సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, October 20, 2014

‪‎రాముడోక్కడుండువరకు‬!!తక్కువేమి మనకు!!

‪‎రాముడోక్కడుండువరకు‬!!తక్కువేమి మనకు!!
#రాముడోక్కడుండువరకు!!తక్కువేమి మనకు!!
ఒక మనిషిగా జన్మించాక, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి, కష్టాల్లో, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి అన్న వాటిని ఆచరించి చూపించిన వాడు రాముడు.
#శ్రీరాముడు దేవుడే మానవుడిగా దైవం మానవరూపంలో అవతరించాడు.శ్రీరాముడు సుగుణాభి రాముడు మర్యాదా పురుషోత్తముడు జగదభిరాముడు ఎన్ని పేర్లు ఎన్ని స్తోత్రాలు ఆయన పేరే ఒక తారకమంత్రం. ఆ పేరును ఒక్కసారి జపిస్తే కోటి పుణ్యాల ఫలం లబిస్తుoది.
నిజంగా రాముడు అంత గొప్పవాడు.భారత దేశంలో ఆదర్శపురుషుడు ఎవరంటే ముందుగా వచ్చే పేరు శ్రీరాముడు,ఆదర్శ దంపతులు ఎవరంటే సీతారాములు,ఆదర్శపాలకుడు ఎవరంటే శ్రీరాముడు ఆదర్శ రాజ్యం ఏదంటే రామరాజ్యం.
#రామాయణం రాముడు సీతారాములు లక్షల సంవత్సరాల నాటి చరిత్ర అఖండ భారత దేశమంతటితో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర దేవుడు మనిషిగా అవతరించిన చరిత్ర. మనిషి దేవుడిగా ఎదిగిపోయిన చరిత్ర విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరాముడు రావణుడిని హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు.
#తల్లి దండ్రుల గారాల పట్టి అయిన రాముడు 17ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట వెళ్లమంటే మారు మాటాడకుండా వెళ్లాడు. రేపు పట్టాభిషేకం అనగా పధ్నాలుగేళ్ళు వనవాసం చేయమంటే అలాగే అంటూ వెళ్లిపోయాడు.. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు.#జననీ,జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నది ఈ రాముడే'' కన్నతల్లి, కన్నభూమి స్వర్గంతో సమానమన్నాడు,అందుకే ఆయన ఆదర్శరాముడయ్యాడు.
#అన్నగా తమ్ముళ్ల పట్ల అపారమైన ప్రేమను కురిపించిన వాడు. ఆయన తమ్ముళ్ళు కూడా అదే విధంగా అన్నపట్ల ప్రేమతో ఉన్నారు.తల్లులు వేరైనా ఏనాడూ కూడా దాయాదుల పోరు జరగలేదు. సీతాపహరణం తరువాత సుగ్రీవుడితో స్నేహం కుదిరాక ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని తమ్ముడి భార్యను అపహరించిన వాలిని సంహరించాడు..
వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు,అంతటి వీరుడు చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చింది? జంతువును చెట్టుచాటునుంచి చంపటం తప్పుకాదన్నారు. దీని వెనుక సాంకేతికంగా ఓ #లాజిక్‌ ఉంది. దాని గురించి #వాల్మీకి స్వయంగా రామాయణంలో చెప్పుకొచ్చాడు. వాలిలో ఒక గొప్ప శక్తి ఉంది.ఆయన ముందు ఎవరు నిలబడ్డా,ఆయన్ను చూసిన వెంటనే మెస్మరైజ్‌ అయిపోతారు.ఎదుటివారిలో శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. ఇది ఒకరకంగా హిప్నటిజం లాంటిదే,ఇప్పుడంటే హిప్నటిజంలో ఎదుటి వ్యక్తి అనుమతితో అతణ్ణి మెస్మరైజ్‌ చేస్తారు. ఆనాడు వాలి సూపర్‌ హిప్నాటిస్‌‌ట అన్నమాట.
ఒకటి కాదు.. రెండు కాదు.. హు్యమానిటీ అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఎన్నో ఉదాహరణలు రామాయణంలో మనకు కనిపిస్తాయి. పడవపై దాటించిన గుహుడు, ఎంగిలి పళ్లను ఇచ్చిన #శబరి, సీత జాడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణ సమయంలో ఉడుత, శరణు కోరిన శత్రువు తమ్ముడు చివరకు తొలి రోజు యుద్ధంలో #నిరాయుధుడైన రావణున్ని సైతం వదిలేసిన ఉదాత్త పురుషుడు కాబట్టే ఆయన అన్నింటా, అందరికీ, తరతరాలకు, యుగయుగాలకు ఆదర్శమయ్యాడు,యుగపురుషుడయ్యాడు.
ఒక మనిషిగా జన్మించాక, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి, కష్టాల్లో, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి అన్న వాటిని ఆచరించి చూపించిన వాడు రాముడు.
శ్రీరాముడు‬ దేవుడే మానవుడిగా దైవం మానవరూపంలో అవతరించాడు.శ్రీరాముడు సుగుణాభి రాముడు మర్యాదా పురుషోత్తముడు జగదభిరాముడు ఎన్ని పేర్లు ఎన్ని స్తోత్రాలు ఆయన పేరే ఒక తారకమంత్రం. ఆ పేరును ఒక్కసారి జపిస్తే కోటి పుణ్యాల ఫలం లబిస్తుoది.
నిజంగా రాముడు అంత గొప్పవాడు.భారత దేశంలో ఆదర్శపురుషుడు ఎవరంటే ముందుగా వచ్చే పేరు శ్రీరాముడు,ఆదర్శ దంపతులు ఎవరంటే సీతారాములు,ఆదర్శపాలకుడు ఎవరంటే శ్రీరాముడు ఆదర్శ రాజ్యం ఏదంటే రామరాజ్యం.
రామాయణం‬ రాముడు సీతారాములు లక్షల సంవత్సరాల నాటి చరిత్ర అఖండ భారత దేశమంతటితో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర దేవుడు మనిషిగా అవతరించిన చరిత్ర. మనిషి దేవుడిగా ఎదిగిపోయిన చరిత్ర విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరాముడు రావణుడిని హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు.
‪‎తల్లి‬ దండ్రుల గారాల పట్టి అయిన రాముడు 17ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట వెళ్లమంటే మారు మాటాడకుండా వెళ్లాడు. రేపు పట్టాభిషేకం అనగా పధ్నాలుగేళ్ళు వనవాసం చేయమంటే అలాగే అంటూ వెళ్లిపోయాడు.. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు.‪‎జననీ‬,జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నది ఈ రాముడే'' కన్నతల్లి, కన్నభూమి స్వర్గంతో సమానమన్నాడు,అందుకే ఆయన ఆదర్శరాముడయ్యాడు.
అన్నగా‬ తమ్ముళ్ల పట్ల అపారమైన ప్రేమను కురిపించిన వాడు. ఆయన తమ్ముళ్ళు కూడా అదే విధంగా అన్నపట్ల ప్రేమతో ఉన్నారు.తల్లులు వేరైనా ఏనాడూ కూడా దాయాదుల పోరు జరగలేదు. సీతాపహరణం తరువాత సుగ్రీవుడితో స్నేహం కుదిరాక ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని తమ్ముడి భార్యను అపహరించిన వాలిని సంహరించాడు..
వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు,అంతటి వీరుడు చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చింది? జంతువును చెట్టుచాటునుంచి చంపటం తప్పుకాదన్నారు. దీని వెనుక సాంకేతికంగా ఓ లాజిక్‌‬ ఉంది. దాని గురించి ‪‎వాల్మీకి‬ స్వయంగా రామాయణంలో చెప్పుకొచ్చాడు. వాలిలో ఒక గొప్ప శక్తి ఉంది.ఆయన ముందు ఎవరు నిలబడ్డా,ఆయన్ను చూసిన వెంటనే మెస్మరైజ్‌ అయిపోతారు.ఎదుటివారిలో శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. ఇది ఒకరకంగా హిప్నటిజం లాంటిదే,ఇప్పుడంటే హిప్నటిజంలో ఎదుటి వ్యక్తి అనుమతితో అతణ్ణి మెస్మరైజ్‌ చేస్తారు. ఆనాడు వాలి సూపర్‌ హిప్నాటిస్‌‌ట అన్నమాట.
ఒకటి కాదు.. రెండు కాదు.. హు్యమానిటీ అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఎన్నో ఉదాహరణలు రామాయణంలో మనకు కనిపిస్తాయి. పడవపై దాటించిన గుహుడు, ఎంగిలి పళ్లను ఇచ్చిన ‪‎శబరి‬, సీత జాడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణ సమయంలో ఉడుత, శరణు కోరిన శత్రువు తమ్ముడు చివరకు తొలి రోజు యుద్ధంలో ‪‎నిరాయుధుడైన‬ రావణున్ని సైతం వదిలేసిన ఉదాత్త పురుషుడు కాబట్టే ఆయన అన్నింటా, అందరికీ, తరతరాలకు, యుగయుగాలకు ఆదర్శమయ్యాడు,యుగపురుషుడయ్యాడు.

No comments:

Post a Comment