సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 30, 2014

‪జనన‬ మరణాల మధ్య అంతా మిథ్య

జనన‬ మరణాల మధ్య అంతా మిథ్య.. 

                                       ''‪‎మాతా‬ నాస్తి పితా నాస్తి
                                           నాస్తి బంధు సెదరః
                                        అర్ధం నాస్తి గృహం నాస్తి
                                      తస్మాత్‌ జాగ్రత జాగ్రతాః''!!ఇది శంకర భగవత్పాదులు బోధించిన జీవిత సత్యం. భూమి మీద మనం జన్మించడానికి ఒక మార్గం కావాలి. పూర్వజన్మ ‪‎పాపపుణ్యాల్ని‬ అనుభవించి, తిరిగి వచ్చినచోటేక చేరుకుంటాం. అలా మనకి సాయపడుతున్న జన్మకారకులు తల్లిదండ్రులు. మనతోపాటు మరికొన్న జీవాలు ఋణానుబంధాలననుసరించి అదే ‪‎గర్భవాసాన‬ జన్మిస్తూవుంటారు. వారే మనకు సోెదరులు అవుతారు. ఫలానా వారు మనకి సోెదరిగా జన్మిస్తుందనిగానీ, సెదరుడుగా పుడతాడని గానీ మనకు ముందుగా తెలియదు. అదే జన్మరహస్యం‬.
ఇలా జన్మించిన మనకి తల్లి, తండ్రి, అక్కా, అన్నా, చెల్లెలు, తమ్ముడు అనే బంధాలు ఏర్పడతాయి. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు వీరెవరూ మనతోపాటు రారు. అలాగే మనం‪ ‎మరణించేటప్పుడు‬ తిరిగి ఈ తల్లి గర్భానికి చేరం. తల్లిదం డ్రులూ మనతో రారు. జన్మించడానికి, మరణించడానికి మధ్య నున్న వ్యవధిలో మనకి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు బుద్దిపూర్వకంగా పుడుతూవుంటాయి. పెళ్ళి, పిల్లలు, సంసారం అనే సడిగుండంలో చిక్కుకుని, ‪‎జీవితకాలంలో‬ మనం కూడబె ట్టుకున్నది ఉన్నవారికి వదిలి తిరుగు ప్రయాణం అవుతాం. అప్పుడు మన సంసారంలో భార్యగానీ, పిల్లలుగానీ మనతో పాటు రారు. అందుకే వీటిమీద వ్యామోహాన్ని పెంచుకోకూ డదు. ఈ సంసార‬ సాగరంలో పడితే పుడుతూ, మరిన్ని పాపకర్మలు చేస్తూ మరణిస్తూ తిరిగి వాటిని అనుభవించడానికి మరో గర్భాన జన్మిస్తూ ఇలా అంతులేని భవసాగరాన్ని ‪‎జననమరణాలతో‬ ఈదులాడుతూనే ఉండాలి. 
''పునరపి‬ జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్సారే
కృపయాపారే పాహి మురారే!!
అన్నారు ‪‎శంకరభగవత్పాదులు‬. మరి మనకి తోడుగా, నీడగా ఉండేది ఏదీ..? అనే సంశయా నికి సమాధానంగానే శంకరులవారు ప్రబోధించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పరమేశ్వరుని శరణాగతి ఒక్కటే మార్గం అని. అన్ని జన్మల్లోనూ ఉత్కృష్టమైనది మానవ జన్మ.జన్మరాహిత్యాన్ని‬ పొందడానికి ఇదే చక్కని చుక్కాని. పుట్టుక వల్ల ఏర్పడిన భవబంధాల మీద అనురక్తిని పెంచుకోకుండా, భగవంతుని‬ అన్వేషించి పట్టుకుంటే ఈ జననమరణ చక్రంలో పడి కొట్టుకుపోకుండా ఆ పరమేశ్వరుడే మనల్ని ఒడ్డుకి చేరుస్తాడు.
ఎవరూ మనతో రాకపోయినప్పటికీ, నీడలా‬ మనని అంటిపెట్టుకు వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే అన్న విషయం విజ్ఞులందరికీ తెలిసినదే. పుణ్యచరణ వలన ఉత్తమగతులు కలుగుతాయన్నదే వేదవాక్కు. అందుకు ఈశ్వరుడు‬ అనుగ్రిహంచిన ఈ జన్మని, తిరిగి పరమేశ్వరార్పణమే చేయాలి. బ్రహ్మాండం నుంచి పుట్టిన ‪‎అణువులు‬, పరమాణువులు మళ్ళీ‪ బ్రహ్మాండంలోనే‬ విలీనం కావాలి. అదే ప్రకృతి. దానిననుసరించి వర్తించడమే మానవ ధర్మం. అందుకు తగిన సాధన ప్రతి మానవుడు చేయాలి. అప్పుడే జన్మరాహిత్యం‬ కలుగుతుంది. మనసా, వాచా, కర్మణా భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకునే ప్రతీ మానవుడు ఆయనలోనే‪ లీనమవుతాడు‬.
ఆయనే ‪‎జన్మాంతరాన‬ మనతో పాటు నడిచే, నడిపించే బాంధవుడు. మనం మమకారం పెంచుకున్నవా రెవ్వరూ మనతో ఉండరు, రారు.అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. మంచి‬ జన్మ లభించినందుకు ఈ జన్మలోనే పాప పరిహారం చేసుకుని, సకల బంధాలనూ విడనాడి, ఆ పరమే శ్వరుని పాదాలచెంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడానికి అహర్నిశలూ కృషిచేయాలి. ‪‎ధర్మ‬ పథంలో పయనిస్తూ, ఆ పరమపథాన్ని చేరుకోవడానికి భగవన్నామాన్ని జీవిత నౌకగా చేసుకుని నవవిధ‪ భక్తిమార్గాలలో‬ ఈ భవ సాగరాన్ని దాటాలి.
''రామ‬ హరే కృష్ణ హరే
తవ నామవధామి సదానుహరే
నామస్మరణా ధన్యోపాయం
నహి పశ్యామో భవతరణే''!!
ఈ భవబంధాల్నించి మనల్ని విముక్తుల్ని చేసేది ఈ కలియుగంలో నామస్మరణ ఒక్కటే.అందుకే ‘‪‎కలియుగే‬ స్మరణాన్ముక్తిః’ అని శాస్తవ్రచనం. ఈ కలియుగంలో విషయానురక్తులైన మానవులకు భక్తి, ముక్తి దాయకం ఈ నామస్మరణ. అనుక్షణం భగవంతుని స్మరిస్తూ, ప్రతిచర్యా, ప్రతి‬ క్రియా ఆ భగవంతుని ప్రేరణగానే భావించి తరించడం కంటే ‪‎సూక్ష్మమైన‬ సాధన మరొకటి లేదు.

No comments:

Post a Comment