సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, June 10, 2016

హనుమంతుడి జన్మరహస్యాలు

హనుమంతుడి జన్మరహస్యాలు

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది.

రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:)  శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం(20-14, 37) స్పష్టం చేసింది.

అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం(20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది.   అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం(66-16, 18,19) . సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం(66-24).

అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.

విష్ణు కథ - 16

విష్ణు కథ - 16

కృత, త్రేతా యుగాల తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి, భూమికి బరువయ్యారు. భూదేవి విష్ణువుతో మొరపెట్టింది.

విష్ణువు, ‘‘దేవీ! కృష్ణావతారం ఎత్తి, నీ ఆర్తి తొలగిస్తాను!’’ అని అభయమిచ్చాడు.

ఆదికాలం నుంచీ విష్ణువుకు ప్రబల శత్రువైన కాలనేమి రాక్షసుడు కంసుడుగా పుట్టి, మధురానగరాన్ని పాలించే ఉగ్రసేనుడి కుమారుడనిపించుకున్నాడు.

దేవాసుర యుద్ధంలో, దానవ నాయకుడై విష్ణువుతో భీకరంగా పోరాడిన విప్రచిత్తి, మగథ రాజ్యాన్నేలే జరాసంధుడై పుట్టి, రాజులను తెచ్చి భైరవుడికి బలులిచ్చి అతి శ్రద్ధగా దీక్షతో అర్చిస్తున్నాడు. కంసుడు జరాసంధుడి అల్లుడు.

ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకికి, యదువంశ రాజైన వసుదేవుడితో వివాహం జరిగింది. కంసుడు వారిని రథం మీద తీసుకుపోతూండగా, ఆకాశవాణి - దేవకి ఎనిమిదో సంతానంవల్ల కంసుడు చంపబడతాడు - అని పలికింది.

కంసుడు దేవకిని చంపకుండా వసుదేవుడు అడ్డుపడి, ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి ఇచ్చిన మాట తప్పకుండా, ఆరుగుర్ని అప్పగించాడు.

దేవకి ఏడవ గర్భాన విష్ణువు అంశతో ఆదిశేషుడు పడ్డాడు. ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్యయైన రోహిణి గర్భాన చేర్చి, పిమ్మట నందగోపుడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగ మాయాదేవిని విష్ణువు ఆదేశించాడు.


దేవకి ఏడవగర్భం ప్రసవం రాకుండా అణగారిపోయింది. తర్వాత దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించిన వెంటనే, దేవకీ వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు.

అది శ్రావణ మాసం. కృష్ణపక్షం. అష్టమి ప్రవేశించింది. చంద్రుడు రోహిణీ నక్షత్రంతో   ఉన్నాడు. నడి రాత్రి. కావలి భటులకు చావునిద్ర ముంచుకొచ్చింది. దేవకి ప్రసవించింది. విష్ణువు కృష్ణుడుగా అవతరించాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి.

విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డడిని యమునానదిని దాటించి, అదే సమయంలో గోకులంలో అందర్నీ మాయనిద్ర ఆవహించగా, ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోద పక్కలో పిల్లవాణ్ణి ఉంచి, ప్రాణం లేనట్లున్న పిల్లను సంగ్రహించుకొని తిరిగి వెళ్ళాడు.

చెరసాల చేరగానే దిక్కులు పిక్కటిల్లేలాగ ఆ శిశువు క్యారుమని గగ్గోలు చేసింది.

కంసుడు శిశువును వధ్యశిల పైకొట్టి చంపబోగా పైకెగసి, పకపక నవ్వుతూ, ‘‘ఓరి, కంసా! నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే!’’ అని చెపుతూ, దుర్గాదేవిగా కనిపించి అంతర్థానమైంది.

కంసుడు భయంతో, ఆగ్రహంతో దేవకీ వసుదేవుల ఎదుట వారి ఆరుగురి బిడ్డల్నీ తెగటార్చాడు.

గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి, గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి. అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు పుట్టాడు.

నారదుడు కంసుడి దగ్గిరికి వచ్చి, ‘‘కంసా! నువ్వు ఉగ్రసేనుడి కుమారుడివి కావు; కాలనేమివి! నిన్ను చంపాలని పుట్టిన ఆ విష్ణువు ఎక్కడో ఉన్నాడని వింటివి గదా? నీ పిలుపు కోసం రాక్షసులు ఎదురు చూస్తున్నారు!’’ అని హెచ్చరించి వెళ్ళాడు.

ఉగ్రసేనుడితో వివాహమై, విరహంతో ఉన్న ఉగ్రసేనుడి రాణివద్దకు ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంతో వెళ్ళినప్పుడు, కాలనేమి ఆమె గర్భంలో ప్రవేశించి కంసుడుగా పుట్టాడు.
కంసుడు ఉగ్రసేనుడిని కారాగారంలో వేయించి సింహాసనం ఆక్రమించాడు.
పసివాళ్ళను చంపమని పూతన రక్కసిని పంపాడు. ఊరూరా పసిపాపల్ని చంపుతూ, మానవకాంత రూపంతో వెళ్ళి పాలీయ వచ్చిన దాని ప్రాణాలు పీల్చి చంపాడు కృష్ణుడు.

యవనమ్లేచ్ఛులకు రాజైన కాలుయవన రాక్షసుడిని జరాసంధుడు కృష్ణుడి మీదకు ఉసిగొల్పాడు.

కృష్ణుడు కాలుయవనుడికి దొరక్కుండా పరుగెత్తి ముచికుందుడు నిద్రిస్తున్న గుహలో జొరబడి దాక్కున్నాడు.

ముచికుందుడు ఇక్ష్వాకుల నాటి మాంధాత కుమారుడైన గొప్ప రాజు. యుద్ధాల్లో దేవతలకు గొప్ప సహాయం చేశాడు. దేవతలు వరం కోరుకోమనగా మోక్షాన్ని కోరాడు. ద్వాపరయుగంలో కృష్ణుడి దర్శనం అనంతరం సిద్ధిస్తుందని దేవతలు చెప్పగా అంతవరకు నిద్రను, నిద్రాభంగం చేసినవారు తను చూడగానే భస్మం కావలెనని కోరుకున్నాడు.

కాలయవనుడు ముచికుందుణ్ణి కృష్ణుడనుకొని తన్నాడు. నిద్రాభంగమై ముచికుందుడు తీక్ష్ణంగా చూసేసరికి కాలువనుడు బూడిద అయ్యాడు.

కృష్ణుడు ముచికుందుడికి దర్శనమిచ్చి, బదరికాశ్రమం చేరుకొని తపస్సు చేశాక మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు. జయ, విజయులు వారి మూడో జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు, దంతవక్త్రుడుగా పుట్టారు.
చేదిదేశానికి రాజైన దమఘోషుడికి కుమారుడుగా శిశుపాలుడు నాలుగు చేతులతో, మూడు కన్నులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకున్నప్పుడు మూడో కన్ను, రెండు చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతాడని ఆకాశవాణి చెప్పింది. శిశుపాలుడి తల్లి సాత్వతి వచ్చిన వారందరికీ పిల్లవాణ్ణి ఎత్తుకోమని ఇస్తుండేది.

కృష్ణ బలరాములకు సాత్వతి అత్త అవుతుంది. తన పిల్లవాణ్ణి వారికీ ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపుడ్యూడు.

శిశుపాలుడిని నూరు తప్పుల వరకు విడిచి పుచ్చమని సాత్వతి అర్థించింది. కృష్ణుడు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు.

శిశుపాలుడు రాజై జరాసంధుడితో చేరి అత్యాచారాలూ, అపరాధాలూ చేస్తూ వచ్చాడు. అతడికి తమ్ముడు దంతవక్త్రుడు తోడైనాడు.

జరాసంధుడు మాటిమాటికీ మధురా నగరంపై దాడి చేస్తూంటే కృష్ణుడు పలు మార్లు ఓడించి, తరిమికొట్టి, దుర్మార్గులైన రాజులెందర్నో కడతేర్చాడు.

కృష్ణుడు సముద్రుణ్ణి చోటు అడిగి సముద్ర మధ్యంలో విశ్వకర్మచేత సురక్షతమైన ద్వారకానగరాన్ని వైభవోపేతంగా నిర్మింపజేసి తనవారినందరినీ ద్వారకకు తరలించాడు.

జరాసంధుడు చివరిసారిగా శిశుపాలుడు, దంతవక్త్రుడు, పౌండ్రకుడు, సాళ్వుడు మొదలైన తన అనుయాయులైన రాజులందర్నీ కూడగట్టుకొని మధురను ముట్టడించాడు.

అంతకుముందే యాదవుల్నీ, మధురా ప్రజనూ, ద్వారకకు పంపించిన కృష్ణ బలరాములు ప్రవర్షణగిరికి చేరుకొని శిఖరాగ్రాన్ని అధిరోహించారు.

జరాసంధాదులు ప్రవర్షణ గిరి చుట్టూరా మంటను పెట్టి గిరిని కాల్చారు. కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షతంగా చేరుకున్నారు.

జరాసంధుడూ, శిశుపాలుడూ కృష్ణ బలరాములు దగ్థమై ఉంటారని పొంగిపోతూ వెళ్తుంటే, ద్వారక నుండి కృష్ణుడు పూరించిన శంఖధ్వని విని తెల్లముఖాలతో ఒకర్నొకరు చూసుకున్నారు.

శిశుపాలుడు అక్కసుకొద్దీ మధురా నగరాన్ని నిప్పుపెట్టి కాల్చాడు. జరాసంధుడు నౌకల మీద ద్వారకను ముట్టడించాలని సైన్యాలను పంపాడు. పెను తుఫానులో చిక్కుకొని నౌకలన్నీ మునిగిపోయాయి. జరాసంధుడు ఈవలి సముద్రం ఒడ్డున కెరటాల విజృంభణ చూస్తూండగా, ‘‘తాతా!’’ అన్న కృష్ణుడి పిలుపు, పకపక నవ్వు వినిపించి సముద్ర మధ్యంలో ఒక గుట్ట మీదనిల్చుని నవ్వుతున్న కృష్ణుడు కనిపించాడు.

‘‘జరాసంధా! ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు. నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు. నీ సమబలుడైన వాడిచేత చస్తావు. కొంతకాలం గతించాక మళ్లీ పునర్దర్శనం, వెళ్ళు!’’ అన్నాడు కృష్ణుడు.

విదర్భ రాజైన భీష్మకుడికి కుమార్తెగా లక్ష్మి రుక్మిణిగా పుట్టింది. బాలప్రాయం నుంచీ కృష్ణుడే తన నాథుడని చెప్పుకొనేది. అటువంటి రుక్మిణిని, రుక్మిణి అన్న రుక్మి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శిశుపాలుడితో వివాహం చెయ్యడానికి సర్వసన్నాహాలు చేశాడు.

ఆ వివాహం తప్పించి తన్ను చేపట్టి రక్షంచమని రుక్మిణి కృష్ణుడికి తమ పురోహితుడి ద్వారా కబురు పంపింది.

పెళ్ళికి ముందు రుక్మిణి దుర్గను పూజించి, ఆలయం నుంచి వస్తూండగా, కృష్ణుడు రుక్మిణి చేయిపట్టి నాలుగు గుర్రాలు పూన్చిన తన రథం మీదకు ఎక్కించుకొన్నాడు. రుక్మి, శిశుపాల జరాసంధాదులు ఎదుర్కొన్నారు.
బలరాముడు యాదవ వీరులతో వెనుకనే వచ్చి తమ్ముడితో కలిశాడు.

కృష్ణుడు శిశుపాలుణ్ణి తరిమికొట్టాడు. బలరాముడు జరాసంధుడినీ ఓడించి తరిమాడు. శత్రు రాజులందర్నీ కృష్ణ బలరాములు చిందర వందర చేశారు. కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతూంటే వెంట తలపడిన రుక్మిని ఓడించి జుట్టూ, మీసమూ గొరిగి పరాభవించి విడిచి పెట్టాడు. రుక్మి మరెప్పుడూ కృష్ణుడి జోలికి పోలేదు.

క్షత్రియ వీరుడికి తగిన రాక్షస వివాహంగా ఎత్తుకు వచ్చిన రుక్మిణీ కళ్యాణం కృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది.

తరువాత కృష్ణుడు నీలాపనింద తొల గించుకోడానికి అరణ్యం పట్టి, గుహలో జాంబవంతుడితో యుద్ధం చేసి, శ్యమంతక మణిని తెచ్చి, సత్రాజిత్తుకి ఇచ్చి, భూదేవి అంశగల అతని కుమార్తె సత్యభామను వివాహం చేసుకొన్నాడు. తరువాత జాంబవతి, మిత్రవింద, కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితిలను వివాహం చేసుకొని అష్ట మహిషులతో అష్ట సిద్ధులుగల యోగపురుషుడిలాగ, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ, ద్వారక రాజధానిగా యాదవులకు ప్రధాన నాయకుడై వెలుగొందుతున్నాడు.

విష్ణు కథ -15

విష్ణు కథ -15

రాముడు పట్టాభిషిక్తుడై, లక్ష్మణ భరత శత్రుఘ్నుల అండదండలతో రాజ్యాన్ని చక్కదిద్ది, ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తూండగా, ప్రజలు అన్నివిధాలా ఆనందిస్తున్నారు.
ఒకనాడు పల్లెటూరి బ్రాహ్మణుడు ఒకడు తన అయిదేళ్ళ కొడుకు శవం తెచ్చి రాజద్వారం దగ్గిర నిలబడి ఏడవటం మొదలు పెట్టాడు. తనకున్న ఒకే కొడుకు అకాలమరణం పొందినందుకు ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు "రాజు సరిగా పాలిస్తే ఇలాటి అకాలమరణాలుండవనీ, ఇన్నాళ్ళకు ఇక్ష్వాకుల పరిపాలనలో, రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదయింద"నీ అన్నాడు.

రాముడీ సంగతి తెలుసుకుని చాలా చింతించి, తన మంత్రులనూ, వసిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులనూ పిలిపించి, వారితో బ్రాహ్మణ బాలుడి అకాలమరణం గురించి చెప్పాడు. శంబూకుడనే ఒక శూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడనీ, అది యుగధర్మానికి విరుద్ధమనీ, అందుకే ఆ బాలుడు చనిపోయాడనీ, నారదుడు రాముడితో అన్నాడు.

రాముడు లక్ష్మణుడితో, ‘‘నీవు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి ఓదార్చి, ఆ బాలుడి కళేబరాన్ని తైలభాండంలో భద్రంగా వుంచు," అన్నాడు. తరవాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి పడమరా, ఉత్తరమూ, తూర్పూ గాలించి, చివరకు దక్షణదిక్కున ఒక సరస్సులో తలకిందుగా తపస్సు చేస్తున్న మనిషి నొకణ్ణి చూశాడు.

రాముడు పుష్పకం దిగి, తన కత్తి దూసి శంబూకుడి తల నరికాడు. శంబూకుని తల కళ్ళు విప్పి ఆనందంగా రాముణ్ణి చూసి ‘‘రాఘవా! మరణమన్నది ఏదో ఒకలాగ తప్పనిది. నీవు నిమిత్తమాత్రుడివి.


వివిధవర్గాలతో కూడిన ప్రజలకు నీవు రాజువి; రాజు ప్రజాసేవకుడు, ఆ ధర్మాన్ని నిర్వర్తించావు. నీవు విచారించవలసిన పనిలేదు. నిన్నెటువంటి పాతకమూ అంటదు; నేను కులానికీ, వృత్తికీ అతీతుడైన యోగిని; విష్ణుసాయుజ్యాన్ని పొందుతున్నాను!’’ అని చెప్పి కళ్ళు మూసింది.

శంబూకుని భార్య కపిల రాముడితో, ‘‘సీతాపతీ! రాజధర్మ నిర్వహణలో మున్ముందు నీవు ఎదుర్కొనవలసి ఉన్న కఠోర పరీక్షకు ఇది నాంది! నేను నా భర్తతో సంతోషంగా వెళ్తున్నాను, దృఢచిత్తుడవై కర్తవ్యపాలన చెయ్యి!’’ అని చెప్పి భర్తతో చితిపై సహగమనం చేసింది.

రాముడు తిరిగి వస్తున్న దారిలో, ఒక గుడ్లగూబకు చెందిన చెట్టు తొరన్రు దురాక్రమణ చేసిన గ్రద్దను శిక్షస్తున్నట్లుగా దాని తలమీద చేత్తో తట్టాడు. ఆ వెంటనే గ్రద్ద రూపం పోయి బ్రహ్మదత్తుడనే రాజు శాపవిమోచనం పొంది వెళ్ళాడు. విశ్వామిత్రుడు రాముడి కొలువుకు వచ్చి, తనను అవమానించిన శకుంతుడు అనే రాజును వధించవలసిందిగా ఆజ్ఞాపించాడు.

అప్పటికప్పుడే రాముడు గురువు ఆనతిని తలదాల్చి శకుంతుణ్ణి వధించడానికి బయలుదేరాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి శకుంతుడికి శరణు ఇచ్చింది. హనుమంతుడు తల్లి మాట నిలపడానికి, రామబాణానికి ఎదురొడ్డి రామనామం జపిస్తూ కన్నులు మూసి నిలబడ్డాడు. రాముడు విడిచిన బాణం హనుమంతుడి హృదయంలో లీనమైంది.

ఇది చూసిన విశ్వామిత్రుడు దురాగ్రహం  విడిచి శకుంతుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళాడు.

ఒక అర్ధరాత్రి రాముడి శయన మందిరం ముందు ఒక కుక్క న్యా…యం కోసం ఆర్తనాదం చేసింది. రాముడు దిగ్గున వచ్చి రక్తం కారుతూన్న దాని గాయాన్ని అదిమిపట్టాడు.
కుక్క తాను కిందటిజన్మలో పూజారిగా ఉన్నందువల్లే కుక్కగా పుట్టాననీ, నిష్కారణంగా తన్ను కొట్టినవాడిని పూజారిగా నియమించవలసిందనీ, అదే తగిన శిక్ష అనీ చెప్పింది. దాని గా…యం మాయమై సుఖంగా వెళ్ళింది.

ఏ ప్రాణికీ నొప్పి కలగకుండా చక్కగా రాజ్యపాలన జరుగుతున్న రామరాజ్యంలో - ‘‘పరాయివాడి ఇంట ఉన్న భార్యను తెచ్చి పెట్టుకొనేలాంటి సిగ్గుచేటు పని చేయడానికి, రాజ్యమేలే రాముడిని కాను-!’’ అనే మాట ఒక అల్పుడి నోట వెలువడింది.

 సీతను అరణ్యంలో వదిలి రమ్మని రాముడు లక్ష్మణుడితో చెప్పాడు. లక్ష్మణుడు ఆక్రోశంతో ఆవేశపడుతూంటే, ‘‘లక్ష్మణా! ఒక అల్పుడు ఆడంబరంగా పలికిన మాట ఎంతోమంది మనస్సుల్లోనో దాగి ఉండవచ్చును గదా! రాజ్యమంటే నేలకాదు, మనుషులు! భిన్నవర్గాలతో నిండిన ఆ ప్రజల్ని పాలించడం అనేది కత్తి పదును మీద నడక! స్వార్థానికి ఏ మాత్రం తావు లేదు. జనవాక్యాన్ని కర్తవ్యంగా ఎంచి, గుండెను రాయి చేసుకొనవలసిన రాజును నేను!’’ అని రాముడు అన్నాడు.

మునిపత్నులతో ఆశ్రమాల్లో ముచ్చటగా గడపాలన్న నిండు చూలాలైన సీత కోరిక చెల్లించే నెపంతో, లక్ష్మణుడు రథం మీద సీతను తీసుకెళ్ళి కీకారణ్యంలో దిగవిడిచి వచ్చి, ‘‘అయ్యో! ఆనాడు హనుమంతుడు  సంజీవిని తెచ్చి నన్ను బ్రతికించింది ఇందుకా!’’ అని గుండెలవిసేలాగ రోదించాడు. వాల్మీకి మహర్షి సీతను తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. సీత కుశుడు, లవుడు అనే అందమైన కవల కుమాళ్ళను కన్నది.

అయోధ్యా రాజ్యంలో అనావృష్టి ఏర్పడింది. వర్షాలు సరిగ్గా కురవక భూమి బీటలు బారింది. సీతావియోగంతో కుమిలి పోతున్న రాముడితో అశ్వమేధయాగం చే…యమని పెద్దలు ఆదేశించారు. బంగారంతో సీత విగ్రహాన్ని చేయించి పక్క నుంచుకొని రాముడు యాగదీక్ష పట్టాడు. లవకుశులు వాల్మీకి రచించిన రామా…యణాన్ని గానం చేస్తూ అయోధ్యకు వచ్చారు. ముని బాలకులమని చెప్పుకొన్న వారిని చూసి రాముడు ముచ్చటపడి కౌగలించుకొని కానుకలిచ్చి పంపాడు.

రఘు వంశీ…యులకు తప్ప అన్యులకు పట్ట శక్యం కాని అశ్వమేధయాగాశ్వాన్ని లవకుశులు పట్టి కట్టేశారు. యాగాశ్వాన్ని విడిపించడానికి వచ్చిన శత్రుఘ్న, భరత, లక్ష్మణులతో …యుద్ధం చేసి, వాళ్ళను మూర్ఛపోయేలా చేసిన లవకుశులను రాముడు ఎదుర్కొన్నాడు. లవకుశులు తల్లి మీద ఆనపెట్టి బాణాలు వదిలారు. రాముడు మూర్ఛపోగా సీత వచ్చి పాదాలుపట్టి మేల్కొలిపింది. రాముడితోబాటు అంతా మూర్ఛ నుండి లేచారు. వాల్మీకి రాముడికి కుమాళ్ళనూ, సీతనూ అప్పగించాడు.

రాముడు సీతతో సింహాసనంపై కూర్చొని లవకుశులను తొడలపై కూర్చుండబెట్టుకొని వారిని …యువరాజులుగా ప్రకటించాడు. తరువాత రాముడు సీత తన ఔచిత్యానికి తగ్గట్టుగా అయోధ్యా ప్రజలముందు శపథం చే…యవలసిందని చెప్పాడు.

సీత అయోధ్యానగర మధ్యంలో నిలబడి ఆకాశాన్ని చూసి, అయోధ్యా రాజ్యంపై వర్షం కురవాలని పలికింది. మరుక్షణంలో ఆకాశం మబ్బులతో నిండి అమృత జలధారలతో రాజ్యమంతటా వాన కురిసింది. ఆ తరువాత సీత నేలను చూస్తూ, ‘‘అమ్మా! రఘువంశదీపకులైన కుమాళ్లు తండ్రి అండ చేరుకున్నారు. నాకు కావలసిందింకేమీలేదు, కరుణతో నన్ను స్వీక రించు!’’ అన్నది.

భూమి కంపించింది. భూమి రెండు పాయలుగా చీలింది. దివ్యకాంతులు వెలువడ్డాయి. రత్నసింహాసనంపై భూదేవి మీదకువచ్చి సీతను తన ఒడిలోకి తీసుకొని భూమిలోకి వెళ్ళిపోయింది. పుష్పవృష్టి కురిసింది. భూమి వెంటనే మూసుకుంది. రాముడు భూమిని చీలుస్తానని విల్లెక్కు పెట్టాడు. అప్పుడు ఆకాశవాణి, ‘‘రామా! భూదేవిపై ఆగ్రహించడం పాడి కాదు. సీత భూజాత. భూమిలోకి వెళ్ళి నిజనివాసం చేరింది!’’ అని పలికింది.

 రాముడు కుమాళ్ళను చూసుకొంటూ చాలాకాలం రాజ్యం చేశాక, యమధర్మ రాజు బ్రాహ్మణవేషంతో వచ్చి, దేవ రహస్యం చెప్పవలసి ఉందనీ, లక్ష్మణుడిని ద్వారం దగ్గిర కాపుంచమనీ, ఎవరినైనా రానిచ్చితే లక్ష్మణుడు మరణదండన పొందాలనీ, రాముడితో చెప్పి ఒప్పించాడు. లక్ష్మణుడు ద్వారపాలన చేస్తున్నాడు. యముడు నిజరూపంతో కనిపించి రాముడితో అవతరించిన పని తీరిందనీ, వైకుంఠానికి విష్ణువుగా చేరవలసిందనీ చెప్పాడు.

అదే సమయంలో దుర్వాసుడు వచ్చి తక్షణం రాముడిని చూడటానికి వెళ్ళ నివ్వకపోతే రఘువంశాన్ని శపిస్తానన్నాడు. దుర్వాసుణ్ణి లోనికి వెళ్ళనిచ్చి, లక్ష్మణుడు అలాగే వెళ్లి సరయూనదిలో మునిగిపో…యాడు.

రాముడు లవకుశులను పట్టాభిషిక్తుల్ని చేసి రాజ్యపాలన చేయించాడు. అది శ్రావణమాసం. సర…యూనది నిండుగా ఉరకలెత్తి ప్రవహిస్తూన్నది. ఆనాడు పూర్ణిమ. చంద్రగ్రహణపర్వదినం. మంగళ తూర్యనాదాలు మ్రోగుతూండగా, భరతశత్రుఘ్నులు ఇరువైపులా అంటి పెట్టుకొని నడుస్తూండగా, రాముడు సరయూనదికి బ…యలుదేరాడు. అశేష ప్రజానీకం అనుసరించారు.

రాముడు నదీజలాల్లో ప్రవేశించాడు. వెనుకనే తమ్ముళ్ళు దిగారు. అప్పుడే గ్రహణం విడిపోయి, నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆకాశం నుండి జలజలా అఖండంగా పూలవాన కురిసింది. సామ,దేవగాంధార, హిందోళ, సురట రాగాల మేళవింపుతో వీణాధ్వనులు దిక్కులు మారుమ్రోగుతూండగా వినిపించాయి.

అంతటా వెన్నెల మరింత తెల్లగా వెల్లి విరుస్తున్నది, పూలవాన కురుస్తున్నది; క్షీరసాగరంలాగ సర…యూనది పూల రాసులతో నిండిన ఉవ్వెత్తు కెరటాలతో వడివడిగా సాగింది!
అంతకుముందే క్షీరసాగరంలో లక్ష్మణుడు శేషతల్పంగా, సీత లక్ష్మిగా అమరి ఎదురుచూస్తున్నారు. భరతశత్రుఘ్నులు శంఖచక్రాలుకాగా రామావతారం చాలించి, విష్ణువు లక్ష్మిపాదాలొత్తగా శేషతల్పం అలంకరించాడు.

మాయామానుష విగ్రహుడై ఉత్తమ మానవతామూర్తిగా పితృవాక్యపాలనకై వనవాసం చేసి, కార్యసాధకుడైన మానవ మాత్రుడిగా వానరులను కూడగట్టుకొని వారధినికట్టి, అజేయుడనని విరవ్రీగిన రావణుడినికొట్టి రాక్షసపాలన అంత మొందించి సీతను తెచ్చి, ఏకపత్నీ వ్రతుడై ఆదర్శపాలన చేసిన రాముడి అవతారం విష్ణువు దశావతారాల్లో చాలా విశేష మైనదిగా కీర్తింపబడింది.

కీర్తింపబడింది. రామరాజ్యం ఆచంద్రార్కం పేర్కొన బడుతుంది-అని సూతమహర్షి రామావతారం ముగించి, కృష్ణావతారం గురించి చెప్పడం ప్రారంభించాడు: ఒకానొకప్పుడు శివుడు తన భక్తులైన దానవప్రముఖుల్ని అవలీలగా విష్ణువు అంతమొందించడం చూసి అసహనంగా కనుబొమలు ముడిచాడు. ఆ బొమముడి నుండి సహస్రకవచుడు అనే ఘోరాకారుడు ఉద్భవించాడు. పొరలు పొరలుగా వెయ్యి కవచాలు, అజేయ ప్రభావంగల అద్భుత కుండలాలుగల సహస్రకవచుడు ప్రళయ భీకర గర్జన
చేసి, ‘‘నేను తెలివిమాలిన రాక్షస మాత్రుణ్ణికాను, రుద్రాంశ సంభూతుణ్ణి! చేవగలవాడైతే ఆ విష్ణు నన్నేం చేగలడో చెయ్యమనండి!’’ అని లోకాలు దద్దరిల్లేలాగ అరిచి విజృంభించాడు.

విష్ణువు నర, నారాయణులనే జంట ఋషులుగా అవతరించాడు. నరనారాయణులు దురహంకారి అయిన సహస్రకవచుడిని జయించగల శక్తిసాధనకు తపస్సు ప్రారంభించారు. ఇంద్రుడు వారి తపోభంగానికి అప్సరసల్ని పంపాడు. నారా…యణుడు తన తొడ నుండి అద్భుత సౌందర్య రాశి అయిన ఊర్వశిని పుట్టించాడు. ఊర్వశి ముందు రంభాది అప్సరసలు వెలవెలపోయారు. ఇంద్రుడు నరనారాయణులకు క్షమాపణ చెప్పుకొని ప్రణమిల్లాడు. నారాయణుడు ఊర్వశిని తీసుకుపొమ్మన్నాడు.

అప్సరసలతో కలిసి ఊర్వశి సంతోషంగా స్వర్గలోకం చేరింది. నారాయణుడు, నరుడు ఒకరు తపస్సు చేస్తుంటే ఒకరు విల్లమ్ములు ధరించి సహస్రకవచుడితో పోరాటంచేస్తూ, అలాగ వేలసంవత్సరాల పొడుగున సాగిన …యుద్ధంలో, తొమ్మిదివందల తొంభైతొమ్మిది సహస్రకవచుడి కవచాలను ఛేదించారు. సహస్రకవచుడు ఒకే కవచంతో పారిపోయి సూర్యుడిలో దాక్కున్నాడు. ‘‘ప్రగల్భాలు పలికి చివరికి పారిపోయి దాక్కున్నాడు, పిరికిపంద! వీడి పని కృష్ణావతారంలో పట్టించాలి!’’ అని విష్ణువు నిశ్చయించుకున్నాడు.

విష్ణు కథ - 14

విష్ణు కథ - 14
విభీషణుడిలాగే రావణుడి పట్టమహిషి మందోదరి కూడా భర్తకు హితవు చెప్పింది. ‘‘నాథా! ముక్కు చెవులు కోసినందుకో, వరించమంటే వరించనందుకో, నీ చెల్లెలు అవమానం భరించలేకపోయినప్పుడు; ఒంటరిదాన్ని, అసహా…యురాల్ని, బంగారాన్నో, పశువునో, పక్షనోలాగ ఎత్తుకు వచ్చినందుకు, సీత ఎంత బాధపడుతుందో ఊహించావా? శూర్పణఖ ప్రతీకారంతో సీతను ఎత్తుకు రమ్మన్నట్లే, సీతకు జరిగిన అవమానానికి ఆమెకు ఇంకెంత కసి ఉంటుందో ఆలోచించు!’’ అన్నది.

రావణుడు, ‘‘ఔను మందోదరీ, ఇప్పుడు తెలుస్తున్నదిగానీ, కానీ-ఏమైనా కానీ, రావణుడు తల వంచడం అనేది లేదు! నీ భర్త భీరువుకాడు. పిరికిమందు నూరి పోయకు! కేవలం మానవుడైన ఆ రాముడు ఏం చేయగలడో నేనూ చూస్తాను,’’ అన్నాడు.

ఎక్కడెక్కడి వనాల్లోని వానరులంతా చేరుకొని రాముడి సేనగా తయారయ్యారు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, సుషేణుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులంతా సేనానాయకులై రాముడికి అండదండలుగా నిల్చారు. హనుమంతుడు రాముడి కార్యకర్తగా, అంగరక్షకుడిగా లంకపై దాడికి సర్వసన్నాహాలు ప్రారంభమయ్యాయి.

హనుమంతుడు పర్వతాలు, కొండలు తెచ్చి సముద్రంలో వేశాడు. వానరులు పెద్ద బండలు, శిలలు తెస్తున్నారు. చిన్న కోతులు రాళ్ళు మోసుకొస్తున్నారు.

నూరు యోజనాల పొడవునా లంకకు సముద్రం మీద సేతు నిర్మాణం అతి వేగంగా ఎంతో ఉత్సాహంతో ప్రారంభమైంది.

 నీలుడు సేతు నిర్మాణపర్యవేక్షణాబాధ్యత తీసుకున్నాడు. విభీషణుడు ఆకాశమార్గాన రాముడి శరణాగతుడై వచ్చాడు. రాముడతనికి అభ…ుమిచ్చి లంకకు రాజును చేస్తానని చెప్పాడు. అప్పటికప్పుడు సముద్ర జలాలతో అతణ్ణి లంకకు రాజుగా అభిషేకించాడు.

రాముడు వారధికట్టించి, కోదండాన్ని, రామబాణాన్ని రెండు చేతులతో పట్టుకొని, వానరసేనలు వెంటరాగా, ఇరుపక్కల లక్ష్మణుడు, హనుమంతుడు నడుస్తూండగా,  లంకను ముట్టడించడానికి బ…ులుదేరాడు. విభీషణుడు వారిని అనుసరించాడు. వేగులు రాముడు వానరసేనలతో సముద్రం దాటి వస్తున్న వార్త తెచ్చారు. రావణుడు చకితుడ…్యూడు. ఒక నరుడు వానరులను కూడగట్టుకొని, సముద్రం మీద నూరు ెూజనాల పొడవు వంతెన కట్టి, ముల్లోకాలను గడగడలాడించే రావణాసురు డంతటివాడిని కొట్టి తన సొత్తయిన భార్యను తెచ్చుకున్నాడు అని అనిపించుకోవడమే! ఏమిటిది? ఇది జరుగుతుందా? కట్టడం మాత్రమే జరిగినంత మాత్రాన మిగతా రెండూ జరుగుతా…ుని భ…ుపడ్డం దేనికి? అని అనుకుంటూన్న రావణుడితో, మంత్రి ప్రహస్తుడు, ‘‘శత్రువును దారిలోనే ఎదుర్కొని తుద ముట్టించడం మంచిది!’’ అన్నాడు.

రావణుడు నవ్వి, ‘‘మన కుంభకర్ణుడికి తగినంత ఆహారం దొరకడం లేదు. వాళ్ళు లంకకు రానీ! సాలెగూటిలో చిక్కుకున్న ఈగల్లాగ, నా తమ్ముడి ఆకలికి పనికొస్తారు!’’ అన్నాడు. రాముడు వానరసేనలతో వారధిని దాటి లంకా తీరాన్ని చేరాడు. లంకానగరం ఎత్తయిన పర్వతం చివరంటా నిర్మించబడింది. పర్వతాగ్రం మీది సౌధంలో రావణుడు ఉంటాడు.

ఆ సౌధాగ్రం నుంచి రావణుడు రామదండు విడిసిన తీరాన్ని చూశాడు. తీరం పొడవునా చీమలబారుల్లాగ వానర సేనలు వ్యూహాలు పన్నుతున్నారు. అంగదుడికి వీరావేశం వచ్చింది. రివ్వున ఎగిరి వెళ్ళి రావణాసురుడి సౌధం మీద వాలాడు. ‘‘ఓ, రావణా! ఒకప్పుడు నిన్ను తోకతో చుట్టి విసిరేసిన వాలి కుమారుణ్ణి నేను, అంగదుణ్ణి! అప్పటి నుంచి నువ్వు, మా తండ్రిపట్ల గౌరవమర్యాదలతో మిత్రుడిగా ఉన్నావు గనుక, చెబుతున్నాను.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాముడితో వైరం మాను. శరణు వేడు. వానరమూకతో రాముడేం చేయగలడన్న ధీమాతో వుండకు. వానరులెంతటి వారో నీకు మళ్ళీ చెప్పనవసరం లేదు!’’ అన్నాడు.

రావణుడికి కోపం వచ్చి కత్తి ఎత్తాడు. అంగదుడు రావణుడి కిరీటాన్ని కాలితో తన్ని పడద్రోసి, తిరిగి వానరసైన్యం వున్న చోటుకు ఎగిరి వెళ్ళాడు. వానరసేన విజృంభించి లంకా నగరాన్ని ముట్టడించి చికాకు పరుస్తూంటే, రావణుడు కుంభకర్ణుడి నిద్ర చెడగొట్టించి, అతణ్ణి వెంటనే యుద్ధానికి వెళ్ళమన్నాడు.

కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ సరస్వతి చేత అతని కోరికలు తారుమారు చేయించాడు. ఆరు నెలలు తిండి, ఒకరోజు నిద్ర కోరుకోవాలనుకున్న కుంభకర్ణుడు, ఆరు నెలల నిద్ర, ఒకరోజు తిండి కోరుకున్నాడు. బ్రహ్మ అతడికి అలాగే వరమిచ్చాడు. ఆరు నెలల నిద్ర పూర్తిగా తీరకపోతే, కుంభకర్ణుడి శక్తి తగ్గిపోతుంది. అతడు రావణుడు చేసిన పనికి విసుక్కున్నాడు, అన్నకు వినయంగా హితబోధ కూడాచేశాడు. రావణుడు, ‘‘చేస్తే యుద్ధం చెయ్యి, లేదా వెళ్ళి పడుకో!’’ అన్నాడు.

నిద్ర చెడిన కోపంతో కుంభకర్ణుడు వానరులను పట్టుకు తినసాగాడు. రామలక్ష్మణులు నిర్విరామంగా యుద్ధం చేశారు. ఆ …యుద్ధంలో రాముడు కుంభకర్ణుడిని సంహరించాడు.
ఆ తరవాత యోధానుయోధులైన రాక్షస ప్రముఖులందరూ కూలిపోయారు. రావణుడి పెద్దకొడుకు ఇంద్రజిత్తు యుద్ధానికొచ్చాడు.

రావణుడు అతని మీద పెద్ద ఆశ పెట్టుకొని ఉన్నాడు. మేఘాల్లోంచి యుద్ధం చేసే వాడవడంవల్ల మేఘనాథుడు అని పేరొంది, ఇంద్రుణ్ణి జయించి కట్టి తెచ్చి, ఇంద్రజిత్తు అనిపించుకొన్న మహావీరుడు. మంత్రతంత్రాలు నేర్చిన ఇంద్రజిత్తు జిత్తులమారి, మహామాయావి. పధ్నాలుగేళ్ళు బ్రహ్మచర్యంతో నిద్రాహారాలు లేకుండా కఠోరదీక్ష గడిపిన వాడివల్లనేగాని, మరెవ్వరివల్లా అతనికి ప్రాణభయం లేదు.

ఇంద్రజిత్తు మాయ సీతను కల్పించి, రాముడికి కనిపించేలాగ ముక్క ముక్కలుగా నరికాడు. లక్ష్మణుడు అది అంతా మాయాజాల మని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు. అలాగే రావణుడు విద్యుజ్జిహ్వుడనే వాడి చేత రాముడి తలను తయారు చేయించి, శూలానికి గుచ్చి సీతకు చూపమని పంపాడు.

దానిని చూసిన సీత, ‘‘ఇలాంటి చేతి పనివి కాకుండా, రావణుడి అసలు తలలు తెగి నేల దొర్లేరోజు వచ్చిందిలే,’’ అని చెప్పింది ఆవేశంగా. ఇంద్రజిత్తు  మేఘాల్లో దాగి రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు. గరుత్మంతుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల వల నుంచి తప్పించాడు.

సీతారాముల సేవలో పధ్నాలుగేళ్ళు కఠోరదీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు. లక్ష్మణుడూ, విభీషణ, హనుమంతులూ వెళ్ళి నల్లటి మేకపోతులను బలిచేస్తూ, ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రామలక్ష్మణులను కాళికి బలి వేయమని రావణుడు పాతాళ లంకాధిపతియైన మైరావణుడిని కోరాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమల్ని చేసి, పాతాళ లంకకు ఎత్తుకుపోయి, కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు.

హనుమంతుడు పాతాళ లంక చేరి, ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతూండగా, సువర్చలాదేవి వారిద్దరూ తండ్రీ కొడుకులౌతారని చెప్పి పోరు మాన్పించింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో కాళికాలయం ప్రవేశించి, రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని ఇవతలకు తెచ్చాడు. రామలక్ష్మణులు మైరావణుడితో యుద్ధం చేశారు.

రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు చెరతెచ్చాడు. ఆమెవల్ల హనుమంతుడు మైరావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. మైరావణుడిని రాముడు సులభంగా హతమార్చాడు.

రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి, మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు. పాతాళలంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి, హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు.

మాయోపాయాలన్నీ విఫలం కాగా, రావణుడు ఉక్కుయోధుల్నీ, చతురంగ బలాల్నీ పుట్టించే పాతాళలంకాయాగాన్ని ప్రారంభించాడు. విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భంగపుచ్చే ఉపాయం చెప్పాడు. అంగదుడు అదృశ్యకరణి విద్యాప్రభావంతో వెళ్లి మందోదరి జుట్టుపట్టి రావణుడి ఎదుటికి ఈడ్చుకెళ్లాడు. రావణుడి దీక్షభగ్నమై …యాగధ్వంసం అయింది. రావణుడు హతాశుడై చివరకు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా మందోదరి సీతను రాముడికి అప్పగించమని భర్తకు హితవు చెప్పింది. ‘‘రావణుడు రావణుడే!’’ అని సింహగర్జన చేసి పది గుర్రాలు పూన్చిన రథం మీద రావణుడు యుద్ధానికి వెళ్ళాడు.

 ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహావేశం ముంచుకొచ్చింది. ఒకప్పుడు బంధ విమోచనకు మారుపణంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తిమహా…యుధాస్త్రాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు.

హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతానికెళ్ళి సూర్యోదయం లోపలే సంజీవిని తెచ్చి, మూర్ఛ నుండి లక్ష్మణుడిని కాపాడాడు. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, దేవలోకం నుండి ఇంద్రుడు రాముడికి మాతలి సారథిగా ఒక దివ్యరథాన్ని పంపాడు.

రామరావణ భీషణ సంగ్రామంలో రావణుడి తలలు తెగిపడి నేలమీద దొర్లుతూంటే తిరిగి తలలు మొలుచుకొస్తున్నాయి. అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృతభాండం ఊడిపడేలాగ భేదించమని చెప్పాడు. రాముడు బ్రహ్మాస్ర్తంతో ఆ పని చేశాడు. రావణుడు ఒంటితలతో ఏకాకిగా నేల కూలాడు.

ఆ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడివల్ల, ‘‘ఇంటిగుట్టు లంకకు చేటు!’’ అనే సామెత వచ్చింది. రావణ సంహారంతో లంకాసామ్రాజ్యం పతనమై రాక్షస రాజ్యం అంతరించింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. రావణ కుంభకర్ణుల చావుతో జ…య విజ…యుల రెండో జన్మ ముగిసింది. అశోకవనం నుండి సీత వచ్చింది.

రాముడు, ‘‘సీతా! దుర్మార్గుణ్ణి శిక్షించి రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నిన్ను రావణుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు. నిన్ను నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు  తీసుకెళ్ళగలను? ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చును!’’ అని చెప్పాడు. సీత అక్కడున్నవారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తనకోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమని చెప్పింది.

సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి, అగ్నిలోకి దూకింది. అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతను నవవికసిత పద్మంలాగ దోసిట ఎత్తివచ్చి,గాని, మరెవ్వరివల్లా అతనికి ప్రాణభయం లేదు.

ఇంద్రజిత్తు మాయ సీతను కల్పించి, రాముడికి కనిపించేలాగ ముక్క ముక్కలుగా నరికాడు. లక్ష్మణుడు అది అంతా మాయాజాల మని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు. అలాగే రావణుడు విద్యుజ్జిహ్వుడనే వాడి చేత రాముడి తలను తయారు చేయించి, శూలానికి గుచ్చి సీతకు చూపమని పంపాడు.

దానిని చూసిన సీత, ‘‘ఇలాంటి చేతి పనివి కాకుండా, రావణుడి అసలు తలలు తెగి నేల దొర్లేరోజు వచ్చిందిలే,’’ అని చెప్పింది ఆవేశంగా. ఇంద్రజిత్తు  మేఘాల్లో దాగి రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు. గరుత్మంతుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల వల నుంచి తప్పించాడు.

సీతారాముల సేవలో పధ్నాలుగేళ్ళు కఠోరదీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు. లక్ష్మణుడూ, విభీషణ, హనుమంతులూ వెళ్ళి నల్లటి మేకపోతులను బలిచేస్తూ, ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రామలక్ష్మణులను కాళికి బలి వేయమని రావణుడు పాతాళ లంకాధిపతియైన మైరావణుడిని కోరాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమల్ని చేసి, పాతాళ లంకకు ఎత్తుకుపోయి, కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు.

హనుమంతుడు పాతాళ లంక చేరి, ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతూండగా, సువర్చలాదేవి వారిద్దరూ తండ్రీ కొడుకులౌతారని చెప్పి పోరు మాన్పించింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో కాళికాలయం ప్రవేశించి, రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని ఇవతలకు తెచ్చాడు. రామలక్ష్మణులు మైరావణుడితో యుద్ధం చేశారు.

రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు చెరతెచ్చాడు. ఆమెవల్ల హనుమంతుడు మైరావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. మైరావణుడిని రాముడు సులభంగా హతమార్చాడు.

రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి, మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు. పాతాళలంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి, హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు.

మాయోపాయాలన్నీ విఫలం కాగా, రావణుడు ఉక్కుయోధుల్నీ, చతురంగ బలాల్నీ పుట్టించే పాతాళలంకాయాగాన్ని ప్రారంభించాడు. విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భంగపుచ్చే ఉపాయం చెప్పాడు. అంగదుడు అదృశ్యకరణి విద్యాప్రభావంతో వెళ్లి మందోదరి జుట్టుపట్టి రావణుడి ఎదుటికి ఈడ్చుకెళ్లాడు. రావణుడి దీక్షభగ్నమై …యాగధ్వంసం అయింది. రావణుడు హతాశుడై చివరకు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా మందోదరి సీతను రాముడికి అప్పగించమని భర్తకు హితవు చెప్పింది. ‘‘రావణుడు రావణుడే!’’ అని సింహగర్జన చేసి పది గుర్రాలు పూన్చిన రథం మీద రావణుడు యుద్ధానికి వెళ్ళాడు.

 ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహావేశం ముంచుకొచ్చింది. ఒకప్పుడు బంధ విమోచనకు మారుపణంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తిమహా…యుధాస్త్రాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు.

హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతానికెళ్ళి సూర్యోదయం లోపలే సంజీవిని తెచ్చి, మూర్ఛ నుండి లక్ష్మణుడిని కాపాడాడు. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, దేవలోకం నుండి ఇంద్రుడు రాముడికి మాతలి సారథిగా ఒక దివ్యరథాన్ని పంపాడు.

రామరావణ భీషణ సంగ్రామంలో రావణుడి తలలు తెగిపడి నేలమీద దొర్లుతూంటే తిరిగి తలలు మొలుచుకొస్తున్నాయి. అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృతభాండం ఊడిపడేలాగ భేదించమని చెప్పాడు. రాముడు బ్రహ్మాస్ర్తంతో ఆ పని చేశాడు. రావణుడు ఒంటితలతో ఏకాకిగా నేల కూలాడు.

ఆ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడివల్ల, ‘‘ఇంటిగుట్టు లంకకు చేటు!’’ అనే సామెత వచ్చింది. రావణ సంహారంతో లంకాసామ్రాజ్యం పతనమై రాక్షస రాజ్యం అంతరించింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. రావణ కుంభకర్ణుల చావుతో జ…య విజ…యుల రెండో జన్మ ముగిసింది. అశోకవనం నుండి సీత వచ్చింది.

రాముడు, ‘‘సీతా! దుర్మార్గుణ్ణి శిక్షించి రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నిన్ను రావణుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు. నిన్ను నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు  తీసుకెళ్ళగలను? ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చును!’’ అని చెప్పాడు. సీత అక్కడున్నవారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తనకోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమని చెప్పింది.

సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి, అగ్నిలోకి దూకింది. అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతను నవవికసిత పద్మంలాగ దోసిట ఎత్తివచ్చి, ‘‘రామా! సీత నిప్పులాంటిది! పావని! స్వీకరించు!’’ అని చెప్పాడు.

అదే సమయంలో స్వర్గంనుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి, ‘‘నాయనా! రామచంద్రా! అగ్నిపరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది. సీతతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి!’’ అని కుమారుని ప్రేమతో ఆదేశించాడు. రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో అయోధ్యకు చేరాడు. నిప్పులాంటిది! పావని! స్వీకరించు!’’ అని చెప్పాడు.

అదే సమయంలో స్వర్గంనుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి, ‘‘నాయనా! రామచంద్రా! అగ్నిపరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది. సీతతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి!’’ అని కుమారుని ప్రేమతో ఆదేశించాడు. రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో అయోధ్యకు చేరాడు.

విష్ణు కథ - 13

విష్ణు కథ - 13
సుగ్రీవుడు కిష్కింధకు రాజై, వాలి కుమారుడు అంగదుణ్ణి యువరాజును చేసి, రాచకార్యాలన్నీ అప్పజెప్పి, తాను సుఖాల్లో తేలుతూ రాముడి సంగతే మరిచాడు. లక్ష్మణుడు విల్లెక్కుపెట్టి కిష్కింధకు వెళ్ళాడు. హనుమంతుడు రామకార్యం నెరవేర్చడం తక్షణ కర్తవ్యంగా సుగ్రీవుడికి బుద్ధిచెప్పాడు.

వానరులను నాలుగు దిక్కులకూ వెళ్ళి సీత జాడ తెలుసుకురమ్మని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనవారంతా దక్షణ దిశకు బయలుదేరుతున్నప్పుడు, రాముడు తన వేలిఉంగరాన్ని తీసి హనుమంతుడికి సీతకు ఆనవాలుగా ఇమ్మని ఇచ్చాడు.

దక్షణ సముద్రతీర ప్రాంతం చేరుకొని వానరులు, ‘‘జటాయువు రావణుడు సీతనెత్తుకొని దక్షణంగా వెళ్ళాడని చెప్పాడేగాని, ఎటు మళ్ళాడో, ఎక్కడ దాచాడో, ఏం చేశాడో ఎవరికి తెలుసు?’’ అని అనుకుంటూండగా, వానరులను ఆహారంగా కబళిద్దామను కుంటున్న జటాయువు అన్న సంపాతి అనే పర్వతాకారంగల రెక్కలులేని పక్షి మెల్లగా నడుస్తూ వచ్చింది.

ఒకప్పుడు సంపాతీ, జటాయువూ సూర్యమండలానికి ఎగురుపందెం వేసుకున్నారు. జటాయువు ఎగరలేక విరమించాడు. సంపాతి ఎగిరి రెక్కలు కాల్చుకున్నాడు. దక్షణ సముద్ర తీరాన అవిటివాడై పడిపోయి, దొరికిన ప్రాణుల్ని తిని బ్రతుకుతున్నాడు. సంపాతి వానరుల వలన జరిగినదంతా తెలుసుకొని, అంగదుణ్ణి వీపున ఎక్కించుకొని ఆకాశంలోకి నిటారుగా లేచి దూర దూరాల్లో సముద్రానికి ఆవల ఉన్న లంకను చూపించాడు.

శతయోజన పర్యంతమైన సముద్రాన్ని లంఘించి లంకను చేరగలవాడెవడు? అనుకున్నారు వానరులు.

హనుమంతుడికి అతని శక్తిసామర్థ్యాలు అతనికి తెలియకుండా, బాల్యంలో అల్లరి చేయగా ఋషులు శాపం పెట్టారు. అది తెలిసిన జాంబవంతుడు, ‘‘హనుమంతా! నువ్వు అవలీలగా సముద్రాన్ని లంఘించి రామకార్యం నెరవేరుస్తావు!’’ అని ఎరుక చేశాడు.

అప్పుడు హనుమంతుడు రాముణ్ణి ధ్యానించి నేలను తన్ని ఆకాశానికి ఎగిరాడు. మారుతి సముద్రాన్ని లంఘిస్తూండగా, అతడి శక్తియుక్తుల్ని పరీక్షించడానికి దేవతలు సురసను పంపారు. దేవతాస్త్రీ అయిన సురస భయంకర రాక్షసాకారంతో నోరావులించి హనుమంతుణ్ణి ఎదుర్కొంది. హనుమ శరీరాన్ని పెంచాడు. సురస కూడా పెరిగింది. హనుమంతుడు ఇంకా పెరిగాడు.


సురస మరింత, మరింత పెరిగి మ్రింగవచ్చింది. హనుమంతుడు చప్పున సూక్ష్మాతి సూక్ష్మంగా తగ్గిపోయి, సురస నోట్లో దూరి, పెరిగిపోయి దాన్ని చీల్చుకొని బయటపడి ఎగిరి వెళ్ళాడు. సురస దేవతాస్ర్తీ రూపంతో వెళ్ళిపోయింది. దేవతలు హనుమంతుణ్ణి శ్లాఘించారు.

హనుమంతుడు అలా ఎగురుతూండగా సముద్రంలో పడిన అతని నీడను రాహువు తల్లి సింహిక అనే జలరాక్షసి పట్టుకొని లాగసాగింది. హనుమంతుడు తన్నేదో కిందినుంచి వెనక్కు లాగుతున్నదనిపించి కిందికి చూసి, సింహికను పిడిగుద్దులతో చంపేశాడు.

హనుమంతుడు అవరోధాలన్నీ జయించి, అలా ఆకాశాన వెళ్తూండగా సువర్చల అనే సాగరకన్య చేపరూపంతో నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూండగా హనుమంతుడి చెమట బిందువొకటి పడింది. చేప మింగింది. అందువల్ల సువర్చల గర్భం ధరించి మత్స్యవల్లభుడు అనే కుమారుణ్ణి కన్నది.

ఒకప్పుడు ఇంద్రుడు పర్వతాలకు ఉండే రెక్కలను వజ్రాయుధంతో నరుకుతూండగా,  హిమవంతుడి కుమారుడైన మైనాకుడు భయపడి సముద్రంలో దాక్కున్నాడు.

హనుమంతుడిని చూసి మీదకు వచ్చి, ‘‘అంజనేయా, కాస్త నాపై వాలి సేదదేరమని అభ్యర్థిస్తున్నాను,’’ అన్నాడు.

మైనాకుడి మాట కాదనకుండా హనుమంతుడు, కొద్దిక్షణాలు మైనాక పర్వతం మీద కాలుమోపి తిరిగి రివ్వున ఎగిరాడు. హనుమంతుడు మెరుపు లాగ లంకను చేరాడు.
లంకానగరాన్ని పరిరక్షంచే లంకానగర దేవత లంకిణి, హనుమంతుడి ఆగమనాన్ని గుర్తించి, భీకరాకృతితో శూలాన్నెత్తి పొడవబోయింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో తప్పించుకొని, లంకాద్వారాన్ని దాటబోయాడు. లంకిణి హనుమంతుణ్ణి ఈగను పట్టినట్లు గుప్పెట్లో పట్టింది. హనుమంతుడు లంకిణి అరచేతిని కరిచాడు. లంకిణి వదిలేసింది. దాని అరచేయి రక్తం కారుతూన్నది.

హనుమంతుడు ఒక్క ఉదుటున లంఘించి పిడికిలితో లంకిణి గుండె మీద గుద్దాడు. ఆ ముష్టిఘాతంతో లంకిణి దిమ్మరపోయి పడిపోయింది. తరవాత తేరుకొని ఆంజనేయుడికి మస్కరించి, ‘‘ఎప్పుడైతే నేను ఇలా కూలి పడతానో, ఆనాటితో లంకకు వినాశకాలం పడుతుందని నాకు, బ్రహ్మ చెప్పాడు. శాపంవల్ల నేను క్షుద్రదేవతగా ఇలా లంకా నగరాన్ని ఇన్నాళ్ళూ కాపలా కాస్తూ వచ్చాను. నేను వెళ్ళి పోతున్నాను, ఇక నీవు వెళ్ళు!’’ అని చెప్పి గంధర్వస్త్రీ రూపంతో ఆకాశానికి ఎగిరి అంతర్థానమైంది.

హనుమంతుడు లంకా నగరం ప్రవేశించాడు. మణిదీపాలతో, ఎత్తయిన సౌధాలతో కన్నులు మిరుమిట్లు గొలుపుతున్న లంకా వైభవానికి ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు సూక్ష్మరూపంతో సీత కోసం నగరమంతా వెతికాడు. రావణాసురుడి అంతఃపుర భవనాలన్నీ వెతికాడు. మందోదరిని సీత అనుకొని భ్రమపడి పొరపాటు గ్రహించాడు.
సీత జాడ ఎక్కడా లేదు. అలా నగరంలోని వివిధ ప్రదేశాలను వెతుకుతూ అశోకవనం చేరుకున్నాడు. అక్కడ రామనామ స్మరణ విన్నాడు.

ఒక చంద్రశిలా నిర్మిత మంటపంలో సీత రాముణ్ణి తలంచుతూ శోకిస్తూన్నది. ఆ మంటపం చుట్టూరా పెద్ద బళ్లేలు, కత్తులు మొదలైన ఆయుధాలు పట్టుకొని రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారు.మంటపం చేరువనే ఉన్న శింశుపా వృక్షం ఎక్కి హనుమంతుడు కొమ్మల మాటున కూర్చుని చూస్తున్నాడు.

సీత మంటపం నుండి వచ్చి, పక్కనున్న అశోక చెట్టుకింద కూర్చున్నది. రావణుడు పటాటోపంగా అశోకవనం లోకి వస్తున్నాడు. అతని వెనక దేవ, గంధర్వ, నాగ, …యక్ష, రాక్షస, మానవ సుందరీమణులు గుంపులు, గుంపులుగా అతడి వైభవాన్ని కీర్తిస్తున్నారు.

రావణుడు అశోకవృక్షం దగ్గరికి వచ్చి, ‘‘ఓ, సీతా! ఇప్పటికైనా, నా మాట విను! క్షుద్ర మానవుడైన రాముణ్ణి నమ్ముకోకు. రాముడు లంక చేరగలడనేది కల్ల!’’ అన్నాడు.
సీత ఒక గడ్డిపరకను పెరికి దానితోనే, ‘‘ఓ, రావణా! నీ ప్రగల్భానికీ, బలవైభవాలకీ నేను లొంగుతాననేది కల్ల! నీవు దొంగవు! నిన్ను శిక్షంచడం రాజైన రాముడికి కర్తవ్యధర్మం. దశకంఠశోషగా వాగకు. రాముడు నిన్ను పరిమార్చక ముందే, నీ ముచ్చటలన్నీ తీర్చుకో! అంతఃపురానికి వెళ్ళు, త్వరలోనే నీకు అంత్యకాలం!’’ అన్నది. రావణుడా మాటలకు పెద్ద గండ్రకత్తి తీసి, ‘‘నిన్ను ముక్కలుగా నరుకుతాను!’’ అన్నాడు.

‘‘అలా చేయవు! నా అంతట నేను, నీకు లొంగిపోతానని అనుకుంటున్నావు. రాముడి భార్య, రావణుడి ప్రతాప వైభవాలను చూసి లోబడిపోయింది అనిపించుకోవాలని, నీ దురహంకార దురాకాంక్ష!’’ అన్నది సీత. ‘‘ఔను! మా రాక్షస వనితకు జరిగిన పరాభవానికి, అదే సరైన ప్రతీకారం! అదే నా పట్టుదల!’’ అన్నాడు రావణుడు. ‘‘కాదు! నువ్వు రాముడిని ఎదుర్కొని జయించి, నన్ను తీసుకుపోవలసింది. నువ్వు పిరికివాడవు. మాయలు పన్ని చోరవృత్తిని అవలంబించావు. రాముడు నిన్ను సంహరించాలి! ఇది నా పట్టుదల!!’’ అన్నది సీత. రావణుడు రుసరుసలాడుతూ వెళ్లాడు.

హనుమంతుడు రాక్షస స్త్రీలు లేని సమయం చూసి, చెట్టు దిగి, సీతకు రాముడి  ఉంగరాన్ని ఇచ్చాడు. చుక్కలు తల పూవులుగా పెరిగిన తన విశ్వరూపం చూపించి, తన వీపున కూర్చుంటే రాముడి దగ్గరకు చేరుస్తానన్నాడు. ‘‘అది సక్రమం కాదు; రాముడు రావణుడిని సంహరించి నన్ను విడిపించాలి! అంతవరకు సీత అశోకవనంలో శోకంలోనే ఉంటుందని రాముడితో చెప్పు!’’ అని చెప్పి సీత తన పాపిట నున్న చూడామణిని తీసి, రాముడికి ఇమ్మని హనుమంతుడికి ఇచ్చింది.

 హనుమంతుడు తన రాక తెలియాలని సుందరమైన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చంపవచ్చిన జంబుమాలిని, అక్షయుడిని, వేలాది రాక్షసుల్ని చంపాడు. రావణుడి పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మపట్ల గౌరవంగా క్షణకాలం హనుమంతుడు అస్త్రానికి బద్ధుడై, రావణుడికి ముఖాముఖి బుద్ధి చెప్పాలని కట్టుబడి రావణ సభకు వెళ్ళాడు.

హనుమంతుడు మేను పెంచి గొలుసులు తెంచుకొని, రావణుడి తల తన్నే ఎత్తున తన తోకను పెంచి, చుట్ట చుట్టుకొని దానిపై కూర్చున్నాడు.

హనుమంతుడు, ‘‘ఓయి, రావణ రాక్షసరాజా! నేను రాముడి దూతను. రాముడు కోతులనే మహావీరులుగా నడిపించి, నీ లంకను ముట్టడించగల సమర్థుడైన మానవశ్రేష్ఠుడు. లమున్నదని గర్వించకు. బలవంతమైన సర్పము చలిచీమల చేత ఏ విధంగా చస్తుందో, నీకు చెప్పనవసరం లేదు. సీతను రాముడికి అప్పగించి మన్నించమని వేడు!’’ అని చెప్పాడు.

రావణుడు పట్టరాని ఆగ్రహంతో కత్తి తీశాడు. విభీషణుడు రావణుడితో, ‘‘దూతను చంపకూడదు, అది పౌరుషం అనిపించుకోదు!’’ అన్నాడు.

రావణుడు, ‘‘అలాగైతే, ఈ వానరుడి తోక పొగరు అణిగేలా గుడ్డలు చుట్టి చమురుపోసి కాల్చండి!’’ అని ఆజ్ఞాపించాడు. రాక్షసభటులు హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టినకొద్దీ తోక పెరిగిపోతూనే ఉంది. చమురు చాలలేదు. నిప్పంటించారు.

 హనుమంతుడు శరీరం పెంచి సింహనాదం చేసి ఛెంగున ఎగిరాడు. కాలుతున్న తోకను గిరగిరా తిప్పుతూ, సౌధాల మీంచి దూకుతూ, లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. అతనికి అగ్ని చల్లగా తోచింది ఆర్పడానికి వీలు కాకుండా లంకాదహనం జరిగింది. రావణుడి అంతఃపుర సౌధాలు కాలిపోయాయి. మంటల్లో చాలామంది రాక్షసులు చచ్చారు. విభీషణుడి మందిరం మాత్రం చెక్కుచెదరలేదు.

హనుమంతుడు అశోకవనంలో సీత క్షేమంగా ఉండడం చూసి, రివ్వున ఎగిరి సముద్రంలో తోకను ముంచి మంటలార్పుకొని, చూడామణిని పట్టుకొని రాముడి ముందు వాలాడు.

రాముడు చూడామణిని చూసి, సీతను చూసినట్లుగా గుండెలకు హత్తుకొన్నాడు. హనుమంతుడు అంతా చెప్పాడు. రాముడు హనుమను ఆలింగనం చేసుకొని, ‘‘హనుమా! చూసి రమ్మంటే కాల్చి వచ్చావన్నమాట! నీవంటివాడు అండగా ఉండగా, నేను సాధించలేనిదంటూ ఉండదు. సీతకూ, నాకూ సంధానకర్తవై, ఆనందం చేకూర్చిన నీవు బుద్ధిమంతుడవు, ఆనంద సంధాతవు, కీర్తిమంతుడవు ఔతావు!’’ అన్నాడు.

రాముడు కోదండాన్ని ఎత్తి పట్టుకొని, సీత చెప్పినట్టుగా రావణసంహారానికి దీక్షా కంకణం కట్టుకున్నాడు. విభీషణుడు రావణుడికి సవతి తమ్ముడు, రాముడితో వైరం పెట్టుకోవద్దనీ, సీతను సగౌరవంగా తీసుకెళ్ళి, రాముడికి అప్పగించి, లంకానగరాన్నీ, లంకావాసుల్నీ కాపాడమనీ చెప్పాడు. ‘‘నీ ఒక్కడి పట్టుదల, మూర్ఖతవల్ల రాక్షసకులానికే ముప్పుతేవడం అన్యాయం!’’ అని విభీషణుడు చెప్పిన దానికి, రావణుడు మండిపడి, ‘‘ఓరీ, పిరికిపందా! నువ్వు రాక్షసకులంలో తప్ప పుట్టావు! శూర్పణఖకు చేసిన పరాభవం రాక్షస జాతికంతటికీ పరాభవం అని తెలుసుకో! నువ్వు కులద్రోహివి! వెంటనే లంక వదలి వెళ్ళిపో!
మళ్ళీ కనిపించావో, నిన్ను చిత్రవధ చేస్తాను!’’ అన్నాడు. విభీషణుడు తన అనుచరులతో లంక వదిలి పెట్టాడు

విష్ణు కథ - 12

విష్ణు కథ - 12

రాముడు కోదండాన్ని ఎక్కుపెట్టగానే, పరశురాముడు, ‘‘రఘురామా! ఇకనుండి క్షత్రియులపె పగ విడిచి ప్రశాంతంగా త…పస్సు చేసుకొంటాను. నేనిచ్చిన కోదండం నీదే! నీవు కోదండరాముడివి!’’ అని చెప్పి వెళ్ళాడు.

అయోధ్యానగరం నూతన వధూవరుల ఆగమనంతో కళకళలాడింది. సీతారాములు ఒకే ఒక్క పరిపూర్ణ స్వరూపంగా అనురాగ సామ్రాజ్య సింహాసనం అలంకరించారు. ఒకనాడు రాముడు, ‘‘సీతా! ఈ రాజ ప్రాసాదంలోకంటే, మనం సుందరవనాల్లో విహరిస్తూంటే ఇంకెం…తఆనందంగా ఉంటుందో! వనలక్ష్మి లాగ నువ్వు కనిపిస్తూంటే ...’’ అని అంటూంటే సీ… బుగ్గలు ఎరు పెక్కాయి.

వారికి రోజులు మధురంగా గడుస్తున్నాయి. కొంత కాలానికి దశరథుడికి దుశ్సకునాలు తోచాయి. ఉల్కలు రాలుతూ కనిపించాయి. అ…నికి మునిదంపతుల శాపం గుర్తు వచ్చింది. ప్రాణభ…యం పట్టుకుంది. రాముడికి వెంటనే పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించి వసిష్ఠుడిచే… మూహూర్తం పెట్టించాడు. అక్కడ సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంలో చిదానందంగా ఉన్నాడు.

సరస్వతి వీణపె రాగమాలిక ఆలపిస్తున్నది. నారదుడు, అ…ని వెనక దేవ…తలు వచ్చారు. నారదుడు, ‘‘రాముడు సింహాసనం ఎక్కి కూర్చుంటే రాక్షస నిర్మూలనం ఎలా జరుగుతుంది? అని దేవ…తలంతా త…ల్లడిల్లు…తూన్నారు!’’ అన్నాడు బ్రహ్మతో. బ్రహ్మ సరస్వతి వంక చూశాడు. సరస్వతి మందహాసంతో, ‘‘జరగవలసింది జరగక మానదుకదా, నారదా! త్రికాల వేత్తవు! అదుగో అటు చూడు! నీకు వారసురాలు మంధర కెకేయి మందిరానికి వెళ్తున్నది!’’ అన్నది.


దేవతలూ, నారదుడూ క్రిందికి భూమ్మీదకు చూశారు. గూని మోసుకొంటూ మంధర గొణుక్కొంటూ వెళ్తూన్నది. నారదుడు, ‘‘అమ్మా, వాగ్దేవీ! లోక కల్యాణార్థం వాళ్ళ నోట ఎలాంటి వాక్కులు పలికిస్తావో మరి! అంతా నీ దయ!’’ అని వెళ్ళాడు. గూనిమంధర కెకేయికి అరణంగా వచ్చిన నమ్మిన ముసలిదాసి. అప్పుడే నిద్రలేస్తున్న కెకేయిని జాలిగా చూస్తూ నిలబడ్డది. కెకేయి, ‘‘ఏమిటి, మంధరా, అలా దిగాలుగా నిల్చున్నావు?!’’ అనడిగింది.
‘‘ఏం చెప్పమంటావు, …తల్లీ! రేపు రాముడికి పట్టాభిషేకమట! పట్టాభిషేకం!!’’ అంది మంధర. కెకేయి తన మెడలోని ముత్యాల హారం తీసి మంధర మెడలో వేస్తూ, ‘‘ఎంత మంచి వార్త తెచ్చావే, మంధరా!’’ అంటూ ఆనందం పట్టలేకపోయింది. మంధర పెదవి విరుస్తూ, ‘‘అయ్యో, కెకేయి! ఎంత అమాయకురాలివి పాపం! ఒఠ్ఠి వెర్రిబాగులదానివి!’’ అన్నది. ‘‘ఏమిటి నువ్వనేది?’’ అన్నది కెకేయి.

‘‘రాముడు రాజైతే, ఆ కౌసల్య ముందు నేనూ, నువ్వూ దాసీలమే! బాగా ఆలోచించు, ఆలసించకు. కోపగృహం లోకి వెళ్ళు! నీ రెండు వరాలు ఇప్పుడు కోరుకో! భరతుణ్ణి దేనికి కన్నావు? రాముడి వెనక ఛత్రచామరాలు పట్టడానికేనా?’’ అని మంధర చురకలు పెట్టినట్టు అన్నది. తన రెండు వరాలు ఇప్పుడు కావాలని కెకేయి కోరింది, ‘‘ఏవి కావాలో అవి తీసుకో!’’ అన్నాడు దశరథుడు. ‘పధ్నాలుగేళ్ళు రాముడు వనవాసం చెయ్యాలి! భరతుడికి పట్టాభిషేకం కట్టాలి!’’ అన్నది కైక.

ఆ మాటలు వింటూనే దశరథుడు జుట్టు పీక్కొంటూ అలాగే శయ్య మీద మూర్ఛపడిపోయాడు. రాముడికి పిలుపు అందింది. ‘‘పితృవాక్య పరిపాలన కర్తవ్యం! దశరథుడు ఆడి తప్పినవాడనిపించుకోకూడదు. రఘువంశంలో అటువంటిది లేదు!’’ అనుకున్నాడు రాముడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు చెట్టు బెరడులో తయారైన బట్టలు ధరించి వనవాసం చెయ్యడానికి సిద్ధమయ్యాడు.

 లక్ష్మణుడు మహాసర్పం బుసలు కొడుతున్నట్లు వచ్చాడు. కెకేయినీ, దశరథుడినీ నరికేస్తానని కత్తి దూశాడు. రాముడు …తమ్ముడిని శాం…తపరిచాడు. రాముడితో సీత…, లక్ష్మణుడు బయలు దేరారు.

అయోధ్యా పౌరులు దారికి అడ్డంగా పడుకున్నారు. రాముడు వారిని సమాధానపరిచి గంగానదిని దాటి అరణ్య మార్గం పట్టి, భరద్వాజాశ్రమం చేరుకున్నాడు.
మర్రిపాలు తలకు పట్టించి, రామలక్ష్మణులు మునులకుమల్లే జుట్టుముళ్ళు వేసుకున్నారు. దశరథుడు మూర్ఛనుండి తేరుకొని, రాముడు వనవాసం వెళ్ళిన సంగతి తెలుసుకొని, ‘‘రామా! రామా!’’ అంటూనే ప్రాణాలు విడిచాడు.

అప్పుడు భర…తశత్రుఘ్నులు తాతగారి ఊళ్ళో ఉన్నారు. నందిగ్రామం నుండి భర…శత్రుఘ్నులు వచ్చాక, భర…తుడు తండ్రికి ఉత్తరరక్రియలు జరిపాడు.
భరతుడు…తల్లి ముఖం చూడలేదు. శత్రుఘ్నుడు మంధర గూనిపోయేలాగ…తన్నాలనుకున్నాడు, కాని దాని జాడ కనిపించలేదు. భర…తుడు రాముణ్ణి తీసుకురాడానికి సపరివారంగా శ్వే…త ఛత్రాలు పట్టించుకుని వెళ్ళాడు.

భరతుడితో రాముడు, ‘‘మన …తండ్రి మాట నిలపడంలో మన ఇద్దరివంతూ ఉంది. నీవు నా …తమ్ముడివి, నా మాట విను. పట్టాభిషిక్తుడివై రాజ్యపాలన చెయ్యి!’’ అన్నాడు.
భరతుడు …తల అడ్డంగా తిప్పి, ‘‘నేను రాజ్యపాలన మాత్రం చూసుకుంటాను. నీ పాదుకల్ని సింహాసనం మీద ఉంచుతాను!’’ అని చెప్పి రాముడి పావుకోళ్ళను …తలపై పెట్టుకొని తీసుకెళ్ళాడు. రాముడు సీతాలక్ష్మణ సమే…తంగా అరణ్యం లోలోపలికి చొచ్చుకువెళ్ళాడు.ఖరుడు, దూషణుడు అనేవాళ్ళు దండకారణ్యంలో రావణుడి ప్రతినిధులు, వాళ్ళు వింధ్యపర్వాలకు దిగువనున్న భూమి అంతా ఆక్రమించారు. వాళ్ళు రాక్షస గుంపులో తిరుగుతూ, అరణ్యంలో ప్రవేశిస్తున్న నరులను చూశారు. ఆకలిగొన్న క్రూర మృగాల్లాగ సీతా రామలక్ష్మణుల్ని చంపడానికి, పెద్ద పెద్ద బండ కత్తులూ, శూలాల్తో చుట్టు ముట్టారు రాక్షసులు.

రామలక్ష్మణులు ధనుర్బాణాలు తీసి రాక్షసమూకలను చెల్లాచెదరుగా చేశారు. రాముడు ఖరదూషణుల్ని చంపాడు. రాక్షసులు చాలామంది చచ్చారు. హతశేషులైనవారు పారిపోయారు. నివాస యోగ్యమెన ప్రదేశంకోసం వెదుకుతూ వెళ్తూండగా, తాటిచెట్టును మించిన ప్రమాణంలో భయంకరాకారుడెన విరాధుడు సీతను అరచేత ఎత్తి భుజాన పెట్టుకొని పారిపోతూంటే, రాముడు ఒక మహాస్తాన్ని వేసి రాక్షసుణ్ణి చంపాడు. హత…శేషులెన రాక్షసులు శూర్పణఖ, ఖరదూషణుల చావుకబురు చెప్పారు. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. ఖరుడు, దూషణుడు, శూర్పణఖ సొంత తమ్ముళ్ళు.

దండకారణ్యాల్లో గ్రుమ్మరుతూండే రాక్షసులందరికీ శూర్పణఖ నాయకురాలు, రామలక్ష్మణుల్ని చీల్చి చెండాడాలని బయలుదేరింది. ఊడలే మానులైన ఐదు మర్రిచెట్లతో నిండిన పంచవటికి రాముడు, సీతా లక్ష్మణులతో చేరాడు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నది. పర్ణశాలను నిర్మించుకొని, రాముడు సీతా వనవిహారం చేస్తూ వనవాసం గడుపుతున్నాడు. లక్ష్మణుడు అన్నను, వదినను సేవిస్తూ, పర్ణశాలను దివారాత్రులు కాపలా కాస్తున్నాడు.

శూర్పణఖ అట్టహాసంగా విరుచుక పడింది. రాముణ్ణి చూసి నన్ను వరించమంది, వేడింది, బెదిరించింది. సీతను చంపడానికి ఉరికింది. లక్ష్మణుడు శూర్పణఖను చంపకుండా ముక్కు, చెవులు కోసి తరిమాడు. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణాసురుడితో తనకు జరిగిన పరాభవాన్ని మొరపెట్టుకొంది. సీత అందాన్ని వర్ణించి రెచ్చగొట్టింది. రావణుడు ప్రతీకారంగా సీతను చెరగొని తేవడానికి మారీచుణ్ణి బంగారు లేడిగా పంపాడు.

 సీత…మాయలేడిని చూసి ముచ్చట పడింది. రాముడు వెళ్ళి పట్టుకోవాలని బాణం వేశాడు. బాణం తగిలి మాయలేడి మారీచుడై, ‘‘హా, సీతా! హా, లక్ష్మణా!’’ అని రాముడు చేసినట్టు ఆర్తనాదం పెద్ద పెట్టున చేసి మరీ చచ్చాడు. అది రాక్షసమాయ, రాముడికెటువంటి హానీ జరగదని లక్ష్మణుడు ఎంత…చెప్పినా సీత వినలేదు. నిష్ఠురోక్తులు పలికింది. లక్ష్మణుడు పర్ణశాల ముందు మూడు గీతలు గీచి వెళ్ళాడు.

సీత ఒంటరిగా ఉంది. రావణుడు వృద్దతాపసి వేషంలో భిక్షకు వచ్చాడు. సీత… భిక్ష వేయడానికి మూడు గీత…లూ దాటింది. రావణుడు నిజరూపుతో సీ…ను ఎ…త్తుకుపోయాడు.
రామలక్ష్మణులు సీ…తను వెదుకుతూ వెళ్ళారు. రాముడు సామాన్య పామర మానవుడిలాగే విలపించాడు. వారలా వెళ్ళగా వెళ్ళగా, రెక్కలు తెగి పడి ఉన్న జటాయు పక్షి, ‘‘సీత…ను విడిపించడానికి పోరాడాను, నా రెక్కలు నరికి రావణుడు దక్షణ దిశగా సీ…ను ఎ…త్తుకుపోయాడు,’’ అని చెప్పి ప్రాణాలు విడిచింది. దశరథుడి ఆప్తమిత్రుడైన జటాయువుకు దహన సంస్కారం చేసి, రామలక్ష్మణులు వెళ్తుండగా, కబంధుడు వన్యమృగాల్తో బాటు వారిని దగ్గరకు లాక్కున్నాడు. కబంధుడు విచిత్రమైనవాడు.

    పర్వత మంతటి కడుపు, దానికే కోరలో ఆవులించుకొని ఉన్న పెద్ద నోరు, ఒక నిప్పు లాంటి కన్ను, యోజనాల పొడవునా చాచుకునే చే…తులు ఉన్నాయి. తలఅంటూ వేరే లేదు, కాళ్ళుగాని మరే అంగాలు గాని లేవు. రామలక్ష్మణులు కత్తులు తీసి కబంధుడి చేతులు నరికారు. కబంధుడు శాపగ్రస్తుడెన గంధర్వుడు. శాపవిమోచనం పొంది ఆ గంధర్వుడు, గంధర్వలోకానికి పోతూ, ‘‘నీకు మునుముందు వానరులతో మెత్రికుదురుతుంది, ప్రయోజనకారి అవు…తుంది,’’ అని రాముడికి చెప్పాడు.

ఋష్యమూక పర్వతం మీద వానర వీరులతో ఉంటున్న సుగ్రీవుడు రాముడి వద్దకు హనుమంతుణ్ణి పంపాడు.

ముక్కోటి దేవ…తలు వానరుల…య్యారు. హనుమం…తుడు శివుడి అంశన పుట్టినవాడు. అంజనాదేవి, వా…యుదేవుడి అనుగ్రహంతో హనుమం…తుణ్ణి కన్నది. ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మారుతి అని పిలువబడ్డాడు. పసిత…నంలో ఆంజనే…యుడు ఉద…య సూర్య బింబాన్ని పండు అని  భావించి ఎగిరి కబళించబోగా, ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. మారుతి మూర్ఛిల్లాడు. వా…యుదేవుడికి కోపం వచ్చి స్తంభించాడు. అప్పుడు దేవ…తలు హనుమం…తుణ్ణి చిరంజీవిగా దీవించి, అనేక వరాలు ఇచ్చారు.
బ్రహ్మ ఆంజనేయుడి చెవులకు విచిత్ర… ప్రభావంగల కుండలాలు …తగిలించి, అవి ఎవరికి కనపడి మెచ్చుకుంటే అ…తడే విష్ణువుగా గుర్తించి, ఆరాధ్యదైవంగా సేవించమని హనుమకు చెప్పాడు.

హనుమంతుడు సుగ్రీవుడి పంపున రామలక్ష్మణుల దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. రాముడు అ…తడిని చూసి లక్ష్మణుడితో, ‘‘సుందరుడైన ఇ…తని కర్ణకుండలాలు ఎంత… ముచ్చటగా ఉన్నాయో, చూడు!’’ అంటూ మెచ్చుకున్నాడు. అప్పుడు హనుమంతుడు, రాముడు విష్ణువు అవతారమని గుర్తించి, బంటు అయ్యాడు. రాముడిచే… సుందరుడు అనిపించుకొన్న హనుమం…తుడు, ‘సుందరుడు’ అని పేరు పొందాడు. హనుమంతుడి మూలంగా రాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షగా మిత్రులయ్యారు.
సుగ్రీవుడి అన్న వాలి, కిష్కింధకు రాజు. …తమ్ముడిని ద్రోహిగా అపోహపడి చంపబోగా సుగ్రీవుడు …తప్పించుకుని పోయి ఋష్యమూక పర్వతం మీద …తల దాచుకున్నాడు. వాలి …తమ్ముడి భార్యను నిర్బంధంలో ఉంచాడు.
ఆపదలో ఉన్న మిత్రుణ్ణి కాపాడడం …తన ధర్మంగా రాముడు ఎంచి, వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధా నగరానికి రాజును చేయడానికి మాట ఇచ్చాడు. వాలి ఎదురుగా నిలిచినవాడి బలం వాలిని చేరేలా వరం ఉంది. ఆ కారణంగా వాలి సుగ్రీవులు పోరాడుతుండగా చెట్ల చాటునుండి రాముడు బాణంకొట్టి వాలిని కడతేర్చాడు.