సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, October 29, 2014

‎కృష్ణావతారం‬

కృష్ణావతారం‬
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
వచ్చింది పోట్లగిత్త కాదని రాక్షసుడెవరో అని తెలుసుకున్నాడు. పోట్లగిత్త రూపంలో వృతాసురుడు ఇదే మంచి సమయ మని అతన్ని కుమ్మి చంపుదామని సమీపానికి రాగానే అరక్షణము వ్యవధిలో చిన్ని కృష్ణుడు ముందుకు ఊరికి పోట్ల గిత్తను ఒక్కసారిగా నేలపైకి కూలద్రోసి దాని నాలుగు కాళ్ళు పట్టి గాలిలో గిరగిరా తిప్పి బలంగా నేలపై మోదాడు. నేలపైపడిన వెంటనే పెద్దగా ఆర్తనాదం చేస్తూ రాక్షస రూపంలోకి మారి చనిపోయాడు. వృతాసురుడు అలాగే మరొకనాడు కొంగ రూపంలో వచ్చిన బకాసురుడు తనను మింగి వేయడానికి ప్రయత్నించగా కృష్ణుడు అతడిని సునాయాసంగా చంపేశాడు. ఒకనాడు మరొక వింత జరిగింది. విష్ణుమూర్తి మాయను కళ్ళారా చూడాలని బ్రహ్మదేవుడికి ఆలోచన వచ్చింది.
ఆలమందలను కొంతసేపు పచ్చిక బయళ్ళలో మేపి ఆ తర్వాత చద్ది అన్నాలు తింటున్నారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆలమందలను మాయం చేశాడు. తరువాత ఆలమందలు కనపడకపోయేసరికి గోపాలకులు భయపడ్డారు. ఈ విషయం గోపాలకుల కృష్ణుడితో చెప్పారు. వెంటనే కృష్ణుడు వెళ్ళి వనమంతా వెతికినా ఆలమందలు కనపడలేదు. తిరిగి వచ్చి చూసేసరికి గోపాలకులు కూడా అక్కడ లేరు. వారిని కూడా బ్రహ్మదేవుడు మాయం చేశాడు. అప్పుడు కృష్ణుడు ఇది అంతా బ్రహ్మమాయ అని తెలుసుకొని తన మాయతో ఆలమందలనూ గోపబాలురనూ సృష్టించాడు. ఆ మాయా మోహనాన్ని చూసి తన అజ్ఞానానికి సిగ్గు పడ్డాడు బ్రహ్మ. ఈ జగత్తంతా శ్రీహరి మాయ అని తెలుసుకుని కృష్ణున్ని స్తుతించాడు. తను మాయ చేసి దాచి ఉంచిన ఆలమందలనూ, గోపాలురనూ కృష్ణుడికి సమర్పించి అనుగ్రహించమని ప్రార్థించాడు. ఆ సమయంలో కృష్ణుడు బ్రహ్మదేవుడిని కరుణించి తన మాయ ఉపసంహరించాడు.

No comments:

Post a Comment