
స్వేతార్క గణపతి
వినాయకునికి అనేక రూపాలున్నాయి . ఇన్ని రూపాలు ఏ దేవుడికి లేవు .కాని ఈ రూపాలలో మనం ఆయన్ను దర్శించాలేము అందుకని ముఖ్యమైన 64 రూపాలను పేర్కొంటారు కాని అందులో 32 ముఖ్యమైనవి వీటిలో కూడా 16 రూపాలుఅత్యంత ముఖ్యమైనవి .కాని వీటిలోఎక్కడా స్వేతార్క గణ పతి పేరు పేర్కొన బడ లేదు
కాని నారదాది పురాణాలలో లో తెల్ల జిల్లేడు చెట్టు వంద ఏళ్ళు బతికితే అది గణపతి రూపం పొందుతుంది అని ఉంది .అదే స్వేతార్క గణపతి .గా పెద్దలు చెబుతున్నారు .కాని అనుభవం లో స్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు వంద ఏళ్ళు బతికి ఉండగా చూసిన వారు అది గణపతి రూపం పొందినట్లు చూసిన వారు ఎవరూలేరు.గణపతి ఉపనిషత్ లో మాత్రం తెల్ల జిల్లేడు వందేళ్ళు జీవిస్తే గణపతికి ఉండే సర్వ అవయవాలతో గణపతి రూపం దాలుస్తుంది అని ఖచ్చితం గా చెప్ప బడింది .ఇది అతి అరుదైన సంఘటన అని కూడా పేర్కొన్నారు .సాధారణం గా ఏ చెట్టు వేరు అయినా దీర్ఘకాలానికి పాము ఆకారం లోనో ,ఏనుగు ఆకారం లోనో మారుతుంది . అని అనుభావ్జులైన పెద్దలన్నారు .అంతమాత్రం చేత ప్రతి వేరు గణపతి రూపం పొందటం అసంభవం .హనుమంతుడు పారిజాత వృక్షమూలం లో ఉంటాడని అందరికి నమ్మకం .పారిజాత మూలం హనుమాన్ రూపం దాలుస్తుంది అని విజ్ఞులు భావించారు .
ఆంద్ర ప్రదేశ్ లో కాజీ పేట లో విష్ణుపురి కాలని లో స్వేతార్క మూల గణపతి స్వామి ‘’వారల దేవాలయం దేశ దేశాలలో ప్రసిద్ధి చెందిన అరుదైన ఆలయం .నిత్యం వేలాది భక్తులు ‘’తెల్ల జిల్లేడు గణపతి ‘’స్వామిని దర్శించి ,పూజించి తరిస్తుంటారు .ఈ స్వామిని సంకల్ప సిద్ధి వినాయకుడు ‘’అని కూడా అంటారు .ఈ తెల్ల జిల్లేడుగణేశునికి అన్ని అవయవాలు ఏర్పడి పూర్ణ స్వరూపుడు గా దర్శనం ఇస్తాడు .ఏ శిల్పీ చెక్కిన రూపం కాదుఇది .స్పష్టమైన కన్నులు తొండం ,చెవులు ,నుదురు కాళ్ళు చేతులు వాహనమైన అనిన్ద్యుడనే ఎలుక,యజ్ఞోప వీతం ముక్కు అన్ని ఉండిమహాశ్చర్యాన్ని కలిగిస్తాయి .అతి సహజం గా ఏర్పడిన విశిష్ట వింత స్వరూపం ఈ స్వేతార్క మూల గణపతి .
తూర్పు ముఖం గా స్వామి ఉన్నా ,ఈశాన్య దిశ వైపు చూస్తున్నట్లు కన్పిస్తాడు ద్రుష్టి తండ్రి శివుని విహార భూమి కైలాసం వైపు ఉన్నట్లు అని పిస్తుంది .సకల వాస్తు స్వరూపుడు అని పిస్తాడు .పురాణ కధనం ప్రకారం ఒక సారి మూహికాసురునికి వినాయకునికి యుద్ధం జరిగింది తన కున్న రెండు దంతాలలో ఒక దాన్ని పెకలించి దానితో మూషికుడిని పొడిచి చంపాడు .ఈ మూషికాసుర వధ అయిన తర్వాతా స్వామి ప్రశాంత చిత్తం ఈ రూపం లో తో ఇక్కడ కూర్చున్నాడని కధనం .ఓం గం గణపతయే నమః ‘’అని ఆర్తిగా ధ్యానిస్తే స్వామి సంప్రీతుడై సకల కోరికలు నేరవేరుస్తాడు అని భక్త జన విశ్వాసం.
No comments:
Post a Comment