Wednesday, September 17, 2014
శ్రీ హేమాద్రినాధుడు
అడవిలో కొలువైన భక్త వరదుడు... శ్రీ హేమాద్రినాధుడు
శ్లోకం: ఉగ్రవీరం నారసింహం దారిద్య్రి దుఃఖ దృష్ట గ్రహా పీడానివారణం
శంఖచక్రారాయుధ ధరం శ్రీ హేమాద్రి నాధ వరధాభయ ప్రధాత శరణం ప్రపద్యే!!
శ్లోకం: ఉగ్రవీరం నారసింహం దారిద్య్రి దుఃఖ దృష్ట గ్రహా పీడానివారణం
శంఖచక్రారాయుధ ధరం శ్రీ హేమాద్రి నాధ వరధాభయ ప్రధాత శరణం ప్రపద్యే!!
అర్ధచంద్రాకృతిలో మహ్మదీయ ఆరాధ్య చిహ్నాన్ని పోలిన గుట్టపై వెలసిన కొండంత దేవు డు, సర్వరోగ నివారిణి, సంతానప్రాప్తి కలి గించే స్వామి నరహరి విగ్రహానికి నిరంతరం కారే చెమటలు, హరిపాదంలో పుట్టిన చింత మాణి ధార నెలవైన 7 ఆంజనేయ ప్రతిమలు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన దేవదేవుడే శ్రీ హేమాద్రినాధుడు.
పిలిస్తే పలికే ఆపద్బంధువు, ఆర్తజన చింతామణి, అనే క విశిష్టతలు సంతరించు కున్న శ్రీ హేమాద్రి (బం గారు కొండ) లక్ష్మీ నర్సింహస్వామి క్షేత్రం మహిమాన్వితమైనది. అడవిలో ఎతైన కొండపై చల్లని చింతామణి ధారలతో ఆహ్లాదకర వాతా వరణంతో చారిత్రిక, పురాతన ప్రాధాన్యత సంతరించుకొని ప్రకృతి మాత ఓడిలో కొలువుదీరిన అతి సనాతనమై.. రెండవ యాదగిరిగా పిలువబడే ఈ హేమాద్రి పుణ్య క్షేత్రం నవ నారసింహా క్షేత్రాలలో ఒక్కటిగా ప్రఖ్యాతి పొందింది.పావన గోదావరి నది తీరాన వెలసిన ఈ మల్లూరు లక్ష్మీ నరసింహ క్షేత్రం వరంగల్ జిల్లా మంగపేట మండల పరిధి మల్లూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్నది. హిందూముస్లిం మతసామారస్యానికి ప్రతీక ఈ హేమాధ్రి అని అందులో వెలసిన స్వామి వారు ఇరు మతాల వారిచే పూజలందుకోవడం విశేషం.
అర్ధ చంద్రాకృతిని పోలిన పర్వతం...
శ్రీవారు కొలువైన ఈ పర్వతం మహ్మదీయ ప్రవిత్ర ఆరాధ్య చిహ్నాన్ని పొలిన రీతిలో (అర్ధ చంద్రాకృతిలో), నక్షత్ర ఆకారంలో శ్రీహరి ఆలయం తలుకులీనుతుండగా ఈ ఆధారంతో వివిధ ప్రాంతాల నుండి ముస్లిం భక్తులు హాజ రై అల్లా రూపంలో అలరారే’ శ్రీ నారసింహున్ని సేవించి పరవశిస్తారు.
శ్రీవారు కొలువైన ఈ పర్వతం మహ్మదీయ ప్రవిత్ర ఆరాధ్య చిహ్నాన్ని పొలిన రీతిలో (అర్ధ చంద్రాకృతిలో), నక్షత్ర ఆకారంలో శ్రీహరి ఆలయం తలుకులీనుతుండగా ఈ ఆధారంతో వివిధ ప్రాంతాల నుండి ముస్లిం భక్తులు హాజ రై అల్లా రూపంలో అలరారే’ శ్రీ నారసింహున్ని సేవించి పరవశిస్తారు.
17వ శతాబ్ధంలో భారతదేశాన్ని పాలించిన మహ్మదీయ చక్రవర్తి గజనీ మహ్మద్ స్వామి వారి మహిమలు విని అర్ధ చంద్రాకృతిలో వా రి మత చిహ్నాన్ని పోలినట్టుగా ఉన్న ఈ గుట్ట ను చూసి ఆశ్చర్యంతో అల్లాకు, హరికి తేడా లేదని, ఈ దేవున్ని ఆయన కూడా ఆరాధించా డని ఆధారాలున్నాయి. అంతేకాక నరసింహుని మహిమలు ఆయనకు అనుభవం లోకి రావడంతో స్వామివారిని భక్తితో కొలచిన ఆయన.. నాడు కానుకగా ఇచ్చిన బిస్కెట్ బంగారం నేడు అమ్మగా వచ్చిన నిధిని నిర్వాహకులు మల్లూరు లోని గ్రామీణ బ్యాంకు లో ఫిక్స్డ్ చేశారు. ఎన్నో హిందు ఆలయాలను ధ్వం సం చేసిన ఆయన ఈ స్వామి విశిష్టతను తెలుసుకొని సర్వస్య శరణాగతి పొందాడు అందుకే ఈ ఆలయం రక్షించబ డింది. అంతే కాక 6వ శతాబ్ధానికి పూర్వం నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించి సేవించిన చోళ రాజులు హరికి సమర్పించిన బంగారు ఆభరణాలు ఇప్పటికి నగరంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లాకర్లో దేవాదాయ శాఖ ఆధీనంలో భద్రపర్చడం జరిగింది.
ప్రాముఖ్యత
భరద్వాజ మహర్షి తన శిష్య బృందంతో నాసి కాత్రయంబకం నుండి బయలుదేరి పుణ్యక్షేత్రా లను దర్శిస్తూ ప్రవిత్ర గోదావరి నది ప్రాంతం లో పర్యటిస్తూ ఒకనాటి రాత్రి మల్లూరు పరిస రాలలో బస చేశాడని, ఆ రాత్రి ఆయనకు శ్రీహరి నరుని రూపంలో స్వప్న దర్శనం ఇచ్చి తాను ఈ హేమాద్రి గుట్టపై రాతి పొరల్లో అర్చారూపంలో నిక్షిప్తమై ఉన్నానని తెలిపాడ న్నాడు. పాపాల నుండి ప్రజలను రక్షించడాని కి తనకు విముక్తి కలిగించమని మహర్షిని ఆదేశించి అదృశ్యమయ్యాడని పురాణగాథలు తెలుపుతున్నాయి. మహర్షి శిష్య బృందంతో కీకారణ్యంలోని భయంకరమైన గుట్టపైకి వెళ్ళి స్వామి వారు చెప్పిన ప్రాంతంలో పెకలిస్తుండ గా గుణపం పోటు స్వామి వారి నాభిలో పడిందని, అంతలో కనులు మిరిమిట్లుగొలిపే దివ్య కాంతితో భయంకరంగా ఒక్కసారిగా చేసిన \సింహగర్జన ఆ గుట్ట ప్రతిధ్వనించగా వారు భయపడి గుణపాన్ని వెలికిలాగడం వల్ల దాం తో చిందిన పెద్ద రక్తపు ధారకు ప్రకృతి స్తంభిం చింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం రావడం క్షణంలో జరిగింది.
ప్రాముఖ్యత
భరద్వాజ మహర్షి తన శిష్య బృందంతో నాసి కాత్రయంబకం నుండి బయలుదేరి పుణ్యక్షేత్రా లను దర్శిస్తూ ప్రవిత్ర గోదావరి నది ప్రాంతం లో పర్యటిస్తూ ఒకనాటి రాత్రి మల్లూరు పరిస రాలలో బస చేశాడని, ఆ రాత్రి ఆయనకు శ్రీహరి నరుని రూపంలో స్వప్న దర్శనం ఇచ్చి తాను ఈ హేమాద్రి గుట్టపై రాతి పొరల్లో అర్చారూపంలో నిక్షిప్తమై ఉన్నానని తెలిపాడ న్నాడు. పాపాల నుండి ప్రజలను రక్షించడాని కి తనకు విముక్తి కలిగించమని మహర్షిని ఆదేశించి అదృశ్యమయ్యాడని పురాణగాథలు తెలుపుతున్నాయి. మహర్షి శిష్య బృందంతో కీకారణ్యంలోని భయంకరమైన గుట్టపైకి వెళ్ళి స్వామి వారు చెప్పిన ప్రాంతంలో పెకలిస్తుండ గా గుణపం పోటు స్వామి వారి నాభిలో పడిందని, అంతలో కనులు మిరిమిట్లుగొలిపే దివ్య కాంతితో భయంకరంగా ఒక్కసారిగా చేసిన \సింహగర్జన ఆ గుట్ట ప్రతిధ్వనించగా వారు భయపడి గుణపాన్ని వెలికిలాగడం వల్ల దాం తో చిందిన పెద్ద రక్తపు ధారకు ప్రకృతి స్తంభిం చింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం రావడం క్షణంలో జరిగింది.
దాంతో మహర్షి భయంతో స్వామిని వేడుకోగా గుణపం పోటు బాధకు సింహముఖం రీతిలో భయంకరంగా తెరచుకున్న పెద్ద నోరు, నరుని రూపంతో నాలుగు చేతులతో వెలసిన నిలవెత్తు స్వామి రూపం గోడపై వెలసింది. దెబ్బ తగిలిన నాభి వద్ద పసుపుతో కట్టు కట్టి శాంతి చేయగా అప్పటి నుండి చిన్నచిన్న చుక్కల రూపంలో స్రవించే రక్తం ఇప్పటికీ కారుతూనే ఉన్నది. నాభి వద్ద అద్దిన గంధంతో తడసిన ఆ రక్తపు చుక్కలను సేవిస్తే ధన్వంతరి వైద్యం వలే సర్వరోగనివారణతో పాటు సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకము.
హరిపాదన పుట్టావమ్మా గంగమ్మ #చింతామణి ధార
హరిపదాంభుజ పావని (శ్రీ మహావిష్ణు పాదన పుట్టిన గంగమ్మ వలే) ఆలయంలో వెలసిన శ్రీహరి ప్రతిరూపమైన స్వామి వారి ఎడమ పాదం నుండి మండుటెండల్లో సైతం నిరంతరం ప్రవహించే స్వచ్ఛమైన ఈ ధారకు #చింతామణి ధారగా పేరున్నది. సర్వపాపహరి ని అయిన ఈ జలధార చేరే కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే ఆయురారోగ్యాలు ప్ర సాదిస్తుందనేది నమ్మకం. గుట్టపై గల వివిధ రకాల ఔషధ చెట్ల వేళ్ళ మధ్య నుండి ప్రవ హించే ఈ జలధారతో పుణ్యస్నానాలు ఆచరిం చి, సేవిస్తే పిశాచ, గ్రహరోగ పిడితులు, దీర్ఘరో గులకు నయమవుతుందని అంటారు. ఈ నీరు గుట్ట కింద గోముఖకాన్ని పోలిన ప్రతిమ నుండి బయటికి వెళుతుంది.
స్వామివారికి ఒల్లంతా చెమటే!
స్వామి వారి విగ్రహానికి నిరంతరం చెమట కారడమేకాకుండా మనిషి శరీరంపై నొక్కితే సొట్టలు పడినట్లుగా ఎక్కడాలేని విధంగా విగ్రహంపై సొట్టలుపడడం విశేషం. స్వామి వారికి సాధారణంగా జలక్షీరాభిషేకం చేస్తే ఇక్కడ మాత్రం ఉత్తర భారతంలోని హరిద్వార్ మాదిరిగానే నరసింహునికి తిలతైలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
హరిపాదన పుట్టావమ్మా గంగమ్మ #చింతామణి ధార
హరిపదాంభుజ పావని (శ్రీ మహావిష్ణు పాదన పుట్టిన గంగమ్మ వలే) ఆలయంలో వెలసిన శ్రీహరి ప్రతిరూపమైన స్వామి వారి ఎడమ పాదం నుండి మండుటెండల్లో సైతం నిరంతరం ప్రవహించే స్వచ్ఛమైన ఈ ధారకు #చింతామణి ధారగా పేరున్నది. సర్వపాపహరి ని అయిన ఈ జలధార చేరే కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే ఆయురారోగ్యాలు ప్ర సాదిస్తుందనేది నమ్మకం. గుట్టపై గల వివిధ రకాల ఔషధ చెట్ల వేళ్ళ మధ్య నుండి ప్రవ హించే ఈ జలధారతో పుణ్యస్నానాలు ఆచరిం చి, సేవిస్తే పిశాచ, గ్రహరోగ పిడితులు, దీర్ఘరో గులకు నయమవుతుందని అంటారు. ఈ నీరు గుట్ట కింద గోముఖకాన్ని పోలిన ప్రతిమ నుండి బయటికి వెళుతుంది.
స్వామివారికి ఒల్లంతా చెమటే!
స్వామి వారి విగ్రహానికి నిరంతరం చెమట కారడమేకాకుండా మనిషి శరీరంపై నొక్కితే సొట్టలు పడినట్లుగా ఎక్కడాలేని విధంగా విగ్రహంపై సొట్టలుపడడం విశేషం. స్వామి వారికి సాధారణంగా జలక్షీరాభిషేకం చేస్తే ఇక్కడ మాత్రం ఉత్తర భారతంలోని హరిద్వార్ మాదిరిగానే నరసింహునికి తిలతైలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
Subscribe to:
Posts (Atom)