రాధాకృష్ణుల వ్యక్తిత్వాలలోని వైశిష్ట్యాన్ని, తత్త్వాలలోని వైలక్షణ్యాన్ని, ఆదర్శమూర్తీమత్వాన్ని తెలుసుకో వలసిన ఆవశ్యకత పునరావృత్తం అవుతుంది.పరిమళ చంధనం. బృందావనేశ్వరి, రాసేశ్వరి, విష్ణుజనని, కృష్ణసేవిత, కృష్ణ ప్రాణాధిక, సర్వలోకేశ్వరి రాధ అనే భావనకి పటిష్టమైన ఆలంబనం బ్రహ్మవైవర్త పురాణం, గర్గసంవాత, పద్మపురాణం, కృష్ణయామళము, బృందావన యోగుల అనుభూతులు, అనుభవాలు తదితర ఆధ్యాత్మిక వాఙ్మయ సమాహారము.

శ్రీకృష్ణ తత్త్వాన్ని జీర్ణించుకున్న మండపాక పార్వతీశ్వరకవి తన 'రాధాకృష్ణ సంవాదము' అనే కావ్యంలో తన ఉపాసనను యిలా ఆవిష్కరించాడు.
''మురళి ప్రణవంబు గోపికలు ముక్తజశము
గోగణంబు చిరంతన గోగణంబు
రాధ మూల ప్రకృతి లక్ష్మి బ్రహ్మవిద్య
కృష్ణు డానందమయ తత్త్వమిదె నిజంబు''
కృష్ణుడు ఆనందమయ రూపం, లక్ష్మి బ్రహ్మవిద్యా జ్ఞానం, రాధ ప్రకృతి స్వరూపం, గోపికా సమూహము ముక్తిజనం, శ్రీకృష్ణతత్త్వానికి ఎంత చక్కటి నిర్వచనం!
సకల ప్రాణులకు జీవనాధారం శృంగారం. అదే జీవధాతువుగా సకల సృష్టికి హేతువు, శృంగారంలో రమించి నట్లు జీవకోటి చిత్తవృతి ఇతర చిత్తసహజాతం పట్ల అనురక్తం కానందువలన సకల సృష్టికి శృంగారం ఆసాదనీయం అవుతుంది. ఆ శృంగార రసాధినాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
''మురళి ప్రణవంబు గోపికలు ముక్తజశము
గోగణంబు చిరంతన గోగణంబు
రాధ మూల ప్రకృతి లక్ష్మి బ్రహ్మవిద్య
కృష్ణు డానందమయ తత్త్వమిదె నిజంబు''
కృష్ణుడు ఆనందమయ రూపం, లక్ష్మి బ్రహ్మవిద్యా జ్ఞానం, రాధ ప్రకృతి స్వరూపం, గోపికా సమూహము ముక్తిజనం, శ్రీకృష్ణతత్త్వానికి ఎంత చక్కటి నిర్వచనం!
సకల ప్రాణులకు జీవనాధారం శృంగారం. అదే జీవధాతువుగా సకల సృష్టికి హేతువు, శృంగారంలో రమించి నట్లు జీవకోటి చిత్తవృతి ఇతర చిత్తసహజాతం పట్ల అనురక్తం కానందువలన సకల సృష్టికి శృంగారం ఆసాదనీయం అవుతుంది. ఆ శృంగార రసాధినాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
శ్రీకృష్ణలీలల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేని నవనాగరికులకు గోపికావస్త్రాపహరణం అసహ్యమని పిస్తుంది. కాని నారాయణ తీర్థుల వారి కీర్తన విన్నప్పుడు, అది పటాపంచలై పోతుంది. గోపికా వస్త్రాపహరణం చేసి పుణ్య పుంజవలోదయుడైన గోవిందుడు గోపికలకు పరమబాంధవుడై వారితో శర్మదములైన ధర్మ వాక్యములు పలికాడు. గోపికలు తమకు ఆవరణము (వస్త్రము) యిమ్మని వేడగా శ్రీకృష్ణుడు వారికి జ్ఞానబోధయిట్లా చేశాడు.
ఆవరణం మమ న హితే దాతుమ్
నీతంనైవ మయా పరకీయం
నైవ మ మావరణం నిజ దృష్ట్యా
యుక్తి సదాం నహి భవదావరణం
యోగిభిరీతి మీమంసిత మబలా''
''గోపికలారా| మీకివ్వడానికి నా వద్ద నా ఆవరణము తప్ప మీ ఆవరణము (వస్త్రము) లేదు. బాగా ఆలోచించండి. ఓ . అవంతుడా! నీవు ఇప్పుడు మా ఆవరణాలను తీసుకొన్నావు కదా వాటినే మరల మాకు ఇవ్వు,''అన్నారు గోపికలు కృష్ణునితో. ''నేను ఇతరుల ఆవరణాలను ఎప్పుడు తీసుకోలేదు, అన్నాడు కృష్ణుడు. లోకం దృష్టిని కప్పిపుచ్చడానికి ఆవరణానిన్న మనిగోపికలు వేడుకుంటే లోకం దృష్టి యొక్క సాక్షీ స్వరూపమే ఈ మాయావరణము అన్నాడు కృష్ణుడు.
కృష్ణ బ్రహ్మనిష్ఠలైన గోపికలు కృష్ణునితో కలిసి రాసమండలం వర్తులంలో గానంతో నృత్యం చేస్తూ అతడు ఉపదేశించిన అద్వైతాన్ని అనురక్తితో యిలా అనుసరించారు.
''అద్వయ మఖండిత మశేష జగదాదిం
యత్ర చజగత్త్రితయ మాస్థిిత మనంతే
యత్ర నిలయం పునురుపైతి మృదికుంభో
యద్వదవ ధారయత సత్య మితిమామోమ్'
''నేను అద్వితీయడను, సజాతీయ, విజాతీయ, స్వగత భేదము లేని వాడను, నాశరహితుడను. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయ కాలం నాకంటే వేరు కాదు. ఎందుకంటే యీ ప్రపంచానికి కారణభూతుడను నేనే. గోపికలంతా సత్తా మాత్ర స్వరూపుడని చెప్పబడే పరమాత్మను నేనేనని తెలుసుకోండి. ఓంకారం నన్ను గూర్చే చెప్తూంది.'' గోపికలు కృష్ణుని మాటలను అనుకరించడంలో వాటిలోని అంతరారార్థాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నమే కాని అతణ్ణి వేళాకోళం చేయాలనే ఉద్దేశ్యం కనబడదు. అందులో వారి ముగ్ధ, మనోహర ప్రకృతి రూపుదాలుస్తుంది.
ప్రపంచంలో ప్రణయం అనే పదం బ్రతికి ఉన్నంత కాలం రాధా కృష్ణుల ప్రయణతత్వం నిలిచి ఉంటుందని అక్షర సత్యం.రాధాకృష్ణుల ప్రణయ ఆధారంగా చైతన్యుడు 'మధుర భక్తి' అనే భక్తి మార్గాన్ని ప్రచారం చేశాడు. 'మధుర భక్తి' తత్త్వంలో భక్తుడు ప్రేయసిగా, భగవంతుడు ప్రియుడుగా భావించి చేసే ప్రణయోపాసన ప్రదానం. చైతన్యుని భావనలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు,జీవాత్మలన్నీ స్త్రీలే. భక్తుడు గోపికగా తనను తాను భావించుకొని కృష్ణ ప్రేమలో తరించడాన్ని ఆయన ప్రతిపాదించాడు.
యశోదానందుల పుత్రునిగా జన్మించిన శ్రీకృష్ణుడు వృషభానుని పుత్రునిగా జన్మించిన రాధాదేవి ఇద్దరు పరబ్రహ్మ స్వరూపులు.
''రాధా రాసేశ్వరీ రమ్యా రామా చ పరమాత్మన:
రాసోద్భవా కృష్ణ కాన్తా వక్ష: సంస్థితా
కృష్ణ ప్రాణాధి దేవీ చ మహావిష్ణో: ప్రసూదపి
సర్వాద్యా, విష్ణుమాయా చ సత్యా నిత్యా సనాతనీ
బ్రహ్మ స్వరూపా పరమా నిర్లిప్తా నిర్గుణా పరా''
ఆమె రాసేశ్వరి. రాసమండంలో ఉదయించింది.
కృష్ణునికి ప్రాణాధిదేవత. ఆమె, సనాతని, విష్ణుమాయ,
రాధాశ్రీకృష్ణుని ఆనంద స్వరూపము.
ఆవరణం మమ న హితే దాతుమ్
నీతంనైవ మయా పరకీయం
నైవ మ మావరణం నిజ దృష్ట్యా
యుక్తి సదాం నహి భవదావరణం
యోగిభిరీతి మీమంసిత మబలా''
''గోపికలారా| మీకివ్వడానికి నా వద్ద నా ఆవరణము తప్ప మీ ఆవరణము (వస్త్రము) లేదు. బాగా ఆలోచించండి. ఓ . అవంతుడా! నీవు ఇప్పుడు మా ఆవరణాలను తీసుకొన్నావు కదా వాటినే మరల మాకు ఇవ్వు,''అన్నారు గోపికలు కృష్ణునితో. ''నేను ఇతరుల ఆవరణాలను ఎప్పుడు తీసుకోలేదు, అన్నాడు కృష్ణుడు. లోకం దృష్టిని కప్పిపుచ్చడానికి ఆవరణానిన్న మనిగోపికలు వేడుకుంటే లోకం దృష్టి యొక్క సాక్షీ స్వరూపమే ఈ మాయావరణము అన్నాడు కృష్ణుడు.
కృష్ణ బ్రహ్మనిష్ఠలైన గోపికలు కృష్ణునితో కలిసి రాసమండలం వర్తులంలో గానంతో నృత్యం చేస్తూ అతడు ఉపదేశించిన అద్వైతాన్ని అనురక్తితో యిలా అనుసరించారు.
''అద్వయ మఖండిత మశేష జగదాదిం
యత్ర చజగత్త్రితయ మాస్థిిత మనంతే
యత్ర నిలయం పునురుపైతి మృదికుంభో
యద్వదవ ధారయత సత్య మితిమామోమ్'
''నేను అద్వితీయడను, సజాతీయ, విజాతీయ, స్వగత భేదము లేని వాడను, నాశరహితుడను. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయ కాలం నాకంటే వేరు కాదు. ఎందుకంటే యీ ప్రపంచానికి కారణభూతుడను నేనే. గోపికలంతా సత్తా మాత్ర స్వరూపుడని చెప్పబడే పరమాత్మను నేనేనని తెలుసుకోండి. ఓంకారం నన్ను గూర్చే చెప్తూంది.'' గోపికలు కృష్ణుని మాటలను అనుకరించడంలో వాటిలోని అంతరారార్థాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నమే కాని అతణ్ణి వేళాకోళం చేయాలనే ఉద్దేశ్యం కనబడదు. అందులో వారి ముగ్ధ, మనోహర ప్రకృతి రూపుదాలుస్తుంది.
ప్రపంచంలో ప్రణయం అనే పదం బ్రతికి ఉన్నంత కాలం రాధా కృష్ణుల ప్రయణతత్వం నిలిచి ఉంటుందని అక్షర సత్యం.రాధాకృష్ణుల ప్రణయ ఆధారంగా చైతన్యుడు 'మధుర భక్తి' అనే భక్తి మార్గాన్ని ప్రచారం చేశాడు. 'మధుర భక్తి' తత్త్వంలో భక్తుడు ప్రేయసిగా, భగవంతుడు ప్రియుడుగా భావించి చేసే ప్రణయోపాసన ప్రదానం. చైతన్యుని భావనలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు,జీవాత్మలన్నీ స్త్రీలే. భక్తుడు గోపికగా తనను తాను భావించుకొని కృష్ణ ప్రేమలో తరించడాన్ని ఆయన ప్రతిపాదించాడు.
యశోదానందుల పుత్రునిగా జన్మించిన శ్రీకృష్ణుడు వృషభానుని పుత్రునిగా జన్మించిన రాధాదేవి ఇద్దరు పరబ్రహ్మ స్వరూపులు.
''రాధా రాసేశ్వరీ రమ్యా రామా చ పరమాత్మన:
రాసోద్భవా కృష్ణ కాన్తా వక్ష: సంస్థితా
కృష్ణ ప్రాణాధి దేవీ చ మహావిష్ణో: ప్రసూదపి
సర్వాద్యా, విష్ణుమాయా చ సత్యా నిత్యా సనాతనీ
బ్రహ్మ స్వరూపా పరమా నిర్లిప్తా నిర్గుణా పరా''
ఆమె రాసేశ్వరి. రాసమండంలో ఉదయించింది.
కృష్ణునికి ప్రాణాధిదేవత. ఆమె, సనాతని, విష్ణుమాయ,
రాధాశ్రీకృష్ణుని ఆనంద స్వరూపము.
సృష్టికి ఆధారం రాధాదేవి. బీజ స్వరూపుడు కృష్ణుడు. కృష్ణునిలోని శోభ రాధ. ఆమెతో కలిసినపుడే శ్రీకృష్ణుడు. రాధాకృష్ణులు తేజోరూపులు. రాధ మూల ప్రకృతి. కృష్ణుడు మూల పురుషుడు. ఇద్దరూ మహాభావ స్వరూపులు. బృందావన ధామంలో ఆనందరూపిణఙయైన రాధాదేవిని రసభావ మార్గంలో సాధకులు, ఉపాసిస్తారు. #రాధా శబ్దాన్ని రాధాకృష్న తత్త్వాన్ని ఎరిగిన మహనీయులు ఒక శృంగారనాయిక అనే అర్థుములోనే కాక సకల ప్రాణి సహజమైన కామభావ ఆశ్రయమైన స్త్రీ మూర్తి అనే అర్థంలో కాక భగవత్తత్త్వాను భూతికి సాధనమైన లోకోత్తర మహాతత్త్వముగా గ్రహించారు. రాధాకృష్ణ శబ్దాలను ఆలంబనగా చేసుకొన చేయబడిన వర్ణనలను, ఈతాత్త్విక అర్థా లకు తగినట్లుగా ఏర్పడే లోతైన పవిత్రభావనలతోనే గ్రహించాలి గాని వేరొక విధంగా కాదు.
లోకంలో మానవులు తదితర ప్రాణులు వీరికి స్వాభావికమైన ఇంద్రియిక ప్రవృత్తికి స్పష్టరూపమైన శృంగార, రసానికి దాని అంగాలైన భావిశేషాలకు ఉండవలసిన పవిత్రతకు శుద్ధరూపము ఇది అని లోకానికి చూపడానికి శ్రీకృష్ణుడు తన్ను తాను విభిన్న రూపాలలో విభజించుకొన్న రూపాల శృంగార రసాధి నాయకుడుగా - నాయికలుగా రాధాకృష్ణ వాఙ్మయంలో కనబడే కృష్ణుడు, రాధ, గోపికలు. ఈ పరమార్థాన్ని దృష్టి పధంలో నిలుపుకొని రాధా కృష్ణ గోపికల శృంగారపరమైన సన్నివేశాలను సమన్వయ పరుచుకోవటంలోనే ఆ సారస్వతానికి సముచితమైన న్యాయం జరుగుతుంది.
''రాధా పునాతు జగ దచ్యుత దత్త చిత్తా
మన్థానకం నిదధతీ దధిరిక్త పాత్ర
యస్యా: స్తనస్త బకచఞ్చలలోచనా లిర్
దేవోపి రుద్ద హృదయో ధవలం దుదోహ''
తన చిత్తవృత్తులను ఆకట్టుకొని తన చుట్టూ తిరుగుతున్న శ్రీకృష్ణునిపైన తన మనస్సుండటంఓ రాధ తాను పెరుగు చిలుక వలసిన పాత్రలో పెరుగు లేకున్నా ఉన్నది అని తలచి దానిలో కవ్వము ఉంచి చిలుకుతోంది. పూగుత్తులవలె అందమైన రధస్తనాలు తన హృదయాన్ని ఆకర్షిస్తుంటే వాటిపైన తన చూపులను నిలిపిన కృష్ణుడు అక్కడ కనబడిన వృషభాన్నే తాను పాలు పితుకవలసిన గోవుగా తలచి దానిని పితుకుతున్నాడు. అట్టి కృష్ణుని యందు ఆసక్తయైన రాధ తన శుద్ధ స్వచ్ఛధవల హృదయ ప్రకాశంతో లోకాలన్నింటిని కూడ తన చిత్తం వలెనే శుద్ధములుగా, పవిత్రములుగా చేయాలని లీలాశుకుని ''శ్రీ కృష్ణ కర్ణామృతము,''లోని ఈ శ్లోక భావం.''కృష్ణం వందే జగద్గురుమ్'!!
''రాధా పునాతు జగ దచ్యుత దత్త చిత్తా
మన్థానకం నిదధతీ దధిరిక్త పాత్ర
యస్యా: స్తనస్త బకచఞ్చలలోచనా లిర్
దేవోపి రుద్ద హృదయో ధవలం దుదోహ''
తన చిత్తవృత్తులను ఆకట్టుకొని తన చుట్టూ తిరుగుతున్న శ్రీకృష్ణునిపైన తన మనస్సుండటంఓ రాధ తాను పెరుగు చిలుక వలసిన పాత్రలో పెరుగు లేకున్నా ఉన్నది అని తలచి దానిలో కవ్వము ఉంచి చిలుకుతోంది. పూగుత్తులవలె అందమైన రధస్తనాలు తన హృదయాన్ని ఆకర్షిస్తుంటే వాటిపైన తన చూపులను నిలిపిన కృష్ణుడు అక్కడ కనబడిన వృషభాన్నే తాను పాలు పితుకవలసిన గోవుగా తలచి దానిని పితుకుతున్నాడు. అట్టి కృష్ణుని యందు ఆసక్తయైన రాధ తన శుద్ధ స్వచ్ఛధవల హృదయ ప్రకాశంతో లోకాలన్నింటిని కూడ తన చిత్తం వలెనే శుద్ధములుగా, పవిత్రములుగా చేయాలని లీలాశుకుని ''శ్రీ కృష్ణ కర్ణామృతము,''లోని ఈ శ్లోక భావం.''కృష్ణం వందే జగద్గురుమ్'!!
No comments:
Post a Comment