భావయామి పవమాన నందనం
రామావతారంలోని వైశిష్ట్యం వద్దన్నా కనబడేది. నరులైనా, వానరులైనా, రాక్షసులైనా జాతినిబట్టి గాక గుణాన్ని మాత్రమే స్వీకరించి అనుగ్రహించాలని స్వామి జీవితం మానవులకు నిత్యసత్యాన్ని బోధిస్తున్నది. మానవులైన శబరి, గుహుడు, పక్షి జాతికి చెందిన జటాయువు, వానరులైన సుగ్రీవాంజనేయులు, భల్లూకపతి అయిన జాంబవంతుడు- వీరందరూ స్వామి అనుగ్రహానికి పాత్రులైనవారే! ఎవరికి తోచిన విధంగా వాళ్ల స్వామికి సహకరించారు. ఇది ‘సహకారం’ అని భావించకుండా సేవచేసే అవకాశమని భావించినవారే ఈ భాగవతోత్తములు. అందువల్లనే వీరందరూ నేటికి రామకథలో మరచిపోలేని వ్యక్తులుగా ఉండిపోయారు.============================
అశ్వర్ధామా బలీర్వ్యాసో
హనుమశ్చ విభీషణం
కృపఃపరుశురామశ్చ
సపె్తైతే చిరంజీవినః
చిరంజీవులుగా పై ఏడుగురిని మనం చెప్పుకొంటాము. వీరిలో ప్రసిద్ధులైన రామభక్తులు ఆంజనేయస్వామి, ఆంజనేయులు రామబంటు. విభీషణుడు కూడా రామ‘బంటు’లాంటి వాడే! ఇద్దరు కిష్కిందలోనే స్వామివారికి సన్నిహితులైనారు. ఆంజనేయులవారు తన స్వామి సుగ్రీవుని కొరకు స్వామి అండన చేరితే విభీషణుడు అన్నగారికి మంచి చెప్పబోయి విఫలుడై స్వామి పంచన చేరాడు.ఆంజనేయుల భక్తి ప్రపత్తుల విషయంలో అందరిదీ ఒకే మాట, ఒకే భావన..
No comments:
Post a Comment