మహర్షి శాప ఫలితంగా ఇంద్రుని వైభవం అంతా అంతరించింది. సామ్రాజ్య లక్ష్మితో సహా సమస్త సంపదలూ చేజారిపోయాయి. ఇంద్ర సింహాసనాన్ని రాక్షసులు ఆక్రమించుకున్నారు. ఇంద్రునితోపాటు అష్టదిక్పాలుర గణాలన్నిటికీ అథోగతి పట్టింది. అందరూ కలసికట్టుగా వెళ్లి
బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు. బ్రహ్మకూడా ఏం చెయ్యడానికీ పాలుబోక, మనకీ దుస్థితి నుంచి నారాయణుడు రక్షించాలి తప్ప అన్యులెవరకీ సాధ్యం కాదని చెప్పి, అందరితోనూ కలసి వైకుంఠుని శరణువేడాడు. మధుసూదనుని పరిపరి విధాలా స్తుతించాడు. ‘‘అతి సనాతనుడవు, ఆరాధ్యుడవు,
యజ్ఞరూపుడవు. ఏ పోలికలకూ అందనివాడువు. బ్రహ్మను కూడా నీవే సృష్టించినవాడవు. మమ్ము కటాక్షించి మాకు దర్శనం ఇవ్వవలసిందిగా కోరుతూన్నాం’’ అని
ఋష్యాదులు ప్రార్థించగా
శ్రీ మహావిష్ణువు వారికి ప్రత్యక్షమయ్యాడు. తిరిగి యావన్మందీ స్తోత్రం చేయగా,
జనార్దనుడు సంతసించి ఇట్లా పలికాడు.
మథనానికి శ్రీకారం...‘‘దేవతలారా! ఇంద్రునితో కూడి, మీరంతా రాక్షసుల వద్దకు వెళ్ళి వారిని సముద్ర మథనా నికి ఒప్పిస్తే, తదుపరి కార్యం నేను నిర్వహి స్తాను. ఇంతవరకు మీకు అమరత్వ లబ్ధిచేకూ రని కారణంగా యద్ధంలో రాక్షసుల ధాటికి మీరు నిలువజాలకున్నారు. సముద్ర మథనం వల్ల జనించే అమృతం గ్రోలి మీరు
అమరులు కండి! జాగ్రత్త! ఈ
అమృతం రాక్షసులకు దక్క కుండా నేను పథకం రచిస్తాను-’’ అంటూ ఆన తిచ్చాడు. శ్రీమాన్నారయణుని ఆదేశానుసారం వాసుకిని కవ్వంత్రాడుగా - మంథర పర్వతా న్ని కవ్వంగా మలచి దేవదానవుల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు.
హాలాహలమే మొదట వెలవడింది. వెయ్యి సంవత్సరాలకు వాసుకి తలలు భయంకరమైన విషమును
క్రక్కాయి. నిప్పుతో సమానమైన ఆ విషం వలన దేవాసురులు, మనుషులతో కూడిన ఈ ప్రపంచం దహించబడింది.
దేవతలు ఈశ్వ రుని వద్దకు వెళ్లి రక్షింపుమని కోరారు. శంఖ చక్రధారి అయిన విష్ణువు కూడా అక్కడకు వచ్చాడు. ‘
‘సురశ్రేష్ఠా! నీవు దేవలందరిలోనూ
అగ్రగణ్యుడువు. కావున
సముద్ర మధనము నందు మొదట పుట్టినది నీ భాగము. పుట్టిన ఈ విషం లోకాలన్నింటిని దహించివేస్తోంది. ఈ భయంకరమైన విషాగ్నిని ఉపసంహరించి భూత కోటిని సంరక్షించడానికి నీవే సమర్ధుడ వు. ఇతరులవల్ల ఆ మహకార్యము కాజాలదు. దీనిని అగ్రపూజగా ఎంచి విషమును గ్రహింపు ము అని విష్ణువు అంతర్థానం చెందాడు. ప్రజా పతులందరూ
ముక్తకంఠంలో పరమేశ్వరుని స్తోత్రం చేశారు. అపుడు దయా సముద్రుడైన శంకరుడు భక్తవశంకరుడై పరమేశ్వరి ముఖం చూచి ఇలా అన్నాడు. ‘‘ఓ దేవీ! లోకాలకు కల్గిన ఈ ఉపద్రవం చూశావా! ఈ
హాలాహలా న్ని అదుపు చేసి మధుర ఫలంలాగా భక్షిస్తాను. ప్రాణుల్ని రక్షిస్తాను’’ అన్నాడు.
ఆ మాటలు వి ని భవాని నిర్భయంగా ‘‘
మహాత్మా! మీ అభీష్టం ప్రకారం జరుగుతుంది’’ అని చెప్పింది. అప్పు డు సమస్త దేవదానవులు జయజయ ధ్వానము లు పలుకుతూండగా పరమేశ్వరుడు హాలాహ లానికి ఎదురునిలచి ఆ మహావిషాన్ని ఆకర్షించి పట్టుకొని దగ్గరకు చేర్చి ఒక ముద్దగా చేసి అల్లనేరేడు పండులా మెల్లగా నిగనిగలాడుతూ ఉన్న దానిని ఆ పరమశివు డు
కంఠంలోనే నిలిపివేశాడు. అలా ఘోరవి షాగ్నిని కంఠంలో నిలుపుకోవడం వల్ల ఆ
విషతీక్షణతకు ఆయన కంఠం నల్లబడింది. కంఠంలోనే నిక్షిప్తం చేసి
గరళకంఠుడయ్యాడు.కాని ఆ నలుపు కూడా ఆ తెల్లని పరమేశ్వ రుని ఒడలుకి ఒక అలంకారంగానే భాసిం చింది. ఇలా హాలాహలం విషం వల్ల కలిగి న విఘ్నాన్ని
పరమేశ్వరుడు తొలగించ గానే దేవాసురులు
క్షీరసాగర మధనం పునఃప్రారంభించారు. కవ్వముగా వున్న
మందర పర్వతం పాతాళలోకానికి కుం గింది. దేవ గంధర్వులు విష్ణువును ప్రస్తుతించారు. సమస్త ప్రాణులకు ప్రత్యేకించి దేవలకు దిక్కువు నీవే. మందర పర్వతం సముద్రములో మునిగిపోయింది. దానిని పైకి లేవనె త్తుము అని ప్రార్థించారు.
దేవతల ప్రార్థన విని
మహానిష్ణువు
తాబేలు రూపము వహించి మందర పర్వత మును వీపుపై ధరించి సముద్రం లో శయనించాడు. శ్రీ విష్ణుదేవు డు చేతులు పైకి చాపి మందర పర్వత
శిఖరమును పట్టుకున్నా డు. దేవతలతో కలిసి తానునున
సముద్ర మధనంలో పాల్గొన్నా డు. వెయ్యి సంవత్సకాలు గడి చాయి. దండ కమండలములు ధరించి ధరించి
ధన్వంతరి పాలసముద్రం నుండి ఉద యించాడు. పాలను చిలుకు ట వలన పాలనుండి ఒక రసము ఉద్భవించింది. ఆ క్షీరసాగర మథనంలో
లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం,
ఐరావతం వగైరాలన్నీ ఉద్భవించాయి. వాటితో పాటే నిప్పులు చిమ్ముతూ హాలాహలం కూడా ఎగసిపడింది. ఆ రసము నుండి కొందరు స్త్రీలు జనించారు. వారు ఆ రసం నుండి జన్మించారు కనుక వారిని
అప్సరసలు అని అన్నారు.
చిట్టచివరిగా అమృతం పుట్టింది. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారమెత్తి, రాక్షసులతో అచ్చిక బుచ్చికలాడుతూ వారిని ఏమార్చి, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిపెట్టడంతో క్షీరసాగర మథనం పూర్తయింది.
జగన్నాటక సూత్రధారి స్వీయ పర్యవేక్షణలో ఆద్యంతం ‘సుర’సవత్తరంగా సాగిన ఈ మహానాటకాన్ని