సద్గురువు షిర్డీ సాయి బాబా
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు.
హృదయములో దేవుడు..
సామాన్య దీపం బాహ్యాంధకారాన్ని పోగొడుతుంది. భగవంతుడు ఇచ్చే జ్ఞానము అనే దీపం అంతఃకరణ యందలి మోహరూప తమస్సును నశింపజేస్తుంది. దుఃఖ నివారణమునకు ప్రతి జీవియు నిర్మల హృదయముతో అచంచల భక్తితో భగవతారాధన చేయవలెను. ప్రతి మనిషి హృదయములో దేవుడు ఉన్నాడని తెలిసింది కాబట్టి, దైవకార్య ధర్మ కార్య నిరతుడై యుండవలెను.
సామాన్య దీపం బాహ్యాంధకారాన్ని పోగొడుతుంది. భగవంతుడు ఇచ్చే జ్ఞానము అనే దీపం అంతఃకరణ యందలి మోహరూప తమస్సును నశింపజేస్తుంది. దుఃఖ నివారణమునకు ప్రతి జీవియు నిర్మల హృదయముతో అచంచల భక్తితో భగవతారాధన చేయవలెను. ప్రతి మనిషి హృదయములో దేవుడు ఉన్నాడని తెలిసింది కాబట్టి, దైవకార్య ధర్మ కార్య నిరతుడై యుండవలెను.

No comments:
Post a Comment