దీపం లక్ష్మీదేవిరూపం..

''దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్
దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః!!
దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే అంధకారాన్ని పటాపంచలు చేయడం. అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి పండుగేకదా!
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంక్రుతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం


దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః!!
దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే అంధకారాన్ని పటాపంచలు చేయడం. అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి పండుగేకదా!
ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే....ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు. దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు. ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు. జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి. అమ్మవారి పూజలో నూనె దీపాన్ని ఎడంవైపు, ఆవు నెయ్యి దీపాన్ని కుడివైపు వెలిగించాలి. జపం చేసేటప్పుడు జపమాలపై వస్త్రం కప్పి ఉంచాలి. మాల బయటకు కనిపించకూడదు. దీపం శివునికి ఎడంవైపు, విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఏ దైవానికైనా దీపం ఎదురుగా మాత్రం ఉంచరాదు.
అగ్నితత్వం
పంచ భూతాల్లో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని అఖిలప్రాణ కోటి మనుగడకు ఉపకరించే తేజస్సు, ఓజస్సును అందిస్తుంది. అంతేగాక మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని ఇస్తుంది. ఈ దీపాల వెలుగును మనం సరిగ్గా గమనిస్తే నీలం, పసుపు, తెలుపు రంగులు మనకు కనిపిస్తాయి. ఈ మూడు రంగులను సత్వ, రజో, స్తమో గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి. ఈ మూడు రంగులను జగత్తును పాలించే లక్ష్మి, సరస్వతి, పార్వతులుగా పౌరాణికులు భావిస్తారు. దీపాన్ని వెలిగించడమంటే విజ్ఞానం, వివేకం, వినయాన్ని సందేశాత్మకంగా తీసుకోవడమని అర్థం.
పంచ భూతాల్లో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని అఖిలప్రాణ కోటి మనుగడకు ఉపకరించే తేజస్సు, ఓజస్సును అందిస్తుంది. అంతేగాక మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని ఇస్తుంది. ఈ దీపాల వెలుగును మనం సరిగ్గా గమనిస్తే నీలం, పసుపు, తెలుపు రంగులు మనకు కనిపిస్తాయి. ఈ మూడు రంగులను సత్వ, రజో, స్తమో గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి. ఈ మూడు రంగులను జగత్తును పాలించే లక్ష్మి, సరస్వతి, పార్వతులుగా పౌరాణికులు భావిస్తారు. దీపాన్ని వెలిగించడమంటే విజ్ఞానం, వివేకం, వినయాన్ని సందేశాత్మకంగా తీసుకోవడమని అర్థం.
నరకం నుంచి తప్పించేది
''అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణ తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే!!
ఇది వేదం చెప్పిన మాట. అంధతమిశ్రమనే నరకం. దక్షిణాయణకాలంలో మరణించిన వారు ఈ నర కం నుంచి తప్పించుకోవడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో వెలిగించిన జ్యోతిని దానం చేయాలని చెబుతారు. మరణం మన చేతుల్లోలేని కార్యం కాబట్టి ఉత్తరాయణ కాలంలో అందులోనూ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఇస్తే ఉత్తమోత్తమం అని వేదాలు చెబుతున్నాయి.
''అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణ తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే!!
ఇది వేదం చెప్పిన మాట. అంధతమిశ్రమనే నరకం. దక్షిణాయణకాలంలో మరణించిన వారు ఈ నర కం నుంచి తప్పించుకోవడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో వెలిగించిన జ్యోతిని దానం చేయాలని చెబుతారు. మరణం మన చేతుల్లోలేని కార్యం కాబట్టి ఉత్తరాయణ కాలంలో అందులోనూ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఇస్తే ఉత్తమోత్తమం అని వేదాలు చెబుతున్నాయి.
పితృదేవత కోసం-
ప్రదోష వేళలో దక్షిణ దిశగా నిలబడి దీపాన్ని వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు స్వర్గం వెళ్లేందుకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపాన్ని వెలిగించి ఇంటికి వచ్చిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని తీపి పదార్థాన్ని ఆరగించాలి.
ప్రదోష వేళలో దక్షిణ దిశగా నిలబడి దీపాన్ని వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు స్వర్గం వెళ్లేందుకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపాన్ని వెలిగించి ఇంటికి వచ్చిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని తీపి పదార్థాన్ని ఆరగించాలి.
లక్ష్మీదేవి ఆవాహన
సాయంత్ర సమయాన నువ్వుల నూనెలతో ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. దీపపు వెలుగులో దారిద్య్రం, దుఖాలు, కష్టాలు వంటివి దూరంగా తరిమి వేయబడతాయి. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా జరుపుకునే ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా దీపలక్ష్మిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.
సాయంత్ర సమయాన నువ్వుల నూనెలతో ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. దీపపు వెలుగులో దారిద్య్రం, దుఖాలు, కష్టాలు వంటివి దూరంగా తరిమి వేయబడతాయి. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా జరుపుకునే ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా దీపలక్ష్మిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంక్రుతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం
మనకు బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. తలలో పూల మాలలు, పరిమళభరితమైన స్నానాలు ముఖ్యం కాదు. స్వచ్చమైన, నిర్మలమైన, సంస్కారంతో కూడిన మాటలే సిసలైన అలంకారాలు. కనుక పైపై మెరుగులేవీ కాదు, మాట తీరే ముఖ్యం. అదే సిసలైన ఆభరణం

No comments:
Post a Comment