సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, October 25, 2014

శ్రీవేంకటేశ్వరస్వామికి‬ సహస్ర కలశాభిషేకం

‪‎శ్రీవేంకటేశ్వరస్వామికి‬ సహస్ర కలశాభిషేకం

శ్రీవేంకటేశ్వరస్వామికి‬సహస్ర కలశాభిషేకం..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం శనివారం జరగనుంది. భోగ శ్రీనివాసమూర్తికి పల్లవరాణి కడవన్‌ సామవాయిగా క్రీ.శ. 614లో శ్రీవారి ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని బహుకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఉత్సవమూర్తికి ఆభరణాలను కూడా వితరణ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. బహూకరణకు గుర్తుగా ఏటా జ్యేష్టమాసంలో భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రసిద్ధి చెందిన కడవన్‌ పెరుందేవి వెండి ప్రతిమ బహూకరణకు గుర్తుగా సహస్ర కలశాభిషేకం సేవను నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని శ్రీనివాసమూర్తికి ఆగమోక్తంగా ఆలయ అర్చకులు జరపనున్నారు. శంఖుచక్రధారియైున ఈ చతుర్భుజమూర్తిని స్వామివారి మూలవిరాట్టుకు ప్రతిరూపంగా కొలుస్తున్నారు. వైఖానస ఆగమం ప్రకారం ఈ మూర్తికే కౌతుకమూర్తి, పురుషబేరం అనే పేరు కూడా ఉంది.
ఈ మూర్తి స్వామివారి పాదాలచెంత పద్మపీఠానికి అనుకుని ఉన్నారు. నిత్యం రాత్రి ఏకాంతసేవ ఈ స్వామికే జరుగుతుంది. ధనుర్మాసంలో మాత్రమే శ్రీకృష్ణస్వామికి జరుగుతుంది. సాధారణంగా సహస్ర కలశాభిషేకం ప్రతి బుధవారం ఉదయం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ప్రత్యేక ఉత్సవ నేపథ్యంలో ఏడాదిలో జ్యేష్ఠమాసంలోని శనివారం 18 అంగుళాల ఎత్తుగల ఈ రజితమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకోత్సవాన్ని తితిదే 2006 నుంచి వరుసగా ప్రతి ఏటా నిర్వహిస్తోంది. శనివారం ఉదయం ఐదు గంటలకు ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment