ఆంజనేయస్వామి జననo {బుద్ధి, బలం, కీర్తి ప్రదాతుడు}
ఒకసారి హనుమంతుడు శ్రీరామచంద్రునితో
''దేమదృష్ట్యాతు దాసోహం
జీవదృష్ట్యాతు దంశకః
వస్తుతస్తు త్వమేవాహ
మితి నిశ్చయతే మతిః| '' ''రామా!'' దేహ దృష్ట్యా నేను దాసుడను. నేను జీవరూపంలో మీ అంశను. కానీ పరమార్థ దృష్టిలో చూడగా నేనూ మీరూ ఒక్కటే'' అని హనుమంతుడు శ్రీరామునితో పలికాడు. కనుక ఆంజనేయుడు శ్రీరాము నితో సమానము.
ఒకసారి హనుమంతుడు శ్రీరామచంద్రునితో
''దేమదృష్ట్యాతు దాసోహం
జీవదృష్ట్యాతు దంశకః
వస్తుతస్తు త్వమేవాహ
మితి నిశ్చయతే మతిః| '' ''రామా!'' దేహ దృష్ట్యా నేను దాసుడను. నేను జీవరూపంలో మీ అంశను. కానీ పరమార్థ దృష్టిలో చూడగా నేనూ మీరూ ఒక్కటే'' అని హనుమంతుడు శ్రీరామునితో పలికాడు. కనుక ఆంజనేయుడు శ్రీరాము నితో సమానము.
''వైశాఖే మాసికృష్ణాయాః దశిమీ మంద సంయుతా పూర్వ ప్రోష్ఠ పదాయుక్తా అధనైదృత సంయుతా తస్యాం మధ్యాహ్నవేళాయాః జనయా మానవైసుతమ్' వైశాఖ మాస, కృష్ణపక్ష, దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీనామ యోగం, గ్రహాలన్నీ శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ఆంజనాదేవిగర్భయుక్త ఫల ఆంజనేయస్వామి జన్మించాడు. ఆ పరమ శివుడే ఆంజనాదేవి గర్భాన జన్మించాడని తెలిసి, ఆ రుద్రావతారుని చూడడానికి వెళ్లిన సప్తబుుషులు వానర కుమారుని చూసి ఆంజనీగర్భాన ఉదయించిన ఈ బాలుడు 'ఆంజనేయు'డని పిలువ బడుతాడని సెలవిచ్చాడు.సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయుడు త్రేతా, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో నేటికి తన లీలలు చూపుతూ చిరంజీవిగా విలసిల్లుతున్నాడు.బాలాంజనేయుడు ఒకనాడు ఆకలిగా ఉన్నదని తల్లినికోరగా, ఫలముల కొరకు ఆంజనవనమున కేగిన సమయాన ఉదయించుచున్న సూర్యుని చూచి ఫలమని భ్రమించి సూర్య మండలానికి ఎగసి సూర్యుని గ్రహించబోగా, అది గ్రహించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో చీల్చబడిన 'హనుమ (దౌడలు) కారణంగాగా నాటి నుండి ''ఆంజనేయుడు'' ''హనుమంతుడు'గా ప్రసిద్ధి చెందాడు.
శ్రీరాముని కరుణా సాగరంలో పునీతుడైనవాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుని మహిమను లోకానికి చాటుటకై రామసేవకై జన్మించిన కారణ జన్ముడు. హనుమ శ్రీరామచంద్రుని సర్వోత్తమ దాసభక్తుడు. రామనామ సాధనం హను మంతుని జీవనం. హనుమంతుడు వేదాధ్యయన శీలుడు, వ్యాకరణాధ్యయన సంపన్నుడు. సంస్కార క్రమ సంప న్నుడు. శాస్త్రబద్ద వాగుచ్ఛారణుడైన హనుమ నోట వెలువడిన వాక్కు వేద వాక్కువలే కల్యాణి రూపిణిగా శ్రీరామునికి తోచింది.
''అధ సంస్కార సంపన్నో, హనుమాన్ సచివోత్తమః ఉవాచ వచనం శ్లక్ష్ణ మర్ధవన్మధురం లఘ'' సంస్కార సంపన్నుడైన సచివోత్తముడుగా వాల్మీకి చెప్పినాడు.
శ్రీరాముని హనుమ ఒక వరమడిగాడు ''రామాయణం లోకంలోగానం చేయబడినంత కాలం నేను జీవించాలి' అని, శ్రీరాముడు అందుకు ఆంగీకరించగా
'యత్ర యత్ర రఘనాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతి సమతా రాక్షసాంతకమ్''అని హనుమతుండే స్వయంగా రామభక్తి పరాయణతను వ్యక్తం చేసాడు. తదాదిగా దేశంలో ఎక్కడ చూసినా ప్రతిచోట ప్రతి గ్రామంలో హనుమంతుని ఆలయాలు వెలసి, హనుమ రణముచే సకల భూత, ప్రేత, పిశాచ, రాక్షస బాదల నుండి ఆశ్రితులను సర్వకాల సర్వావస్థల నుండి రక్షించుచున్నాడు. హనుమ స్మరణ వల్ల మానవులకు బుద్ది, బలం, యశము, ధైర్యం, నిర్భయత్వము, ఆరోగ్యము, వివేకము, వాక్పటుత్వము గుణములు సిద్దిస్తాయి.
నవగ్రహాలలో శనిగ్రహం కష్టాలు కలిగించేదిగా అందరూ భావిస్తారు. అయితే రావణాసురుని చెరలో నవగ్రహాలు ఉన్నప్పుడు శనని ఆంజనేయుడు తప్పించి, రక్షించినందుకు కృతజ్ఞతా పూర్వకంగా #ఆంజనేయస్వామి భక్తుల జోలికి తాను వెళ్లనని శని మాట ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
జన్మలగ్నాత్తు శని మహార్థశ జరుగుతున్నవారు అర్థాష్టమ, మరియు అష్టమశని, ఏలినాటిశని, జాతకాల్లో ప్రతీవారికి ఏదో విధంగా ప్రవేశించినప్పుడు వచ్చే విపత్తుల బారినుండి రక్షణ పొందటానికి శనివారం నాడు ఆంజనేయుని పూజ చేస్తే శనిదోష సాంద్రత తగ్గుతుంది. అంతేకాక అంగారక దోషం వల్ల కుటుంబంలో ఏర్పడ్డ కలతలు పోయి అనుకూల దాంపత్యాన్నిశ్రీస్వామివారికి పూజ, ప్రదక్షిణ చేయడం వల్ల వెంటనే ఫలితం లభిస్తుంది.
శ్రీరాముని కరుణా సాగరంలో పునీతుడైనవాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుని మహిమను లోకానికి చాటుటకై రామసేవకై జన్మించిన కారణ జన్ముడు. హనుమ శ్రీరామచంద్రుని సర్వోత్తమ దాసభక్తుడు. రామనామ సాధనం హను మంతుని జీవనం. హనుమంతుడు వేదాధ్యయన శీలుడు, వ్యాకరణాధ్యయన సంపన్నుడు. సంస్కార క్రమ సంప న్నుడు. శాస్త్రబద్ద వాగుచ్ఛారణుడైన హనుమ నోట వెలువడిన వాక్కు వేద వాక్కువలే కల్యాణి రూపిణిగా శ్రీరామునికి తోచింది.
''అధ సంస్కార సంపన్నో, హనుమాన్ సచివోత్తమః ఉవాచ వచనం శ్లక్ష్ణ మర్ధవన్మధురం లఘ'' సంస్కార సంపన్నుడైన సచివోత్తముడుగా వాల్మీకి చెప్పినాడు.
శ్రీరాముని హనుమ ఒక వరమడిగాడు ''రామాయణం లోకంలోగానం చేయబడినంత కాలం నేను జీవించాలి' అని, శ్రీరాముడు అందుకు ఆంగీకరించగా
'యత్ర యత్ర రఘనాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతి సమతా రాక్షసాంతకమ్''అని హనుమతుండే స్వయంగా రామభక్తి పరాయణతను వ్యక్తం చేసాడు. తదాదిగా దేశంలో ఎక్కడ చూసినా ప్రతిచోట ప్రతి గ్రామంలో హనుమంతుని ఆలయాలు వెలసి, హనుమ రణముచే సకల భూత, ప్రేత, పిశాచ, రాక్షస బాదల నుండి ఆశ్రితులను సర్వకాల సర్వావస్థల నుండి రక్షించుచున్నాడు. హనుమ స్మరణ వల్ల మానవులకు బుద్ది, బలం, యశము, ధైర్యం, నిర్భయత్వము, ఆరోగ్యము, వివేకము, వాక్పటుత్వము గుణములు సిద్దిస్తాయి.
నవగ్రహాలలో శనిగ్రహం కష్టాలు కలిగించేదిగా అందరూ భావిస్తారు. అయితే రావణాసురుని చెరలో నవగ్రహాలు ఉన్నప్పుడు శనని ఆంజనేయుడు తప్పించి, రక్షించినందుకు కృతజ్ఞతా పూర్వకంగా #ఆంజనేయస్వామి భక్తుల జోలికి తాను వెళ్లనని శని మాట ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
జన్మలగ్నాత్తు శని మహార్థశ జరుగుతున్నవారు అర్థాష్టమ, మరియు అష్టమశని, ఏలినాటిశని, జాతకాల్లో ప్రతీవారికి ఏదో విధంగా ప్రవేశించినప్పుడు వచ్చే విపత్తుల బారినుండి రక్షణ పొందటానికి శనివారం నాడు ఆంజనేయుని పూజ చేస్తే శనిదోష సాంద్రత తగ్గుతుంది. అంతేకాక అంగారక దోషం వల్ల కుటుంబంలో ఏర్పడ్డ కలతలు పోయి అనుకూల దాంపత్యాన్నిశ్రీస్వామివారికి పూజ, ప్రదక్షిణ చేయడం వల్ల వెంటనే ఫలితం లభిస్తుంది.
''మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్|
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి!! 'ఆంజనేయస్వామి మనసుకున్నంత వేగం, ఇంద్రియ నిగ్రహం, శ్రేష్ఠమైన బుద్ధి ఉన్నాయని చెప్పడం మనసును గురించి చెబుతున్నట్లే అనిపిస్తుంది. మనసుకు స్థిరమైన సంకల్పాలను, ఆదర్శ జీవనం, నియమాలు తదితరములైనవి సక్రమంగా అవి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయని, అవి కొరవడితే మనసు చంచలమై పోతుందని,''బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా ద్భవేత్' ఆంజనేయుని ప్రార్థిస్తే బుద్ది, బలం, కీర్తి, ధైర్యం, భయం లేకపోవడం,వాక్కులో స్పష్టత, రోగం లేకపోవడం మొదలైనవన్నీ వస్తాయి. మనో వాక్కాయములచే ఎవరు హనుమంతుని ధ్యానింతురో వారిని అతడు సమస్త బాదల నుండి విముక్తుల్ని చేస్తాడు.
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్|
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి!! 'ఆంజనేయస్వామి మనసుకున్నంత వేగం, ఇంద్రియ నిగ్రహం, శ్రేష్ఠమైన బుద్ధి ఉన్నాయని చెప్పడం మనసును గురించి చెబుతున్నట్లే అనిపిస్తుంది. మనసుకు స్థిరమైన సంకల్పాలను, ఆదర్శ జీవనం, నియమాలు తదితరములైనవి సక్రమంగా అవి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయని, అవి కొరవడితే మనసు చంచలమై పోతుందని,''బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా ద్భవేత్' ఆంజనేయుని ప్రార్థిస్తే బుద్ది, బలం, కీర్తి, ధైర్యం, భయం లేకపోవడం,వాక్కులో స్పష్టత, రోగం లేకపోవడం మొదలైనవన్నీ వస్తాయి. మనో వాక్కాయములచే ఎవరు హనుమంతుని ధ్యానింతురో వారిని అతడు సమస్త బాదల నుండి విముక్తుల్ని చేస్తాడు.
''న కాలస్యన శక్రస్య న విష్ణో ర్విత్త పస్యచ| కర్మాని తాని శ్రూయంతేయాని యత్తే హనుమతః'' శ్రద్దా భక్తితో ఆరా ధించిన వారికి అష్టసిద్దులతోపాటు ఆత్మోద్ధరణము జరుగును. హనుమంతుని వలె పరాక్రమ శాలియై నిష్కాముడైన వాడే ధర్మాన్ని రక్షించగలడు.

ఏకైక ఆదర్శం-హనుమంతుడు..
''ధర్మ ఏవ హతో హన్తి’! అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన పరిష్కారం ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.
ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. #ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం #హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని రామసేవకుడని చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘'రామో విగ్రహవాన్ ధర్మః’అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది ధర్మసేవే. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ చిరంజీవి ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.

ఏకైక ఆదర్శం-హనుమంతుడు..
''ధర్మ ఏవ హతో హన్తి’! అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన పరిష్కారం ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.
ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. #ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం #హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని రామసేవకుడని చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘'రామో విగ్రహవాన్ ధర్మః’అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది ధర్మసేవే. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ చిరంజీవి ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.
No comments:
Post a Comment