ఓం నమో నరాయణాయ
నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు, విష్ణు భక్తుడు, దేవర్షి అని అందరికీ తెలిసినదే. ఆయన అనుగ్రహమే ప్రాతిపధికగా వాల్మీకి, వ్యాస మహర్షులు రామాయణ, భాగవతాది ఉత్కృష్ట రచనలు మనకు అందిచారు. నారదుడు అన్న పేరు గల వారు, పురాణేతిహాసాలలో ఏడుగురు కనిపిస్తారు.
1.బ్రహ్మ యొక్క మానస పుత్రుడు
2.పర్వతుడు అనబడే ఋషియొక్క మామగారు
3.వసిష్ఠుని భార్య ఐన అరుంధతికి సోదరుడు; లేదా సత్యవతి అనే ఆమెకు భర్త
4.ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మొదట జగడాలకు తెర తీసినా, చివరికి అది లోక కల్యాణం వైపుకు దారి తీసేట్టు చేయువాడు
5.కుబేరుని సభాసదుడు
6.శ్రీరామచంద్రుని సభలో ఉన్న ఎనిమిది మంది ధర్మశాస్త్రవిదులలో ఒకడు
7.జనమేజేయుని సర్ప యాగం సదస్యులలో ఒకడు
భగవంతుడు స్వయంగా ఎలా అవతరిస్తుంటారో, అలాగే కారణ జన్ములైన మహాపురుషులు కూడా లోకములో అప్పుడప్పుడూ అవతరించి ఆ భగవంతుడి లీలల కొరకు కావలసిన రంగాన్ని సిద్ధం చేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అలాంటి మహాపురుషులు అవిద్య, అహంకారము, మమకారములవంటి వికారాలు లేని ముక్త పురుషులై ఉండి కూడా, ముక్తులుగా కాక లోకంలోని జీవుల మధ్యలో తిరుగాడి వారి కృష్ణ ద్వైపాయనుడు, శుకయోగి, ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి మహానుభావులకు భక్తి మార్గంలో మార్గ దర్శకత్వం చేసినది ఈయనే కదా!
ఇంతకీ ఈయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం – స్వయంగా ఈయనే వ్యాసమహర్షికి తెలియజేసారు. రెండు కల్పాలకు సంబంధించిన చరిత్ర శ్రీమద్భాగవతంలో కనబడుతుంది.
దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాసమహర్షి, లోక కల్యాణార్థమై వేదములను నాలుగు భాగములుగా విభాగించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని – ఎన్నో ఆఖ్యాన, ఉపాఖ్యానాలతో లోకాలకు అందించాడు. పురాణాలను రచించాడు. ఐనా తృప్తి కలుగక పరిపూర్ణ శాంతిని పొందలేదు. ఏదో తక్కువ ఐనట్టు వ్యథ చెందుతున్నప్పుడు, నారద మహర్షి అక్కడికి చేరుకొంటారు. తన పరిస్థితిని తెలియజేసి నివారణోపాయాన్ని వ్యాసుడు తెలియజేయమని కోరుకుంటాడు. అప్పుడు నారదులవారు, తన అన్ని రచనలలో ధర్మాలను వివరించిన విధంగా, (అంటే ధర్మబోధయే ప్రధాన లక్ష్యం) భగవంతుని కీర్తిని కీర్తించలేదు కాబట్టి తనకు అలా వెలితిగా తోస్తున్నదని తెలియజేసి, తన పూర్వ వృత్తాంతాన్ని తెలిపి, వ్యాసుడిని శ్రీమద్భాగవత రచన చేయవలసినదిగా సెలవిస్తారు. అలా నారదుల వారు వ్యాసుడికి తెలిపిన తన వృత్తాంతం…
దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాసమహర్షి, లోక కల్యాణార్థమై వేదములను నాలుగు భాగములుగా విభాగించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని – ఎన్నో ఆఖ్యాన, ఉపాఖ్యానాలతో లోకాలకు అందించాడు. పురాణాలను రచించాడు. ఐనా తృప్తి కలుగక పరిపూర్ణ శాంతిని పొందలేదు. ఏదో తక్కువ ఐనట్టు వ్యథ చెందుతున్నప్పుడు, నారద మహర్షి అక్కడికి చేరుకొంటారు. తన పరిస్థితిని తెలియజేసి నివారణోపాయాన్ని వ్యాసుడు తెలియజేయమని కోరుకుంటాడు. అప్పుడు నారదులవారు, తన అన్ని రచనలలో ధర్మాలను వివరించిన విధంగా, (అంటే ధర్మబోధయే ప్రధాన లక్ష్యం) భగవంతుని కీర్తిని కీర్తించలేదు కాబట్టి తనకు అలా వెలితిగా తోస్తున్నదని తెలియజేసి, తన పూర్వ వృత్తాంతాన్ని తెలిపి, వ్యాసుడిని శ్రీమద్భాగవత రచన చేయవలసినదిగా సెలవిస్తారు. అలా నారదుల వారు వ్యాసుడికి తెలిపిన తన వృత్తాంతం…
No comments:
Post a Comment