సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, October 25, 2014

‪భజ‬ గోవిందం

భజ‬ గోవిందం..
భజ గోవిందం వింటూ వుంటే మన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. విష్ణు‬ నామాలు ప్రతి రోజు వింటూ,‪‎భగవద్గీతను‬ చదివితే మన జీవితానికి ఒక అర్దం ఏర్పడుతుంది.ఇదే భక్తి ‪‎మార్గనికి‬నాంది.సృష్టిలో జరిగే ప్రతి చర్యకూ ఎక్కడో మూలం ఉంటుందన్నది గీతాకారుడు చెప్పింది. అదే...కర్మసిద్ధాంతం‬.
ధర్మాన్ని‬ కాపాడుటకు, భగవంతుడు ప్రతి యుగాములోను, ఏదో ఒక ‪‎రూపములొ‬ఆవిర్భవించుచున్నాడు ‪‎ఓం‬ నమో వేంకటేశాయ" సర్వే‬ జనా సుఖినోభవంతు, లోకాసమస్తా సుఖినోభవంతు " ప్రజలంతా‬ సుఖంగా ఉండాలి. అప్పుడే ఈ విశ్వమంతట సుఖంగా ఉండును.కానీ అంతిమంగా మానవకల్యాణం‬ జరగడమే ‪‎భగవత్తత్వం‬.
#భజ గోవిందం..
ఒకనాడు #శంకరాచార్యులవారు శిష్యులతో కాశీ పట్టణం లో గంగాతీరాన వెళ్తుండగా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్న ఒక వృద్ధుని చూడటం తటస్థించింది. వయసు గతించి, చావు దాపురిస్తున్న వృద్ధాప్యంలో కూడా, ఆ #మానవుడు దైవ చింతన గూర్చి తలపెట్టక, ఏదో వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేసుకుంటూ, కాలం వ్యర్ధం చేస్తున్నాడే, అనే ఆవేదనతో ఆయన నుండి '#మోహ ముద్గర' అనే ఈ గేయం వెలువడింది."#ఓయీ మూఢుడా ! గోవిందుని భజించు, భజింపవోయి గోవిందుని. నీ అంత్యకాలం సమీపించునపుడు ఈ వ్యాకరణ సూత్రం నిన్నేమీ రక్షించదు సుమా !" అను ఈ శ్లోకాన్ని పల్లవిగా చదువుతూ, 12 శ్లోకాలను శంకరుల వారు చెప్పరట. దీనిని ద్వాదశ మంజరిక స్త్రోత్రం అంటారు. శిష్యులు తరవాతి 14 శ్లోకాలను (చదుర్దశ మంజరిక) చెపగా, ఆశీర్వాదంగా, ఆచార్యులవారు 4 శ్లోకాలు చెప్పారు. 

1. #భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే | 
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షతి డుకృఞ్కరణే || 
 "గోవిందుని భజించు, సేవించు గోవిందుని, గోవిందునే భజింపవోయీ మూఢమతీ ! నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణసూత్రం నిన్ను ఏవిధంగానూ రక్షించలేదు సుమా" 

2. మూఢ ! జహీహి, ధనాగమతృష్ణాం, కురుసద్ బుద్ధిం మనసి వితృష్ణాం | 
యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం || 
"ఓ మూఢుడా ! ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి, సద్బుద్ధితో కూడియున్న ఆలోచనల్నే ప్రవేశింపజేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ, వాటివల్ల లభించు విత్తము (ఫలము)ను అనుభవిస్తూ ఆనందించు." 

3. నారీస్తనభరనాబీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం| 
ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం || 
 వనితల వక్షస్థల శోభ, నాభీస్థల ఆకర్షణలో పడి, మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము, కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగ గ్రహించి, మాటి మాటికి ఈ సత్యాన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉండు. 

4. నళినీదళగతజలమతితరళం, తద్వత్ జీవిత మతిశయచపలం| 
విద్ధి, వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తం || 
 తామరాకు మీది నీటిబిందువెంత తరళమై యుంటుందో (అస్థిరంగా కదులుతుందో) అలాగే ఈ జీవితం కూడా అతి చపలం (చంచలం) అయినట్టిది. ఈ లోకమంతా రోగాలతోనూ, మానసిక దురహంకార, దుఃఖః, దురభిమానాలతోనూ పీడింపబడుతూ ఉంటుందని తెలుసుకో. 

5. యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః | 
పశ్చాత్ జీవతి, జర్జరదేహే, వార్తాం కీపి న పృచ్చతి గేహే || 
 నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళూ (నీవు సంపాదిస్తున్ననాళ్ళూ) నీ పరివారం అంతా నీ యందు అనురాగం చూపుతారు. ఆ తరవాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు, నీ ఇంట్లోనే, నీ క్షేమ సమాచారాలు ఎవారూ అడగరు. 

6.యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్చతి కుశలం గేహే | 
గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే || 
 శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే, ఇంట్లో వారు నీ కుశలం గురించి అడుగుతారు. ఆ వాయువు కాస్తా వెళ్ళిపోయి, దేహం చెడేసరికీ, ఈ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది.
ఒకనాడు శంకరాచార్యులవారు‬ శిష్యులతో కాశీ పట్టణం లో గంగాతీరాన వెళ్తుండగా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్న ఒక వృద్ధుని చూడటం తటస్థించింది. వయసు గతించి, చావు దాపురిస్తున్న వృద్ధాప్యంలో కూడా, ఆ ‪‎మానవుడు‬ దైవ చింతన గూర్చి తలపెట్టక, ఏదో వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేసుకుంటూ, కాలం వ్యర్ధం చేస్తున్నాడే, అనే ఆవేదనతో ఆయన నుండి '‪‎మోహ‬ముద్గర' అనే ఈ గేయం వెలువడింది."ఓయీ‬ మూఢుడా ! గోవిందుని భజించు, భజింపవోయి గోవిందుని. నీ అంత్యకాలం సమీపించునపుడు ఈ వ్యాకరణ సూత్రం నిన్నేమీ రక్షించదు సుమా !" అను ఈ శ్లోకాన్ని పల్లవిగా చదువుతూ, 12 శ్లోకాలను శంకరుల వారు చెప్పరట. దీనిని ద్వాదశ మంజరిక స్త్రోత్రం అంటారు. శిష్యులు తరవాతి 14 శ్లోకాలను (చదుర్దశ మంజరిక) చెపగా, ఆశీర్వాదంగా, ఆచార్యులవారు 4 శ్లోకాలు చెప్పారు.
1. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షతి డుకృఞ్కరణే ||
"గోవిందుని భజించు, సేవించు గోవిందుని, గోవిందునే భజింపవోయీ మూఢమతీ ! నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణసూత్రం నిన్ను ఏవిధంగానూ రక్షించలేదు సుమా"
2. మూఢ ! జహీహి, ధనాగమతృష్ణాం, కురుసద్ బుద్ధిం మనసి వితృష్ణాం |
యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం ||
"ఓ మూఢుడా ! ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి, సద్బుద్ధితో కూడియున్న ఆలోచనల్నే ప్రవేశింపజేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ, వాటివల్ల లభించు విత్తము (ఫలము)ను అనుభవిస్తూ ఆనందించు."
3. నారీస్తనభరనాబీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం|
ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం ||
వనితల వక్షస్థల శోభ, నాభీస్థల ఆకర్షణలో పడి, మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము, కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగ గ్రహించి, మాటి మాటికి ఈ సత్యాన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉండు.
4. నళినీదళగతజలమతితరళం, తద్వత్ జీవిత మతిశయచపలం|
విద్ధి, వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తం ||
తామరాకు మీది నీటిబిందువెంత తరళమై యుంటుందో (అస్థిరంగా కదులుతుందో) అలాగే ఈ జీవితం కూడా అతి చపలం (చంచలం) అయినట్టిది. ఈ లోకమంతా రోగాలతోనూ, మానసిక దురహంకార, దుఃఖః, దురభిమానాలతోనూ పీడింపబడుతూ ఉంటుందని తెలుసుకో.
5. యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః |
పశ్చాత్ జీవతి, జర్జరదేహే, వార్తాం కీపి న పృచ్చతి గేహే ||
నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళూ (నీవు సంపాదిస్తున్ననాళ్ళూ) నీ పరివారం అంతా నీ యందు అనురాగం చూపుతారు. ఆ తరవాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు, నీ ఇంట్లోనే, నీ క్షేమ సమాచారాలు ఎవారూ అడగరు.
6.యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్చతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ||
శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే, ఇంట్లో వారు నీ కుశలం గురించి అడుగుతారు. ఆ వాయువు కాస్తా వెళ్ళిపోయి, దేహం చెడేసరికీ, ఈ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది.

No comments:

Post a Comment