రామో విగ్రహవాన్ ధర్మః..

"కురురామ కధాం పుణ్యాం శ్లోకబద్దాం మనోరమాం" రామ కథని శ్లోకరూపంలో వ్రాయి. అని చతుర్ముఖునిచే ఆజ్ఞాపింపబడి, తదుపరి "తతఃపశ్యతి ధర్మాత్మో తత్సర్వం యోగమాస్థితః" రామ కథ సర్వస్వాన్ని యోగదృష్టితో చూసి రామాయణాన్ని రచించి తరించిన ధన్యజీవి వాల్మీకి. ఈ మహాకావ్యం సకల వేద సారము, ధర్మార్ధ కామమోక్షాలైన చతుర్విధ పురుషార్ధ సాధకము, బోధకము. ధర్మాచరణమును రాముని ద్వారా ఆచరింపజేసి, "సత్యంచ ధర్మంచ పరాక్రమంచ, భూతాను కంపారిప్రియ వాదితాంచ ద్విజాతి దేవాతిధిపూజనంచ పంధానమాహః త్రిదివస్యసంతాః" సత్యము ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియభాషణాది గుణాలు, ద్విజ, దేవ, అతిధి పూజల వంటి కర్మలను సామాన్యులకు గూడ అర్ధ మగు రీతిలో తెల్పిన బృహత్కావ్యం రామాయణం.
రాముడు దేవుడిగా కాక పరిపూర్ణ మానవునిగా ప్రవర్తించి, ఎన్ని కష్టములు వచ్చిననూ, ధర్మగుణాన్ని వీడక, లోకానికి ధర్మగుణాన్ని చాటి "రామోవిగ్రహవాన్ ధర్మః" అని కీర్తించబడినాడు. ధర్మాన్నివిడచి, అర్ధకామాల్ని ఆశించి, అధర్మానికి పాల్పడిన రాక్షసులను సంహరించి, వేదధర్మాన్ని అనుసరించే ఋషులను కాపాడి ధర్మ మార్గమే అనుసరణీయము అని నిరూపించినాడు
"ధర్మాదర్భః ప్రభవతి ధర్మాత్ ప్రభవతీ సుఖమ్, ధర్మేణలభతే సర్వం ధర్మసార మిదంజగత్"
అనగా ధర్మము వలన అర్ధము, అర్ధము వలన సుఖము లభిస్తాయి. ఈ సమస్త జగత్తు ధర్మ స్వరూపమే అని ఋషివాక్యం "ధరతివిశ్వం ధర్మః" ధరింపబడేది ధర్మం. ధర్మాన్ని మనం ధరిస్తే అది మనల్ని రక్షిస్తుంది.
అనగా ధర్మము వలన అర్ధము, అర్ధము వలన సుఖము లభిస్తాయి. ఈ సమస్త జగత్తు ధర్మ స్వరూపమే అని ఋషివాక్యం "ధరతివిశ్వం ధర్మః" ధరింపబడేది ధర్మం. ధర్మాన్ని మనం ధరిస్తే అది మనల్ని రక్షిస్తుంది.
"సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం" సత్య ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు. కనుక ధర్మాన్ని అందరూ ఆచరించాలి అని రామాయణం మనకి బోధిస్తుంది. పితృ వాక్య పరిపాలన, పుత్ర, మిత్ర, కళత్ర, భాతృ సమాదరణ, శరణాగత రక్షణ, శత్రునిర్మూలన వంటి ధర్మాలనెన్నింటినో శ్రీరాముని జీవిత చిత్రణలో మనం చూడవచ్చు. తాటక వధ విషయంలో స్త్రీ అని ముందు సంశయించినా గురువాజ్ఞననుసరించి వధిస్తాడు రాముడు. ఈ విషయంలో ఏది ధర్మమో రాముడే మనకు వివరిస్తాడు. "పితుర్వచన నిర్దేశాత పితుర్వచన గౌరవాత్" వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయా|| తండ్రి చెప్పినటుల, తండ్రి మాట మీద గౌరవంతో, గురువగు విశ్వామిత్రుని ఆజ్ఞననుసరించి స్త్రీ వధ తప్పుగాదని మరియు "గోబ్రాహ్మణులను రక్షించుటకు, దేశ క్షేమము కొరకు స్త్రీ వధ చేయటం తప్పుకాదు" అన్న ధర్మసూక్ష్మాన్ని లోకానికి తెల్పి తాటకిని వధిస్తాడు. ఇది రాముని వ్యక్తిత్వం. రామాయణంలో సీతారాముల దాంపత్య ధర్మం అమోఘం, అద్భుతం, ఆదర్శవంతం.
రామస్తు సీతయాసార్ధం విజహార బహుఋతూన్
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః||
వారిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలిసికొని, పరస్పర ప్రేమానురాగాలతో "లక్శ్మీనారాయణులు" సామాన్య దంపతులవలె అనేక రుతువులు గడిపిరి అని వాల్మీకి వర్ణిస్తారు.
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః||
వారిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలిసికొని, పరస్పర ప్రేమానురాగాలతో "లక్శ్మీనారాయణులు" సామాన్య దంపతులవలె అనేక రుతువులు గడిపిరి అని వాల్మీకి వర్ణిస్తారు.
రామచంద్రుని ఉదాత్తగుణాలలో---
"బుద్దిమాన మధురభాష పూర్వభాషీ ప్రియందదః"
రాఘవుడు బుద్ధిమంతుడు. మధురంగా, ముందుగా, ప్రియంగా మట్లాడు స్వభావం కలవాడు. కనుకనే రాముడు "మందస్మిత సుందర తదనారవిందుడు. ఇందీవర శ్యామలాంగ వందిత సుత్రాముడు.
"బుద్దిమాన మధురభాష పూర్వభాషీ ప్రియందదః"
రాఘవుడు బుద్ధిమంతుడు. మధురంగా, ముందుగా, ప్రియంగా మట్లాడు స్వభావం కలవాడు. కనుకనే రాముడు "మందస్మిత సుందర తదనారవిందుడు. ఇందీవర శ్యామలాంగ వందిత సుత్రాముడు.
పితృ వాక్య పాలనకు బద్దుడై, అరణ్య వాసానికి బయలుదేరిన రాముని ధర్మగుణాన్ని వాల్మీకి వివరిస్తూ
"యధా యధా దాశరధిః ధర్మ ఏవస్థితో భవేత్
తధా తధా ప్రకృతయో రామం ప్రతిర్యకామయన్||"
రాముడు ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ప్రజలు రామ మార్గాన్ని అనుసరించి "యధారాజా తధా ప్రజాః" అన్న విధంగా ప్రవర్తించేరని తెల్పి, రాముని వలె అందరూ ధర్మాన్ని ఆచరించాలని బోధిస్తాడు వాల్మీకి. ధర్మరహితమైన కాలాన్ని కోరుకుంటే దశరధుడు, దశకంఠుని వలె నశిస్తారని ఉపదేశిస్తుంది #రామాయణం. అందుకనే "రామతత్ వర్తితత్యం, నరావణవత్." అని పెద్దలు తెల్పేరు, కావున ప్రతి వ్యక్తి ధర్మంతో కూడిన అర్ధాన్ని ధర్మంతో కూడిన కాలాన్ని కోరుకోవాలి. సదా ధర్మాన్ని కాపాడాలి,
తధా తధా ప్రకృతయో రామం ప్రతిర్యకామయన్||"
రాముడు ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ప్రజలు రామ మార్గాన్ని అనుసరించి "యధారాజా తధా ప్రజాః" అన్న విధంగా ప్రవర్తించేరని తెల్పి, రాముని వలె అందరూ ధర్మాన్ని ఆచరించాలని బోధిస్తాడు వాల్మీకి. ధర్మరహితమైన కాలాన్ని కోరుకుంటే దశరధుడు, దశకంఠుని వలె నశిస్తారని ఉపదేశిస్తుంది #రామాయణం. అందుకనే "రామతత్ వర్తితత్యం, నరావణవత్." అని పెద్దలు తెల్పేరు, కావున ప్రతి వ్యక్తి ధర్మంతో కూడిన అర్ధాన్ని ధర్మంతో కూడిన కాలాన్ని కోరుకోవాలి. సదా ధర్మాన్ని కాపాడాలి,
''ధర్మ ఏనహతోహంతి ధర్మోరక్షతి రక్షితః."
తస్మాద్ధర్మోనహంతవ్యః మానోధర్మహనోభవేత్|| అని ధర్మ శాస్త్రం వివరిస్తుంది. ఇదే విషయం రామాయణం రామ చంద్రుని ద్వారా తెల్పుతుంది.
తస్మాద్ధర్మోనహంతవ్యః మానోధర్మహనోభవేత్|| అని ధర్మ శాస్త్రం వివరిస్తుంది. ఇదే విషయం రామాయణం రామ చంద్రుని ద్వారా తెల్పుతుంది.
రాజ్యానికి తిరిగి రావలసినదిగా వేడుకొని భరతునితో రాముడు ధర్మకావ్యాలని గూర్చి తెల్పుతూ
"కచ్చిదర్దేన వాధర్మం అర్ధధర్మేణవాపునః|
ఉచే వాప్రీతిలో భేన కామేనచనబాధతే"
అనగా ప్రురుషార్ధాలు ఒకదానినొకటి బాధించకుండా పరస్పర సహకారంతో, మెలిగితే రాజ్యం రామరాజ్యం అవుతుందని బోధించి పాదుకల నొసగి పంపిస్తాడు.
"కచ్చిదర్దేన వాధర్మం అర్ధధర్మేణవాపునః|
ఉచే వాప్రీతిలో భేన కామేనచనబాధతే"
అనగా ప్రురుషార్ధాలు ఒకదానినొకటి బాధించకుండా పరస్పర సహకారంతో, మెలిగితే రాజ్యం రామరాజ్యం అవుతుందని బోధించి పాదుకల నొసగి పంపిస్తాడు.
గుహుని విషయంలో, సుగ్రీవుని విషయంలో రాముడు చూపిన మిత్రధర్మం అపూర్వం, సదా స్మరణీయం. మానవరూపం దాల్చిన ధర్మమే రాముడు అని తెల్పుతూ వాల్మీకి-
''రామోవిగ్రహ వాన్ ధర్మః సాధుస్సత్య పరాక్రమః"
రాజా సర్వస్యలోకస్య దేవానామితతాసతః||
దేవతలకు ఇంద్రుని వలె, సమస లోకాలకు రాముడే ప్రభువు అని కీర్తిస్తాడు. విభీషణుడు శరణాగతుడై రాగా, వానరులు సంశయం వెలిబుచ్చగా శరణాగత ధర్మాన్ని తెల్పుతూ-
రాజా సర్వస్యలోకస్య దేవానామితతాసతః||
దేవతలకు ఇంద్రుని వలె, సమస లోకాలకు రాముడే ప్రభువు అని కీర్తిస్తాడు. విభీషణుడు శరణాగతుడై రాగా, వానరులు సంశయం వెలిబుచ్చగా శరణాగత ధర్మాన్ని తెల్పుతూ-
"సకృదేవప్రసన్నాయత వాస్మీతి చయాచతే|
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతంమమ||
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతంమమ||
ఒక్కసారి ’శరణు" అని ఆశ్రయించిన వారిని రక్షించడమే నా వ్రతం అని, విభీషణుడికి అభయం యిస్తాడు.
రావణుని మరణానంతరం అగ్ని సంస్కారం చేయమని విభీషణుడికి బోధిస్తూ "మరణాంతాని వైరాణి ఎంత శతృత్వమైనా మరణంతో పోతుంది " అని విశదపరుస్తాడు.
రావణుని మరణానంతరం అగ్ని సంస్కారం చేయమని విభీషణుడికి బోధిస్తూ "మరణాంతాని వైరాణి ఎంత శతృత్వమైనా మరణంతో పోతుంది " అని విశదపరుస్తాడు.
"యతో భ్యదయని శేశ్రీయ ససిధ్ధిః సధర్మః" ఇహలోక పరలోకము లందు కూడా మంచిని చేకూర్చునదే ధర్మము ఇట్టి ధర్మస్వరూపాన్ని రాముని ద్వారా లోకానికి చాటినది రామాయణం భారతీయుల సచ్చీలతకు, సంప్రదాయానికి, సత్ప్రవర్తనకు మణిదర్పణం రామాయణం చదివి ధర్మాన్ని ఆచరించడం మన ధర్మం.
No comments:
Post a Comment