సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, October 23, 2016

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ??

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ??


ద్వాదశ జ్యోతిర్లింగాలను సాక్షాత్తు శివజ్యోతి ప్రతిరూపాలుగా మహా మహిమాన్వితాలుగా హైందవులు విశ్వసిస్తుంటారు. అయితే, అసలు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో పలువురికి తెలియదు.

గుజరాత్‌లోని అరేబియా సముద్రతీరంలో సోమనాథ క్షేత్రం ఉంది. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాతీరంలో శ్రీశైలం మల్లికార్జునుడున్నాడు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు కొలువయ్యాడు.ఈ ప్రాంతం మధ్యప్రదేశ్‌కు వాయవ్యంగా దాదాపు రాజస్థాన్‌కు అనుకుని ఉంటుంది. నర్మదాతీరంలో ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 77 కిలోమీటర్ల దూరం.

కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్‌లోని బదిరీనాథ్ సమీపంలో వెలిశాడు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో వెలసిన జ్యోతిర్లింగం భీమశంకరుడు. నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరుడు కొలువయ్యాడు. కాశీలోని జ్యోతిర్లింగం విశ్వనాథుడు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ ప్రాంతంలో వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్‌లోని ద్వారక సమీపంలో ఉంది. తమిళనాడులోని రామేశ్వరంలో రామేశ్వరుడు ఉన్నాడు. మహారాష్ట్రలోని దౌలతాబాద్ దగ్గర ఘశ్మేశ్వరుడి పేరుతో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు.

No comments:

Post a Comment