సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, January 4, 2014

పరమశివుడు {5పంచభూత స్థలాలు}

పరమశివుడు అనంత రూపుడు అనంతనాముడు. ఈ రూపమునే మహారుద్రు లుగా కొలుచుచున్నారు. అభిషేకనందలి పంచబ్రహ్మ మంత్రములందలి వామదేవుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, రుద్రుడు, కాలుడు, కలవికరణుడు, జలవికరణుడు, బలుడు, బలప్రమథనుడు, సర్వభూతదమనుడు, మనోన్మనుడు ఏకాదశ రుద్రులే . 
చిదంబర దర్శనం, తిరువళ్ళూర్‌లో జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి. మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి, పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహాతేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.

                                    " అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 
                                     అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా"!! 
 తిరువణ్ణామలై
 తిరువణ్ణామలై తిరువణ్ణామలై  లో పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు గా వెలిసాడు. అరుణాచలేశ్వరుడు ఇక్కడ అగ్ని లింగం రూపం లో దర్శనమిస్తాడు


 లింగం రూపం
అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షల మంది జనం తరిలివస్తారంటే తిశయోక్తి కాదు. ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశవరుడు, అమ్మవారి పేరు అపితకుచాంబిక.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ, మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్ళెదము గాకా అన్న ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ అరుణాచల కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది.

చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు, నేను అనుకుంటే వచ్చేది కాదు ముక్తి, పైవాడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం వాడి అనుగ్రహం పొందాలి. వాడి అనుగ్రహం కోసం నిత్యం అరుణాచలాన్ని స్మరించండి.   
                                    " అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 
                                     అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా"!! 
శ్రీ కాలాహస్తిపూర్వము సర్వేశ్వరుడు సృష్టికర్త బ్రహ్మను పిలిచి కైలాసమును సృష్టించమని ఆజ్ఞాపించగా బ్రహ్మ కైలాసమును సృష్టించు సమయమున తత్తరపాటు చెందిన కారణాంగా కైలాసములోని కొంత భాగము భూమిపై పడినదట. ఆ భాగమే దక్షణకైలాసముగా పిలవబడుచున్న శ్రీకాళహస్తి క్షేత్రమైనది.
చారిత్మాక ప్రాశస్త్యం..
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను  శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు.
 శ్రీకాలాహస్తి
శ్రీకాళహస్తి పట్టణం చిత్తూర్ జిల్లలో ఆంధ్ర ప్రదేశ్ రాస్త్ర్హం లోనిది.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు కేవలం 40 కిలోమీటర్లు దూరంలో వెలసినది.పట్టణమునకు మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ రేణిగుంట గూడూర్ మార్గం కలదు. ఈ క్షేత్రంను చేరుకొనుటకు దేశంలోని అన్ని వైపుల నుండి బస్సు,రైలు ,విమాన సౌకర్యాలు గలవు.
భారతదేశము నందలి అనేక పుణ్యక్షేత్రములలో శ్రీకాళహస్తి మహాక్షేత్రము పరమపవిత్రమైన ప్రసిద్ద శివక్షేత్రము. ఇది దక్షిణ కైలాసముగాను సత్యవ్రత మహా భాస్కరక్షేత్రముగాను, సద్యోముక్తి క్షేత్రముగాను, శివానందైకనిలయంగాను అనేక నామాంతరములతో ప్రసిద్ది చెందినది. పంచభూత క్షేత్రములలో శ్రీకాళహస్తి వాయుక్షేత్రము. జంబుకేశ్వరములో జలలింగం, తిరువణ్నామలైలో తేజోలింగం , శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో అకాశలింగం, కంచిలో పృద్వీలింగంగా వెలసియున్నవి.పంచభూత లింగాలుగా చెప్పబడ్డాయి. ఈ పంచభూత లింగాలు ఎంతో విశిష్టమైనవిగా ... మరెంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి.
 స్వర్ణముఖీనది బ్రహ్మదేవుని వరప్రాసాదముచే అగస్త్యముని తపప్రభావము వలన దక్షిణ కైలాసం అనెె కొండల్లో నుండి ఉత్తర వాహినిగా ఇచ్చట ప్రవహించుచున్నది.
లింగరూపముwww.tvramudu.blogspot.com
సాధారణంగా ఏ దేవాలయంలోను గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశముండదు. ఆగమ శాస్త్రం మేరకు గర్భగుడి నిర్మాణాన్ని అలాగే చేస్తారు. అందువల్లనే శ్రీ కాళహస్తీశ్వర స్వామి గర్భాలయంలోకి కూడా ఏ మాత్రం గాలి రాదు.

అయితే స్వామి వారికి ఇరువైపులా వున్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ వుంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దాంతో స్వామి వారి శ్వాస కారణంగానే అలా జరుగుతుందనే విషయం స్పష్టమైంది. అందువలన ఇక్కడి శివలింగం వాయులింగంగా ప్రసిద్ధికెక్కింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని దర్శిస్తే పరమశివుడిని ప్రత్యక్షంగా దర్శించిన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
 లింగరూపము
 శ్రీకాళహస్తి అను నామాంతరము ఈ క్షేత్రము మూడు మూగ జీవుల భక్తి, అరాధనల ఫలితంగా ఏర్పడినది. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా సర్పము, హస్తి అనగా గజరాజు, పూర్వజన్మమున సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నందున బ్రహ్మదేవుని శాపమునకు గురియై ఊర్ణనాభుడనబడే శిల్పి భూలోకమున సాలీడుగా జన్మించి మారేడు పత్రముల మధ్య జీవిస్తూ ఉండెను. అ వృక్షం క్రింద మరి యెక ఇతి వృత్తములో శాపవశమున శివుని మెడలోని కాళము భూలోకములో దక్షిణ కైలాసమున అడవిలో జన్మించి అచట బిల్వ వృక్షము క్రింద వెలసిన శివలింగమున అర్పించుచుండెను. హస్తి అనే శివకింకరుడు తానోనర్చిన అపరాధ ఫలితంగా భూలోకములో శివుని శాపవశమున గజరాజుగా జన్మించి, అదే బిల్వ వనమున నివసించుచూ, కాళము పూజించుచున్న శివలింగమునెె తానుకూడా పూజించు చుండెను. కాళమొనర్చిన అలంకరణలు తొలిగించి, తొండముతో సువర్ణముఖినదీ జలమును తెచ్చి అభిషేకించుచూ అర్పించుట అరంభించినది. ఇందుకు కోపించిన కాళము ఒకనాడు శివలింగ సమీపమున వేచియుండి అభిషేకము చేయుచున్న గజరాజు తొండములో దూరి కుంభస్దలమున అలజడి కలిగించగా ఆ బాధ భరించలేని గజరాజు తన తలను ఒక బండకు మోదుకొని మరణించెను. గజరాజుతో పాటు కుంభస్దలము లోపల వున్న కాళము (సర్పము) కూడా మృతిచెందెను. ఆ క్షణమున శివుడు ప్రత్యక్షమై వారిరువురికి పూర్వజన్మ వృత్తాంతము తెలియపరిచి, వారిని అనుగ్రహించి శివైక్యము గావించెను. అప్పటి నుండి దక్షిణకైలాసము అని పిలవబడుతున్న ఈ క్షేత్రమునకు శ్రీకాళహస్తి అను నామధేయము ఏర్పడినది.

కన్నప్పకి మోక్షమొసగిన శివుడు
మహభక్తుడు అయిన తిన్నడు(కన్నప్ప) శివసాయుజ్యం పొందినది కూడా ఈ పుణ్యక్షేత్రములోనే అంటారు. అటవిక రాజైన తిన్నడు పూర్వజన్మమున పాండవ మధ్యముడైన అర్జునుడు. అతనిని పరీక్షించు నెపమున శివుడు పార్వతీ సమేతంగా బోయరూపమున వచ్చి పరీక్షించగా అందు అర్జునుడు విజయమొందెను. శివుడు సంతసించి ఒసగిన వరఫలితంగా అర్జునుడు మరు జన్మమున తిన్నడుగా జన్మించెను. జంతువులను వేటాడుచూ తిరుగుతున్న తిన్నడికి బిల్వ వనమున వెలసియున్న శ్రీకాళహస్తీశ్వరుని దర్శనమైంది. లింగ రూపుడైన పరమేశ్వరునికి ప్రతి దినమూ తాను వేటాడిన మాంసఖండములను నైవేద్యముగా సమర్పించెడివాడట. అచ్చోటనే శివలింగంను అర్పించుచున్న బ్రాహ్మణుడు ఖిన్నుడై ఇదేమి అపవిత్రమని శివుని ప్రార్దంచగా శివుడు అశరీరవాణిగా తిన్నని వృత్తాంతమును ఆ బ్రాహ్మణునికి తెలియజేసెను. అంతటి మహాభక్తుని దర్శించవలెనని బ్రాహ్మణునుడు అ సమీపంలోనే రహస్యంగా దాగియుండెను. మాంసమునర్పింప వచ్చిన తిన్నని పరీక్షించుటకై శివుడు తన శివలింగములో ఏర్పడిన కనుల నుండి ధారగా రక్తం కారుతున్న దృశ్యమును గాంచెను. అందుకు ఖిన్నుడైన తిన్నడు తన కన్నులను పెకలించి శివలింగమునకు అమర్చెను. అతని భక్తి శ్రద్దలకు ముగ్దుడైన శివుడు తిన్ననికి శివసాన్నిధ్యమును ప్రసాదించెను. ఇదంతయూ దర్శించిన బ్రాహ్మణునికి శివసాన్నిధ్యము లబించెను. ఇట్టి మహత్యం కలిగిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఈ శ్రీకాళహస్త్తి. మొదట బ్రహ్మోత్సవాలు కూడా కన్నప్ప ధ్వజారోహణంతోనే ప్రారంభమైనాయి.
             
3. కాంచీపురం కాంచి అంటే సంస్కృతం లో వఢ్యాణము అని అర్థము.
కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేదాంతాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉన్నది.
 కాంచీపురo

ఏకాంబరేశ్వర ఆలయం

కంచిలోని ఏకామ్రేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టురూపంలో ఆవిర్భవించాయి. నేటికీ ఈ ఆమ్రవృక్షం పూజనీయమైనది. దీనివల్లనే ఇచ్చటి ఈశ్వరునికి ఏకామ్రేశ్వరుడనే పేరు వచ్చింది. 
మహాశివుడి లీలలను గురించి తెలుసుకోవడానికి మానవుడి జీవితకాలం సరిపోదు. అనురాగపూరితమైన ఆయన తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి మరుజన్మలు సైతం చాలవు. అలాంటి ఆదిదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శించడాన్ని భక్తులు ఒక వరంగా భావిస్తూ వుంటారు. కైలాసనాథుడిని కనులారా తిలకించడం కన్నా అసలైన అదృష్టం ఏవుంటుందనే అనుకుంటూ వుంటారు.

అలా సదాశివుడి క్షేత్రాలను దర్శించినప్పుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ వుంటుంది. వివిధ క్షేత్రాలలో శివలింగాలకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే, రూపంలోనూ ... పరిమాణంలోను విభిన్నమైన ఆకృతులు కలిగినవి కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మట్టితో ... ఇసుకతో ... చెట్టు మొదలుతో ... రాళ్లతో ప్రతిష్ఠించబడిన శివలింగాలు దర్శనమిస్తూ వుంటాయి.

అలా మట్టితో చేసిన శివలింగం 'కాంచీపురం'లో కొలువై 'ఏకామ్రేశ్వరుడు' పేరుతో పూజలందుకుంటోంది. అయితే కేవలం మట్టితో చేయబడిన శివలింగమైతే ఇంత ప్రాధాన్యత వుండేది కాదు. ఆ శివలింగంపై పార్వతీదేవి ఆభరణాల ముద్రలు వుండటం ఇక్కడి ప్రధాన విశేషం. అమ్మవారు కాత్యాయనిగా వున్నప్పుడు మట్టితో శివలింగం చేసి శివుడి గురించి కఠోర తపస్సు చేస్తుంది. పరమశివుడి ఆదేశం మేరకు గంగాదేవి ఆమె భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుంటుంది.

 కంచీపురముhttp://www.tvramudu.blogspot.comఅనుకున్నదే తడవుగా ఉరుకులు పరుగులు తీస్తూ వచ్చి ఆ మట్టి శివలింగాన్ని ముంచేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకుంటూ అమ్మవారు శివలింగాన్ని హృదయానికి గట్టిగా హత్తుకుని కూర్చుంటుంది. ఆ సమయంలో జరిగిన ఒత్తిడి కారణంగా, ఆమె ఆభరణాలు శివలింగానికి వత్తుకుపోయి దానిపై గుర్తులు ఏర్పడ్డాయి. అమ్మవారి ఆభరణాల గుర్తులనే స్వామి అలంకారాలుగా చేసుకోవడం వలన, ఇప్పటికీ ఈ మట్టి శివలింగం చెక్కుచెదరకపోవడం వలన ఇది మరింత మహిమాన్వితమైనదని చెబుతుంటారు.కంచి క్షేత్రంలోని కామాక్షిదేవి ఆలయం శ్రీ చక్ర ఆకృతిలో నిర్మితమై వుంది. దీని మధ్యగా, బిందుస్థానీయంగా సిద్ధాసనంలో, చతుర్భుజరూపిణియై శ్రీ కామాక్షి దేవి ప్రతిష్టితులై ఉన్నారు. 

అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి, ప్రతిష్టించిన శ్రీ చక్రాధిష్ఠాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనం ఇస్తున్నది.

కంచిలో ఏ ప్రాణి అయినా ఏ కోరికతో అయినా ధర్మానుష్ఠానం చేస్తే అది ఒక్క పర్యాయమే అయినా కోటి రెట్లుగా ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇవి కామకోటి అయింది. కంచిలోని కామరాజ పీఠమే కామకోటి పీఠంగా ప్రసిద్ధమై వుంది. ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా వుంది.

 కంచికామాక్షి
పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్ లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, మరియు తామర పుష్పాన్ని మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి.భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆతర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు. 

 మధుర మీనాక్షిమూగవానిచే కవిత్వం చెప్పించిన కంచి కామాక్షి. కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశివిశాలాక్షి అనేది వాడుకలోనున్న, ప్రశస్తి. కంచి కామకోటి పీఠంగా ప్రసిద్ధి చెందిన, శ్రీకామక్షి దేవాలయం, 51 శక్తిపీఠాలలో ప్రశస్తమైనది. ఇరువదినాల్గు స్తంభాలు, ఇరువై నాలుగు గాయత్రి అక్షరములని, ఆ మంటప గర్భ గృహంలో, పద్మా సనాసీనురాలై, చతుర్భుజములు కల్గి అంకుశము, పుష్పము, బాణము, చెరకు విల్లు ధరించి కనుచూపుతో భక్తుల అభీష్టము తీర్చునట్లు అనుగ్రహమూర్తిగా, వెలసి యున్న జగన్మాత కామాక్షీ దేవి.

అమ్మ ఆదిశంకరులచే ప్రతిష్టించబడిన ఆలయంలో త్రికాలములందు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాలో అమ్మవారికి అభిషేకాలు జరుగుచుండును. పరాంబికయే, కామాక్షి అమ్మవారుగా పురాధీశ్వరిగా, వెలసినది. పంచభూత క్షేత్రములలో, (పృధ్వి) భూమి స్థలముగా, వెలసినది. 18 పురాణాలలో వర్ణించ బడి నదీ క్షేత్రం. దుష్టులను శిక్షించడానికి దైవశక్తి ఒక రూపంలో, అవతరించి, పాప భీతిని, కల్గించి, భక్తి భావాలను, ముక్తి కాంక్షను, పెంచి మానవుని మహోన్నత పథంవైపు, నడిపిస్తుంది. ఈ జగత్తు సర్వం ధర్మాధర్మాలమిశ్రమం. అక్రమ మార్గాన్ని వదలి, సక్రమ మార్గంలో పయనించుటవల్ల, మనసు, నిర్మలంగా ఉంటుంది. ఆ స్థితిలో మాలిన్యం, అంటే చీకటితొలగి, జ్ఞానోదయం అవుతుంది. వెలుగు, మార్గం కనబడుతుంది. ఆ వెలుగు అఖండ ఆనంద సౌందర్య రసస్వరూపంగా మనకు గోచరమవుతుంది. విశ్వంలోని ప్రతివస్తువులో ఆ వెలుగును చూడగల్గుతాం.
శ్లో|| వాగర్థావివసంపృక్తౌ వాగర్థ ప్రతిపక్తయే'' అని ఏ శుభ సమయాన శ్లోకార్చన చేశారో, తదనంతర కవులెందరో అమ్మవారికి అక్షరాభిషేకం చేశారు. ఏ కవులస్తుతులలో దేదీప్య మానంగా దేవీస్వరూపాన్ని ప్రస్తుతించారో, ఆ దేవీ స్వరూపం త్రిమూర్త్యాత్మికమైయ్యింది. అట్టి త్రిమూర్త్యిత్మిక స్వరూపమే 'కామాక్షీ' అమ్మవారు.
శ్రీకాంచీ పురంలో మూగ పిల్లవాడు ఉండేవాడు. అతడు తన మూగ వల్ల అందరితో ఛీత్కరింపబడి, తిరస్కృతుడయ్యాడు. చివరకు కన్నతల్లి దండ్రులు గూడ అతనిని సరిగా ఆదరింపకున్నారు. అతడు మరణించుటకుపక్రమించి, కామాక్షీ చరణారవిందాలను ఆశ్రయించాడు. భక్తితో ఆర్తితో ఆర్ద్రతతో, అమ్మవారి పాదాలచెంత, నమ్రతతో ఆమె పాదాల చెంత దు:ఖించసాగాడు. అమ్మవారికటాక్ష వీక్షణాలు ఆ బాలునిపై ప్రసరించాయి. అమ్మ అతని ఆవేదన ఆలకించింది. ఆ సమయం ప్రసన్నమై, రమణీయమైన సమయం. అమ్మవారు తాంబూలం సేవిస్తూ, లీలావిలాసంగా, కూర్చొన్న తరుణం. అమ్మవారి అనుగ్రహం తాంబూలమై ప్రసరించింది. అమ్మవారి అనుగ్రహానికి చిహ్నంగాతాను నములుతున్న, తాంబూలలేహ్యము ఆ మూగపిల్లవాని నాలుక పై నుంచింది. ఆకాశం నుండి నేలపైకి వెన్నెల ప్రవాహం ఏ విధంగా ప్రవహిస్తుందో అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ మూగపిల్లవానికి, సంప్రాప్తించింది. ఆ మూగ పిల్లవానికి మాటలువచ్చాయి. మాటలు రావడమంటే మామూలు మాటలు కాదు గంగా ప్రవాహంవలే వచ్చాయి. ఆ మాటలే కవిత్వంగా పరిణమించి ఏక ధాటిగా ఐదువందల శ్లోకాలు చెప్పాడు.
ఆ కవిత్వమే 'మూకపంచవింశతి'. సంస్కృత ప్రవాహమై ప్రసరించింది. ఆరా శతకం-అమ్మవారి దివ్యలీలా విలాసం సంవర్ణించేది. మరొకటి పాదారవింద శతకం-అమ్మవారి పాదపద్మాల గురించి చెప్పినమాట చెప్పకుండా భక్తి ప్రవా హంగా మారింది. జగన్మాత పాదపద్మాల దర్శనం అనుభవించి, భక్తి ప్రవా హంగా చెప్పిన శతకం. తరోత కటాక్ష శతకం అమ్మవారి చూపులు ఎలా ఉంటాయో మనోజ్ఞంగా వర్ణించింది. లౌకిక విద్యలయందు నేర్పరియగు నొక యువకుడు ఎట్లు లౌకిక సంపదలు బడయునో, అట్లే పూర్వకృపస్తుతికి పస్తుతికి ఫలితంగా, భక్తుడు, అమ్మవారి కటాక్ష శతకంనందు సూచించెను.
దేవి అనుగ్రహ పాత్రుడై ఆ తల్లి మందస్మిత చంద్రకాయుతుడౖైె ఆనంద చంద్రునివలే, అలౌకిక నిరతిశయానంద, భవ్యస్వరూపుడై ప్రకాశించునని, మందస్మిత శతకమును ఆవిష్కరించెను. ఒక్కొక్క శతకాన్ని ఒక్కొక్క రకంగా వర్ణించాడు. అమ్మవారి శతకం అమ్మవారి, దివ్యలీలా విలాసంగా నిలిచాయి. సప్త మోక్ష పురాలలో కాంచీపురం ఒకటిగా నిలిచింది. కంచికామాక్షి మధురమీనాక్షి, కాశీ విశాలాక్షి అనేది వాడుకలో ప్రశస్తి.
 చిదంబర రహస్యం
చిదంబరం,..నటరాజస్వామి ఆనందతాండవం చేసేఈ ఆలయానికి కోయిల్ అనే పేరుకూడా వుంది,..అలాగే మరొక నామం తిల్లయ్ అని కూడా పిలుస్తారు..

          పాండిచ్చేరి నుండి బస్ లో రెండున్నర గంటలు పడుతుంది చిదంబరం చేరేసరికి, చాలా పెద్ద ఆలయం. తొలి ప్రాకారంలోంచి మందిరంలోకి ప్రవేశించగానే ఆనంద నటరాజస్వామి నాట్యంచేసే అద్బుత రూపం సాక్షాత్కరిస్తుందిమాటలలో చెప్పలేని అలౌకిక ఆనందాన్ని చూపరులకు కల్గిస్తుంది
చిత్’ అంటే చైతన్యం. ‘అంబరం’ అంటే నిర్మల ఆకాశం (ఈథర్). మరో అర్థం ప్రకారం, అంబరం అంటే వేదిక. ‘చిత్’ అంటే ఆనంద తాండవం. ‘చిదంబరం’ అంటే ‘ఆనంద తాండవ వేదిక’. అంటే, చిదంబరం అత్యంత ఆనందంతో, ఆత్మ జరిపే తాండవానికి వేదిక అన్నమాట. ఈ ఆత్మానంద తాండవానికి నటరాజ విగ్రహం ప్రతీక. పైగా శివుడు పంచభూత తత్వాలను తనలో ఉంచుకున్నవాడు. చిదంబరం’ ఆకాశ తత్వానికి ప్రతీక. ‘ఆకాశం’ అన్నది అనంతమైనది. ఆకాశం అంటే శూన్యం. ఆకాశం అన్నది భూమిపైనున్న వారికి వాతావరణం వల్ల ‘నీలి’ రంగులో కనిపిస్తుంది. నిజానికి అది ఆకాశం రంగు కాదు. ఇందులోనే ‘చిదంబర రహస్యం’ దాగుంది.ఆ ఓంకారుని నిర్మల చైతన్యమే చిదంబర రహస్యం.
ఈ రహస్యాన్ని సాధారణ మానవమాత్రులు ఛేదించలేరని అంటారు. తత్వాన్వేషణతో ఆత్మ-విచక్షణా ఙ్ఞానాన్ని పొందగలుగుతేనే అది సాధ్యం.
ఎవరైతే మనలో దాగివున్న ఆ పరమాత్ముడి దరిచేరగలుగుతారో వారికే తెరవెనుక నున్న ఆ ఆదికేశవుడి ఉనికీ, పరమార్ధం గోచరిస్తాయని ప్రతీతి.                         

 చిదంబర రహస్యం
ఆకాశం అనంతమైనది. అలాంటి అనంతమైన ఆకాశాన్ని వివరించటం, వర్ణించటం, అవగాహన చేసుకోవటం కుదరదు. కానీ ఆ భావనను అనుభవించగలం. భావించగలం. ఆ భావనను మనసు భావించి, అనుభవించి, అవగాహనకు తెచ్చుకుని అనంత ఆనందాన్ని పొంది, ఆనంద తాండవం చేయించగల మహాత్మ్యం చిదంబరం ఆలయానికి ఉంది. అయితే ఆ ఆనంద తాండవం భావనను కలిగించే దివ్యమంగళ మూర్తి, అర్ధ నారీశ్వరుడు మందిరంలో కొలువై ఉన్నాడు. కానీ అందరికీ కనిపించడు! ఆ దివ్యమూర్తి దర్శనానికి అడ్డుగా ఓ తెర ఉంటుంది. పూజారి పూజ పూర్తయిన తర్వాత, క్షణకాలం సేపు తెరను తొలగించి, వేచి ఉన్న భక్తులను దివ్య మంగళమూర్తి దర్శన భాగ్యం కలిగిస్తారు కానీ, లోపల ఉన్న మూర్తి అందరికీ కనబడదు. అందరి మనసుల్లో ఆనంద తాండవ మృదంగ ధ్వనులు మార్మోగుతున్నా, కొందరు పుణ్యాత్ములకు మాత్రమే లోపలి దివ్యమంగళ మూర్తి అసలు దర్శన భాగ్యం కలుగుతుంది.
 చిదంబర రహస్యం
‘తెర’ అన్న మాయను తొలగిస్తే కానీ, అనంత ఆనంద స్వరూపుడైన భగవంతుడి దర్శనం కాదని, మనసును కమ్మిన మాయ తెరలను తొలగించినవారికే దర్శనం అవుతుందని వివరిస్తారు కానీ, ఇంతకీ తెర మాటున నిజంగా దివ్యమంగళ మూర్తి ఉన్నాడా లేక శూన్యానికి ప్రతీకగా, అనంతానందంలోని అనంత శూన్యాన్ని ప్రతిబింబిస్తూ లోపల శూన్యంగా ఉందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు. ఎందుకంటే లోపల ఏముందో చూడాలంటే కళ్లకున్న పొరలు కరగాలి. కానీ ఏమీ కనబడలేదంటే మాయ తెరలు తొలగలేదని ఒప్పుకోవాలి. అందుకే చిదంబరంలోని తెర మాటున ‘'చిదంబర రహస్యం’ ఇప్పటికీ పదిలంగా దాగి ఉన్నది. ఈ చిదంబర రహస్యమే కాదు, మరో విషయం కూడా మిస్టరీగానే మిగిలి ఉంది. {అందరికీ కనిపించే నటరాజ విగ్రహం ఆలయంలోని ఇంకో ప్రాంగణంలోనిది}.