"ఖిలా వరంగల్"
ఇలాంటి అద్భుతమైన శివలింగాన్ని ఇంకెక్కడైనా చూశారా ??
ఇది వరంగల్ జిల్లా "ఖిలా వరంగల్" లో కాకతీయ రాజులు నిర్మించిన "శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం" లో గర్భాలయానికి బయట ఉంది..!!
ఈ ఆలయం చిన్నదే. శిల్పసంపద మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది.
క్రీ .శ 1162 లో రెండవ ప్రోల రాజు ,హనుమకొండను రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి .అప్పుడు దేశం సుభిక్షంగా ఉంది .పచ్చని పైరుపంటలతోకళకళలాడుతూ ఉంది.ఒకానొక రోజు రైతులు పంటను కోసి బండ్లపైకి ఎత్తించి ,ఇంటికి తిసుకువస్తుండగా ఒక బండి చక్రం భూమి లోపలికి కూరుకుపోయింది. రైతులంతా చాల ప్రయత్నించారు కానీ లాభం లేకపోగా ఊరులోని వారు కూడా వచ్చి సాయం చేయగా చివరికి ఆ చక్రాన్ని పికి తీసారు.భూమినుండి బయటికి వచ్చిన ఆ చక్రం బంగారు కాంతులతో మెరుస్తూ వచ్చింది. దానితో ఆ రైతుల మనసులు మురిసిపొయ్యాయి.ఆ తర్వాత అసలెందుకు అల అయ్యిందో ఎవరికీ ఎంత ఆలోచించినా అర్థంకాక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు .
కొన్ని రోజులకి అందరు అనుకోవడంవల్ల ఆ విషయం రాజుకి తెలిసింది .దాంతో ఆ రాజు ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించాడు. ఆ ప్రాంతం అంతా బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉండటంతో ,ఆ రాజు నమస్కారం చేసి పంచాక్షరి మంత్రమయిన “ఓం నమ:శివాయ” అని పదే పదే జపించాడు.దాంతో ఆ ప్రాంతంలో స్వయంభూలింగం దర్శనమిచ్చింది .దాంతో ఆ రాజు ఆ లింగాన్ని తనరాజదానిలో ప్రతిష్టించాలని తలంచి ,శివలింగాన్ని తీయించబోయి విపలమయ్యాడు.
అప్పుడు ఆ ప్రోలరాజు గురువర్యులైన శ్రీ పాదులను ప్రశ్నించాడు .దానితో వారు దివ్య దృష్టితో దర్శించి ,ఆ స్వయంభూ లింగం ఇనుమును కూడా బంగారం చేయగల గొప్ప మహిమలు కలదని తెలియచేసి ,అచ్చటనే దేవాలయ నిర్మాణం చేయమని ఆదేశించారు .అంతటితో ఆ రాజు అచ్చటనే దేవాలయాన్ని నిర్మించి ,చుట్టూ ఏడుకోటలు కట్టించి ఒక పెద్ద నగరాన్ని నెలకొల్పాడు .అదే కాకతీయుల రాజధాని అయిన అప్పటి ఓరుగల్లు యిప్పటి వరంగల్.ఈ ఆలయంలో మహిషాసురమర్తిని సహిత శంభులింగేశ్వర స్వామి కొలువైవున్నాడు.
ఇలాంటి అద్భుతమైన శివలింగాన్ని ఇంకెక్కడైనా చూశారా ??
ఇది వరంగల్ జిల్లా "ఖిలా వరంగల్" లో కాకతీయ రాజులు నిర్మించిన "శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం" లో గర్భాలయానికి బయట ఉంది..!!
ఈ ఆలయం చిన్నదే. శిల్పసంపద మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది.
క్రీ .శ 1162 లో రెండవ ప్రోల రాజు ,హనుమకొండను రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి .అప్పుడు దేశం సుభిక్షంగా ఉంది .పచ్చని పైరుపంటలతోకళకళలాడుతూ ఉంది.ఒకానొక రోజు రైతులు పంటను కోసి బండ్లపైకి ఎత్తించి ,ఇంటికి తిసుకువస్తుండగా ఒక బండి చక్రం భూమి లోపలికి కూరుకుపోయింది. రైతులంతా చాల ప్రయత్నించారు కానీ లాభం లేకపోగా ఊరులోని వారు కూడా వచ్చి సాయం చేయగా చివరికి ఆ చక్రాన్ని పికి తీసారు.భూమినుండి బయటికి వచ్చిన ఆ చక్రం బంగారు కాంతులతో మెరుస్తూ వచ్చింది. దానితో ఆ రైతుల మనసులు మురిసిపొయ్యాయి.ఆ తర్వాత అసలెందుకు అల అయ్యిందో ఎవరికీ ఎంత ఆలోచించినా అర్థంకాక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు .
కొన్ని రోజులకి అందరు అనుకోవడంవల్ల ఆ విషయం రాజుకి తెలిసింది .దాంతో ఆ రాజు ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించాడు. ఆ ప్రాంతం అంతా బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉండటంతో ,ఆ రాజు నమస్కారం చేసి పంచాక్షరి మంత్రమయిన “ఓం నమ:శివాయ” అని పదే పదే జపించాడు.దాంతో ఆ ప్రాంతంలో స్వయంభూలింగం దర్శనమిచ్చింది .దాంతో ఆ రాజు ఆ లింగాన్ని తనరాజదానిలో ప్రతిష్టించాలని తలంచి ,శివలింగాన్ని తీయించబోయి విపలమయ్యాడు.
అప్పుడు ఆ ప్రోలరాజు గురువర్యులైన శ్రీ పాదులను ప్రశ్నించాడు .దానితో వారు దివ్య దృష్టితో దర్శించి ,ఆ స్వయంభూ లింగం ఇనుమును కూడా బంగారం చేయగల గొప్ప మహిమలు కలదని తెలియచేసి ,అచ్చటనే దేవాలయ నిర్మాణం చేయమని ఆదేశించారు .అంతటితో ఆ రాజు అచ్చటనే దేవాలయాన్ని నిర్మించి ,చుట్టూ ఏడుకోటలు కట్టించి ఒక పెద్ద నగరాన్ని నెలకొల్పాడు .అదే కాకతీయుల రాజధాని అయిన అప్పటి ఓరుగల్లు యిప్పటి వరంగల్.ఈ ఆలయంలో మహిషాసురమర్తిని సహిత శంభులింగేశ్వర స్వామి కొలువైవున్నాడు.
No comments:
Post a Comment