ఉదయం నీవే సందేపొద్దువి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి
పగలు నీవే రేతిరివి నీవే సాయి
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి
రాధవి నీవే రమణుడివి నీవే సాయి
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి
భాష నీవే భావానివి నీవే సాయి
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి
కవనం నీవే కవితాగానానివి నీవే సాయి
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి
ఆత్మవి నీవే ఆత్మారాముడివి నీవే సాయి
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి
జగానివి నీవే జగన్నాధుడివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి
ప్రభువి నీవే ప్రభలవెలుగువి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి
గౌరివి నీవే గంగానాధుడివి నీవే సాయి
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి
వేదన నీవే వేడుకవి నీవే సాయి
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి
గమ్యం నీవే గమనం నీవే సాయి
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి
సర్వం నీవే సకలం నీవే సాయి
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి!!
ఎవరికి వారు, ''నేను ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది? అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ, ఆదర్శప్రాయంగా జీవించాలని షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు.
ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం ఆలోచించడం మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పాడు.
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి!!
ఎవరికి వారు, ''నేను ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది? అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ, ఆదర్శప్రాయంగా జీవించాలని షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు.
ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం ఆలోచించడం మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పాడు.
No comments:
Post a Comment