కర్మలను బట్టే సుఖదు:ఖాలు..

శబ్ద స్పర్శ రూప రస గంధాలను విషయాలంటారు. బ్రహ్మచారులు వాటికి సంబంధించిన కథలకూ, విషయలోలుర సాంగత్యానికీ, స్త్రీ సాంగత్యానికీ దూరంగా ఉండి ఉత్తమ శిక్షణనూ, పూర్ణవిద్యనూ సంపాదించాలి. శరీరంలో వీర్య రక్షణ విషయంలో చిన్న తప్పు చేసినా దాన్ని సవరించుకోవడానికి ఈ జన్మలో మళ్లి అవకాశం లభించదనే విషయాన్ని గ్రహించాలి.తల్లిదండ్రులు, ఆచార్యుడు తమ సంతానాన్ని, శిష్యులనూ నైతిక శిక్షణ విషయంలో దండించవచ్చు. ఆ విధంగా దండిస్తే అది తమ సంతానాన్ని, శిష్యులనూ అమృత పానం చేయించినట్లే అవుతుంది. బాధ్యరహితంగా వ్యవహరిస్తూ పిల్లలను లాలించేవారు తమ పిల్లలకు పరోక్షంగా విషాన్ని త్రాగించిన వాళ్లవుతారు.
సంతానానికి ఉత్తమ విద్య, శిక్షణ, గుణకర్మలు ఉత్తమ స్వభావం అనే ఆచారాలను ధరింపజేసే తల్లిదండ్రులు, ఆచార్యులే ఉత్తములు. ఆభరణాలతో మనుష్య శరీరం అందంగా కనిపించవచ్చు గాని ఆత్మకు వాటివల్ల ప్రయోజనం లేదు. బాలబాలికలు బ్రహ్మచర్యంలో ఉన్నంత కాలం విషయధ్యానం, విషయకథ, స్పర్శనం, పరస్పర క్రీడ, పరస్పర దర్శనం, ఆలింగనం, ఏకాంత సేవనం, సంగతం అనే ఎనిమిది పనులకు దూరంగా ఉండాలి.
''స్మరణం కీర్తనం కేలి: ప్రేక్షణం గుహ్యభాషణమ్, సంకల్పోధ్యవసాయశ్చ క్రియానిర్వృత్తిరేవచ''!!
కనుక తల్లిదండ్రులు, ఆచార్యుడు పిల్లలకు బాల్యం నుండి సద్భుద్ధిని అందించే ప్రయ త్నం చేయాలి.
కనుక తల్లిదండ్రులు, ఆచార్యుడు పిల్లలకు బాల్యం నుండి సద్భుద్ధిని అందించే ప్రయ త్నం చేయాలి.
''అద్బిర్ గాత్రాణి శుధ్యన్తి, మన: సత్యేన శుధ్యతి,!
విద్యాతపోభ్యాం భూతాత్మా, బుద్ధిర్ జ్ఞానేన శుధ్యతి'' మనుస్మృతి!!
నీటి వల్ల శరీరావయవాలు, సత్యాన్ని ఆచరించడం వల్ల మనస్సు, విద్యవల్ల జీవాత్మ, జ్ఞానంవల్ల బుద్ధి పవిత్రం అవు తాయి.
విద్యాతపోభ్యాం భూతాత్మా, బుద్ధిర్ జ్ఞానేన శుధ్యతి'' మనుస్మృతి!!
నీటి వల్ల శరీరావయవాలు, సత్యాన్ని ఆచరించడం వల్ల మనస్సు, విద్యవల్ల జీవాత్మ, జ్ఞానంవల్ల బుద్ధి పవిత్రం అవు తాయి.
తల్లి మాత్రమే సంతానాన్ని ధర్మమార్గంలో నడిపించ గలుగుతుంది. అందుకు ఆమె మొదట సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కర్తవ్యశీలి కావడంతో పాటు దేశంపట్ల, ధర్మం పట్ల, గౌరవం కలిగి స్వయంగా ధార్మికురాలు కావాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి మహిళ వీరవనిత కావాలి, విదుషీ మణి కావాలి.
ఎప్పటి దాక వైదిక దినచర్య ఆచరింపబడదో అప్పడిదాక నిజమైన అభివృద్ధి సాధ్యం కాదు. పాశ్చాత్య నాగరికత, విద్యల కారణంగా వ్యభిచార ప్రవృత్తి అధికమవుతుంది. ఆర్ష సంస్కృతికి చెప్పరాని అప కారం జరుగుతుంది. దీన్ని భారతీయ స్త్రీ పురుషులు గమనించాలి.
నివాస యోగ్యంగా ఇల్లు కట్టుకోలేనప్పటికీ, అప్పుడప్పుడు ద్వార బంధనానికి మాత్రం అందమైన కర్టెన్ గుడ్డలు వేలాడదీస్తాం. మన వైభవాన్ని ఇతరులకు చూపి వారి మీద మన ప్రభావాన్ని వేస్తాం. ఇదంతా ఇతరుల ముందు మన ఆధిక్యతను ప్రదర్శించడమే తప్ప మరోటి కాదు. ఇట్లే ఒకరి ప్రభావానికి మరొకరం లొంగిపోయి, మన వైభ వాన్ని చాటుకోవడానికి వ్యాపారంలో అవినీతికి పాల్పడు తాం. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కళ్లు జిగేలు మనే దుస్తులను, వస్తువులను కొంటాం. కాని రంగు రంగుల ఆకర్షణీయమైన దుస్తులను ధరించడం వల్ల యువతీ యువకుల్లో కామ ప్రవృత్తి బ్రహ్మచర్యాన్ని దెబ్బదీస్తుం దన్న విషయాన్ని విస్మరిస్తున్నాం.
ఈ భూమి మీద మనలను మంచి మార్గంలో నడపగలిగిన మహా పురుషులు ఎంతో మంది జన్మించి నప్పటికీ వారి చరిత్రలను మనం వక్రీకరించాం. కొందరు సీతామాత శీలాన్ని శంకించారు.
రాముణ్ణి న్యాయ విరోధిగా చిత్రించారు. కృష్ణుణ్ణి చోరు నిగా లెక్కించారు. వ్యభి చారిగా గాథలు రచించారు. ద్రౌపది పంచభర్తృకగా చూపెట్టబడింది. కుంతి,మాద్రి, సత్యవతి మొదలైన నారీ మణుల చరిత్రలు కళంకితమయ్యాయి. అమాయకులైన ప్రజలు #ధర్మ విరుద్ధమైన కల్పితగాథల మీద మక్కువ చూపుతూ వాటిచేత ఆకర్షితులు కావడానికి మన పుస్తకాలలోని కల్పిత గాథలు ఎంతో దోహదం చేశాయి. కొందరు కామ వాసనలను తీర్చుకోవడానికే జన్మించి నట్లు భావిస్తున్నారు. ఏడాది పొడవునా భోగించడానికి కాక ఈ శరీరం మరెందుకని ప్రశ్నిస్తున్నారు. ఆ #పరమేశ్వరుడు మనలను కేవలం బోగ జీవులుగా రచించాడనే భ్రమలో మునిగి ఉన్నారు.
నిజానికి భోగం అంటే సుఖదు:ఖానుభవం. మనం చేసే కర్మలను బట్టి సుఖ దు:ఖాలు మన వెన్నంటి ఉంటాయి. కర్మఫలాలను అనుభవించకుండా తప్పించుకునే మార్గం లేదు. అనుభవించడం వల్లనే కర్మలు తీరిపోతాయి. కనుక ప్రతి మనిషి సత్కర్మలను ఆచరిస్తూ జీవించాలి. వేదం ఇదే విషయాన్ని మనకు ఉపదేశిస్తుంది.
''కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే చ్ఛతగ్ం సమా:
ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లివ్యతే నరే''!!
పరవేశ్వరుడు న్యాయాధీశుడని భావించి, అతని ఆజ్ఞ పాలింపదగిందని నిర్ణయించి, సోమరితనం విడిచిపెట్టి శుభకర్మలు చేయాలి. యుక్తాహార విహారాలచే నూరేండ్లు జీవించాలి. కామసుఖాలు అనుభవించడానికే భగవంతుడు సృజించాడనడం ఆ భగవంతుణ్ణి మన పాపంలో భాగస్వామిని చేయడమే కాని మరోటికాదు.
ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లివ్యతే నరే''!!
పరవేశ్వరుడు న్యాయాధీశుడని భావించి, అతని ఆజ్ఞ పాలింపదగిందని నిర్ణయించి, సోమరితనం విడిచిపెట్టి శుభకర్మలు చేయాలి. యుక్తాహార విహారాలచే నూరేండ్లు జీవించాలి. కామసుఖాలు అనుభవించడానికే భగవంతుడు సృజించాడనడం ఆ భగవంతుణ్ణి మన పాపంలో భాగస్వామిని చేయడమే కాని మరోటికాదు.
వీర్యాన్ని అధికంగా వ్యయం చేయడం ద్వారా ఎవరైతే అధిక సుఖాన్ని పొందా లనుకొంటారో వారు చివరికి నిరాశ పాలౌతారు.తొందరగా #మృత్యుముఖంలోకి ప్రవేశిస్తారు. కామోప భోగం వల్ల ఎన్నటికీ తృప్తి తీరదు. అమూల్య మైన జీవిత కాలం
వ్యర్థ మౌతుంది కూడా.#బాల్య వివాహాల వల్ల, బహు భార్యాత్వం వల్ల కలిగే నష్టాలను గూర్చి మన #వాఙ్మయం నుండి ఎన్ని ఉదా హరణలైనా చెప్పు కోవచ్చు.
No comments:
Post a Comment