రధ సప్తమి పూజ మహిమ
అనేకానేక హిందూ పురాణాలూ,గ్రంధాలలో పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ స్వామిని ప్రత్యక్ష దైవంగా అభివర్నించాయీ అంటే కారణం ఆయనొక్కడే ప్రతినిత్యం దర్శనమిచ్చేది కనుక.
కాని మారిన యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన,మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అలా నిర్ణయించిన వాటిల్లో #రధ సప్తమి పూజ ఒకటి.
అదితి, కశ్యప మహర్షి దంపతులకు జన్మించిన ఆదిత్యుడు లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు.దానినే దక్షిణాయనం,ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి[15 జనవరి]జులై పదిహేను వరకు దక్షిణాయనం,జూలై నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే రధ సప్తమి అని లేదా సూర్య జయంతి అని అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయంగా వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.
కాని మారిన యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన,మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అలా నిర్ణయించిన వాటిల్లో #రధ సప్తమి పూజ ఒకటి.
అదితి, కశ్యప మహర్షి దంపతులకు జన్మించిన ఆదిత్యుడు లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు.దానినే దక్షిణాయనం,ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి[15 జనవరి]జులై పదిహేను వరకు దక్షిణాయనం,జూలై నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే రధ సప్తమి అని లేదా సూర్య జయంతి అని అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయంగా వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.
పురాణగాధ:-
రధ సప్తమి నాడు నిర్వర్తించే పూజకు సంభందించి ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.
పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా బిడ్డ అనారోగ్యంవలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించేవారు.
తన పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.
రధ సప్తమి నాడు నిర్వర్తించే పూజకు సంభందించి ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.
పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా బిడ్డ అనారోగ్యంవలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించేవారు.
తన పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.
రధ సప్తమి పూజా విధానం:-
సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద,పాదాల మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని స్నానమాచరించి,గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.
అనంతరం గృహములో తూర్పుదిశగా రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.నైవేద్యముగా పొంగలిని సమర్పించాలి.
ఆ రోజంతా ఉపవాసముండి, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.
సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద,పాదాల మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని స్నానమాచరించి,గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.
అనంతరం గృహములో తూర్పుదిశగా రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.నైవేద్యముగా పొంగలిని సమర్పించాలి.
ఆ రోజంతా ఉపవాసముండి, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.
No comments:
Post a Comment