సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, October 7, 2016

శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతుందట… అక్కడ పూజలు చేస్తే కోర్కెలన్నీ తీరుతాయట…

ఆ ఆలయంలో ఉన్న శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతుందట… అక్కడ పూజలు చేస్తే కోర్కెలన్నీ తీరుతాయట
మన దేశంలోని చారిత్రాత్మక హిందూ దేవాలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉందని ముందే చెప్పుకున్నాం కదా! ఆ, అవును. సరిగ్గా ఆ కోవకే చెందే మరో ఆలయం గురించే ఇప్పుడు చెప్పబోయేది. అదే రాజస్థాన్ ధోల్‌పూర్‌లోని శివాలయం. దాదాపు వేయి సంవత్సరాల కిందట నిర్మాణమైనట్టుగా చెప్పబడుతున్న ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ శివాలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన శివాలయాల్లో ఒకటిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొంది. అక్కడి శివున్ని అచలేశ్వర్ మహాదేవ్‌గా పిలుస్తారు.

ఈ శివాలయంలో ఉన్న శివలింగం నిత్యం 3 రకాల రంగుల్లో కనిపిస్తుంది. ఉదయం పూట ఎరుపు రంగులో, మధ్యాహ్నం కుంకుమ పువ్వు రంగులో, రాత్రికి నలుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. కాగా కొంత మంది సైంటిస్టులు ఆ ఆలయంలోకి ప్రవేశించే సూర్యకాంతి వల్లే అలా ఆ శివలింగం రంగులు మారుతుందని చెప్పారు. కానీ వారు దాన్ని సైంటిఫిక్‌గా నిరూపించలేకపోయారు. దీంతో ఈ రంగులు మారడమనేది అత్యంత మిస్టరీగా మారింది.

అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులు రోజంతా అక్కడే ఉండి శివలింగం మారే అన్ని రంగులను చూసి వెళ్తారట. ఎందుకంటే అలా చూడడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.

సాధారణంగా ఏ శివాలయంలో ఉన్న లింగమైనా ఎంతో కొంత ఎత్తు, పొడవు, వెడల్పులను కలిగి ఉంటుంది. అయితే ధోల్‌పూర్ శివాలయంలోని లింగం మాత్రం చాలా పొడవైందని చెబుతారు. అయితే అది పైకి కనిపించదు. చూసేందుకు మామూలు శివలింగంగానే ఉంటుంది. కాకపోతే కింది వైపుకు పొడవు ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే భూమి లోపల లెక్కకు మించిన అడుగుల లోతు వరకు ఆ శివలింగం ఉంటుందని అంచనా. కొంత మంది భక్తులు ఆ శివలింగం పొడవు తెలుసుకునేందుకు దేవాలయం చుట్టూ భూమి లోపలికి సొరంగంలా తవ్వారట. అయినా ఆ శివలింగం చివరి భాగం మాత్రం ఎవరికీ కనిపించలేదట.

పెళ్లి కాని యువతీ యువకులు ఇక్కడికి వచ్చి శివలింగానికి పూజలు చేస్తే వారికి వెంటనే వివాహం జరుగుతుందట. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయంలో అధిక శాతం మంది యువతీ యువకులు కనిపిస్తారు.

సాక్షాత్తూ పరమశివుడు ఇక్కడ పాదం మోపాడని ఆయన అలా పాదం మోపిన ప్రదేశంలోనే శివలింగం ఏర్పడిందని, అక్కడే ఆలయం కూడా నిర్మించారని ఆ ఆలయానికి చెందిన పురాణ గాథలు చెబుతున్నాయి. కొంత మంది భూమికి మధ్య భాగం ఈ ఆలయంలోనే ఉందని విశ్వసిస్తారు.

ధోల్‌పూర్ శివాలయంలో స్వామికి ఎదురుగా కొలువై ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని 5 విభిన్న రకాల లోహాలతో తయారు చేశారట. ఒకానొక సమయంలో కొంత మంది దుండగులు ఈ ఆలయంలోకి చొరబడితే అక్కడి నందీశ్వరుడే వారిని పెద్ద పెద్ద ఈగలతో బయటికి తరిమికొట్టాడని చెబుతారు.

No comments:

Post a Comment