సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, October 21, 2014

‪‎ఉపనిషత్తులు‬

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
1.సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
2.బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
3.అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
4.ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.
"దైవాధీనం‬ జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం" ఈ జగత్తుకి కారణమైన పరమాత్మని వంచేది ఆయన నామం. నామాన్ని కలిగినవి మంత్రాలు. మననం చేయగా మనల్ని రక్షిస్తాయి. ఇట్లా భగవంతుని మంత్రాలను అందించిన మహానుభావులు మన ఋషులు. భగవంతుణ్ణి చూడాలి అనే ఆరాటంలో అడవులని చేరి కోరికతో తిండి, నిద్రలు మాని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సుని చేస్తే ఏదో ఒక దివ్య అనుభూతిని వారు పొందారు. దాన్ని లోపల ఇమడ్చుకోలేక మనందరితో అభివ్యక్తం చేస్తారు. పరతత్వాన్ని దర్శించిన ఋషులు ప్రేమతో అప్రయత్నంగా, అసంకల్పితంగా దివ్య వాక్కు ఏర్పడింది. ఇలా ఒకరి నుండి మరొకరు ఆ దివ్య తత్వాన్ని దర్శించగలిగారు దానికి ఉప-నిషద్ అని పేరు పెట్టారు. ఉప- దగ్గరగా, నిషణ్ణా అంటే చూపునది. అట్లా ఉపనిషత్తు అని పేరు ఏర్పడింది. దేన్ని చూపుతుంది ? కావల్సిన పరం బ్రహ్మ తత్వాన్ని. ఇతరత్ర లభించే చోటికంటే దగ్గరగా తెచ్చి చూపగలవు.
ఉపనిషత్తులు వేదాలలోంచి వచ్చాయి. వేదాలు అపౌరుషేయాలు. ఎవరో కూర్చోని రచించినది కాదు. వేదాన్ని ఎవ్వరూ వ్రాయలేదు. ఆది అనేది తెలియకుండా లోకంలో ప్రవర్తిస్తూ వచ్చిన అఖండమైన అనంతమైన విజ్ఞాన రాశి, అలౌఖికమైన వాంగ్మయం వేదం. దోశాలు లేనివి. మనిషి చేసే వాటికి లోపాలు ఉండవచ్చు. నాలుగు రకాల లోపాలు ఉంటాయి. ఒకటి బ్రమ. ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవచ్చు. బొమ్మను చూసి మనిషి అనుకోవచ్చు. తాడును చూసి పాము అనుకోవచ్చు. ఒకదాన్ని మరొకటిగా గుర్తించడమే బ్రమ. రెండోది ప్రమాద. ప్రమాద అంటే తెలుగులో ప్రమాదం వేరు. సంస్కృతంలో ప్రమాదం అంటే పరాక్కు. పరాక్కు వల్ల కొన్ని విషయాలని పట్టించుకోలేక పోవచ్చు. మూడవది విప్రలంబ. అంటే ఏదో మెప్పు కోసం చేసేవి. లేనివి ఆరోపించి చెప్పడం. పొగడ్తల కోసం విషయాలు మార్చి వ్రాయడాన్ని విప్రలంబం. నాలుగవది అశక్తి. ఉంటుంది ఒకటి కానీ చెప్ప చేతకాదు. తెలిస్తే చెప్పకుండా ఎలా ఉండగలం ? కొన్ని చెప్ప చేత కాదు. తీపిగా అంటే ఏమి అంటే చెప్పడం చేతకాదు. అనుభవించగలం కానీ చెప్పే యోగ్యత లేదు. మానవ నిర్మిత గ్రంథాలు ఈ నాలుగు రకాల దోశాలతో నిండి ఉంటాయి. కనుక పౌరుషేయ గ్రంథాల్లో వలె దోషం లేని దాన్ని వేదం అని అంటారు. ఏది చెబితే అది దోషరహితం. అది ఎప్పుడో వ్రాసినది కాదు కనుక ఎప్పటికీ ఉంటుంది అందుకే నిత్యం అంటారు.
వేదాలు మన తత్త్వాన్ని గురించి, పరమాత్మ తత్త్వాన్ని గురించి, ప్రకృతి తత్త్వాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు చెబుతాయి. ఇక్కడ ఉన్నాం, ఇక్కడి తత్త్వం ఏమిటో తెలియకుంటే సుఖంగా ఏట్లా ఉండగలం. ఈ శరీరం వచ్చింది, శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి, జ్ఞానాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఆ విషయాలనన్నింటిని వేదరాశి వెలువరించింది. వేదంలో మన శరీరానికి కావల్సిన సాధనాలను చెప్పే భాగం పూర్వ భాగం అంటారు. చేయాల్సిన పనులు, ఫలితాలు చెబుతుంది. అయితే పనిచేస్తే ఫలితం ఎట్లా వస్తుంది ? మనం చేసే పని మనకు జీతం ఇస్తుందా కాదు ఆ పనిని చూసే వాడు జీతాన్ని ఇస్తాడు. అట్లానే మనకి శరీరాన్ని ఇచ్చి మనం దానితో సక్రమంగా నడుతుంటే చూసి సంతోషించి ఫలితం ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడు ఫలితాన్ని ఇచ్చేవాడు. వేదం మొత్తం పరమాత్మ తత్త్వాన్ని చెప్పేదే కానీ ఉత్తర భాగం అంతా పరమాత్మ తత్త్వాన్ని స్పష్టంగా చెబుతుంది. ఉత్తర భాగం పరమాత్మని చూపునది కనుక "ఉప", ఎలా దగ్గరిగా "నిషణ్ణ", అది అట్లా తనలో నింపుకొని ఇచ్చునది కనుక ఉపనిషద్ అని పేరు పెట్టారు.

No comments:

Post a Comment