సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, September 20, 2014

‎శనేశ్వరుడు‬ [మందగమనుడు]

శనేశ్వరుడు‬ మందగమనుడు అని కూడా పేరు.
సకల జీవులకు ప్రత్యక్షదైవం‬ అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ బార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు‬ అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం‪‎సూర్య‬ గ్రహణములో జరిగింది.
నవగ్రహాలకు రారాజు, ప్రత్యక్ష దైవం ‪‎సూర్యుడు‬. ఆయన సతీమణి సం‬ జ్ఞాదేవి. వారికిరువురు సంతానం. ‘‘యముడు‬, యమునా’’… వారే య మధర్మరాజు.
శనేశ్వరుడు, శనైశ్చరుడు, కాలుడు, మంద్యకోణ, సూర్యపుత్ర, యమ, సౌరి, ఛాయసుత, పంగు…
‪‎శనయే‬ క్రమతి స: అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు‬ మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.
ధర్మ‬ రక్షకుడు
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ‪‎ఫలాన్ని‬ వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు ‪#‎అగ్రజుడు‬. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు‬ బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.
గుణపాఠం నేర్పించే విషయంలో ‪‎శనీశ్వరునికి‬ ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.తన దృష్టి‬ పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి,అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి‬ అని శాస్త్రాలు వర్ణించాయి.
‪‎నల్లని‬ ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.
శనిభగవానుడు‬ సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, ‪‎మందగమనుడిగాను‬, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ ‪‎పురాణాలు‬ జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు.
శని‬ శాంతి మంత్రాలు
ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పాఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. ‪‎నలమహారాజు‬ రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు
అతనికి ‪‎శనిదేవుడు‬ కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.
క్రోడం‬ నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ”క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని‬ 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
శన్యారిష్టే‬ తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే!!

No comments:

Post a Comment