సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, October 20, 2014

శ్రీరామచంద్రుడు

#భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది.ఈ రామున్ని అవతారాన్ని విష్ణు మూర్తి యొక్క ఏడవ  అవతారం అని చెపవచ్చు. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపించారు. 
దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖములలో , కష్ట నష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాక పితృవాక్య పరిపాలనము, సత్యసంధత, భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట - ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలను ఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.
భగవంతుడు‬ తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది.ఈ రామున్ని అవతారాన్ని విష్ణు మూర్తి యొక్క ఏడవ అవతారం అని చెపవచ్చు. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపించారు.
దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖములలో , కష్ట నష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాక పితృవాక్య పరిపాలనము, సత్యసంధత, భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట - ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలను ఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.


Ramudu Thota Venkataramana's photo.
చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక (అభిజత్) లగ్నమందు - మేషమునందు సూర్యుడు, ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములందు ఉండగా శ్రీరామ‬ జననం జరిగిందని చెప్పబడినది.
కనుక మధ్యాహ్న వ్యాప్తమైన నవమి నాడు శ్రీరామ నవమి చేసుకోవాలి. రొండురోజులలోనూ నవమి మధ్యాహ్నానికి ఉంటే రెండవరోజునే గ్రహించాలి. అష్టమీ విద్ధ (అష్టమి తో కూడిన) కలిగిన నవమి పనికిరాదు అని శాస్త్ర వచనం చెబుతుంది.
ఈరొజు శ్రీరామ నవమి జరుపుకోవాలి.

శ్రీరామ నవమీ వ్రత విధానం-
శ్రీరామ ప్రతిమాదానం కరిష్యేహం ద్విజోత్తమ|
తత్ర ఆచార్యోభవ ప్రీత శ్శ్రీరామోసి త్వమేవమే||
శ్రీరామ నవమి పూజను చేయించుటకు, శ్రీరామ ప్రతిమను దానము చేయుటకు అష్టమి నాడే ఒక బ్రహ్మగారిని‬ వరించాలి.
నవమ్యాం‬ అంగ భూతేన ఏక భుక్తేన రాఘవ|
ఇక్ష్వాకు వంశతిలక ప్రీతో భవ భవప్రియ||
అనగా శ్రీరామనవమీ‬ వ్రతములో భాగంగా ఏకభుక్తమును చేస్తాను. ఇక్ష్వాకు వంశతిలకా, శంకర ప్రియుడా నాయందు ప్రీతిచెందవలసినది అని ‪‎ప్రార్థన‬ చేసి ఈరోజు( అష్టమి నాడు ) ఏకభుక్తము చేస్తానని సంకల్పించుకోవాలి. ( మధ్యాహ్న సమయములో ఆచార్యులతో కలిసి హవిస్సు ను మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. రాత్రికి భుజించరాదు.)
శ్రీరామ నవమి నాడు ఉదయాన్నే లేచి స్నానసంధ్యావందనాదులు ముగించుకుని, ముందుగా ఎర్పరచుకున్న వేదికపై పూజా మండపమును ఏర్పరచి
ఉపోషచాం‬ నవమీ త్వద్య యామేష్వష్టసు రాఘవ|
తేన ప్రీతోభవత్వం మే సంసారా త్త్రాహి మాం హరే||
ఈ నవమీ తిథినాడు ఎనిమిది జాములు ఉపవాసము చేసెదను, నీవు ప్రీతిచెంది నన్ను సంసారమునుండి రక్షించవలెను‬ అని ప్రార్థించాలి. సర్వతో భద్రమండలమును ఏర్పరచి ఆయా దేవతలను ఆవాహనచేయాలి.
‪‎ఇమాం‬ స్వర్ణమయీం రామప్రతిమాం ప్రయత్నతః|
శ్రీరామ ప్రీతయే దాస్యే రామభక్తాయ ధీమతే||
శ్రీరామ చంద్రప్రభూ రామ ప్రతిమారూపుడవైన నిన్ను నీప్రీతికొరకు నీభక్తునికి దానము చేసెదను అని సంకల్పించుకోవాలి.
“శ్రీరామ నమమీ వ్రతాంగ భూత షోడశోపచార పూజం కరిష్యే” !!
శ్రీరామ నవమీ వ్రతంలో భాగమైన శ్రీరామ పూజను చేస్తున్నాను. అని సంకల్పించి‪ ‎సర్వతోభద్ర‬ మండలము నందు కలశమును స్థాపించి, వస్త్రముతో కూడిన పూర్ణపాత్రమందు స్వర్ణ ప్రతిమ యందు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠచేసి పురుషసూక్త విధానముగా షోడశోపచారపూజలు చేయాలి. పూజానంతరము
రామస్య‬ జననీ చాసి రామాత్మక మిదం జగత్|
అతస్త్వాం పూజ ఇష్యామి లోకమాతర్నమోస్తుతే||
జగత్తంతా రామస్వరూపము. అట్టి రామునకు తల్లివైతివికనుక (ఓకౌసల్యా!) ‪‎లోకమాతవైన‬నిన్ను పూజించెదను అని కౌసల్యను పూజించాలి. “‪‎ఓం‬ నమో దశరథాయ” అని దశరథుని పూజించాలి.
దశానన‬ వథార్థాయ ధర్మ సంస్థాపనాయచ|
దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయచ||
పరిత్రాణాయ సాధూనాం జాతోరామస్స్వయం హరిః|
గృహాణార్ఘ్యం మయాదత్తం భ్రాతృభిస్సహితోనఘ||
రావణుని యొక్క, దైత్యదానవులయొక్క నాశనము కొఱకు, సాధువులను రక్షించి ధర్మమును స్థాపించుటకు సాక్షాత్తుగా శ్రీహరివైన నీవే ‪‎రాముడివైతివి‬. తమ్ములతో గూడి ఈ అర్ఘ్యమును స్వీకరింపుము అని మధ్యాహ్న సమయములో ఫలపుష్ప జలములతో కూడిన పూర్ణ‬శంఖముతో అర్ఘ్యమును ఇవ్వవలెను.
రాత్రి భజనాదులచే జాగరణము చేసి ఉదయాన్నే‬ మోల్కాంచి నిత్యపూజచేసి శ్రీరామ మూలమంత్రముచే నూట యెనిమిది సార్లు హోమము చేయవలెను. తదనంతరం
ఇమాం స్వర్ణమయీం రామ ప్రతిమాం సమలం కృతాం|
శుచి వస్త్రయుగచ్ఛన్నాం రామోహం రాఘవాయతే|
శ్రీరామ ప్రీతయే దాస్యే తుష్టో భవతు రాఘవః||
‪‎స్వర్ణమయమై‬ అలంకరించ బడిన రామ ప్రతిమను శుభ్రమైన వస్త్రయుగముతో గూర్చి శ్రీరామ ప్రీతికోరకు శ్రీరాముని స్వరూపమైన మీకు దానమిచ్చుచున్నాను. దీనిచే మీరు (రాముడు)‪‎సంతుష్టులగుదురుగాక‬. అని పలుకుతూ స్వర్ణప్రతిమను దానం చేయవలెను.
తవప్రసాదం‬ స్వీకృత్య క్రియతే పారణామయా|
వ్రతేనానేన సంతుష్టుః స్వామిన్ భక్తిం ప్రయచ్ఛమే||
నీ ప్రసాదమును స్వీకరించ పారణ‬ (ఉపవాస విరమణ) చేయుచున్నాను. నాచే ఆచరింపబడిన ఈ శ్రీరామనవమీ వ్రతముచే నీవు సంతుష్టుడవై మమ్మనుగ్రహించి సదా (నీయందు నిశ్చల) భక్తిని ప్రసాదించవలసినది అని ప్రార్థన చేస్తు శ్రీరామ ‪‎ప్రసాదమును‬స్వీకరించవలెను.

శ్రీరామ నవమి నాడు శ్రీరామ కళ్యాణం మనకు లోకకళ్యాణార్థం వేడుకగా వస్తున్నది కానీ కళ్యాణం చేయడంతో శ్రీరామ నవమీ వ్రతం పరిపూర్ణమవదు. శ్రీరామనవమి నాడు “‪‎ఏకభుక్తము‬, శ్రీరామ పూజ, సువర్ణ (శ్రీరామ) ప్రతిమాదానము” చేయాలని శాస్త్రగ్రంధాలలో చెప్పారు. వీటితో పాటు కళ్యాణం చేసుకుంటే ఇంకావిశేషం. వ్రతంగా‬ చేయాలంటే ఏమిటి నియమము అని తెలుసుకోవాలనుకునే వారికోసం ఈ వివరం అంత ఇవ్వబడినది. శ్రీరామ పూజ, కళ్యాణము విశేషంగానేడు అనేకులు చేస్తూనే ఉన్నారు. కాని శ్రీరామ నవమినాడు ఏమీచేయడానికి శక్తిలేనివారు ఫలం,పత్రం,పుష్పం,తోయం... అన్నట్లు కేవలం రామనామం‬చేస్తూ కూర్చున్నా అనంత ఫలాన్ని పొందుతారు.

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. దానధర్మాలు, స్వాశ్రీతరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వజ్ఞుడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. ఆత్మతత్వం‬ ఎరిగినవాడు. ‪‎ధర్మాన్ని‬ తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు. విద్వాంసుడు, ప్రియదర్శ నుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్న వాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు.
బాల్యంలోనే ‪‎శ్రీరాముడు‬ గుహుడు లాంటి (నీచ) జాతి వారితో సహవాసం చేయడంతో, ఆయన గుణవంతుడు అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి వీర్యవంతుడు అయ్యాడు. గురు వాజ్ఞ మీరక పోవడం-జనకాజ్ఞ‬ జవదాటక పోవడం-పరశు రాముడిని చంపక పోవడం లాంటివి ఆయన ధర్మజ్ఞుడు అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా -సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ‬ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను -సర్వ భూత హితాన్ని ‪‎అరణ్య‬ కాండ ద్వారా తెలుపుతుంది. సుందర‬ కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది.
విభీషణ‬ శర ణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడు తుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, ‪‎రాముడి‬ జితక్రోధత్వాన్ని తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే రాముడు కాంతియుక్తుడనీ- భయం కరుడనీ పలు సందర్భాల్లో అర్థమవుతుంది. వాల్మీకి శ్లాఘించిన గుణాలు‬ అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తికలవాడు, ఇక్ష్వాకుల మహారాజు వంశంలో,‪‎రామా‬ రామా రామా, అని లోకులు పొగిడే‪ రామచందమ్రూర్తి‬ అనే పేరుగలాయన మాత్రమే. అతివీర్యవంతుడాయన. అసమాన మైన-వివిధమైన-విచిత్రమైన శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయం లేని ఆనందంగలవాడు. ఇంద్రి యాలను-సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ‪‎ప్రియమైన‬ మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు. ఎత్తైన మూపురాలున్నవాడు. బలిసిన చెక్కిళ్లవాడు.
‪‎స్వజనరక్షకుడు‬. వేద వేదాంగాలను ఎరిగినవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య రాజని తలచడం సరైంది కాదు. పంచవటిలో సీతారామ లక్ష్మణులున్నప్పుడు, రామ లక్ష్మణులిద్దరూ లేని సమయంలో ఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతాడు రావణుడు. సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని, చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును‬ చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడు. తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు‬ చేశాడు రాముడు. రామచందమ్రూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. ‪‎మనుష్యులకెలాంటి‬ శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు. రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ‪‎ప్రకృతి‬ గుణాలు ఆయన్ను బాధించవు. రామచందమ్రూర్తి శోకించాడని ‪‎వాల్మీకి‬ రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు‬ దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానేనని మాత్రమే ‪‎రాముడు‬ శోకించాడు. అలానే, సీతాదేవి‬విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందోనని #రామచందమ్రూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు.

No comments:

Post a Comment