సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, May 18, 2016

"శ్రీవారి అభిషేకం - శ్రీపాదతీర్ధం(ప్రతి శుక్రవారం)


                                                                                           
    శుక్రవారం అభిషేకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారిి మూలమూర్తికి 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమపువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పోడి మున్నగు పరిమళ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. వీటితో శ్రీవారికి అభిషేకం చెయ్యగా వచ్చే తీర్ధాన్ని "పులికాపుతీర్ధం (శ్రీ పాదతీర్ధం)" అంటారు. ఈ తీర్ధాన్ని అభిషేకంలో పాల్గొనే భక్తులుపై సంప్రోక్షిస్తారు. ఈ తీర్ధాన్ని శ్రీవారి భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు (TTD వారు Bottles లో వేసి అభిషేకంలో భక్తులందరికీ ఈ తీర్ధం ఇస్తారు). ఈ హరిపాద తీర్ధ మహిమను గూర్చి 'అన్నమయ్య' ఇలా కీర్తించాడు.

"శ్రీహరిపాదతీర్ధంబే చెడని మందు
మోహపాసాలు గోసి మోక్షమిచ్చే మందు

కారమై కంటగించని కడు చల్లని మందు
నూరని కాచనియట్టి నున్నని మందు
కోరికతో వెలవెట్టి కొని తేవల్లని మందు
వేరు వెల్లంకులు కూర్చనట్టి వెందువోని మందు

గురుతైన రోగములు గుణముచేసే మందు
దురితములు పెడబాపే దోడ్డ మందు
నిరతము బ్రహ్మాదులు నేరుపుతో సేవించే మందు
నరకము సొరమట్టి నయమయిన మందు

"ఓం నమో వేంకటేశాయ"
"ఓం నమో వేంకటేశాయ"
"ఓం నమో వేంకటేశాయ"!!

శ్రీ లలితా దేవ్యై నమః

శ్రీ లలితా దేవ్యై నమః
"శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి
చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత" అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత,అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండపూరాణంలో కనిపిస్తుంది.

భండాసురడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతారించవలసిన పరిస్థితి ఏర్పడింది."అమ్మ" అవతారించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు అందులో సమస్త విశ్వాన్ని, 14 భువనాలను, 7సముద్రాలను అన్నిటిని ఆహుతులుగా వేశాడు. తరువాత దేవతలందరూ తమను తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు. అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని, దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్ళి వాడిని సంహరించిందని తెలుస్తొంది.
ఈ అమ్మవారి మహిమలు అమోఘం. లలితా సహస్రనామంలో "మహచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా" అనే ఒక నామం ఉంటుంది అంటే లలితా దేవిని 64 కోట్ల మంది మహయోగినులు నిత్యం పూజిస్తూ ఉంటారని అర్దం.
"కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః" అనే నామం, అమ్మవారి చేతి గొర్ల నుండే విష్ణు మ్ముర్తి యొక్క 10 అవతారలు వచ్చాయి అని చెప్తోంది.
"ఓం కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః" అనే నామాన్ని రోజు జపిస్తే త్వరగా వివాహం అవుతుంది.
"ఓం కదంబవనవాసిన్యై నమః" అనే నామాన్ని గృహిణులు జపిస్తూ పసుపు లేదా ఎరుపు పూవులతో పూజిస్తే కుటుంబసౌక్యం కలుగుతుంది.
"బిసతంతుతనీయసీ" అను నామం షచ్క్రెక్రాలపైన వున్న 'కుండలనీ శక్తి'కి అధిదేవత. ఈ నామం మానసిక శారీరక దృడత్వాన్ని ఇస్తుంది.

ఇలా మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తొత్రంలో నామాలు పరిష్కారాలగా చెప్పబడ్డాయి.
లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామలు "సూపర్ రెమిడిలు"గా పనిచేస్తాయి. చాలా మహిమ కలవి. ఇంట్లో లేక వ్యాపార స్థలంలో వాస్తు దోషముంటే రోజు వీటిని గట్టిగా చదివితే దాని చెడు ప్రభావాలు ఉండవు గర్భవతులు రోజు లలితా సహస్రనామాన్ని చదివితే గర్భ దోషాలు తొలగిపొతాయి పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ లలితా సహస్త్రనామాల మహిమ అనంత ఫలితాన్ని ఇస్తుంది అందున ఇక్కడ చెప్పబడినవి కోన్ని మాత్రమే. మనం చదువుదాం. మన పిల్లలకు నేర్పుదాం. శ్రీ మాతా అనుగ్రహం పోందుదాం. శుభమస్తు.