ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం ఆలోచించడం మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి.
సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పాడు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పాడు.
నువ్ కరుణిస్తే నే నివసిస్తా
కలకాలం నీ కన్నుల ఎదుట
కలకాలం నీ కన్నుల ఎదుట
నువ్ కరుణిస్తే నే నివసిస్తా
కలకాలం నీ కన్నుల ఎదుట
నువ్ కనిపిస్తే నే ననుకుంటా
నువ్ కనిపిస్తే నే ననుకుంటా
పరమాత్మే నా ఎదురుగ ఉందని
పరమాత్మే నా ఎదురుగ ఉందని
నాలో పూచిన పూలన్నీ
నాలో పూచిన పూలన్నీ
నీ పాదాలకు నే నర్పిస్తా
మీ పాదాలకు నే నర్పిస్తా
నువ్వాఘ్రాణిస్తే నేను తరిస్తా
నువ్వాఘ్రాణి స్తే నేను తరిస్తా !!
No comments:
Post a Comment