
భక్తికి నామమే ఆధారం..
కొటి జీవులలొ నేనొక జీవినై నా అంతరాత్మలొ ఓ ఆఖిలాండకొటి బ్రహ్మాండ నాయక పరబ్రహ్మస్వరూపమైన ఓ సాయిబాబా ఆత్మగా నిన్నె చూసాను.నిన్నె తలచాను జగతిలొ ప్రేమపుష్పమై వికసించావు.నిత్యదీపమై సర్వాంతర్యామిగా సకల జీవులలొ నిరంతరమై విశ్వమంత సత్యమై సాయిలీలలు చాటిచేప్పినావు మధురమైన నీ నామమునె గానముగా చేసినావు.నిన్ను నమ్మినవారిని సఖల భాగ్యములతొ ఆశీర్వదించినావు.అనంతమైన విశ్వం లొ స్వచ్చమైన సంపూర్ణమైన నీ ప్రేమ ప్రతి జీవిని ఆదుకుని కాపాడునని నా మనసా వాచా ఓ శిరిడి సాయినాధ నీకై సమర్పిస్తున్నాను.
నామమే భగవత్స్వరూపము. ఎవరైతే నామమును జపిస్తారో వారు తరిస్తారు.భగవదనుగ్రహాన్ని శ్రద్ధతో, సాధనతో స్వప్రయత్నంతోనే పొందగలుగుతాడు సాధకుడు. తద్వారా జ్ఞానాన్ని, శీలాన్ని, ధర్మాన్ని పొందుతాడు. అసాధ్యమైన సత్యాన్ని గ్రహిస్తాడు.మనిషి సృష్టికి శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది. అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది. కొలువలేనిది. కర్మతో జన్మనెత్తి వచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము.అంత:కరణాన్ని శుద్ధం చేసేది సత్సంగమే. ఒంటరిగా కూడా సాధన చేయడం మంచిది. కర్మలలో శ్రేష్ఠమైనది భగవత్కార్యము.
భగవత్కార్యము కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున నామముల వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది. కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది భగవన్నామస్మరణ. దైవం నామాన్ని పదే పదే ఉచ్ఛరించడమె నామ జపము.చిత్తశుద్ధికి నామజపము కంటే సులభమైన సాధనము లేదు. భక్తి, శ్రద్ధ, అణకువ, ప్రేమ, ఓర్పు, విశ్వాసం(నమ్మకం)లతో జపిస్తే సర్వదా భగవంతుని రక్ష ఉంటుంది. అంత:కరణాన్ని శుద్ధిచేసేది, శరీరాన్ని, మనసును కూడా ఉత్తేజపరచి నిర్మలంగా చేసేది సత్సంగమే. ఉత్తమ గతి పొందాలంటే పావనమైన మార్గం నామజపం. దీంతో శీఘ్రంగా సత్ఫలితాలను పొందగలుగుతాము.
~~~~~~~~~~~~!!శిరిడి సాయినాథ్ మహరాజ్ కి జైహో!!~~~~~~~~~~~~
No comments:
Post a Comment