సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, August 24, 2016

కృష్ణాష్టమి పూజా విధానం!! పాఠించాల్సిన మంత్రాలు!!

అందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!
కృష్ణాష్టమి పూజా విధానం!! పాఠించాల్సిన మంత్రాలు!!
శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. ఆగస్టు 25న శ్రీకృష్ణామి. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు.

చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మల, శ్రీ కృష్ణుడి  చిత్రపటం  లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి.

ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.

కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.

కృష్ణాష్టమి రోజున బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేక బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేగాక ఈ పుణ్యదినాన భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.

చివరగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధం గా "నీ కర్తవ్యాన్ని నీవు చిత్త శుద్ధి తో నిర్వహించు పలితాన్ని నాకు వదిలేయి"..ఆనే మాటను ఆచరణ లో పెడితే మనమందరం సుఖంగా జీవించవచ్చు.

Sunday, August 14, 2016

కుక్కె సుబ్రమణ్య

కుక్కె సుబ్రమణ్య
జగన్మాత పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.
ప్రకృతి ఒడిలో...
పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కె గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగావెలిసినిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర
సుబ్రమణ్వస్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కె సుబ్రమణ్య ఒకటి కావడం విశేషం. శంకర భగవత్‌పాదులు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో కుక్కెలింగ అని ప్రస్తావించారు.
నాగులకు రక్షకుడు:
నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.
ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు..
ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి... తదితర పూజలను నిర్వహిస్తారు.
కుమారధారలో పవిత్రస్నానం..
శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.
ఎలా చేరుకోవచ్చు..
మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.మంగళూరు రైల్వేస్టేషన్‌ , బస్‌స్టాండ్‌ నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు సుబ్రమణ్య మీదుగా వెళుతాయి.

స్వామివారి "పెళ్లి పిలుపు"

స్వామివారి 'పెళ్లి పిలుపు!'
లోకకల్యాణ కారకుడే, తన కల్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్తూ... లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఆహా... అహోబిలం పరిసరాల్లోని ఆ ముప్ఫై అయిదు గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు!
పండగంటే ఒకరోజు, మహా అయితే మూడురోజులు. అహోబిలం పరిసరాల్లోని ముప్ఫై అయిదు గ్రామాల్లో మాత్రం... ఆ ఉత్సవాన్ని నలభై అయిదు రోజులు జరుపుకుంటారు. ఆ ఒకటిన్నర నెలా... ప్రతి ఇంట్లోనూ సందడే. ఆడపడుచులూ బంధుమిత్రులతో వూళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలూ గాజులూ చిరుతిళ్ల అంగళ్లే! కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువయ్యాడు. ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రమిది. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటు ఇదేనంటారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవర్లు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదుడు పారువేటోత్సవాలకు సిద్ధమవుతారు.

ఉత్సవ చరిత్ర
'పరి' అంటే గుర్రం. స్వామివారు క్రూరమృగాల్ని వేటాడేందుకు గుర్రంపై బయలుదేరడాన్నే పారువేట అంటారు. ప్రతీకాత్మకంగా... దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు. 'గ్రామ గ్రామానికీ నన్ను తీసుకెళ్లండి. నా పాదపద్మాల్ని ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి' అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్టు అహోబిల క్షేత్ర మహత్యంలో పేర్కొన్నారు. నా పెళ్లికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని కూడా అన్నారట. ఆరువందల సంవత్సరాల క్రితం, ప్రథమ పీఠాధిపతి శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వాముల వారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నాటి నుంచీ నేటి వరకూ పార్వేటోత్సవాలు 45 రోజుల పాటూ 35 గ్రామాల్లో నిర్విఘ్నంగా సాగుతాయి. ఆతర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడోత్సవంతో (మార్చి 17) వేడుకలు పూర్తవుతాయి.
స్థానిక ఐతిహ్యం...
హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి... వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకూ తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని అడిగారు. 'పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను' అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు.
పారువేటోత్సవాలు...
స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో 'తెలుపు'లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే 'తెలుపు.. ఎరుపు' రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకీ మోసే బాధ్యత కూడా వారసత్వమే. తరాల నుంచీ ఆ కుటుంబాలవారే మోస్తున్నారు. వీరిని బోయీలంటారు. రుద్రవరం మండలం ఆలుమూరు, టి.లింగందిన్నెలకు చెందిన సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పటి నుంచీ మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకూ..ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచీ వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకీని ఒక్కరోజైనా మోయాలని పోటీపడతారు.
దర్శన భాగ్యం ఇలా...
పారువేటోత్సవాల్లో భాగంగా స్వామి పల్లకి ఎగువ అహోబిలం నుంచి కిందికి దిగుతుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో ఉత్సవతంతు ముగుస్తుంది. ఆ 45 రోజులూ ప్రతి గ్రామంలోనూ పండుగే. స్వామి తమ వూరికి వచ్చాడంటే ప్రజలకు పట్టరాని ఆనందం. వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్లగడ్డలోనే వేయి దుకాణాలు వెలుస్తాయి. రోజూ కనీసం రూ.25 లక్షల వ్యాపారం జరుగుతుంది. వారంలో దాదాపు రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 'ఆరువందల ఏళ్లుగా... ఎలాంటి ఆటంకాలూ లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా స్వామి మహిమే' అంటారు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్‌. అహోబిలం.. నంద్యాల నుంచి అరవై కిలోమీటర్లూ, కర్నూలు నుంచి దాదాపు నూటనలభై కిలోమీటర్లు.

వేంకటేశ్వరస్వామి ఏ రూపం?

వేంకటేశ్వరస్వామి ఏ రూపం?
విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?
వేంకటేశ్వరస్వామి విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?
తిరుమలేశుని విగ్రహం ఆగమాలకు అందని రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభరణాలు, ఆలయగోపురంపై శక్తి వాహనమైన సింహం.. ఇలా విభిన్నదేవతా చిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం. ''ఇరుండరువురం ఒండ్రాయ్‌ ఇసైందు'' (ఇరుమూర్తులూ నీయందే ఉన్నాయి) అంటూ పెయ్‌ ఆళ్వార్‌ నోరారా కీర్తించాడు. ''స్కంధ విష్ణ్వాత్మికా శక్తిః వేంకటేశ ఇతీరతః'' అని స్కంధ పురాణం చెబుతోంది.అంటే శ్రీవారి మూర్తి స్కంధ, విష్ణు, శక్తి ఈ మూడు తత్వాలనూ కలిగి ఉన్నది. సప్తర్షులకూ ఏడురూపాల్లో సాక్షాత్కరించిన
సత్యస్వరూపుడు వేంకటేశ్వరుడు. ఇలా చాలానే ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ.. మనకున్న పద్దెనిమిది పురాణాలకుగాను 12 పురాణాల్లో శ్రీవారు విష్ణురూపమేనని చెబుతున్నాయి. కాబట్టి స్వామి నిస్సందేహంగా విష్ణురూపమే. అదీ సర్వదేవతా సమన్వయ స్వరూపం. అంటే ముక్కోటి దేవతలూ స్వామియందే ఉన్నారని అర్థం. ''హరి అవతారములే అఖిలదేవతలు'' అని అన్నమాచార్యులవారు చెప్పిందీ అదే కదా!

ఎంత గొప్పవాడండి రాముడు

ఎంత గొప్పవాడండి రాముడు

రావణాసుడు సీతాదేవిని తీసుకు వెల్లినపుడు సమస్త ప్రానలు చూశాయ్. కాని రాముడు అడిగినప్పుడు ఏ ఓక్క చెట్టు గాని ,అడవి గాని,ప్రాని గాని చెప్పలేదు .ఎందుకో తెలుసా చెప్తె రావణాసురుడు ఎక్కడ చంపేస్తాడో అని.
కోపం ఆపుకోలేక రాముడు లక్ష్మణుడితో నేను రామ బాణం వేస్తాను ఈ సమస్త ప్రాణులను , ఆకరికి దేవుళ్ళను  కూడ బంథీ చేస్తానని కోపంతో ఊగిపోతుంటాడు.తమ్ముని మాట విని ఆగిపోతడు.
" క్షణకాలం కోపంతో ఎంతో  గోప్ప పేరున్న రాముడు పాతాలానికి వెళ్ళేవాడు. ఆ కోపాన్ని జయంచటం వల్లే రాముడు దేవుడయ్యాడు."

రుద్రేశ్వరాలయం

రుద్రేశ్వరాలయం
పంచాక్షరీ మంత్రం మారుమోగినచోట శతాబ్దాలపాటూ శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. నరపతులూ గజపతులూ కొలిచిన శివలింగం శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. ఆ పరిస్థితుల్లో... కొండపాక ప్రజలు కొండంత చారిత్రక స్పృహతో వ్యవహరించారు. రుద్రేశ్వరాలయాన్ని పునర్నిర్మించుకున్నారు.
కతీయ నిర్మాణశైలి... అలనాటి శిల్పకళా ప్రతిభకు తార్కాణం! అందమైన స్తంభాలూ, అంతెత్తు ద్వారాలూ, గర్జించే సింహాలూ, పురాణ గాథలూ - ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. రాతితో మలచిన రమణీయ కావ్యాలవి! మెదక్‌జిల్లా కొండపాకలోని రుద్రేశ్వరాలయమూ ఆ శిల్పకళారీతికి ప్రతీకే. సుమారు 820 సంవత్సరాల నాటి ఈ క్షేత్రం అనేకానేక కారణాలతో శిథిలావస్థకు చేరుకుంది. తాతముత్తాతలు కథలుకథలుగా చెప్పిన ఓ మహాలయ వైభవం మట్టికొట్టుకుపోతుంటే కొండపాక గ్రామస్థులు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఆ వారసత్వ సంపదను కాపాడుకోవాలని తీర్మానించారు. వ్యయప్రయాసలకోర్చి పూర్వ రూపాన్ని తీసుకొచ్చారు.

తూర్పునకు అభిముఖంగా ఉన్న ఆలయంలోకి వెళ్లగానే...మధ్యలోని మంటపంలో శివలింగ స్వరూపంలో రుద్రేశ్వరుడు దర్శనమిస్తాడు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలోని ప్రాణవట్టం నమూనాలోనే ఇక్కడి ప్రాణవట్టం కూడా చతురస్రాకారంలో ఉంటుంది. జిల్లాలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడికి పేరు! ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో శివపంచాయతనంతోపాటూ కన్యకాపరమేశ్వరి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, మార్కండేయుడు, వీరభద్రుడు, త్రిమాతలు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కొలువై ఉన్నాయి.
సైనికులే నిర్మించారు!
ఆలయ చరిత్రనంతా ఇక్కడున్న శాసనాల్లో నిక్షిప్తం చేశారు. రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో...కాకతీయుల కొలువులో పనిచేసిన ముప్ఫైమంది సైనికులు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆ ప్రకారంగా, రుద్రేశ్వరాలయ నిర్మాణం క్రీ.శ 1194లో జరిగింది. ప్రాంగణంలోనే త్రికూటేశ్వర (సూర్య-శివ-అంబిక) ఆలయమూ ఉండేదట. గణపతిదేవుడు పాలిస్తున్న కాలంలో... డెబ్భై గ్రామాలపై అధికారమున్న ఆదిత్య అమాత్యుడు త్రికూటేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ గుడి పూర్తిగా శిథిలమైపోయింది. సమష్ఠి కృషితో...రుద్రేశ్వరాలయానికి వైభవాన్ని తీసుకొచ్చిన గ్రామస్థులు, త్రికూటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికీ నడుంబిగించారు.
కోరికలు తీర్చే దేవుడు!
ఆలయంచుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి, శివుడి ఎదురుగా ఉండే నందికేశ్వరుడి చెవిలో ఏ కోరిక కోరుకున్నా... జరిగి తీరుతుందని ప్రతీతి. కాబట్టే స్థానికులు, రుద్రేశ్వరుడిని కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. వందేళ్లక్రితం ఓసారి, ఈ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రుద్రేశ్వరుడికి గ్రామస్థులు సహస్ర ఘటాభిషేకం (వెయ్యి బిందెలతో గర్భాలయంలో నీళ్లు నింపడం) చేశారట. వెంటనే కుండపోత వర్షం కురిసి ... కరవు కనిపించకుండా పోయిందట! ఈ ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మించాలని మొదట సంకల్పించింది కొండపాక గ్రామానికి చెందిన మరుమాముల సీతారామశర్మ. సంకల్పించడమే కాదు, కొంత మొత్తాన్ని విరాళంగా కూడా ఇచ్చారు. దురదృష్టవశాత్తూ పనులు ప్రారంభించకుండానే ఆయన కన్నుమూశారు. తర్వాత ఓసారి... శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠాధిపతులు మాధవానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఆలయ చరిత్ర గురించి విన్నారు. గ్రామస్థుల్ని సమావేశపరచి, పునః ప్రతిష్ఠాపనకు ప్రేరణ కలిగించారు. పల్లెజనమంతా కలిసి కోటి రూపాయలకుపైగా ఖర్చుచేసి, చారిత్రక ఆలయానికి జీవంపోశారు.
రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణం 2006 ఆగస్టులో ప్రారంభమైంది. ఆలయ నిర్మాణ శైలికి ఏ భంగమూ వాటిల్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు నుంచి నిపుణులైన శిల్పులను పిలిపించారు. ఆ కార్యక్రమానికి ఓ రూపం రావడానికి ఆరేళ్లు పట్టింది. 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు. లింగాన్ని కళావరోహణం చేశాక... మళ్లీ ప్రతిష్ఠించే వరకూ జలాధివాసంలోనే ఉంచారు. ఆ ఆరేళ్లూ అఖండదీపం వెలిగించారు. అప్పటి రాతి ధ్వజస్తంభం చెక్కుచెదరకుండా ఉండటంతో దాన్నే నిలబెట్టారు.
విశేష పూజలు...
రుద్రేశ్వరాలయంలో ప్రతి మాసశివరాత్రికీ మాస బ్రహ్మోత్సవాలూ మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం జరుగుతాయి. శివరాత్రికి ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఆ రోజు గ్రామస్థులంతా ఎడ్ల బండ్లనూ వాహనాలనూ చక్కగా అలంకరించుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమం కన్నుల పండువగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు వెళ్లే రాజీవ్‌ రహదారిపైనే కొండపాక ఉంది. కొమురవెల్లి, సిద్దిపేట కోటిలింగాల గుడి... సమీపంలోని దర్శనీయ స్థలాలు.

చందన రూపుడు సింహాచలేశుడు

చందన రూపుడు సింహాచలేశుడు

దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి
స్వయంభువుగా
వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.

ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.
ఆలయ చరిత్ర-స్థల పురాణం
స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాల్లో వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరి ద్వేషంతో.. భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా.. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (రూ.52 కోట్లు)కలిగిన దేవాలయమిదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో వుండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం.
ప్రధాన పూజలు
1. స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
ఇతర సేవల ధరలు
* సహస్రనామార్చన: రూ.200
* అష్టోత్తర శతనామార్చన: రూ.100
* లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
* గరుడ సేవ: రూ.300
* కప్పస్తంభ ఆలింగనం: రూ.25
* లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
* గోపూజ: రూ.50
* గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
* పశువుకట్టు: రూ.15
* అన్నప్రా శ న, అక్షరాభ్యాసం: రూ.50
* ద్విచక్రవాహన పూజ: రూ.100
* కారు పూజ: రూ.200
* కేశఖండన: రూ.10
టిక్కెట్లు దొరికే స్థలాలు: అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.20 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
ప్రసాదాల ధరలు
* లడ్డూ(80గ్రాములు): రూ.5
* పులిహోర : రూ.5
* చక్కెర పొంగలి: రూ.3
* రవ్వ లడ్డూ : రూ.2
దర్శన వేళలు
* ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
* మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం
* మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
* సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
* రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
* రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
* రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
* మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.
దర్శనం టిక్కెట్ల ధరలు
* రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
* రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
* రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.
రవాణా సౌకర్యం
సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా వుంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేకసందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.
వసతి వివరాలు
కొండపై సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు సత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చందన టూరిస్టు రెస్ట్‌ హౌస్‌, తితిదే సత్రాలు ఉన్నాయి. కొండ కింద పలు ప్రైవేటు వసతి గదులు అందుబాటులో వున్నాయి.
ఇతర దర్శనీయ స్థలాలు
ఆండాళ్‌ సన్నిధి(గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
పరిసరాల్లోని దర్శనీయ స్థలాలు
ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్‌, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడమూ సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు..

Saturday, August 13, 2016

శ్రావణ మాసంలో సకల సౌభాగ్యాలనంధించే మంగళగౌరీ వ్రతం..నియమాలు!!

శ్రావణ మాసంలో సకల సౌభాగ్యాలనంధించే మంగళగౌరీ వ్రతం..నియమాలు!! 

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో 'శ్రావణ మాసం' అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన "ఐదవతనం" కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి "అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప" మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే "మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు - అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.మంగళ గౌరి వత్రం విశిష్టత మరియు వ్రతంలో పాటించాల్సిన నియమాలు.. శుభాలు కలిగే .. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు? శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు? శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మంగళగౌరీ వ్రత నియమాలు తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి. మంగళగౌరీ వ్రత నియమాలు వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. మంగళగౌరీ వ్రత నియమాలు వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. మంగళగౌరీ వ్రత నియమాలు వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును) మంగళగౌరీ వ్రత నియమాలు ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. మంగళగౌరీ వ్రత నియమాలు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. మంగళగౌరీ వ్రత నియమాలు పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి. మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు : పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి. మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం : పైన చెప్పినటువంటివే ప్రస్తుతం 'మంగళగౌరీ' విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు.పూజా పీఠాన్న ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు.ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.

మృత్యువును జయించి, అతీత శక్తులు పొందడానికి మహా మృత్యుంజయ మంత్రం.!

మృత్యువును జయించి, అతీత శక్తులు పొందడానికి..
           మహా మృత్యుంజయ మంత్రం.!

 జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకువస్తుందో ఊహించలేం. అలాగే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు ఈ శరీరంపై దాడిచేస్తుందో తెలియదు. ఆ వ్యాధి జీవుడిని ఈ లోకం నుంచి వెంటనే తీసుకువెళుతుందో, లేదంటే జీవించినంత కాలం బాధపెడుతుందో కూడా తెలియదు. ఇలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోనవ్వడం జరుగుతూ వుంటుంది. అయితే ఎలాంటి దుర్ఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదిగా 'మహా మృత్యుంజయ మంత్రం' చెప్పబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం అసమానమైనది. ఈ మంత్ర ప్రభావం దుర్ఘటనలకు దూరంగా ఉండేలా చేస్తూ సదా రక్షిస్తూ వుంటుంది. మరి అంతట మహిమాన్నిత్వాలున్న మహా మృత్యుంజయ మంత్రం గురించి, పఠించడం వల్ల పొందే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం... అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి మహా #మృత్యుంజయ మంత్రంను మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రంను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహా మృత్యుంజయ మంత్రం లార్డ్ శివునికి అంకితం మహా మృత్యుంజయ మంత్రం లార్డ్ శివునికి అంకితం చేయబడింది. ఋషి మార్కండేయ ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడెను. మార్కండేయ మంత్రం అనే పేరు ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం ... "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"!! మంత్రం యొక్క అర్ధం అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంద భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా అని అర్ధం. మహా మృత్యుంజయ మంత్రం శివుని యొక్క రెండు అంశాలను వివరిస్తుంది. ఒక అంశం ఏమిటంటే మండే మూడు కనులతో ఉన్న దేవుడుని చూపిస్తుంది. రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని ఇంకా రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి, యముడు మానవుల మరణం తీసుకుని మరియు ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి భాద్యతను తీసుకొనెను. భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను. ఈ కారణంగా మానవులకు భూమి మీద మరణం గురించి బాధ ఎక్కువైనది. అన్ని రకాల భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను. ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది. మంత్ర జపం ఎలా చేయాలి? మంత్రం జపించటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని ఎప్పుడు పఠించాలి రెండవది,ఒక వ్యక్తి అసహజ మరణం లేదా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు పూజారి ఈశ్వరునికి పూజ ఏర్పాట్లు మరియు ఈ మంత్రాన్ని పఠించును. ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది. మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది మనస్సు మరియు శరీరంనకు ఒక స్వస్థత బలంగా పనిచేస్తుంది. మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు. ఇది అందరికీ, అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు ప్రాఅణికమయిన మంత్రం. దీనిని త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది. మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత: మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. గాయత్రి మంత్రం వలె మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది. క్షీర సాగన మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఈ మంత్రం ఒక విధమైన మృత సంజీవని అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆపదలు కలిగినపుడు కూడా చదువుకోవచ్చు. సాధారణంగా మూడుసార్లు కానీ, తొమ్మిది సార్లు గానీ బేసి సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.

నవగ్రహ ప్రదక్షిణలో పాటించాల్సిన నియమాలు.. ప్రదక్షిణతో పొందే విశేషమైన ఫలితాలు!!

నవగ్రహ ప్రదక్షిణలో పాటించాల్సిన నియమాలు..
ప్రదక్షిణతో పొందే విశేషమైన ఫలితాలు!!

నవగ్రహాలు అంటే.. చాలా మందికి సందేహాలు ఎక్కువ. ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొంతమం దికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొందరు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు. అందుకే.. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని.. అక్కడ పూజ చేయడానికి కూడా సంకోచిస్తారు. శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..? అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహలస్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. వాటిని బట్టే మానసిక పరిస్థితి, ఆరోగ్యం ఆధారపడి వున్నాయి.నగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. చాలామందికి ఈ పద్దతులు గురించి అవగాహన వుండదు. అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? గ్రహస్థితుల నుంచి మనకు ఎదురయ్యే కష్టనష్టాల నుంచి బయటపడేందుకు తగిన మార్గం నవగ్రహ ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణను ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? కొంతమంది ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? 'ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:'‘ అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ప్రార్థనలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? మొదటి ప్రదక్షిణలో... జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యామిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభమృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు! నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే విశేషమైన ఫలితాలు? తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.

Friday, August 12, 2016

శ్రావణమాసంలో ఖచ్చితంగా చేయాల్సిన, ఎట్టిపరిస్థితుల్లో చేయకూడనివి ??

శ్రావణమాసంలో ఖచ్చితంగా చేయాల్సినవి, ఎట్టిపరిస్థితుల్లో చేయకూడనివి ??

ఇది.. చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్న మాసం. శివుడికి అనేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసం అంటే శుభ మాసం, పవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. అందుకే.. ఈ నాలుగువారాలు.. చాలా భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది.అలాగే ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాన్నిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్థోమతను, సమయాన్ని బట్టి ఏదో ఒక పూజాకార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ పవిత్రమైన, శక్తివంతమైన శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల విశేష ఫలితాలు, అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే.. ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం.. శ్రావణ సోమవారం వ్రతం ఈ శ్రావణ మాసంలో చాలామంది శివుడికి ప్రత్యేకమైన సోమవారం ఉపవాసాలు ఉండి.. అభిషేకాలు చేస్తారు. ఇలా చేయడాన్ని శ్రావణ సోమవారం వ్రతం అని పిలుస్తారు. అలాగే మంగళవారం చేస్తే.. మంగళగౌరీ వ్రతం అని పిలుస్తారు. పెళ్లికాని స్త్రీలు ఈ వ్రతం చేస్తే.. శివుడి లాంటి భర్తను పొందుతారు. వేదాలు హిందూ వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణమాసం... శివుడిని పూజించడానికి ప్రత్యేకమని చెబుతాయి. అలాగే వివాహం, సంపద పొందడానికి కూడా ఈ నెలలో పూజలు నిర్వహించాలని సూచిస్తారు. పండుగలు శ్రావణమాసం చాలా విశిష్టమైనది కావడం వల్ల అనేక పండుగలు ఈ నెలలోనే వస్తాయి. శ్రీకృష్ణ జన్మాస్టమి, రక్షాబంధన్, నాగ పంచమి, తేజ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే.. పెళ్లిళ్లు చేయడానికి ఈ నెల చాలా పవిత్రమైనది. వరం శ్రావణ మాసం శివుడు భక్తులకు వరాలు కురిపిస్తారు. వాళ్ల తప్పులు క్షమించమని పశ్చాత్తాపంతోపూజలు నిర్వహిస్తే.. వాటిని మన్నించి.. విజయం సాధిస్తారు. అలాగే నెగటివ్ ఎనర్జీ తొలగించి, అదృష్టం ఆశీర్వదిస్తారు. ఈనెలలో శివపార్వతుల ఆశీర్వాదాలు పొందవచ్చు. తెల్లవారుజామున పూజలు సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. స్నానం చేసి.. శివాలయం దర్శించి.. పాలు, నీళ్లు కలిపిన పదార్థంతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నంతసేపు నిర్విరామంగా నమ: శివాయ అని ధ్యానించాలి. శివలింగం ఇంటికి ఒక శివలింగం తీసుకొచ్చి.. ప్రతిరోజూ పూజించాలి. చల్లటి పాలు లింగంపై పోయాలి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. తర్వాత బిల్వపత్రాలు, పటిక బెల్లం సమర్పించాలి. మహామృత్యుంజ మంత్రం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లు మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల.. ఫలితాలు పొందవచ్చు. వివాహం అవకపోతే వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, వివాహం ఎన్నిరోజులైనా అవకుండా ఉంటే.. శివలింగానికి ఈనెలలో కుంకుమార్చన చేయాలి. ఇలా చేసిన తర్వాత శివపార్వతుల అనుగ్రహం పొంది.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆవుకి ఆహారం తాజా పచ్చి గడ్డిని ఆవులకు శ్రావణ మాసంలో పెట్టడం వల్ల.. శ్రేయస్సు, అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలకు ప్రతిరోజూ ఏదైనా నది, చిన్న నీటి గుంటను సందర్శించి.. చేపలకు ఆహారం పెట్టాలి. అలా చేపలకు ఆహారం పెట్టేటప్పుడు శివుడిని ధ్యానించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయి. పేదలకు శ్రావణమాసంలో అన్నదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. పేదవాళ్లకు మీ ఇంట్లో భోజనం చేసి ప్రతిరోజూ పెట్టడం వల్ల.. ప్రశాంతత పొందుతారు. అలాగే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ల ఆత్మకు శాంతి కలుగుతుంది. బిల్వపత్రం ప్రతి సోమవారం 20 బిల్వాపత్రాలు తీసుకుని... దానిపై ఓం నమ: శివాయ అని గంధంతో రాసి.. శివలింగానికి సమర్పిస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. గోమూత్రం ఈ శ్రావణ మాసం అంతా.. గోమూత్రం తీసుకువచ్చి ఇల్లు మొత్తం చల్లుకుంటూ ఉండాలి. ప్రతి మూల చల్లుకుంటే.. పాజిటివ్ ఎనర్జీ పొందుతారు. అభిషేకం శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం లేదా సాధారణ అభిషేకం నిర్వహించడం వల్ల అన్ని రకాల మంగళ దోషాలు నివారించబడతాయి. రుద్రాక్ష రుద్రాక్ష ధరించాలని భావిస్తే.. శ్రావణమాసంలో వేసుకోవడం చాలా పవిత్రమైనది. ఈ నెలలో రుద్రాక్షలు వేసుకుంటే.. చాలా ఫలితాలు పొందుతారు. బిల్వపత్రాలు ఎప్పుడు పీకరాదు శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం విశిష్టమైనదే కానీ.. అష్టమి, చతుర్ధసి, నవమి, అమావాస్య, సోమవారం వీటిని పీకరాదు. సాయంత్రం శ్రావణమాసంలో సాయంత్రంపూట శివపార్వతుల హారతి ఇస్తే.. శివుడి అనుగ్రహం పొందుతారు. మంచి భాగస్వామిని పొందుతారు. ప్రశాంతత శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయకపోవడం వల్ల ప్రశాంతత కోల్పోకుండా, సంపద తరిగిపోకుండా ఉంటుంది. మాంసాహారం, ఆల్కహాల్ శ్రావణ మాసంలో మాంసాహారం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తీగా మానేయాలి. పాముని చంపడం శ్రావణ మాసంలో ఎట్టిపరిస్థితుల్లో పాములను చంపకూడదు. శివుడిని చాలా ప్రీతికరమైనది కాబట్టి.. పాములను పూజించాలి. చంపకూడదు.

Thursday, August 11, 2016

సకలదేవతా మాసము (శ్రావణ మాసం)

🍃🌾🌿సకలదేవతా మాసము💐🍁☘🍃(శ్రావణ మాసం)


అన్ని మాసాల్లో కంటే శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది ఎందుకనీ..!! మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది.శ్రావణ మాసం చాలా విశేషమైన మాసము. ఈ మాసం విష్ణుమూర్తులవారికి చాలా ప్రీతికరము. అట్లాగే వరలక్ష్మీ, గౌరీ, సంతోషీమాత, హయగ్రీవ, సదాశివ, సుబ్రహ్మణ్య, కృష్ణ, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా ప్రీతికరమగు మాసము. అందుకని శ్రావణ మాసాన్ని సకలదేవతా మాసము అని కూడా అనవచ్చును.

ఈ మాసానికి చాలా ప్రత్యేత ఉంది.ఆది దేవుళ్ళను కొలువై కోరిన వరాలు అందించే మాసం కాబట్టి, ఈ మాసం మొత్తం పండుగ పర్వదినాలతో నిండి ఉంది. ఈ మాసంలో వచ్చే పండుగలు, వాటిని వల్ల పొందే ఫలితాలేంటో తెలుసుకుందాం.. శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం శ్రవణా నక్షత్రం విష్ణుమూర్తుల వారి జన్మ నక్షత్రం. కనుక, శ్రావణ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ రుద్రాభిషేకం ఉత్తరాదిన ఈ మాసంలో శివ ఆరాధనలు కూడా ఎక్కువగా జరుగుతూ వుంటాయి. సంవత్సరం మొత్తంలో శ్రావణ మాసంలో కాశీ క్షేత్రం భక్తులతో చాలా కోలాహలంగా వుంటుంది. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం విశేషము. శ్రీ మంగళ గౌరీ వ్రతం కొత్తగా పెళ్లి అయిన మహిళలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళ వారం మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సుమంగళీ దేవి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ వరలక్ష్మీ వ్రతం పెళ్ళైన స్త్రీలు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సకల సౌభాగ్యాలు చేకురుతాయి. శ్రీ నాగుల చవితి పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి, అనగా శుద్ధ చతుర్ధి రోజున సుబ్రహ్మణ్య లేక నాగ దేవత అభిషేకములు విశేషము. ఈ రోజున నాగ అభిషేకం చేసినవారికి సంతాన సంబంధ దోషములు కొంతవరకు నివృత్తి అవుతాయి. శ్రీ పుత్రదా ఏకాదశీ వ్రతం పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి, అనగా శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈ రోజుని లలితా ఏకాదశీ అని కూడా అంటారు. పుత్ర సంతానం కలగటానికి ఈ రోజున పుత్రదా ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. శ్రీ సంతోషీమాతా వ్రతం మరియు రక్షా బంధనం శ్రావణ పూర్ణిమ శ్రీ సంతోషీమాతా జయంతి. ఈ రోజున శ్రీ సంతోషీమాతా వ్రతము చాలా విశేషము. శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. స్త్రీలు అన్నదమ్ములకు, సోదర సమానులకు రక్షను (రాఖీని) కట్టటం వలన శుభ ఫలితములు చేకూరుతాయి. ఉపాకర్మ మరియు నూతన యజ్ఞోపవీత ధారణ శ్రావణ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. నూతనంగా ఉపనయనం అయిన వటువు ఈ రోజున కృష్ణాజిన విసర్జన చేసి యజ్ఞోపవీతము మార్చుకోవాలి. అట్లాగే విధిగా ఉపనయన సంస్కారం అయిన వారందరూ యజ్ఞోపవీతాన్ని (జంధ్యాన్ని) మార్చుకొని గాయత్రీ జపం చేసుకోవాలి. శ్రీ లలితా సహస్రనామ పారాయణ శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణ వచనము. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతములు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అట్లాగే, ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించబడిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టటం మంచిది. తద్వారా మనుషులలో వుండే ఆహాకారం తొలగిపోయి అందరితో సమ భావన కలిగి వుంటారు. శ్రీ గురు రాఘవేంద్ర జయంతి పూర్ణిమ తర్వాత వచ్చే విదియ, అనగా బహుళ విదియ రోజున శ్రీ గురు రాఘవేన్ద్రుల వారు సజీవంగా సమాధిలోకి వెళ్ళిన రోజు. ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన, అభిషేకములు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. గురునాధ పొంగళ్ళు వున్నవారు ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన ఖచ్చితంగా చేసుకోవాలి. శ్రీ సంకట హరణ చతుర్ధి బహుళ చతుర్ధి రోజున శ్రీ గణపతుల వారికి అభిషేక, అర్చన, వ్రతాదులు చేయటం వలన అన్ని కష్టములు తొలగి మంచి ఫలితములు కలుగుతాయి. శ్రీ కృష్ణాష్టమి బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణ జయంతి కనుక, ఆ రోజున పిల్లలతో శ్రీ కృష్ణ పూజ చేయించి వెన్న, అటుకులు నైవేద్యం పెట్టించటం మంచిది. తద్వారా ఆ పిల్లలకి అన్ని విధాల కష్టాలను తేలికగా ఎదుర్కునే సామర్ధ్యం కలుగుతుంది. ఈ రోజునే జన్మాష్టమి అని కూడా అంటారు. శ్రీ ఏకాదశీ వ్రతం బహుళ ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మనస్సులో వుండే కోరికలు శీఘ్రంగా నెరవేరతాయి. ఈ రోజున వెన్న నైవేద్యం పెట్టటము మంచిది. శ్రీ వృషభ అమావాస్య శ్రావణ అమావాస్య రోజున వృషభ పూజా చాలా విశేషము. ఈ రోజున వృషభ పూజ చేయటం వలన అకాల మృత్యువు తొలగి పోయి దీర్ఘ ఆయుస్సు చేకూరుతుంది. వేదములు వేదములను కాపాడటానికి శ్రీ మహా విష్ణుమూర్తుల వారు శ్రావణ పూర్ణిమ రోజున శ్రీ హయగ్రీవుల వారిగా జన్మించటం జరిగింది. అందువలన, ప్రత్యేకముగా ఈ మాసంలో వేద ప్రచారము, వేద రక్షణ, వేద పారాయణ చేయటము మంచిది. అదే విధంగా, వేద గ్రంథముల ముద్రణకు సహకరిస్తూ, వేద రక్షణ చేయటం చాలా మంచిది. తద్వారా శ్రీ మహావిష్ణు కటాక్షం కలుగుతుంది.