సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 23, 2014

రామానుగ్రహం‬

"#రామానుగ్రహం" ... 
''తీర్త్వా మోహార్ణవం హత్వా
రాగాద్వేషాది రాక్షసాన్ /
యోగీ శాంతి సమాయుక్తః
ఆత్మా రామో విరాజతే //
భావం: ఆత్మజ్ఞాని మోహ సాగరమును దాటి, రాగాద్వేషాది రాక్షసులను సంహరించి, అటు పిమ్మట శాంతిని పొంది ఆత్మారాముడై వెల్గొందుచున్నాడు. 
ఈ శ్లోకమునకు స్వామి సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానం -
ఆత్మయైన తాను జీవుడని భ్రమ చెందుటయే మోహము. మనస్సులో మోహముదయించగనే ప్రశాంతత అనుభవించు చుండిన అంతఃకరణ అశాంతికి నిలయమగును. మోహపూరితమగు వాని మనస్సు రాగద్వేషములతో  నిండియుండును. ఇవి సుఖదుఃఖములనెడి ద్వంద్వములను కల్పించి అనంత దుఃఖమును, అసంఖ్యాకమైన జన్మలను అందించును. 
మోహము సాగరము వంటిది. అందుచే మోహార్ణవమని శ్రీ శంకరులువారు తెలియజేశారు. ఈ మోహము సాగరమువలె అనంతము, అగాధము అని భావం. రాగద్వేషాదులు రాక్షసుల వంటివి. రాక్షసుల ముందు జీవించువానికి ప్రాణభయం తప్పదు. రాగద్వేషాల మధ్య కొనసాగువానికి ప్రతిక్షణమూ మరణమే., ప్రతిక్షణమూ జననమే. విచారణ ద్వారా మోహసాగరమును దాటి, రాగద్వేషాది రాక్షసులను హతమార్చిన వానికి శాంతి లభించును. శాంతస్వరూపుడైనవాడు ఆత్మవిదుడై, ఆత్మారాముడై వెల్గొందును. 
ఈ శ్లోకమును చదువగానే దీని అంతరార్ధం - రామాయణ వైభవము అని అర్ధమౌతుంది. 
రామునికి దూరమై సీత లంకలో వున్నది. సీతలేని రాముడు శాంతిలేని జీవుడు. రాముడు దాటినా సాగరమే జీవుడు దాటవలసిన మోహమహార్ణవము. రామునిచేత వధించబడిన రావణ కుంభకర్ణాది రాక్షసులే, జీవునిచేత వధించబడవలసిన రాగద్వేషాదులు. సీత రామున్ని చేరినట్లు, శాంతి జీవున్ని సమీపించాలి. పట్టాభిషిక్తుడైన రాముడు అయోద్యరాముడు. సాక్షాత్కారము నొందిన జీవుడు ఆత్మారాముడు. 
                                                    'సర్వేషు రమన్తే ఇతిరామః '
                                    'అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రమూర్తి' 
ప్రతి ఒక్కరూ ఆత్మారాములై తరించాలన్నదే వేదాంతాశయము."‪‎రామానుగ్రహం‬" ... 
''తీర్త్వా మోహార్ణవం హత్వా
రాగాద్వేషాది రాక్షసాన్ /
యోగీ శాంతి సమాయుక్తః
ఆత్మా రామో విరాజతే //
భావం: ఆత్మజ్ఞాని మోహ సాగరమును దాటి, రాగాద్వేషాది రాక్షసులను సంహరించి, అటు పిమ్మట శాంతిని పొంది ఆత్మారాముడై వెల్గొందుచున్నాడు.
ఈ శ్లోకమునకు స్వామి సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానం -
ఆత్మయైన తాను జీవుడని భ్రమ చెందుటయే మోహము. మనస్సులో మోహముదయించగనే ప్రశాంతత అనుభవించు చుండిన అంతఃకరణ అశాంతికి నిలయమగును. మోహపూరితమగు వాని మనస్సు రాగద్వేషములతో నిండియుండును. ఇవి సుఖదుఃఖములనెడి ద్వంద్వములను కల్పించి అనంత దుఃఖమును, అసంఖ్యాకమైన జన్మలను అందించును.
మోహము సాగరము వంటిది. అందుచే మోహార్ణవమని శ్రీ శంకరులువారు తెలియజేశారు. ఈ మోహము సాగరమువలె అనంతము, అగాధము అని భావం. రాగద్వేషాదులు రాక్షసుల వంటివి. రాక్షసుల ముందు జీవించువానికి ప్రాణభయం తప్పదు. రాగద్వేషాల మధ్య కొనసాగువానికి ప్రతిక్షణమూ మరణమే., ప్రతిక్షణమూ జననమే. విచారణ ద్వారా మోహసాగరమును దాటి, రాగద్వేషాది రాక్షసులను హతమార్చిన వానికి శాంతి లభించును. శాంతస్వరూపుడైనవాడు ఆత్మవిదుడై, ఆత్మారాముడై వెల్గొందును.
ఈ శ్లోకమును చదువగానే దీని అంతరార్ధం - రామాయణ వైభవము అని అర్ధమౌతుంది.
రామునికి దూరమై సీత లంకలో వున్నది. సీతలేని రాముడు శాంతిలేని జీవుడు. రాముడు దాటినా సాగరమే జీవుడు దాటవలసిన మోహమహార్ణవము. రామునిచేత వధించబడిన రావణ కుంభకర్ణాది రాక్షసులే, జీవునిచేత వధించబడవలసిన రాగద్వేషాదులు. సీత రామున్ని చేరినట్లు, శాంతి జీవున్ని సమీపించాలి. పట్టాభిషిక్తుడైన రాముడు అయోద్యరాముడు. సాక్షాత్కారము నొందిన జీవుడు ఆత్మారాముడు.
'సర్వేషు రమన్తే ఇతిరామః '
'అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రమూర్తి'
ప్రతి ఒక్కరూ ఆత్మారాములై తరించాలన్నదే వేదాంతాశయము.

No comments:

Post a Comment