సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, September 15, 2016

కాలభైరవుడు

కాలభైరవుడు

ఈ సాధన ఉపాసన చేయాలని కాలభైరవ తంత్రం సిద్దించుకోవాలని అవిశ్రాంతంగా కాళ్ళు అరిగేలా చాలామంది గురువుల కోసం తిరుగుతుంటారు.. కానీ ఇది సిద్దించుకోవాలంటే గురూపదేశం,, విధివిధానాలు తెలిస్తే సరిపోదు శివా,, కాలభైరవుని గురించి ఆయనకి ఎన్ని అవతారాలు ఉన్నాయో కూడా తెలిసుండాలి...
సిద్ధించుకున్నవారికి వారికి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల గురించి,,సమస్యలు గురించి కాలభైరవుడు ముందుగానే తెలియజేస్తుంటాడు..కాలభైరవుడు ప్రత్యక్షంగా కానీ,పరోక్షంగా కానీ సాధకుని వెంటే ఉండి అన్నివేళలా కాపాడుతుంటాడు.. తాంత్రిక సిద్దులు కాలభైరవుడిని శక్తి ఆలయాలకు రక్షణగా ఉంచేవారు.. ఆయన శక్తి అమోఘం..
రేపటినుంచి అవతారాల వివరాలు,,కాలభైరవుడు రహస్య ఉపాసన వివరాలు తెలియజేయగలం శివా..శివోహం..
నిత్యం సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడ ఇస్తున్న కాలభైరవగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటల తరువాత కాలభైరవుని పటం ముందు శుచీభూతులై కూర్చుని 108సార్లు పఠించండి శివా.. మీకు కాలభైరవుడి అనుగ్రహం వల్ల సమస్యలు పటాపంచలైపోతాయి..శివోహం
ఇది మీ మిత్రులందరికీ షేర్ చేసి తెలియజేయండి శివా..

||||ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహీ తన్నో కాలభైరవ ప్రఛోధయాత్||||

లలితా త్రిశతి శ్రీయంత్రం

"లలితా త్రిశతి శ్రీయంత్రం,,ప్రతీ గృహంలో పూజగదిలో ఉంచుకున్నా వారికి చాలామంచి జరుగుతుంది..

ఇది చాలా అద్భుతమైన మహిమగల యంత్రం,, అమ్మవారు మీరు చేసే పూజలను బట్టి మీ ఇంట నివసిస్తుంది ఈ యంత్రంలో,, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే శివా,, 

మానవుడు నిజమైనమానవుడు కావాలంటే ఎం చెయ్యాలి??

మానవుడు నిజమైనమానవుడు కావాలంటే ఎం చెయ్యాలి??

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁదలఁపఁడేనిఁ
గలుగనేటికిఁ దల్లులకడుపుఁజేటు.
భావము:
మానవుడు నిజమైనమానవుడు కావాలంటే కొన్ని విశిష్టలక్షణాలను పెంపొందించు కోవాలి. అలాకాకపోతే వాడు పుట్టుకకు ఒకప్రయోజనం ఉన్నదని నిరూపించుకోలేడు. వాడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆవిశిష్టలక్షణాలను ప్రకటిస్తూ పోతన తనపుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తతరంగా రూపుదిద్దుకొనే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.
నమకచమకాలు పఠిస్తూ శివునికి అభిషేకం చేస్తాము. లేదా వేయి నామాలు చదువు కుంటూ పూలతో శివుని పూజిస్తాము. కొంతసేపటికి చేతులు ఆశ్రమను తట్టుకోలేక అభిషేకా నికో, పూజకో మొరాయిస్తాయి. దీక్షకలవాడు ఆమొరాయింపునకు లొంగిపో కూడదు. చేతులను శిక్షించి అయినా పూజను తుదియుట్టా పూర్తిచేయాలి. చేతులారంగ శివుని పూజిం చటం అంటే అది. అలాగే ఏ విష్ణుస్తోత్రాలో, సహస్రనామాలో చదువుతూ ఉంటే నోరు కొంతసేపటికి నొప్పి పొందుతుంది. అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయగూడదు. నోటిని నొప్పించి అయినా హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి. అలాగే దయ, సత్యం మొదలైన ఉత్తమగుణాలయందు మనసును కుదురుకొల్పాలి. అప్పుడే పుట్టుకకు సార్థకత. అలా కాకపోతే తల్లికడుపును చెరచటానికే పుట్టినట్లవుతుంది.
ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి.. 

"ఖిలా వరంగల్" ("శంభు లింగేశ్వర స్వామి ఆలయం" )

 "ఖిలా వరంగల్"

ఇలాంటి అద్భుతమైన శివలింగాన్ని ఇంకెక్కడైనా చూశారా ??
ఇది వరంగల్ జిల్లా "ఖిలా వరంగల్" లో కాకతీయ రాజులు నిర్మించిన "శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం" లో గర్భాలయానికి బయట ఉంది..!!
ఈ ఆలయం చిన్నదే. శిల్పసంపద మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది.

క్రీ .శ  1162  లో రెండవ ప్రోల రాజు ,హనుమకొండను రాజధానిగా చేసుకొని  రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి .అప్పుడు దేశం సుభిక్షంగా ఉంది .పచ్చని పైరుపంటలతోకళకళలాడుతూ ఉంది.ఒకానొక రోజు   రైతులు పంటను కోసి బండ్లపైకి  ఎత్తించి ,ఇంటికి తిసుకువస్తుండగా  ఒక బండి చక్రం భూమి లోపలికి కూరుకుపోయింది. రైతులంతా చాల ప్రయత్నించారు కానీ లాభం లేకపోగా ఊరులోని వారు కూడా వచ్చి సాయం చేయగా చివరికి ఆ చక్రాన్ని పికి తీసారు.భూమినుండి బయటికి వచ్చిన ఆ చక్రం బంగారు కాంతులతో మెరుస్తూ వచ్చింది. దానితో ఆ రైతుల మనసులు మురిసిపొయ్యాయి.ఆ తర్వాత అసలెందుకు అల అయ్యిందో ఎవరికీ ఎంత ఆలోచించినా అర్థంకాక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు .

కొన్ని రోజులకి అందరు అనుకోవడంవల్ల ఆ విషయం  రాజుకి తెలిసింది .దాంతో ఆ రాజు ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించాడు. ఆ ప్రాంతం అంతా బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉండటంతో ,ఆ రాజు నమస్కారం చేసి పంచాక్షరి మంత్రమయిన “ఓం నమ:శివాయ” అని పదే పదే జపించాడు.దాంతో ఆ ప్రాంతంలో స్వయంభూలింగం దర్శనమిచ్చింది .దాంతో ఆ రాజు ఆ లింగాన్ని తనరాజదానిలో ప్రతిష్టించాలని తలంచి ,శివలింగాన్ని తీయించబోయి విపలమయ్యాడు.

అప్పుడు ఆ ప్రోలరాజు గురువర్యులైన  శ్రీ పాదులను ప్రశ్నించాడు .దానితో వారు దివ్య దృష్టితో దర్శించి ,ఆ స్వయంభూ లింగం ఇనుమును కూడా బంగారం చేయగల గొప్ప మహిమలు కలదని తెలియచేసి ,అచ్చటనే దేవాలయ నిర్మాణం చేయమని ఆదేశించారు .అంతటితో ఆ రాజు అచ్చటనే దేవాలయాన్ని నిర్మించి ,చుట్టూ ఏడుకోటలు కట్టించి ఒక పెద్ద నగరాన్ని నెలకొల్పాడు .అదే కాకతీయుల రాజధాని అయిన  అప్పటి ఓరుగల్లు యిప్పటి వరంగల్.ఈ ఆలయంలో మహిషాసురమర్తిని సహిత శంభులింగేశ్వర స్వామి కొలువైవున్నాడు.

!!సర్వం శివమయం జగత్ !!

!!సర్వం శివమయం జగత్ !!
దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!

తాత్పర్యం
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

ఆట కదరా శివ ఆట కద కేశవ!!

ఆట కదరా శివ
        ఆట కద కేశవ!!

       శివయ్యా  ఈ శరీరం నీది
       శివయ్యా  ఈ ప్రాణాలు నీవి
       శివయ్యా  ఈ మనస్సు నీది
   శివయ్యా ఈ మనస్సును ఆఙ్ఞాపించే బుద్ధి
          కూడ    నీదేనయ్యో !!
      శివా ఇవన్ని నీవైనప్పుడు నా శరీరం
        నా ప్రాణ నామనోబుద్ధులనే
          ఈ నేను ఏవర్నయ్యా???????
   ను చెప్పకుంటే  నీ అంశారూపమైన        మాగురు చెప్పిండులే!!! ఏం చెప్పిండు ర నీకు అంటావ! ఆ నేను, నాది అనేవాడు కూడ నీవేనని చెప్పిండు. నువ్వేమో మాకు నేను(అహం) నాది(మమం)   అనే రెండు కళ్ళను ఇచ్చి ఆ మూడో కన్నుకు(ఙ్ఞానం) నువ్వు కానరానీకుండ బూడిదను పూసి మాచేతనే మమ్మల్ని     ఆటాడిస్తూ  తమాషా చూస్తుంటావంటగా!!!    భగీ:-18/61

 ఓ శివయ్యో..
             ఆడించిన ఇక బస్ ఇక మేము ఆడలేమ్ ఏంతో మంది పద్మాష్ గాళ్ళకి కూడ యెన్నెన్నో వరాలిస్తావని విన్న. ఎన్నెన్నో జన్మజన్మలనుండి నాకు ఈ మన్మధుడి బేజారు ఎక్కువైంది జర నీ మూడో కన్ను ఇటిస్తే ఈ పద్మాష్ మన్మధున్ని శుభ్భరంగ భస్మం(కర్మలు మాఫి) చేసి వాడి బూడిద పూస్కోని(నిర్గుణుడినై) అంగరంగ వైభవంగ నీ   కైలాసమొచ్చి నీ కాళ్మొకుతా!!!
     
భగీ:- 18/66 -సర్వధర్మాన్పరితజ్య మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వ పాపేభ్యో మొక్షయిష్యామి మాశుచః ||

నేను అంటే అపద్ధం నువ్వు అంటే అఙ్ఞానం


  జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.