప్రత్యేకంగా బ్రహ్మోపదేశం పొందవలసిన అవసరం ఏముంటుంది?
అదలా ఉంచండి.
భారతీయులు సూర్యోపాసకులు. సావిత్రిని గాయత్రీ మంత్ర జపం ద్వారా ఉపాసించు సర్వులూ శక్తి ఉపసకులే. గాయత్రీ జపం చేయు వారందరూ ఆ శక్తి స్వరూపాన్నే ఆరాధిస్తున్నారు. గతంలో చెప్పినట్లు భర్తలో భార్య శక్తి స్వరూపిణిగా కలసి యున్నట్లు త్రిమూర్తులు వారిలో వారి భార్యలను ధరించటం మనం చూశాము!
స్త్రీలు లలితా సహస్రనామం లో ‘ గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశా…’
అనే మాటను ధ్యానిస్తే చాలు.
ఇక్కడ అందుచేత ఒక రహస్యం కనిపిస్తుంది. పురుషుడు ఒక యోగ్యురాలైన కన్యతో
ప్రకృతిలోని శక్తిని పొంది వివాహ వ్యవస్థలోకి వెళ్లాలన్నా ప్రకృతి సిధ్ధమైన సూర్యోపాసన, గాయత్రీ మహా మంత్ర జపం,  నిష్ఠతో పాటించవలసిన బ్రహ్మచర్యం అనివార్యమని మనకు తెలుస్తున్నది. అదే విధంగా స్త్రీ ఎందుకు సహజమైన శక్తి స్వరూపిణి అన్నది కూడా అర్థమవుతుంది.
సర్వే జనా: సుఖినో భవంతు!
ఓం తత్ సత్!

శౌనక‬ మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం

శౌనక‬ మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం..
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్||1||
అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా||2||
రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్||3||
ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్||4||
వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||5||
స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||6||
ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్||7||
పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||8||
రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్||9||
పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, ‪#‎అమ్మ‬ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ ‪#‎గర్భరక్షా‬ స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు
3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు
4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు
5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు
6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు
7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు
8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు
9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు-రోజూ 108 సార్లు.!!

‎అశ్వినీ‬ దేవతా స్తోత్రం..

అశ్వినీ‬ దేవతా స్తోత్రం..
ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరి
వాశం సామి తపసాహ్యనమ్ తౌ
దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ
అధిక్షిపన్తౌ భువనాని విశ్వాః
హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ
నా సత్య దస్రౌ సునసౌ వైజయంతౌ
శుక్రమ్ వయంతౌ తరసా సు వేమ్నా
వధి వ్యతంతౌ వసితం వివశ్వతః
గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం
అముంచతా మస్వినౌ సౌభగాయ
తావత్సు వ్ఱుతౌ అనమంత మాయయా
వాసత్త మాగా అరుణా ఉదా వహన్
షష్టిశ్చ గావః త్రిశతశ్చ ధేనవః
ఏకం వత్సం సువతీతం దుహంతి
నానా గోష్ఠా విహితా ఏక దోహనా
తావస్వినౌ దుహతో ఘర్మ ముక్త్యమ్
ఏకాం నాభిం సప్తశతా అరాః శ్రితాః
ప్రధిఘ అన్యా వింశతి రర్పితా అరాః
అనేమి చక్రం పరివర్తతే అజరం
మాయా స్వినౌ సమసక్తి చర్షణీ
ఏకం చక్రం వర్తతే ద్వాదశారం
షణ్ణాభి ఏకాక్ష మ్ఱుతస్య ధారం
అస్మిన్ దేవా అధి విశ్వే విషక్తాసా
వస్వినౌ ముంచతో మా విషీదతం
అశ్వినా విందు మమ్రుతం వృత్తభూయో
తిరోధత్తా మస్వినౌ దా సపత్నీ
హిత్వా గిరి మస్వినౌ గా ముదా చరం తౌ
వృత్తభూయో మహ్నా ప్రస్థితౌ బలస్య
యువాం దిశో జన యధోదశాగ్రే
సమానం మూర్ధ్ని రధయానం వియంతి
తాసాం యాత మృషయోను ప్రయాంతి
దేవా మనుష్యాః క్షితి మా చరంతి
యువాం వర్ణాన్ వికురధో విశ్వరూపాన్
తేధి క్షిపంతే భువనాని విశ్వా
తే భానవోప్యను సృతా శ్చరంతి
దేవా మనుష్యాః క్షితి మా చరంతి
తౌ నా సత్యా వశ్వినౌ మహేమ
స్రజం చయా బిబృధః పుష్కరస్య
తౌ నా సత్యా వమృతా వృధా వృతే
దేవా స్తత్ప్ర పదేన సూతే
ముఖేన గర్భం లభతాం యువా నౌ
గతా సురే తత్ ప్రపదేన సూతే
సద్యొజాతో మాతర మత్తి గర్భః
తా వస్వినౌ ముంచధో జీవసేగా
స్తోతుం నశక్నోమి గుణైర్భవంతౌ
చక్షర్విహీనః పధి సంప్ర మోహః
దుర్గే హమస్మిన్ పతితో స్మికూపే
యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే!!

గౌరీదశకమ్‬.

గౌరీదశకమ్‬.
#గౌరీదశకమ్..
లారబ్ధస్థాపితలుప్తాఖిలలొకాం
లొకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్!
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె!!1!!
తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం
 నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్!
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం
 గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె!!2!!
ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.

చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం
 చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్!
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం
 గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె!!3!!
చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం
 భూతె భూతె భూతకదంబప్రసవిత్రీమ్!
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
 గౌరీమంబామంబురుహాక్షీమహమీడే!!4!!
’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.

మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం
 సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్!
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
 గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే!!5!!
సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పీంగళా’ నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.

నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః
 సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ!
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
 గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!6!!
నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం
 భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ!
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం
 గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!7!!
గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా
 సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ!
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
 గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!8!!
చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

నానాకారైః శక్తికదమ్బైర్భువనాని
 వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా!
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం
 గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!9!!
గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆశాపాశక్లేశవినాశం విదధానాం
 పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్!
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం
 గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!10!!
తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః!
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
 తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి!!11!!
ఎవరైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.
హర హర శంకర జయ జయ శంకర
 హర హర శంకర జయ జయ శంకర!!
గౌరీదశకమ్‬..
లారబ్ధస్థాపితలుప్తాఖిలలొకాం
లొకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్!
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె!!1!!
తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.
ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం
నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్!
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె!!2!!
ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.
చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం
చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్!
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె!!3!!
చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.
ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం
భూతె భూతె భూతకదంబప్రసవిత్రీమ్!
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే!!4!!
’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.
మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం
సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్!
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే!!5!!
సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పీంగళా’ నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.
నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః
సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ!
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!6!!
నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.
యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం
భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ!
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!7!!
గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.
యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా
సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ!
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!8!!
చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.
నానాకారైః శక్తికదమ్బైర్భువనాని
వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా!
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!9!!
గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.
ఆశాపాశక్లేశవినాశం విదధానాం
పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్!
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే!!10!!
తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.
ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః!
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి!!11!!
ఎవరైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.
హర హర శంకర జయ జయ శంకర
హర హర శంకర జయ జయ శంకర!!

శ్రీమంగళ‬ చండికా స్తోత్రం..

శ్రీమంగళ‬ చండికా స్తోత్రం..

#శ్రీమంగళ చండికా స్తోత్రం..
ధ్యానం-
దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్
 బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్.
శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్
 జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్.
సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే
 దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే!!

#శ్రీ మహాదేవ ఉవాచ-
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే 
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే!!

ధ్యానం-
దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్
బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్.
శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్
జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్.
సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే
దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే!!
శ్రీ‬ మహాదేవ ఉవాచ-
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే!!

దాక్షాయణీ‬ మాత శక్తిపీఠాలు

దాక్షాయణీ‬ మాత శక్తిపీఠాలు..
Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.
ఒకప్పుడు దక్షుడు‬ బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. ‪‎పుట్టింటివారు‬ ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా ‪‎శివనింద‬ సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు‬ ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు‬ సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా‬ స్థలాలు అయినాయి. ప్రతి శక్తి‬ పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.
అష్టాదశ శక్తిపీఠాలు ప్రార్ధనా శ్లోకం:
‪‎లంకాయాం‬ శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్!!
స్థలాలు
1.‪‎శాంకరి‬ - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ‪‎ట్రిన్‌కోమలీలో‬ ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల ‪‎మందిరం‬ నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర‬ స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో ‪‎కాళీమందిరం‬ప్రసిద్ధమైనది.
2.‪‎కామాక్షి‬ - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో కంచి కామాక్షి ఉంది.
3.‪‎శృంఖల‬ - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్‬ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
4.‪‎చాముండి‬ - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
5.‪‎జోగులాంబ‬ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు ‪‎తుంగభద్రా‬ నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
6.‪‎భ్రమరాంబిక‬ - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున‬ స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 ‪‎జ్యోతిర్లింగాలలో‬ కుడా ఒకటి.
7.‪‎మహాలక్ష్మి‬ - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల ‪‎శేషుని‬ ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి‬ పడుతుంది.
8.ఏకవీరిక‬ - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ ‪#‎మాతను‬ దర్శించుకొనవచ్చును.
9.‪‎మహాకాళి‬ - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు ‪‎అవంతీ‬ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. #మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
10.పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
11.గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా-వైతరిణీ నది తీరాన ఉన్నది.
12.మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
13.కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం- బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14.మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
15.వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16.మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
17.విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.
18.సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో #ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.