విష్ణు కథ - 3
సూతుడు మునులకు నారదుడి గురించి చెప్పసాగాడు: ముందు జన్మలో నారదుడు ఒక దాసికి కొడుకై జన్మించాడు. ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంటిపని చేస్తుండేది. ఆ ఇంట సదా మునులు, జ్ఞానులు అతిథిసత్కారాలను పొందుతూండేవారు. పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్ళు అందిస్తూ, సపర్యలు చేస్తూ, వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విష…ూలను, విష్ణుమహిమలను శ్రద్ధగా ఆలకిస్తూండేవాడు.
నీరు ఇచ్చేవాడని వారు పసివాడికి నారదుడు అని పేరు పెట్టి, ఎంతో ఆప్యా…ుంగా ‘‘నారదా!'' అని పిలుస్తూండేవారు. అంతలో అతని తల్లి పాముకాటుతో మరణించింది. పసివాడికి తండ్రి ఎవరో, ఏమైనాడో తెలియదు. తోటిపిల్లలు నారదుణ్ణి దాసిదాని కొడుకనీ, దిక్కుమాలినవాడనీ అంటూండేవారు. కొద్ది రోజులకే ఇంటి …యజమాని భాగవతోత్తముడు కూడా గతించాడు.
నారదుడు నిరాశ్రుయుడై తిరుగుతూ, ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతణ్ణి దొంగను చూసినట్టు చూసి తరిమేవారు. తండ్రి ఎవరో తెలీని పాపిష్టివాడని హీనంగా తిటే్టవారు. నారదుడు పరమసాధువు అవడం చూసి దుడుకుపిల్లలు రాళ్ళు రువ్వీ, కొట్టీ, ఏడిపించి ఆనందిస్తూండేవారు. ‘‘నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను? నేనేం తప్పు చేశానని నన్నింత అన్యా…ుంగా చూస్తున్నారు? క్రిమి కీటకాలు, అడవులో మృగాలు హాయిగా బతుకుతున్నాయి!''
అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవిపట్టాడు. అతనికి మునులు, జ్ఞానులు చెప్పుకొనే విష…ూలు గుర్తుకొచ్చాయి. ‘‘నేనెందుకు తపస్సు చె…్యుకూడదు! గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి!'' అని అనుకుంటూ తపస్సు మొదలు పెట్టాడు నారదుడు. ‘‘దిక్కులేనివాడికి ఎవడు దిక్కో, ఈ లోకానికంతకూ ఎవడు తండ్రో అతడే నాకు అన్నీ! నన్ను అతడేంచేసినా సరే, అంతా అతని ఇష్టం!'' అంటూ కాలం గుర్తు లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు.
నారదుడి తపస్సు పరిపక్వమైంది. అతనిపై గొప్ప తేజస్సు పడి అతణ్ణి ఆవరించింది. జ్యోతిరూపంలో ప్రసన్నుడైన విష్ణువు, ‘‘వత్సా నారదా! నీవు నాలో కలిసిపోతున్నావు, నీవు బ్రహ్మ మానసపుత్రుడవై జన్మిస్తావు. నీలో నా అంశ వుంటుంది. చిరంజీవిగా త్రికాలవేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తుంటావు!'' అని చెప్పాడు. నారదుడు విష్ణు అంశతో బ్రహ్మకు కుమారుడై, దేవమునిగా పూజింపబడ్డాడు. విష్ణువు యెక్క లీలావతారాల్లో నారదుని అవతారం ఒకటిగా చెప్పబడింది.
అటువంటి నారదుడి వల్ల ఉపదేశం పొంది ధ్రువుడు చరచరా వెళ్తూంటే, ‘‘అన్నా, ఆగు! అడవికి వెళ్ళొద్దు!'' అంటూ పరుగు పరుగున ఉత్తముడు ఏడుస్తూ వచ్చి ధ్రువుడికి అడ్డంగా చేతులు సాచి నిల్చుని, ‘‘నువ్వు, అడవికి పోతే నే నెవరితో కలిసి హరిభజన చేసేది? ఆడించడానికి నీలాంటి అన్న…య్య ఎక్కడ దొరుకుతాడు? మా అమ్మ, నిన్ను అన్ని మాటలన్నదని, నా మీద నీకెందుకు కోపం? వెళ్ళకు, రా!''
అంటూ వలవలా ఏడ్చాడు. ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగలించుకొని, ‘‘తమ్ముడూ! నన్ను కన్నందుకు మా అమ్మ కూడా గొప్పది అనిపించుకోవద్దా? అందుకే వెళ్తున్నాను!'' అన్నాడు. ఉత్తముడు, ‘‘అయితే, నేనూ నీతో అడవికి వస్తాను, నువ్వు తపస్సులో ఉంటే నేను పళ్ళు అవీ తెస్తుంటాను!'' అన్నాడు. ధ్రువుడు, ‘‘అలా అయితే, మీ అమ్మ ఏడుస్తుంది, తమ్ముడూ!
నేను అన్నను, నా మాట వినాలి, వెళ్ళు!'' అన్నాడు ఆప్యా…ుంగా. ఆ మాటతో ఉత్తముడు అలాగే చతికిలబడి ఏడుస్తూంటే సురుచి వచ్చి బుజ్జగించబోతే, ‘‘అమ్మా! నన్ను ముట్టుకోకు. నీ మూలాన్నే అన్న…్యు వెళ్ళిపోతున్నాడు!'' అన్నాడు.
సురుచి లజ్జతో తలవంచుకొని, ‘‘నేను పాషిష్ఠిదాన్ని, అంతా నా మూలానే జరిగింది!'' అని అంటూంటే ఉత్తానపాదుడు, ‘‘ధ్రువా! ధ్రువా! ఆగు, నా…ునా! ఇదంతా నా మందబుద్ధివల్లనే జరిగింది. నా సింహాసనం నీది! రా నా…ునా!'' అంటూ ఎలుగెత్తి పిలుస్తూ అక్కడికి వచ్చాడు. అప్పటికే ధ్రువుడు చాలా దూరం వెళ్ళి పో…యాడు. నారదుడు సునీతితో, ‘‘అమ్మా! నీవు రత్నగర్భవు! నీ కుమారుడి గురించి విచారించకు, నారాయుణుడే అతనికి రక్ష!'' అని చెప్పి ఉత్తానపాదుడితో, ‘‘రాజా!
ఇది మనం అందరమూ సంతోషించవలసిన సమయుం, నీకు తండ్రీ, ధ్రువునికి తాతా అయిన స్వా…యుంభువ మనువు వంశానికి ధ్రువుడు ఎనలేని కీర్తితెస్తాడు. ఇందులో ఎవరు చేసిందీ ఏమీ లేదు, అంతా సర్వరక్షకుడైన ఆ నారా…యణుని సంకల్పమే!'' అని చెప్పి అందరినీ ఊరడించి శాంతపర్చాడు. ధ్రువుడు మధువనంలో ఓం నమో నారా…యణ అని తపస్సు చేస్తూంటే …యమునానది జల జల పారుతూ శృతి కలుపుతూన్నది. క్రూరమృగాలు అతని చుట్టూ ఆప్తమిత్రుల్లా తిరుగుతున్నాయి.
అతని తపస్సుకు ముల్లోకాలు గజగజలాడాయి. ఎవరెక్కడ తపస్సు చేస్తున్నా ఇంద్ర పదవి కోరతారనుకుని భయపడే ఇంద్రుడు ధ్రువుడి తపోభంగానికి భీతికలిగించే ఇంద్రజాలం చాలా చేశాడు. వజ్రాయుధం ఝళిపించి ఉరుములు, మెరుపులు, పిడుగులు రాల్చి బీభత్సం చేశాడు. ధ్రువుడు దేనికీ చలించలేదు. ఇంద్రుడు రాళ్ళ వర్షం కురిపించాడు. విష్ణుచక్రం ధ్రువుడిపై తిరుగుతూ అన్నిటినీ తూలగొట్టింది.
అప్పుడు నారదుడు ఇంద్రుడితో, ‘‘ధ్రువుడు సామాన్య బాలుడని అనుకున్నావు, అతణ్ణి నువ్వేమీ చే…ులేవు. అనవసరంగా బెంగపడకు, ఇంద్రపదవి అతనికి గడ్డిపరక లాంటిది, తెలుసా!'' అని బుద్ధిచెప్పాడు.
ధ్రువుని తపస్సుకు మెచ్చుకొని విష్ణువు ప్రత్యక్ష మ…్యూడు. ధ్రువుడు విష్ణువు కాళ్ళుచుట్టేసి విష్ణువు ముఖాన్ని తదేకంగా చూస్తూ పట్టరాని ఆనందం వల్ల నోటమాట రాకుండా వుండిపో…యాడు.
‘‘నిన్ను నోరారా స్తుతించాలని వుంది, నేను బాలుడను, స్తోత్రపాఠాలు తెలి…యవు,'' అని మనస్సులో అనుకుంటూ ఆనందబాష్పాలు రాలుస్తున్నాడు. విష్ణువు తన శంఖాన్ని ధ్రువుడి చెక్కిళ్ళకు తాకించాడు. వెనువెంటనే వేదవేదాం తాలసారం నిండిన గొప్ప స్తోత్రాన్ని అమిత భక్తితో ఏకధారగా సామగానం చేశాడు ధ్రువుడు.
విష్ణువు మందహాసం చేస్తూ, ‘‘ధ్రువా, ఏం కావాలో చెప్పు!'' అన్నాడు. ధ్రువుడు, ‘‘ఓ పరమపురుషా! తుమ్మెద పద్మాన్ని అంటి పెట్టుకొని వుండేలాగా సదా నీ మధుర మందహాసవదనపద్మాన్ని చూస్తూ వుండాలనే తప్ప నాకు, మరే కోరికా లేదు!'' అన్నాడు. ‘‘అలాగే వుందువుగానిలే! నీరాజ్యానికి వెళ్ళి రాజ్యంచేసి ధర్మపాలన నిర్వర్తించు. పిమ్మట నువ్వు నా రూపమైన విశ్వానికి శిరోభాగంగా వుండే ధ్రువపదాన్ని చేరుతావు. కల్పాంతరాలు గతిస్తూన్నా చెక్కు చెదరని అచలపదాన్ని అలంకరించి వెలుగుతూంటావు!''
అని చెప్పి అంతర్థాన మ…్యూడు విష్ణువు. ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణు అవతరణం ధ్రువనారా…ుణావతారం అని చెప్పబడింది. ధ్రువుడు మాహిష్మతీపురానికివచ్చాడు. ఉత్తానపాదుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపో…యాడు. ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తూన్నాడు. ఉత్తముడు ఇంకా వివాహితుడు కాలేదు. రాజధర్మం అనుసరించి ప్రజలకు వన్యమృగబాధ లేకుండా చే…ుడానికి వేటకు వెళ్ళాడు.
హిమాల…ు పర్వత అరణ్యంలో దుష్ట స్వభావులైన.. విరుచుకుపడి అతణ్ణి చంపారు. సురుచి పుత్రశోకంతో అక్కడకు వెళ్ళి అరణ్యంలో రగుల్కొన్న కార్చిచ్చులో కాలిపోయింది. ధ్రువుడు …యక్ష నిర్మూలనం చేయడానికి …యక్షనగరమైన అలకానగరాన్ని ముట్టడించాడు. మా…యల మారులైన... క్షుక్షుద్రమైన మా…ూజాలాన్ని ప్రెూగించారు. ధ్రువుడు నారా…ుణాస్ర్తంతో మా…యల్ని పటాపంచలు చేసి విజృంభించాడు.
కుబేరుడు శరణాగతుడై ధ్రువుణ్ణి మంచి చేసుకుని భ…ుభక్తులతో అనేక సంపదలిచ్చి పంపాడు. ధ్రువుడు పలువురు కుమారులను కన్నాడు. ఆదర్శ రాజ్యపాలనచేసి స్వాయుంభువ మనువంశానికి కీర్తి తెచ్చాడు. చిరకాలం రాజ్యం చేసి కుమారుడికి పట్టం కట్టి ధ్రువుడు బదరికావనానికి వెళ్ళాడు. విష్ణువును ధ్యానిస్తూ కొన్నాళ్ళకు బంగారు శరీరాన్ని పొందాడు.
విష్ణు ఆదేశంతో విష్ణుభటులు విమానం తెచ్చారు. వారు నాలుగు చేతులతో విష్ణువులాగే ఉన్నారు. ధ్రువుడు వారితో, ‘‘మా అమ్మకు లేని ఉన్నతపథం నాకు అవసరంలేదు!'' అన్నాడు. విష్ణు దూతలు ముందుగా ఒక దివ్య విమానంలో ధ్రువమండలానికి వెళ్తూన్న సునీతిని చూపించారు. అప్పుడు ధ్రువుడు సంతోషించి విమానం ఎక్కి గ్రహమండలాల్నీ నక్షత్ర మండలాల్నీ సప్తర్షి మండలాన్నీ దాటి ధ్రువపదానికి చేరాడు.
ధ్రువపదాన్నే విష్ణుపదము అనీ, ధ్రువక్షతి అనీ అంటారు. విష్ణువు నివాసమైన వైకుంఠము అక్కడే ఉంటుంది. ధ్రువక్షతిలోనే గోలోకము ఉంటుంది. గోలోకములో విష్ణువు రెండు చేతులతో కృష్ణుడుగా ప్రకృతి స్వరూపిణిెున రాధాదేవితో కలిసి వేణువును ఊదుతూ ఆనందిస్తూ ఉంటాడు. గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది. ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడై వెలుగుతూ ఉంటాడు.
ధ్రువుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశించాడు. గుంజకు కట్టిన ఆవులాగ సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షణం చేస్తూంటే, సమస్త నక్షత్ర గ్రహ గణాలతో నిండిన శింశు మార చక్రం అతని క్రిందుగా తిరుగుతూంటుంది.
గోలోకానికి దిగువ బ్రహ్మ ఉండే సత్యలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్లోకము, భువర్లోకము, భూలోకము అనే ఊర్థ్వలోకాలు ఏడూ; భూలోకానికి దిగువ అథోలోకాలనబడే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు ఏడూ కలిసి పధ్నాలుగు లోకాలకు మీదుగా విశ్వశిఖరాగ్రంపై ధ్రువుడు దిక్కులకు దిక్కుగా అచలపద నక్షత్రంగా ప్రకాశిస్తున్నాడు.
దీక్ష ఉండాలేగాని, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎంతటిదైనా సాధించలేనిదంటూ ఉండదు. అందుకు ఐదేండ్ల ప్రాయుంలోనే తపస్సుకు వెళ్ళిన బాలధ్రువుడే చక్కని తార్కాణం! అని సూతుడు ధ్రువచరిత్ర ముగించి తిరిగి చెప్పడం ప్రారంభించాడు: మత్స్యం కేవలం జలచరమైతే తాబేలు నీటిలోనూ, భూమిపైనా చరిస్తుంది. నీటిలో నుండి ప్రాణి నేల మీదకు వచ్చింది; అంటే జలచరదశనుంచి భూచరదశకు పరిణామం జరిగిందన్న మాట. అలాంటి తాబేలుగా విష్ణువు అవతరించాడు.
అదే దశావతారాల్లో రెండవదైన కూర్మావతారం! అంటూ సూతుడు మునులకు అద్భుతమైన కూర్మావతారగాథ చెప్పడం ప్రారంభించాడు: దేవతలు, రాక్షసులు కలిసి క్షరసాగరాన్ని మధించి, అమృతాన్ని సాధించటానికి త…ూర…్యూరు. అమృతం సిద్ధించనీ, అది అంతా మనదే అవుతుంది! అని భుజబలంతోనూ, సంఖ్యలోనూ అధికులైన రాక్షసులు ఎత్తుగడ వేసుకున్నారు. రాక్షసులకూ అమృతంతో అమరత్వంసిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది?
అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు. పాలసముద్రంలో మందరపర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి,చిలకటానికి నిర్ణ…ుం జరిగింది. కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికీ శక్యం కాని పని! విష్ణువు అనుగ్రహించి, ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు. రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి, చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. క్షరసాగర మథనం ప్రారంభమైంది.
సూతుడు మునులకు నారదుడి గురించి చెప్పసాగాడు: ముందు జన్మలో నారదుడు ఒక దాసికి కొడుకై జన్మించాడు. ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంటిపని చేస్తుండేది. ఆ ఇంట సదా మునులు, జ్ఞానులు అతిథిసత్కారాలను పొందుతూండేవారు. పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్ళు అందిస్తూ, సపర్యలు చేస్తూ, వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విష…ూలను, విష్ణుమహిమలను శ్రద్ధగా ఆలకిస్తూండేవాడు.
నీరు ఇచ్చేవాడని వారు పసివాడికి నారదుడు అని పేరు పెట్టి, ఎంతో ఆప్యా…ుంగా ‘‘నారదా!'' అని పిలుస్తూండేవారు. అంతలో అతని తల్లి పాముకాటుతో మరణించింది. పసివాడికి తండ్రి ఎవరో, ఏమైనాడో తెలియదు. తోటిపిల్లలు నారదుణ్ణి దాసిదాని కొడుకనీ, దిక్కుమాలినవాడనీ అంటూండేవారు. కొద్ది రోజులకే ఇంటి …యజమాని భాగవతోత్తముడు కూడా గతించాడు.
నారదుడు నిరాశ్రుయుడై తిరుగుతూ, ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతణ్ణి దొంగను చూసినట్టు చూసి తరిమేవారు. తండ్రి ఎవరో తెలీని పాపిష్టివాడని హీనంగా తిటే్టవారు. నారదుడు పరమసాధువు అవడం చూసి దుడుకుపిల్లలు రాళ్ళు రువ్వీ, కొట్టీ, ఏడిపించి ఆనందిస్తూండేవారు. ‘‘నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను? నేనేం తప్పు చేశానని నన్నింత అన్యా…ుంగా చూస్తున్నారు? క్రిమి కీటకాలు, అడవులో మృగాలు హాయిగా బతుకుతున్నాయి!''
అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవిపట్టాడు. అతనికి మునులు, జ్ఞానులు చెప్పుకొనే విష…ూలు గుర్తుకొచ్చాయి. ‘‘నేనెందుకు తపస్సు చె…్యుకూడదు! గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి!'' అని అనుకుంటూ తపస్సు మొదలు పెట్టాడు నారదుడు. ‘‘దిక్కులేనివాడికి ఎవడు దిక్కో, ఈ లోకానికంతకూ ఎవడు తండ్రో అతడే నాకు అన్నీ! నన్ను అతడేంచేసినా సరే, అంతా అతని ఇష్టం!'' అంటూ కాలం గుర్తు లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు.
నారదుడి తపస్సు పరిపక్వమైంది. అతనిపై గొప్ప తేజస్సు పడి అతణ్ణి ఆవరించింది. జ్యోతిరూపంలో ప్రసన్నుడైన విష్ణువు, ‘‘వత్సా నారదా! నీవు నాలో కలిసిపోతున్నావు, నీవు బ్రహ్మ మానసపుత్రుడవై జన్మిస్తావు. నీలో నా అంశ వుంటుంది. చిరంజీవిగా త్రికాలవేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తుంటావు!'' అని చెప్పాడు. నారదుడు విష్ణు అంశతో బ్రహ్మకు కుమారుడై, దేవమునిగా పూజింపబడ్డాడు. విష్ణువు యెక్క లీలావతారాల్లో నారదుని అవతారం ఒకటిగా చెప్పబడింది.
అటువంటి నారదుడి వల్ల ఉపదేశం పొంది ధ్రువుడు చరచరా వెళ్తూంటే, ‘‘అన్నా, ఆగు! అడవికి వెళ్ళొద్దు!'' అంటూ పరుగు పరుగున ఉత్తముడు ఏడుస్తూ వచ్చి ధ్రువుడికి అడ్డంగా చేతులు సాచి నిల్చుని, ‘‘నువ్వు, అడవికి పోతే నే నెవరితో కలిసి హరిభజన చేసేది? ఆడించడానికి నీలాంటి అన్న…య్య ఎక్కడ దొరుకుతాడు? మా అమ్మ, నిన్ను అన్ని మాటలన్నదని, నా మీద నీకెందుకు కోపం? వెళ్ళకు, రా!''
అంటూ వలవలా ఏడ్చాడు. ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగలించుకొని, ‘‘తమ్ముడూ! నన్ను కన్నందుకు మా అమ్మ కూడా గొప్పది అనిపించుకోవద్దా? అందుకే వెళ్తున్నాను!'' అన్నాడు. ఉత్తముడు, ‘‘అయితే, నేనూ నీతో అడవికి వస్తాను, నువ్వు తపస్సులో ఉంటే నేను పళ్ళు అవీ తెస్తుంటాను!'' అన్నాడు. ధ్రువుడు, ‘‘అలా అయితే, మీ అమ్మ ఏడుస్తుంది, తమ్ముడూ!
నేను అన్నను, నా మాట వినాలి, వెళ్ళు!'' అన్నాడు ఆప్యా…ుంగా. ఆ మాటతో ఉత్తముడు అలాగే చతికిలబడి ఏడుస్తూంటే సురుచి వచ్చి బుజ్జగించబోతే, ‘‘అమ్మా! నన్ను ముట్టుకోకు. నీ మూలాన్నే అన్న…్యు వెళ్ళిపోతున్నాడు!'' అన్నాడు.
సురుచి లజ్జతో తలవంచుకొని, ‘‘నేను పాషిష్ఠిదాన్ని, అంతా నా మూలానే జరిగింది!'' అని అంటూంటే ఉత్తానపాదుడు, ‘‘ధ్రువా! ధ్రువా! ఆగు, నా…ునా! ఇదంతా నా మందబుద్ధివల్లనే జరిగింది. నా సింహాసనం నీది! రా నా…ునా!'' అంటూ ఎలుగెత్తి పిలుస్తూ అక్కడికి వచ్చాడు. అప్పటికే ధ్రువుడు చాలా దూరం వెళ్ళి పో…యాడు. నారదుడు సునీతితో, ‘‘అమ్మా! నీవు రత్నగర్భవు! నీ కుమారుడి గురించి విచారించకు, నారాయుణుడే అతనికి రక్ష!'' అని చెప్పి ఉత్తానపాదుడితో, ‘‘రాజా!
ఇది మనం అందరమూ సంతోషించవలసిన సమయుం, నీకు తండ్రీ, ధ్రువునికి తాతా అయిన స్వా…యుంభువ మనువు వంశానికి ధ్రువుడు ఎనలేని కీర్తితెస్తాడు. ఇందులో ఎవరు చేసిందీ ఏమీ లేదు, అంతా సర్వరక్షకుడైన ఆ నారా…యణుని సంకల్పమే!'' అని చెప్పి అందరినీ ఊరడించి శాంతపర్చాడు. ధ్రువుడు మధువనంలో ఓం నమో నారా…యణ అని తపస్సు చేస్తూంటే …యమునానది జల జల పారుతూ శృతి కలుపుతూన్నది. క్రూరమృగాలు అతని చుట్టూ ఆప్తమిత్రుల్లా తిరుగుతున్నాయి.
అతని తపస్సుకు ముల్లోకాలు గజగజలాడాయి. ఎవరెక్కడ తపస్సు చేస్తున్నా ఇంద్ర పదవి కోరతారనుకుని భయపడే ఇంద్రుడు ధ్రువుడి తపోభంగానికి భీతికలిగించే ఇంద్రజాలం చాలా చేశాడు. వజ్రాయుధం ఝళిపించి ఉరుములు, మెరుపులు, పిడుగులు రాల్చి బీభత్సం చేశాడు. ధ్రువుడు దేనికీ చలించలేదు. ఇంద్రుడు రాళ్ళ వర్షం కురిపించాడు. విష్ణుచక్రం ధ్రువుడిపై తిరుగుతూ అన్నిటినీ తూలగొట్టింది.
అప్పుడు నారదుడు ఇంద్రుడితో, ‘‘ధ్రువుడు సామాన్య బాలుడని అనుకున్నావు, అతణ్ణి నువ్వేమీ చే…ులేవు. అనవసరంగా బెంగపడకు, ఇంద్రపదవి అతనికి గడ్డిపరక లాంటిది, తెలుసా!'' అని బుద్ధిచెప్పాడు.
ధ్రువుని తపస్సుకు మెచ్చుకొని విష్ణువు ప్రత్యక్ష మ…్యూడు. ధ్రువుడు విష్ణువు కాళ్ళుచుట్టేసి విష్ణువు ముఖాన్ని తదేకంగా చూస్తూ పట్టరాని ఆనందం వల్ల నోటమాట రాకుండా వుండిపో…యాడు.
‘‘నిన్ను నోరారా స్తుతించాలని వుంది, నేను బాలుడను, స్తోత్రపాఠాలు తెలి…యవు,'' అని మనస్సులో అనుకుంటూ ఆనందబాష్పాలు రాలుస్తున్నాడు. విష్ణువు తన శంఖాన్ని ధ్రువుడి చెక్కిళ్ళకు తాకించాడు. వెనువెంటనే వేదవేదాం తాలసారం నిండిన గొప్ప స్తోత్రాన్ని అమిత భక్తితో ఏకధారగా సామగానం చేశాడు ధ్రువుడు.
విష్ణువు మందహాసం చేస్తూ, ‘‘ధ్రువా, ఏం కావాలో చెప్పు!'' అన్నాడు. ధ్రువుడు, ‘‘ఓ పరమపురుషా! తుమ్మెద పద్మాన్ని అంటి పెట్టుకొని వుండేలాగా సదా నీ మధుర మందహాసవదనపద్మాన్ని చూస్తూ వుండాలనే తప్ప నాకు, మరే కోరికా లేదు!'' అన్నాడు. ‘‘అలాగే వుందువుగానిలే! నీరాజ్యానికి వెళ్ళి రాజ్యంచేసి ధర్మపాలన నిర్వర్తించు. పిమ్మట నువ్వు నా రూపమైన విశ్వానికి శిరోభాగంగా వుండే ధ్రువపదాన్ని చేరుతావు. కల్పాంతరాలు గతిస్తూన్నా చెక్కు చెదరని అచలపదాన్ని అలంకరించి వెలుగుతూంటావు!''
అని చెప్పి అంతర్థాన మ…్యూడు విష్ణువు. ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణు అవతరణం ధ్రువనారా…ుణావతారం అని చెప్పబడింది. ధ్రువుడు మాహిష్మతీపురానికివచ్చాడు. ఉత్తానపాదుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపో…యాడు. ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తూన్నాడు. ఉత్తముడు ఇంకా వివాహితుడు కాలేదు. రాజధర్మం అనుసరించి ప్రజలకు వన్యమృగబాధ లేకుండా చే…ుడానికి వేటకు వెళ్ళాడు.
హిమాల…ు పర్వత అరణ్యంలో దుష్ట స్వభావులైన.. విరుచుకుపడి అతణ్ణి చంపారు. సురుచి పుత్రశోకంతో అక్కడకు వెళ్ళి అరణ్యంలో రగుల్కొన్న కార్చిచ్చులో కాలిపోయింది. ధ్రువుడు …యక్ష నిర్మూలనం చేయడానికి …యక్షనగరమైన అలకానగరాన్ని ముట్టడించాడు. మా…యల మారులైన... క్షుక్షుద్రమైన మా…ూజాలాన్ని ప్రెూగించారు. ధ్రువుడు నారా…ుణాస్ర్తంతో మా…యల్ని పటాపంచలు చేసి విజృంభించాడు.
కుబేరుడు శరణాగతుడై ధ్రువుణ్ణి మంచి చేసుకుని భ…ుభక్తులతో అనేక సంపదలిచ్చి పంపాడు. ధ్రువుడు పలువురు కుమారులను కన్నాడు. ఆదర్శ రాజ్యపాలనచేసి స్వాయుంభువ మనువంశానికి కీర్తి తెచ్చాడు. చిరకాలం రాజ్యం చేసి కుమారుడికి పట్టం కట్టి ధ్రువుడు బదరికావనానికి వెళ్ళాడు. విష్ణువును ధ్యానిస్తూ కొన్నాళ్ళకు బంగారు శరీరాన్ని పొందాడు.
విష్ణు ఆదేశంతో విష్ణుభటులు విమానం తెచ్చారు. వారు నాలుగు చేతులతో విష్ణువులాగే ఉన్నారు. ధ్రువుడు వారితో, ‘‘మా అమ్మకు లేని ఉన్నతపథం నాకు అవసరంలేదు!'' అన్నాడు. విష్ణు దూతలు ముందుగా ఒక దివ్య విమానంలో ధ్రువమండలానికి వెళ్తూన్న సునీతిని చూపించారు. అప్పుడు ధ్రువుడు సంతోషించి విమానం ఎక్కి గ్రహమండలాల్నీ నక్షత్ర మండలాల్నీ సప్తర్షి మండలాన్నీ దాటి ధ్రువపదానికి చేరాడు.
ధ్రువపదాన్నే విష్ణుపదము అనీ, ధ్రువక్షతి అనీ అంటారు. విష్ణువు నివాసమైన వైకుంఠము అక్కడే ఉంటుంది. ధ్రువక్షతిలోనే గోలోకము ఉంటుంది. గోలోకములో విష్ణువు రెండు చేతులతో కృష్ణుడుగా ప్రకృతి స్వరూపిణిెున రాధాదేవితో కలిసి వేణువును ఊదుతూ ఆనందిస్తూ ఉంటాడు. గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది. ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడై వెలుగుతూ ఉంటాడు.
ధ్రువుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశించాడు. గుంజకు కట్టిన ఆవులాగ సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షణం చేస్తూంటే, సమస్త నక్షత్ర గ్రహ గణాలతో నిండిన శింశు మార చక్రం అతని క్రిందుగా తిరుగుతూంటుంది.
గోలోకానికి దిగువ బ్రహ్మ ఉండే సత్యలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్లోకము, భువర్లోకము, భూలోకము అనే ఊర్థ్వలోకాలు ఏడూ; భూలోకానికి దిగువ అథోలోకాలనబడే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు ఏడూ కలిసి పధ్నాలుగు లోకాలకు మీదుగా విశ్వశిఖరాగ్రంపై ధ్రువుడు దిక్కులకు దిక్కుగా అచలపద నక్షత్రంగా ప్రకాశిస్తున్నాడు.
దీక్ష ఉండాలేగాని, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎంతటిదైనా సాధించలేనిదంటూ ఉండదు. అందుకు ఐదేండ్ల ప్రాయుంలోనే తపస్సుకు వెళ్ళిన బాలధ్రువుడే చక్కని తార్కాణం! అని సూతుడు ధ్రువచరిత్ర ముగించి తిరిగి చెప్పడం ప్రారంభించాడు: మత్స్యం కేవలం జలచరమైతే తాబేలు నీటిలోనూ, భూమిపైనా చరిస్తుంది. నీటిలో నుండి ప్రాణి నేల మీదకు వచ్చింది; అంటే జలచరదశనుంచి భూచరదశకు పరిణామం జరిగిందన్న మాట. అలాంటి తాబేలుగా విష్ణువు అవతరించాడు.
అదే దశావతారాల్లో రెండవదైన కూర్మావతారం! అంటూ సూతుడు మునులకు అద్భుతమైన కూర్మావతారగాథ చెప్పడం ప్రారంభించాడు: దేవతలు, రాక్షసులు కలిసి క్షరసాగరాన్ని మధించి, అమృతాన్ని సాధించటానికి త…ూర…్యూరు. అమృతం సిద్ధించనీ, అది అంతా మనదే అవుతుంది! అని భుజబలంతోనూ, సంఖ్యలోనూ అధికులైన రాక్షసులు ఎత్తుగడ వేసుకున్నారు. రాక్షసులకూ అమృతంతో అమరత్వంసిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది?
అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు. పాలసముద్రంలో మందరపర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి,చిలకటానికి నిర్ణ…ుం జరిగింది. కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికీ శక్యం కాని పని! విష్ణువు అనుగ్రహించి, ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు. రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి, చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. క్షరసాగర మథనం ప్రారంభమైంది.
No comments:
Post a Comment