అమ్మలగన్నయమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ..

శ్రీదుందుర్గే, శివ సంసర్గే, చిద్ర సవర్గే, స్థిరేహాపవర్గే, శ్రీవనదుర్గే, శ్రీ దుందుభి వాద్య భేదనాద వినోదిని, వీణావాదిని, సంవేదిని, అభేదిని...’’
మహాదుర్గను ‘దుర్గామాతా’ అని స్మరించితే చాలు సమస్త జీవుల భయాన్ని పోగొడుతుంది. ఆ జగన్మాతను ‘వనదుర్గా మహామంత్రంతో’ ఆవాహనం చేసి శారదా మాతగా ప్రతిష్ఠించారు- ఆదిశంకరులు-శృంగేరీ పీఠంలో. ఆ తల్లిని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి శ్రీయుతము చేసి, శ్రీరంజని రాగంలో ఘనంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు.
జాతకరీత్యా రాహు మహర్దశ జరుగుచున్నవారు, అంతర్దశ జరుగుచున్నవారు, జాతకంలో రాహుగ్రహము దుస్థానంలో ఉన్నవారు మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలోని-కీలక స్తోత్రం, అర్గలాస్తోత్రం,‘దేవీ కవచ స్తోత్రం’పారాయణ చేసి, తీర్థం తీసుకొంటే దోషములు తొలగి సర్వకార్యసిద్ధి చేకూరుతుందని మహర్షులు భావితరాలకు తెలిపారు. రాహుగ్రహంతోపాటు, కుజగ్రహ అనుకూలం తక్కువ ఉన్నవారు ప్రతి మంగళవారం, రాహుకాలంలో అనగా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటలలోపు దుర్గాస్తోత్రముల్ని చదివితే,సర్వకార్యములునెరవేరుతాయి. ఇది దుర్గామాత పూజా విశేషము.
ఇతరులను హింసించడంలో ఆనందాన్ని పొం దే రాక్షస ప్రవృత్తిని దుర్గాపూజతో అణచుకొని,విశ్వప్రేమతో, సర్వుల హితాన్ని కాంక్షించాలని హితవు చెప్తోంది శ్రీ దుర్గామాత పూజ.
దుష్టత్వాన్ని అణచి, సాధుత్వాన్ని పె ంచి, శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించే జగన్మాత- శ్రీ దుర్గాదేవి. శరదృతువులో చంద్రునిలా బిడ్డలను చ ల్లగా కాపాడే జనని - శ్రీ దుర్గామాత. అష్టకష్టాలతో ఉన్న ప్రజలను అష్టమినాటి దుర్గ అన్ని విధాలా ఆదుకొని ఆనందింపజేస్తుందని పురాణ ప్రశస్తి. లోకకల్యాణం, లోకపోషణ శ్రీ మహాదుర్గ లక్ష్యం. దుష్టశిక్షణలో ఎంత కాఠిన్యం వహిస్తుందో, శిష్టరక్షణలో అంత దయార్ద్ర హృద య భావనాశక్తిని ప్రసాదిస్తుంది. మంచి భావనాశక్తిని ప్రసాదించమని పోతన శరణాగతితో, ఆర్ద్రతతో అపార భక్తి తత్త్వంతో దుర్గామాతను-
#అమ్మలగన్నయమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృతాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటత్వ సంపదల్’’
-అంటూ ప్రార్థించి సాహిత్య వినీలాకాశంలో ధృవతారగా నిలిచాడు.
ద్, ఉ, ఋ, గ్, ఆ అను అక్షరముల కలయికయే ‘దుర్గ’. సర్వ పాపములను శమింపచేసి, శమదమాది గుణ సంపత్తి నొసగి, సంసారాంబుధిని దాటించి, తరింపజేయు మార్గమును చూపి దుష్టులకు వశముగాని అజేయ శక్తులను భక్తులకొసగి రక్షణ ఇవ్వగల దుర్గము (కోట) వంటిది- శ్రీ దుర్గాదేవి.
కష్టముల నుండి తరింపజేయునది ‘‘దుర్గాత్తారయసే, దుర్గే తత్త్వం దుర్గా స్మృజనైః’’ కావున ఆమెకు దుర్గ అనే పేరు వచ్చింది.
పూర్వం మాధవ వర్మ అనే రాజు ప్రజారంజకముగా ధర్మపరిశీలన చేస్తుండేవాడు. ఒక రోజున అతని కుమారుడు వెళుతున్న గుఱ్ఱపు బండి కింద పడి ఓ నిరుపేద బాలుడు మరణించాడు. ధర్మప్రభువైన మాధవవర్మ కన్న కుమారుడికే మరణశిక్ష విధించాడు. అతని ధర్మబుద్ధికి సంతోషించి దుర్గాదేవి ఆ బాలకుణ్ణి తిరిగి జీవింపజేసి కనక వర్షము కురిపించింది. ఆనాటి నుండి జగన్మాతకు ‘కనక దుర్గాదేవి’ నామం సార్థకమయినది.

శ్రీదుందుర్గే, శివ సంసర్గే, చిద్ర సవర్గే, స్థిరేహాపవర్గే, శ్రీవనదుర్గే, శ్రీ దుందుభి వాద్య భేదనాద వినోదిని, వీణావాదిని, సంవేదిని, అభేదిని...’’
మహాదుర్గను ‘దుర్గామాతా’ అని స్మరించితే చాలు సమస్త జీవుల భయాన్ని పోగొడుతుంది. ఆ జగన్మాతను ‘వనదుర్గా మహామంత్రంతో’ ఆవాహనం చేసి శారదా మాతగా ప్రతిష్ఠించారు- ఆదిశంకరులు-శృంగేరీ పీఠంలో. ఆ తల్లిని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి శ్రీయుతము చేసి, శ్రీరంజని రాగంలో ఘనంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు.
జాతకరీత్యా రాహు మహర్దశ జరుగుచున్నవారు, అంతర్దశ జరుగుచున్నవారు, జాతకంలో రాహుగ్రహము దుస్థానంలో ఉన్నవారు మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలోని-కీలక స్తోత్రం, అర్గలాస్తోత్రం,‘దేవీ కవచ స్తోత్రం’పారాయణ చేసి, తీర్థం తీసుకొంటే దోషములు తొలగి సర్వకార్యసిద్ధి చేకూరుతుందని మహర్షులు భావితరాలకు తెలిపారు. రాహుగ్రహంతోపాటు, కుజగ్రహ అనుకూలం తక్కువ ఉన్నవారు ప్రతి మంగళవారం, రాహుకాలంలో అనగా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటలలోపు దుర్గాస్తోత్రముల్ని చదివితే,సర్వకార్యములునెరవేరుతాయి. ఇది దుర్గామాత పూజా విశేషము.
ఇతరులను హింసించడంలో ఆనందాన్ని పొం దే రాక్షస ప్రవృత్తిని దుర్గాపూజతో అణచుకొని,విశ్వప్రేమతో, సర్వుల హితాన్ని కాంక్షించాలని హితవు చెప్తోంది శ్రీ దుర్గామాత పూజ.
దుష్టత్వాన్ని అణచి, సాధుత్వాన్ని పె ంచి, శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించే జగన్మాత- శ్రీ దుర్గాదేవి. శరదృతువులో చంద్రునిలా బిడ్డలను చ ల్లగా కాపాడే జనని - శ్రీ దుర్గామాత. అష్టకష్టాలతో ఉన్న ప్రజలను అష్టమినాటి దుర్గ అన్ని విధాలా ఆదుకొని ఆనందింపజేస్తుందని పురాణ ప్రశస్తి. లోకకల్యాణం, లోకపోషణ శ్రీ మహాదుర్గ లక్ష్యం. దుష్టశిక్షణలో ఎంత కాఠిన్యం వహిస్తుందో, శిష్టరక్షణలో అంత దయార్ద్ర హృద య భావనాశక్తిని ప్రసాదిస్తుంది. మంచి భావనాశక్తిని ప్రసాదించమని పోతన శరణాగతితో, ఆర్ద్రతతో అపార భక్తి తత్త్వంతో దుర్గామాతను-
#అమ్మలగన్నయమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృతాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటత్వ సంపదల్’’
-అంటూ ప్రార్థించి సాహిత్య వినీలాకాశంలో ధృవతారగా నిలిచాడు.
ద్, ఉ, ఋ, గ్, ఆ అను అక్షరముల కలయికయే ‘దుర్గ’. సర్వ పాపములను శమింపచేసి, శమదమాది గుణ సంపత్తి నొసగి, సంసారాంబుధిని దాటించి, తరింపజేయు మార్గమును చూపి దుష్టులకు వశముగాని అజేయ శక్తులను భక్తులకొసగి రక్షణ ఇవ్వగల దుర్గము (కోట) వంటిది- శ్రీ దుర్గాదేవి.
కష్టముల నుండి తరింపజేయునది ‘‘దుర్గాత్తారయసే, దుర్గే తత్త్వం దుర్గా స్మృజనైః’’ కావున ఆమెకు దుర్గ అనే పేరు వచ్చింది.
పూర్వం మాధవ వర్మ అనే రాజు ప్రజారంజకముగా ధర్మపరిశీలన చేస్తుండేవాడు. ఒక రోజున అతని కుమారుడు వెళుతున్న గుఱ్ఱపు బండి కింద పడి ఓ నిరుపేద బాలుడు మరణించాడు. ధర్మప్రభువైన మాధవవర్మ కన్న కుమారుడికే మరణశిక్ష విధించాడు. అతని ధర్మబుద్ధికి సంతోషించి దుర్గాదేవి ఆ బాలకుణ్ణి తిరిగి జీవింపజేసి కనక వర్షము కురిపించింది. ఆనాటి నుండి జగన్మాతకు ‘కనక దుర్గాదేవి’ నామం సార్థకమయినది.
No comments:
Post a Comment