సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 23, 2014

‪‎హరిహర‬ తత్త్వం

‪‎హరిహర‬ తత్త్వం 
#హరిహర తత్త్వం 
భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ ఉంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాల 'రామ' మంత్రం శ్రేష్ఠమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహర తత్త్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమో నారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో 'రా' అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్థం లేనిది అవుతుంది.) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రములో 'మ' అనునది జీవాక్షరం. (ఎందుకంటే 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్థం). ఈరెండు జీవాక్షరముల సమాహారమే 'రామ'. శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ' మంత్రం. అందుచే రామ మంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్ఠమైన ముక్తి ప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మీకిచే రచింపబడి౦ది. అది త్రైలోక్య వాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికీ పంచెను. 33 లక్షల 33వేల 333 శ్లోకముల వంతున పంచగా 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆశ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కథనం. ఆ రెండక్షరములే 'రామ'.!!
భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ ఉంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాల 'రామ' మంత్రం శ్రేష్ఠమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహర తత్త్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమో నారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో 'రా' అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్థం లేనిది అవుతుంది.) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రములో 'మ' అనునది జీవాక్షరం. (ఎందుకంటే 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్థం). ఈరెండు జీవాక్షరముల సమాహారమే 'రామ'. శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ' మంత్రం. అందుచే రామ మంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్ఠమైన ముక్తి ప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మీకిచే రచింపబడి౦ది. అది త్రైలోక్య వాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికీ పంచెను. 33 లక్షల 33వేల 333 శ్లోకముల వంతున పంచగా 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆశ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కథనం. ఆ రెండక్షరములే 'రామ'.!!

No comments:

Post a Comment