సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, October 23, 2016

అశోక వనంలో రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు చెప్పిన జయ మంత్రము

అశోక వనంలో రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు చెప్పిన జయ మంత్రము

హనుమంతుడు పరమ రామ భక్తుడు. ఎక్కడ రామా అంటే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడైనా తదేకంగా రామ నామ జపం జరుగుతుంటే, అక్కడికి హనుమంతుడు కూడా వచ్చి కూర్చుంటాడని అంటారు. అలాంటి హనుమంతుడు జయ మంత్రం చెప్పాడంటే, అందులో ఖచ్చితంగా రామనామం ఉంటుంది.

జయ మంత్రము:
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|

హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||

అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|

సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||

మంత్రము యొక్క అర్ధం:
'రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు' అని జయ మంత్రాన్ని చెప్పాడు.

No comments:

Post a Comment