రాధా కృష్ణుల వ్యక్తిత్వాలలోని వైశిష్ట్యాన్ని, తత్త్వాలలోని వైలక్షణ్యాన్ని, ఆదర్శమూర్తీమత్వాన్ని తెలుసుకో వలసిన ఆవశ్యకత పునరావృత్తం అవుతుంది. రాధా కృష్ణుని కంటే వయస్సులో ఎంతో పెద్దదని, వరుసకు ఆమె కృష్ణునికి మేనత్త అనే కథనం తెలుగు నాట వ్యాపించిన పరిమళ చంధనం. బృందావనేశ్వరి, రాసేశ్వరి, విష్ణుజనని, కృష్ణసేవిత, కృష్ణ ప్రాణాధిక, సర్వలోకేశ్వరి రాధ అనే భావనకి పటిష్టమైన ఆలంబనం బ్రహ్మవైవర్త పురాణం, గర్గసంవాత, పద్మపురాణం, కృష్ణయామళము, బృందావన యోగుల అనుభూతులు, అనుభవాలు తదితర ఆధ్యాత్మిక వాఙ్మయ సమాహారము.
కవిత్రయంలో నన్నయ, తిక్కనలు గోలోక నాయిక రాధాదేవి గురించి పట్టించుకోక పోయినా ఎర్రన మాత్రం ఆమె గురించిన ఒకింత వ్రాసాడు. భక్తకవి పోతన ఆమెను విస్మరించినా శ్రీనాథుడు ఒక పద్యంలో ఆమెను వర్ణిం చాడు.
శ్రీకృష్ణ తత్త్వాన్ని జీర్ణించుకున్న మండపాక పార్వతీశ్వరకవి తన 'రాధాకృష్ణ సంవాదము' అనే కావ్యంలో తన ఉపాసనను యిలా ఆవిష్కరించాడు.
''మురళి ప్రణవంబు గోపికలు ముక్తజశము
గోగణంబు చిరంతన గోగణంబు
రాధ మూల ప్రకృతి లక్ష్మి బ్రహ్మవిద్య
కృష్ణు డానందమయ తత్త్వమిదె నిజంబు''
''మురళి ప్రణవంబు గోపికలు ముక్తజశము
గోగణంబు చిరంతన గోగణంబు
రాధ మూల ప్రకృతి లక్ష్మి బ్రహ్మవిద్య
కృష్ణు డానందమయ తత్త్వమిదె నిజంబు''
కృష్ణుడు ఆనందమయ రూపం, లక్ష్మి బ్రహ్మవిద్యా జ్ఞానం, రాధ ప్రకృతి స్వరూపం, గోపికా సమూహము ముక్తిజనం, శ్రీకృష్ణతత్త్వానికి ఎంత చక్కటి నిర్వచనం!
సకల ప్రాణులకు జీవనాధారం శృంగారం. అదే జీవధాతువుగా సకల సృష్టికి హేతువు, శృంగారంలో రమించి నట్లు జీవకోటి చిత్తవృతి ఇతర చిత్తసహజాతం పట్ల అనురక్తం కానందువలన సకల సృష్టికి శృంగారం ఆసాదనీయం అవుతుంది. ఆ శృంగార రసాధినాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
సకల ప్రాణులకు జీవనాధారం శృంగారం. అదే జీవధాతువుగా సకల సృష్టికి హేతువు, శృంగారంలో రమించి నట్లు జీవకోటి చిత్తవృతి ఇతర చిత్తసహజాతం పట్ల అనురక్తం కానందువలన సకల సృష్టికి శృంగారం ఆసాదనీయం అవుతుంది. ఆ శృంగార రసాధినాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
శ్రీకృష్ణలీలల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేని నవనాగరికులకు గోపికావస్త్రాపహరణం అసహ్యమని పిస్తుంది. కాని నారాయణ తీర్థుల వారి కీర్తన విన్నప్పుడు, అది పటాపంచలై పోతుంది. గోపికా వస్త్రాపహరణం చేసి పుణ్య పుంజవలోదయుడైన గోవిందుడు గోపికలకు పరమబాంధవుడై వారితో శర్మదములైన ధర్మ వాక్యములు పలికాడు. గోపికలు తమకు ఆవరణము (వస్త్రము) యిమ్మని వేడగా శ్రీకృష్ణుడు వారికి జ్ఞానబోధయిట్లా చేశాడు
ఆవరణం మమ న హితే దాతుమ్
నీతంనైవ మయా పరకీయం
నైవ మ మావరణం నిజ దృష్ట్యా
యుక్తి సదాం నహి భవదావరణం
యోగిభిరీతి మీమంసిత మబలా''

''గోపికలారా| మీకివ్వడానికి నా వద్ద నా ఆవరణము తప్ప మీ ఆవరణము (వస్త్రము) లేదు. బాగా ఆలోచించండి. ఓ . అవంతుడా! నీవు ఇప్పుడు మా ఆవరణాలను తీసుకొన్నావు కదా వాటినే మరల మాకు ఇవ్వు,''అన్నారు గోపికలు కృష్ణునితో. ''నేను ఇతరుల ఆవరణాలను ఎప్పుడు తీసుకోలేదు, అన్నాడు కృష్ణుడు. లోకం దృష్టిని కప్పిపుచ్చడానికి ఆవరణానిన్న మనిగోపికలు వేడుకుంటే లోకం దృష్టి యొక్క సాక్షీ స్వరూపమే ఈ మాయావరణము అన్నాడు కృష్ణుడు.
కృష్ణ బ్రహ్మనిష్ఠలైన గోపికలు కృష్ణునితో కలిసి రాసమండలం వర్తులంలో గానంతో నృత్యం చేస్తూ అతడు ఉపదేశించిన అద్వైతాన్ని అనురక్తితో యిలా అనుసరించారు.
''అద్వయ మఖండిత మశేష జగదాదిం
యత్ర చజగత్త్రితయ మాస్థిిత మనంతే
యత్ర నిలయం పునురుపైతి మృదికుంభో
యద్వదవ ధారయత సత్య మితిమామోమ్'
''నేను అద్వితీయడను, సజాతీయ, విజాతీయ, స్వగత భేదము లేని వాడను, నాశరహితుడను. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయ కాలం నాకంటే వేరు కాదు. ఎందుకంటే యీ ప్రపంచానికి కారణభూతుడను నేనే. గోపికలంతా సత్తా మాత్ర స్వరూపుడని చెప్పబడే పరమాత్మను నేనేనని తెలుసుకోండి. ఓంకారం నన్ను గూర్చే చెప్తూంది.'' గోపికలు కృష్ణుని మాటలను అనుకరించడంలో వాటిలోని అంతరారార్థాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నమే కాని అతణ్ణి వేళాకోళం చేయాలనే ఉద్దేశ్యం కనబడదు. అందులో వారి ముగ్ధ, మనోహర ప్రకృతి రూపుదాలుస్తుంది.ప్రపంచంలో ప్రణయం అనే పదం బ్రతికి ఉన్నంత కాలం రాధాకృష్ణులప్రయణతత్వం నిలిచి ఉంటుందని అక్షర సత్యం.
ఆవరణం మమ న హితే దాతుమ్
నీతంనైవ మయా పరకీయం
నైవ మ మావరణం నిజ దృష్ట్యా
యుక్తి సదాం నహి భవదావరణం
యోగిభిరీతి మీమంసిత మబలా''

''గోపికలారా| మీకివ్వడానికి నా వద్ద నా ఆవరణము తప్ప మీ ఆవరణము (వస్త్రము) లేదు. బాగా ఆలోచించండి. ఓ . అవంతుడా! నీవు ఇప్పుడు మా ఆవరణాలను తీసుకొన్నావు కదా వాటినే మరల మాకు ఇవ్వు,''అన్నారు గోపికలు కృష్ణునితో. ''నేను ఇతరుల ఆవరణాలను ఎప్పుడు తీసుకోలేదు, అన్నాడు కృష్ణుడు. లోకం దృష్టిని కప్పిపుచ్చడానికి ఆవరణానిన్న మనిగోపికలు వేడుకుంటే లోకం దృష్టి యొక్క సాక్షీ స్వరూపమే ఈ మాయావరణము అన్నాడు కృష్ణుడు.
కృష్ణ బ్రహ్మనిష్ఠలైన గోపికలు కృష్ణునితో కలిసి రాసమండలం వర్తులంలో గానంతో నృత్యం చేస్తూ అతడు ఉపదేశించిన అద్వైతాన్ని అనురక్తితో యిలా అనుసరించారు.
''అద్వయ మఖండిత మశేష జగదాదిం
యత్ర చజగత్త్రితయ మాస్థిిత మనంతే
యత్ర నిలయం పునురుపైతి మృదికుంభో
యద్వదవ ధారయత సత్య మితిమామోమ్'
''నేను అద్వితీయడను, సజాతీయ, విజాతీయ, స్వగత భేదము లేని వాడను, నాశరహితుడను. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయ కాలం నాకంటే వేరు కాదు. ఎందుకంటే యీ ప్రపంచానికి కారణభూతుడను నేనే. గోపికలంతా సత్తా మాత్ర స్వరూపుడని చెప్పబడే పరమాత్మను నేనేనని తెలుసుకోండి. ఓంకారం నన్ను గూర్చే చెప్తూంది.'' గోపికలు కృష్ణుని మాటలను అనుకరించడంలో వాటిలోని అంతరారార్థాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నమే కాని అతణ్ణి వేళాకోళం చేయాలనే ఉద్దేశ్యం కనబడదు. అందులో వారి ముగ్ధ, మనోహర ప్రకృతి రూపుదాలుస్తుంది.ప్రపంచంలో ప్రణయం అనే పదం బ్రతికి ఉన్నంత కాలం రాధాకృష్ణులప్రయణతత్వం నిలిచి ఉంటుందని అక్షర సత్యం.
No comments:
Post a Comment