సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, January 24, 2014

హరుడు • చంద్రమౌళి

హారుడు









































































శివుడు హరుడు మహేశ్వరుడు..పరమేశ్వరుడు.. కైలాస నాధుడు .
సౌరేస్త్ర సోమనాధం చ శ్రీ శైల మల్లికార్జునం
త్రయంబకం యజా మహె సుగంధం పుస్తివర్ధనం
ఉర్వా తుమివ వందనం మృత్యు మొక్షేన ఆమ్రుతా!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
’హర నేత్రాగ్ని సందగ్ధ కామసంజీవ నౌషధిహ్ ‘’
పరమేశ్వరి నామాలలో ప్రతిదీ ప్రాణ శక్తితో  ఉంటుంది కామ దేవుడిని బూడిద రాసి చేసిన కామేశ్వరుడిని ‘’హర ‘’శబ్దం చక్కగా వ్యక్తం చేసింది .అంతటినీ హరించే వాడు హరుడు ప్రజాపతి చేసిన సృష్టిలో ఆహితమైంది ,అనవసర మైంది ,అశోభన మైంది అంతా నశింప జేయటమే శంకరుని పని .అందుకే హర శబ్దం వాడారు .హరుని మూడవ కన్ను మంట కాముడిని కాల్చింది .ఈ మూడో కన్ను మనందరి లోను ఉంటుందని గ్రహించాలి .లలాటం లో ఉన్న ఈ మూడో కన్ను లోపలి చూపును కలిగి ఆనందాన్ని పొందుతుంది .ఈ కన్ను తెరుచుకొంటే అంధకారం అంతా పటా పంచలై వెలుగు పరచుకొంటుంది .అజ్ఞానం స్తానాన్ని జ్ఞానం ఆక్రమిస్తుంది .ఆత్మ తత్త్వం బోధ పడుతుంది .అప్పుడు జ్ఞాని జీన్ముముక్తుడౌతాడు .ఈ జీవన్ముక్త దశ వైపు ఈ నామం సూచిస్తుందని భావం .పరమేశ్వరుడు ముక్తి దాత .పరమేశ్వరి ఈ ముక్తి ప్రయోజనాన్ని సమస్త ప్రపంచానికి అందిస్తుంది .’’వినాశం లోనే వికాస బీజం ఉంది ‘’అని గ్రహించాలి .కామ వాసన కామిని వినాశనం వైపు లాక్కేడుతుంది .అమ్మ వాడిని కామేశుని వికాసం వైపుకు తీసుకొని వెడుతుంది ఇదే పరమేశ్వరి నామం లో ఉన్న రహస్యార్ధం అని  మహా వ్యాఖ్యాన కర్త స్వర్గీయ ఇల పావులూరి పాండురంగా రావు గారు వ్యాఖ్యానించి చెప్పిన దానినే మీకు అంద జేశాను .అందరికి ఆ పరమేశ్వరీ కటాక్షం లభించాలని  కోరుతున్నాను.

ఈతడే హరుడు
యీతడే యజుడు
ఈతనికి నీ చేతలెoత
ఘనమటుగాన

కడుపెక్కుబ్రహ్మాoడ
కతకములు సుడివడిన
కడుపులొ నిడుకొన్న ఘనుడు
వెడలి పూతకిచంటి
విషము తాగిన యoత
వడి తనకు నేమాయ వట్టిబూమెలుగాక

ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు~
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుడవని నిన్ను పరిణమిoతురు గాన

తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు
పరిపూర్ణుడచ్యుతుడభవుడు
శరణాగతుల రక్షసేయు వాడనుమాట
గురుతుగా తలపోసి కొనియాడాగా వలసె!!






































గరళకంఠుడు

  1. www.panchaamrutam.tvramudu.blogspot.com గరళకంఠుడు సృష్టి మేలుకోసం తానే సర్వమూ అయ్యే సర్వాత్ముడు శివుడు. అమృతోత్పత్తి కోసం దేవతలు, దానవులు అత్యంత ఉత్సాహంతో క్షీరసాగర మథనంలో పాలు పంచుకున్నప్పుడు ముందుగా ఆవిర్భవించింది 'హాలాహలం'.గరళాన్ని సేవించి స్థిరంగా తనలో నిలుపుకోగల మహితమైన మహిమాన్మాతుడు దైవం ఆ పరమశివుడే అని తలచిన దేవదానవులు పాపహరుడైన హరుని ప్రార్థించగానె చిరునవ్వుతో ఆ కాలకూట విషాన్ని తన గొంతులో నింపుకుని గారలకంఠుడయ్యాడు. పరమశివుడు ఈ మహత్తర కార్యంతో లోకాలలో ఎటువంటి కీడు వాటిల్లకుండా చేసిన వాత్సల్య సింధువు ఈ నీలకoధరుడు ఈ గరళకంఠుడు. సముద్రం తరువగా హాలాహలం పుట్టినప్పుడు తక్కినవారు పారిపోగా విషం మింగి జగత్తును రక్షించింది గరళకంఠుడు. అందరి పాపాలనూ ఆయనే భరించాడు. ""మనలను చేసినవాడు మన అందర పాపాలూ హరిస్తాడు. విషం మింగిన గరళకంఠుడు జీవచరాలను రక్షించాడు ప్రకృతి మింగిన హేరళకంఠుడు నేలతల్లినీ కబళించాడు.గరళం శివుని లో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవదం కోసం నిత్యం ఈశ్వరుడు శిరమున దాల్చిన అర్ధ చంద్రుడు జీవకోటికి చల్లదనాన్ని ప్రసాదించి, తాపాలను హరించే తేజోమయుడు. జటాజూటమునందున్న గంగాదేవి సర్వప్రాణులకు దాహార్తిని తీర్చి,జీవాన్ని ప్రసాదించే భక్తి, ముక్తి ప్రదాయిని. శివుడి లలాటంలో వున్న త్రినేత్రం జ్ఞానచక్షువు కాగా ఇరు నేత్రాలు సూర్యచంద్రులుగా వెలుగొందుతుంటాయి.
  2. మహర్షి శాప ఫలితంగా ఇంద్రుని వైభవం అంతా అంతరించింది. సామ్రాజ్య లక్ష్మితో సహా సమస్త సంపదలూ చేజారిపోయాయి. ఇంద్ర సింహాసనాన్ని రాక్షసులు ఆక్రమించుకున్నారు. ఇంద్రునితోపాటు అష్టదిక్పాలుర గణాలన్నిటికీ అథోగతి పట్టింది. అందరూ కలసికట్టుగా వెళ్లి బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు. బ్రహ్మకూడా ఏం చెయ్యడానికీ పాలుబోక, మనకీ దుస్థితి నుంచి నారాయణుడు రక్షించాలి తప్ప అన్యులెవరకీ సాధ్యం కాదని చెప్పి, అందరితోనూ కలసి వైకుంఠుని శరణువేడాడు. మధుసూదనుని పరిపరి విధాలా స్తుతించాడు. ‘‘అతి సనాతనుడవు, ఆరాధ్యుడవు, యజ్ఞరూపుడవు. ఏ పోలికలకూ అందనివాడువు. బ్రహ్మను కూడా నీవే సృష్టించినవాడవు. మమ్ము కటాక్షించి మాకు దర్శనం ఇవ్వవలసిందిగా కోరుతూన్నాం’’ అని ఋష్యాదులు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు వారికి ప్రత్యక్షమయ్యాడు. తిరిగి యావన్మందీ స్తోత్రం చేయగా, జనార్దనుడు సంతసించి ఇట్లా పలికాడు.

    మథనానికి శ్రీకారం...
    ‘‘దేవతలారా! ఇంద్రునితో కూడి, మీరంతా రాక్షసుల వద్దకు వెళ్ళి వారిని సముద్ర మథనా నికి ఒప్పిస్తే, తదుపరి కార్యం నేను నిర్వహి స్తాను. ఇంతవరకు మీకు అమరత్వ లబ్ధిచేకూ రని కారణంగా యద్ధంలో రాక్షసుల ధాటికి మీరు నిలువజాలకున్నారు. సముద్ర మథనం వల్ల జనించే అమృతం గ్రోలి మీరు అమరులు కండి! జాగ్రత్త! ఈ అమృతం రాక్షసులకు దక్క కుండా నేను పథకం రచిస్తాను-’’ అంటూ ఆన తిచ్చాడు. శ్రీమాన్నారయణుని ఆదేశానుసారం వాసుకిని కవ్వంత్రాడుగా - మంథర పర్వతా న్ని కవ్వంగా మలచి దేవదానవుల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. హాలాహలమే మొదట వెలవడింది. వెయ్యి సంవత్సరాలకు వాసుకి తలలు భయంకరమైన విషమును క్రక్కాయి. నిప్పుతో సమానమైన ఆ విషం వలన దేవాసురులు, మనుషులతో కూడిన ఈ ప్రపంచం దహించబడింది.

    దేవతలు ఈశ్వ రుని వద్దకు వెళ్లి రక్షింపుమని కోరారు. శంఖ చక్రధారి అయిన విష్ణువు కూడా అక్కడకు వచ్చాడు. ‘‘సురశ్రేష్ఠా! నీవు దేవలందరిలోనూ అగ్రగణ్యుడువు. కావున సముద్ర మధనము నందు మొదట పుట్టినది నీ భాగము. పుట్టిన ఈ విషం లోకాలన్నింటిని దహించివేస్తోంది. ఈ భయంకరమైన విషాగ్నిని ఉపసంహరించి భూత కోటిని సంరక్షించడానికి నీవే సమర్ధుడ వు. ఇతరులవల్ల ఆ మహకార్యము కాజాలదు. దీనిని అగ్రపూజగా ఎంచి విషమును గ్రహింపు ము అని విష్ణువు అంతర్థానం చెందాడు. ప్రజా పతులందరూ ముక్తకంఠంలో పరమేశ్వరుని స్తోత్రం చేశారు. అపుడు దయా సముద్రుడైన శంకరుడు భక్తవశంకరుడై పరమేశ్వరి ముఖం చూచి ఇలా అన్నాడు. ‘‘ఓ దేవీ! లోకాలకు కల్గిన ఈ ఉపద్రవం చూశావా! ఈ హాలాహలా న్ని అదుపు చేసి మధుర ఫలంలాగా భక్షిస్తాను. ప్రాణుల్ని రక్షిస్తాను’’ అన్నాడు.

    ఆ మాటలు వి ని భవాని నిర్భయంగా ‘‘మహాత్మా! మీ అభీష్టం ప్రకారం జరుగుతుంది’’ అని చెప్పింది. అప్పు డు సమస్త దేవదానవులు జయజయ ధ్వానము లు పలుకుతూండగా పరమేశ్వరుడు హాలాహ లానికి ఎదురునిలచి ఆ మహావిషాన్ని ఆకర్షించి పట్టుకొని దగ్గరకు చేర్చి ఒక ముద్దగా చేసి అల్లనేరేడు పండులా మెల్లగా నిగనిగలాడుతూ ఉన్న దానిని ఆ పరమశివు డు కంఠంలోనే నిలిపివేశాడు. అలా ఘోరవి షాగ్నిని కంఠంలో నిలుపుకోవడం వల్ల ఆ విషతీక్షణతకు ఆయన కంఠం నల్లబడింది. కంఠంలోనే నిక్షిప్తం చేసి గరళకంఠుడయ్యాడు.కాని ఆ నలుపు కూడా ఆ తెల్లని పరమేశ్వ రుని ఒడలుకి ఒక అలంకారంగానే భాసిం చింది. ఇలా హాలాహలం విషం వల్ల కలిగి న విఘ్నాన్ని పరమేశ్వరుడు తొలగించ గానే దేవాసురులు క్షీరసాగర మధనం పునఃప్రారంభించారు. కవ్వముగా వున్న మందర పర్వతం పాతాళలోకానికి కుం గింది. దేవ గంధర్వులు విష్ణువును ప్రస్తుతించారు. సమస్త ప్రాణులకు ప్రత్యేకించి దేవలకు దిక్కువు నీవే. మందర పర్వతం సముద్రములో మునిగిపోయింది. దానిని పైకి లేవనె త్తుము అని ప్రార్థించారు.

    దేవతల ప్రార్థన విని మహానిష్ణువు తాబేలు రూపము వహించి మందర పర్వత మును వీపుపై ధరించి సముద్రం లో శయనించాడు. శ్రీ విష్ణుదేవు డు చేతులు పైకి చాపి మందర పర్వత శిఖరమును పట్టుకున్నా డు. దేవతలతో కలిసి తానునున సముద్ర మధనంలో పాల్గొన్నా డు. వెయ్యి సంవత్సకాలు గడి చాయి. దండ కమండలములు ధరించి ధరించి ధన్వంతరి పాలసముద్రం నుండి ఉద యించాడు. పాలను చిలుకు ట వలన పాలనుండి ఒక రసము ఉద్భవించింది. ఆ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం వగైరాలన్నీ ఉద్భవించాయి. వాటితో పాటే నిప్పులు చిమ్ముతూ హాలాహలం కూడా ఎగసిపడింది. ఆ రసము నుండి కొందరు స్త్రీలు జనించారు. వారు ఆ రసం నుండి జన్మించారు కనుక వారిని అప్సరసలు అని అన్నారు.చిట్టచివరిగా అమృతం పుట్టింది. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారమెత్తి, రాక్షసులతో అచ్చిక బుచ్చికలాడుతూ వారిని ఏమార్చి, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిపెట్టడంతో క్షీరసాగర మథనం పూర్తయింది.
    జగన్నాటక సూత్రధారి స్వీయ పర్యవేక్షణలో ఆద్యంతం ‘సుర’సవత్తరంగా సాగిన ఈ మహానాటకాన్ని నారదుడు కనులారా వీక్షించి ఉప్పొంగిపోయి, విష్ణుమూర్తిని అడిగాడు.
    “స్వామీ! కడు నేత్రపర్వంగా జరిగిన క్షీరసాగర మథనాన్ని సాధారణ ప్రజలు సైతం తిలకించి, పులకించే భాగ్యం కల్పించవచ్చు కదా!”
    విష్ణుమూర్తి మందహాసం చేసి చెప్పాడు “నారదా! నీ కోర్కె తప్పకుండా సిద్ధిస్తుంది.

Saturday, January 18, 2014

పశుపతి

పశుపతినాథ్ దేవాలయం

 పశుపతి
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భువ్యతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే..అని కొలుస్తారాయన భక్తులు. అసలే బోళా శంకరుడు ఆ పైన భక్తుల కోసమే వెలసిన మహాదేవుడు. అలాంటి శివదేవుడి ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రాల్లో.. నేపాల్లోని పశుపతి నాథ్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఇంతకీ ఈ నేపాల్ దేవుడి విశిష్టతలేమిటి? ఇక్కడీ శివుడెలా  వెలిసాడు? శివుడంటే పిలిస్తే పలికే దైవం. శివుడంటే అభయంకరుడు. భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభోశంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు. ఉండేది లింగాకారం. మహత్యం చూపడంలో అనంతాకారం. శివుడ్ని కొలిస్తే ఆపదలు మటుమాయం. శివుడి గురించి విన్నా.. కొలిచినా.. స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు. శివుడంటే కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే

 నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.
గోవు ఇతిహాసం
information about pashupatinath temple details pashupatinath temple is one of the most famous temple in Kathmandu. Dedicated to Lord Shiva
ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.
మరో ఇతిహాసం
ఇంకో ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.

ఆలయ చరిత్ర

 పశుపతి

ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.

ఆలయ నిర్మాణ శైలి

information about pashupatinath temple details pashupatinath temple is one of the most famous temple in Kathmandu. Dedicated to Lord Shiva
దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట(ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది.

ఆదిశంకరుడు కొలిచిన పశుపతినాథ తత్త్వం.. అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి.. దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరా భారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు. మహాశివరాత్రి పూట ఆ జనసందోహం అనంతం. శంభో శంకర అంటూ భక్తజనులు పరమేశ్వర దర్శనం చేస్తారు.
 పశుపతి

information about pashupatinath temple details pashupatinath temple is one of the most famous temple in Kathmandu. Dedicated to Lord Shiva
అలాగే పశుపతినాథ్ ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, ఏడవ శతాబ్ధికి చెందిన చండకేశ్వరుడు, బ్రహ్మదేవాలయం, ఆర్యఘాట్. గౌరీ ఘాట్ లు ఎంతో ప్రముఖమైనవి. శివుడు స్మశాన సంచారి. ఆర్యఘాట్ లో స్మశానం కూడా వుంది.
కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని  వేలాది భక్తులు దర్శిస్తారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం.. భక్తులు అపరమిత సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుడ్ని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు.

Wednesday, January 15, 2014

కైలాసాధిపతి

  1.  పంచామృతo
    ఎన్నో విశిష్టతలు ఇమిడి ఉన్న ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో మానవ మేథస్సుకు అర్థంకాని విషయాలు దాగి ఉంటాయి. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తాడు. ఈ ప్రాంతంలో పర్యటించినప్పడు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.విరోచనుడు, స్కందుడు, శాస్త, సూర్యపుత్రుడగు యముడు,యుక్తిస్వరూపుడు, గొప్ప కీర్తి గలవాడు, ప్రేమ గలవాడు, త్రిపురాసురసంహర్త, కైలాసాధిపతి, సుందరమైన వాడు, జగత్తునకు తండ్రి, సూర్యుడే కన్నుగా గలవాడు , సర్వోత్తముడు,సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాస పంచామృతo.కైలాసాధిపతి.ఉంది .అంతే కాకుండా హిమాచల్‌ ప్రదేశ్‌లో కిన్నెర కైలాసం, బద్రీనాథ్‌లో నీలకంఠ శిఖరం, నేపాల్‌లోని ధౌలగిరి, బెంగుళూరులో నంది కొండలు.. ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే. అంతే కాకుండా మానస సరోవరానికి సమీపంలో కొలువుతీరిన ముక్తినాథ్ వద్ద 108 జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంతో సహా ఎన్నో పర్వతాలను వీక్షించడం మాటలకందని మధురానుభూతి.
కైలాస పర్వత యాత్ర
భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానససరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.

మానస సరోవరం
కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్, బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు  కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్ జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. హర హర మహాదేవ శంభో శంకర. 
 కైలాసాధిపతి
 పంచామృతo.కైలాసాధిపతిwww.tvramudu.blogspot.com

సృష్టికర్త బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ? భూమ్మీదే కైలాసం ఉందా ? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా ? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా ? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా ? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ?
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని..కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో.

మంచు కొండల్లో వెండివెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతుపట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని
అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం
ఈ భూమ్మీదే ఉంది.

కైలాస పర్వత దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. సాక్షాత్తు ఆ పరమశివుని అనుమతి ఉన్నవారికే ఆ పరమ పవిత్రమైన క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుందని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ భూమీదున్న అత్యంత కష్టమైన, సాహసోపేతమైన యాత్రలలో ‘కైలాస మానస సరోవర యాత్ర’ ఒకటి. మహాదేవుని ఆశీస్సులున్నవారు మాత్రమే ఈ యాత్రను విజయవంతంగా పూర్తిచేస్తారని పురాణాల చెప్తున్నాయ. హిందూ పురాణ గ్రంథాల ననుసరించి కైలాస పర్వతం దాదాపు ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందిగా తెలుస్తోంది. కరకురం పర్వత శ్రేణి, నాగపర్వతాల మధ్యలో ఉందీ కైలాస పర్వతం. దీనిని ‘క్వాంగ్‌రింపోచి’ అని పిలుస్తారు. దక్షిణ-పడమర దిశలో టిబెట్‌లో ఉండి, ఆసియా వాసులచే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా నీరాజనాలందుకుంటోంది. కైలాస మానస సరోవర యాత్ర చేయడానికి నాలుగు మార్గాలున్నాయి. రెండు నేపాల్ ద్వారా, ఒకటి ఇండియా ద్వారా, ఇంకొకటి పాకిస్థాన్ ద్వారా ఈ పుణ్యప్రదేశానికి చేరుకోవచ్చు.
ఈ భూమీదున్న అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పరమ పవిత్ర దివ్యక్షేత్రం కైలాస పర్వతం. సముద్ర మట్టానికి 6,714 మీటర్ల ఎత్తులో మానస సరోవర సమీపంలో కైలాసగిరి శిఖరాన్ని ప్రదక్షిణ మార్గంలో చేరుకోవాలే తప్ప అడ్డదారులేవీ లేవు. ప్రపంచంలో ఉన్న అతి ముఖ్యమైన పుణ్యప్రదేశాలలో మానస సరోవర కైలాస యాత్ర ప్రత్యేకమైంది. సాక్షాత్తు పరమశివుడి నివాస స్థలమైన కైలాస పర్వత దర్శనం అత్యద్భుతం. కైలాస మానస సరోవర యాత్ర వల్ల సమస్త దుఃఖాలనుంచి విముక్తి లభిస్తుంది. కొన్ని వందల జన్మలలో చేసిన పుణ్యఫలాల వల్ల కైలాస మానస సరోవర దర్శన భాగ్యం కలుగుతుందంటారు. జైనులు కైలాస పర్వతాన్ని అష్టపాద పర్వతంగా, 24వ తీర్థంకరుడైన రిషభదేవుడి నివాస స్థలంగా నమ్ముతారు. బౌద్ధులు కైలాస పర్వతాన్ని అమూల్యమైన మంచు పర్వతంగా, దేవతలు చక్రసంహర, డోర్సఫాణ్మోల నివాస స్థలంగా కొలవడం జరుగుతుంది. కైలాస పర్వత పాదాల వద్దకు చేరే యాత్ర అతి క్లిష్టమైనది. కైలాస పర్వతాన్ని చుట్టి వచ్చే యాత్రని ‘కోర’ లేదా పరిక్రమంగా చెబుతారు. హిందువులు ఈ పర్వత ప్రదక్షిణాన్ని ఆరోహణ క్రమంలో చేస్తే బోన్ మతస్థులు అవరోహణ క్రమంలో చేస్తారు.
మానస సరోవరానికి పది కిలోమీటర్ల దూరంలో ‘రాక్షసతాల్’ ఉంటుంది. మానస సరోవరం నుంచి కైలాసగిరికి ట్రెక్కింగ్ ప్రారంభమయ్యే ప్రాంతం ‘షిషాంగ్’. ఇక్కడ నుంచే కైలాస పర్వతం పరిక్రమ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం నుంచి భక్తులు పర్వతాలను అధిరోహించాల్సిందే. అది చేయలేనివారు గుర్రాల మీద కైలాస పర్వతానికి చేరుకోవాలి. షిషాంగ్ నుంచి దాదాపు పది గంటలు గుర్రంమీద ప్రయాణం చేస్తే ‘డేరాపుక్’ ప్రాంతం వస్తుంది. ఇక్కడ బస చేయడానికి ఓ వసతి గృహం కూడా ఉంది. డేరాపుక్ నుంచి కొంచెం ఎత్తుకి వెళితే ‘దార్చెన్’ ప్రాంతం వస్తుంది. ఇక్కడ నుంచి కైలాస పర్వతాన్ని ఉత్తరం వైపుగా దర్శించుకోవచ్చు. ట్రెక్కింగ్ చేస్తున్నంత సేపూ, పక్కగా బ్రహ్మపుత్రానది దర్శనమిస్తుంది. కైలాస యాత్రలో భక్తులకు అటు ఆధ్యాత్మికానందంతోపాటు, మానసికానందం కూడా సొంతమవుతుంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు; భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఓ పక్క విపరీతమైన చలి, ఇంకోపక్క అద్భుత ప్రకృతి సౌందర్యం వీక్షిస్తున్నామన్న భావన, ఇంకోపక్క సాక్షాత్తు ఆ మహాదేవుని ఆవాస స్థలం చూశామన్న ఆత్మసంతృప్తి మనల్ని అవ్యక్తమైన ఆనందానికి గురిచేస్తాయి. కైలాస పర్వతం ఒక్కొక్క సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంది. ఇదంతా సాక్షాత్తు ఆ మహాదేవుని లీలావిశేషంగా చెబుతారు.
  పంచామృతo.కైలాసాధిపతి

వెండికొండగా, బంగారు పర్వతంగా, ఇలా రకరకాల ఆకారాలలో ఇది కనిపిస్తుంది. భూమికి దాదాపు 6,714 మీటర్లు ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని దర్శించుకోవడం నిజంగా అదృష్టమే. కైలాస పర్వతం ఇతర పర్వతాలకన్నా భిన్నంగా ఉంటుంది. ఇతర పర్వతాలన్నీ జేగురు వర్ణంలో ఉంటే కైలాస పర్వతం మాత్రం మంచుతో ఉంటుంది. ఈ పర్వతం మీద అస్పష్టంగా కొన్ని రూపాలుంటాయి. ఇవన్నీ మనిషిలో అంతర్గతంగా ఉండే గుణాలకు ప్రతీకలుగా చెబుతారు. కైలాస పర్వత ప్రాంతంలో మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత చలిని తట్టుకోవడం సామాన్య విషయమేమీ కాదు. అందుకనే ఈ యాత్ర చేసే వారంతా ఆరోగ్యవంతులై ఉండాలి. అలాగే ‘హైఆల్టిట్యూడ్’ సమస్యలు కూడా ఇక్కడ యాత్రికులను బాధిస్తాయి. వీటినుంచి తట్టుకోవాలంటే మహదేవుని మీద విశ్వాసం, యాత్ర చేసి తిరిగి రాగలమన్న నమ్మకం ఉండాలి. టిబెట్ భాషలో కైలాస పర్వతాన్ని ‘గ్యాంగ్ రింపోచి’ (వెండి ఆభరణం)గా పిలుస్తారు. కైలాస పర్వతాన్ని మొత్తం చుట్టడాన్ని అంటే ప్రదక్షిణ చేయడాన్ని ‘కోరా’ అని పిలుస్తారు. అంటే 52 కిలోమీటర్ల వ్యాసంలో కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేయాలన్నమాట. అసాధారణమైన వాతావరణ పరిస్థితులలో ఈ పరిక్రమ చేయాలి. నిరంతరం హై ఆల్టిట్యూడ్ సమస్యలు వేధించి, ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఓ దశాబ్దం క్రితం వరకూ సాహసప్రియులకు సైతం ఈ పర్వతారోహణం ఒక సవాలుగా ఉండేది. అయితే చైనా-నేపాల్ సంబంధాలు మెరుగుపడడంతో, ఖాట్మండును టిబెట్‌ను కలుపుతూ ‘్భటెకోసి’ మీద ‘ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి’ నిర్మాణం కావడంతో మానస సరోవరానికి స్నేహవారధి ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని ‘కొడారి’ అని పిలుస్తారు.

మరో కైలాసం
మహా దేవుడికి మరో కైలాసం.. దేవభూమిలో దివ్యధామం.. లింగరూపుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు.. త్రివర్ణాలలో త్రినేత్రుడి మహాదర్శనం.. అపురూపం.. అపూర్వం.. భూమి ఆకాశాలను కలుపుతున్నట్లుగా ఉమాశంకరుడు స్వయంభువుగా అవతరించి భక్తుల మనోరథాలు ఈడేరుస్తున్నాడు. మన భూమిపైన.. మనకు అందుబాటులో  సాక్షాత్కరిస్తున్నాడు. ఇది వింత కాదు.. విడ్డూరం అంతకంటే కాదు.. పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు. నిజం.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రంగుల్లో ముక్కంటి తన భక్తుల ముచ్చట తీరుస్తున్న వాస్తవం.

భూమిపై కైలాసాలు ఎన్ని ఉన్నాయి. మహాదేవుడి నిజనివాసం ఎక్కడ.. టిబెట్‌లోని మానస సరోవరం పాదతీర్థంగా ఉన్న కైలాస పర్వతం కాకుండా, మరో కైలాసం ఉందా? అవును.. దేవదేవుడు హిమాలయ శ్రేణుల నిండా విస్తరించి ఉన్నాడు. హిమాలయాలకు అన్ని వైపులా కైలాస పర్వతాలు నెలకొని ఉన్నాయి. ప్రతిచోటా పలు రూపాల్లో పరమేష్టి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.. మహాదేవుడు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తున్న వైనం తొలిసారి టెలివిజన్‌ కెమెరాకు చిక్కింది..
హిమాలయాల్లో శివుడు మరో కైలాసంలో దర్శనమిస్తున్నాడు. మూడు రంగుల్లో త్రినేత్రుడు తొంభై అడుగుల ఎతె్తైన సహజసిద్ధ శివలింగంగా కనిపిస్తున్నాడు.. ఒక రోజులో మూడు వర్ణాలు మారే శివలింగం.. దేవభూమిలో మహాద్భుత దృశ్యం ఆవిష్కారమైంది.. అత్యంత ఎతె్తైన మంచు కొండల పైన, నిటారుగా, నిరాకారంగా వెలసిన మహాద్భుత అవతారం..
17, 500 అడుగుల చుట్టు కొలత
18వేల అడుగుల ఎత్తున మహా శివలింగం
రంగులు మారే మహాదేవుడు
ఉదయం రజతం
మధ్యాహ్నం సువర్ణం
సాయంత్రం నీలమేఘం
మూడు వర్ణాల్లో ముక్కంటి
ఆధ్యాత్మిక క్షేత్రంలో అపురూప సన్నివేశం

బోళా శంకరుడికి రెండో  కైలాసం ఏమిటని ఆశ్చర్యపోకండి.. ఇది వాస్తవం.. ఆయన నిజంగానే బోళా శంకరుడు.. అందుకే భక్తులను ఇబ్బంది పెట్టకుండా సులభసాధ్యుడయ్యాడు.. కోరుకున్న చోటనే దర్శనమిస్తున్నాడు.. అదే ఈ రెండో కైలాసం.. మౌంట్‌ కైలాస పర్వతం మాత్రమే కాదు.. అది ఆయన నిజనివాసం కావచ్చు. కానీ, శివుడికి రెండో కైలాసం హిమాచలంలోనే ఉంది. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తున ఉంది. భక్తులను పలు వర్ణాల్లో అలరిస్తోంది. వారికి అందుబాటులో ఉంది. కొంచెం కష్టపడితే లయకారుడి దివ్యదర్శనం లభ్యమవుతోంది..

కిన్నెర కైలాసం. పరమేశ్వరుడి నిజకైలాసాన్ని మరిపించే కైలాసం..చూస్తున్న కొద్దీ చూడాలనిపించే కైలాసం.. అణువణువునా ఆధ్యాత్మికత నిలువునా కమ్మేసే అపురూప ప్రదేశం.. అక్కడ శివలింగం రంగులు మారటం విశేషం.. ఒకే ప్రాంతంలో.. ఒకే చోట.. నిశ్చలంగా ఉన్న శివలింగం ఏ విధంగా రంగులు మారుతోంది.. ఇదెలా సాధ్యపడుతోంది?

శివలింగం రంగులు మారటం ఏమిటి? శివుడి మహత్యమా? మాయా? నిజంగా ఈశ్వరుడి లీలలు అక్కడ కనిపిస్తున్నాయా? దీని వెనుక సైంటిఫిక్‌ రీజన్‌ మరేదైనా ఉందా? ఇందులో రహస్యం దాగున్నదా? సముద్ర మట్టానికి దాదాపు 18 వేల అడుగుల ఎత్తున ఉన్న త్రివర్ణాలలో కనిపిస్తూ కెమెరా కంటికి చిక్కటం నిజంగా విశేషం.. ఇంతకీ ఈ అద్భుత ఆవిష్కారం ఎక్కడ దాగి ఉంది? వాస్తవం ఏమిటి?

హిమాచల ప్రదేశ్‌లో కిన్నౌర్‌  ప్రాంతం.. టిబెట్‌కు తూర్పున హిమాచల్‌ ప్రదేశ్‌ దాకా కొనసాగే హిమాలయ శ్రేణి అంతా దేవ భూమి.. ఒక అద్భుతమైన వాతావరణం.. మౌనంగా ఉన్నా, గాలిలో ఈశ్వరుడి పేరు ప్రతిధ్వనించే ప్రాంతం. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్‌ జిల్లా ఉంది..

కిన్నౌర్‌ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో.. నిజంగా అందాల కోన.. మూడు హిమాలయ పర్వతాలు పక్కపక్కనే పేర్చినట్లు ఉంటాయి. జన్‌స్కర్‌, గ్రేటర్‌ హిమాలయ, దౌలంధర్‌ శ్రేణులు సట్లెజ్‌, స్పిటి, బాస్పా వంటి జీవనదులకు పుట్టినిళు్ల.. వీటి మధ్యలోనే అన్నింటికంటే అత్యంత ఎత్తుగా కిన్నెర కైలాస్‌ పర్వతం కొలువుదీరి ఉంది.

సట్లెజ్‌ నదీతీరంలో అందమైన జలపాతాల నడుమ 18వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతాన్ని చూడటానికి వేయి కన్నులున్నా సరిపోవు.. ఈ కొండపైనే సహజసిద్ధమైన శివలింగం ఆవిర్భవించి ఉంది. యోగులకు, సిద్ధులకు మాత్రమే కాదు.. సామాన్యులకు కూడా సాక్షాత్కరించే అతి గొప్ప శివలింగం.. తొంభై అడుగుల ఎతె్తైన శివలింగం..

ఇది అలాంటిలాంటి శివలింగం కాదు.. మనం సాధారణంగా చూసే మాదిరిలో దీని ఆకారం ఉండదు.. కిన్నెర కైలాసం పీక్‌ స్టేజ్‌లో నిటారుగా నిలుచుని ఉన్న రాతినే శివలింగంగా భక్తులు భావిస్తారు.. కేవలం రాయిని శివలింగంగా ఎందుకు భావించారు.? అదే ఇక్కడి ప్రత్యేకత.. ఇది కేవలం రాయి కాదు.. ఇందులో జీవశక్తి ఉందని ఇక్కడ ఉపాసించే సిద్ధుల దృఢమైన అభిప్రాయం. ఎందుకంటే ఈ శివలింగం రోజులో మూడు కాలాల్లో మూడు రంగుల్లో కనిపిస్తుంది. నిర్దిష్ట సమయానికి శివలింగం రంగు మారుతుంది.
అత్యంత ఎతె్తైన ప్రాంతంలో ఉన్న ఈ శివలింగం ఉదయం భానుడి లేలేత కిరణాల స్పర్శతో  మిలమిలా మెరిసిపోతుంది.. వెండి రాశి పోతపోసుకున్నట్లుగా తెల్లగా ఈ శివలింగం దర్శనమిస్తుంది. మధ్యాహ్నానికి సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చేసరికి పసిడి వన్నెలోకి మారిపోతుంది.. ఇదే మహాలింగం సాయంత్రం అయ్యేవేళకు నీలిరంగులో ధగధగలాడుతుంది.. ప్రపంచంలో అతి గొప్ప పరిణామ క్రమం ఇది. శివలింగం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ రంగులు మారుతున్నాయి. ముక్కంటి మాత్రమే ఈ విధంగా దర్శనమిస్తున్నాడు.. ఇది ఆయన లీలా విలాసమేనా? మరేదైనా మర్మముందా?

ప్రపంచంలో కిన్నెర కైలాసంలో  మాత్రమే ఈ అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. అదీ ఈ శివలింగం నెలకొని ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇలా రంగులు మారుతాయి. ఈ పరిణామం దేనికి సంకేతం? శివలింగం మాత్రమే కాదు. కిన్నెర కైలాస పర్వతానిదే ఒక ప్రత్యేకత. మౌంట్‌ కైలాసాన్ని మరిపించే ఈ కిన్నెర కైలాసం మర్మం ఏమిటి?   ..లుక్‌

కిన్నెర కైలాసంలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం మూడు వర్ణాల్లో కనిపించేందుకు ఇక్కడ ఉపాసకులు ఆసక్తికరమైన కథనాలను వినిపిస్తారు.. ఉదయం వెండి రంగులో  శివలింగం కనిపిస్తుంది.. సూర్యుని కిరణాలు శివుడి తలపె ఉన్న జాబిల్లిని తాకుతాయి.  జాబిల్లి నుంచి వెలువడే వెన్నెలే ఈ తెలుపు రంగుకు కారణం.. ఈ వెన్నెలకు భూతనాథుడి ఒంటిపై ఉండే విభూతి తోడై అద్భుతంగా విరాజిల్లుతుందని శివభక్తులు చెప్తారు..

మధ్యాహ్నానికి కిన్నెర శివలింగం పసిడి వన్నెలోకి మారిపోతుంది. శివుడు ధరించిన పులిచర్మం, పట్టపగలు తనపై నేరుగా పడే సూర్యుడి కిరణాలకు బంగారు రంగులో మెరిసిపోతుందిట.. ఈ రంగు చుట్టూ ఉన్న మేఘాలపై ప్రసరించి మరింత అద్భుత దృశ్యం ఆవిష్కారమవుతుంది.

సాయంకాలానికి ఈశ్వరుడి లయవిన్యాసం విశ్వరూపం దాలుస్తుంది. ఆయన కంఠంలో ఉన్న గరళం ఒక్కసారిగా చైతన్యవంతం అవుతుంది. గరళం నుంచి వెలువడే సెగలు ఒక్కసారిగా శివలింగాన్ని నీలివర్ణంలోకి మార్చేస్తాయి. ఇదొక అద్భుత సన్నివేశం.. అపురూప ప్రకృతి స్వరూపం.

పురాణాలు చెప్పే కథనాలు  ఆధ్యాత్మిక భావనను వెల్లడి చేస్తున్నాయి. ఈ కథలు, కథనాలు సైన్‌‌సకు అంతుపట్టవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలో, సూర్యుడి ప్రస్థానంలో, వాతావరణంలో, హిమాలయ శ్రేణుల్లో సాగే మేఘాలు ఈ శివలింగాన్ని తాకుతూ వెళ్తాయి. అందువల్లే ఇక్కడ ప్రకృతిలో రంగుల మార్పులు జరుగుతాయని సైంటిస్టులు ఒకరకమైన అంచనా వేస్తుంటారు..

సైంటిస్టులు చెప్పిన మాటలో లాజిక్‌ లేకపోలేదు. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న ఎలాంటి జవాబుకూ చిక్కడం లేదు. ఎందుకంటే నిజంగా ప్రకృతిలో, వాతావరణంలో మార్పుల వల్ల ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే ఆ ప్రాంతం అంతటా అదే విధంగా రంగులు మారుతూ ఉండాలి.. కానీ, ఒక్క శివలింగం ఉన్న పరిసర ప్రాంతంలోనే ఇలా జరుగుతోంది.. కిన్నెర కైలాస పర్వత శ్రేణిలోనే ఈ వర్ణాల మార్పు జరుగుతోంది.. దీనికి మాత్రం ఇప్పటివరకు ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు.. మరి ఇది నిజంగా ఈశ్వరుడి మాయా? ఏమో..

సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తున జరుగుతున్న అద్భుతం ఇది.. సైన్‌‌సకు ఎంతమాత్రం అందని, అంతుపట్టని ప్రకృతి విన్యాసం ఇది. కేవలం శివలింగం మాత్రమే కాదు.. మొత్తం కిన్నెర కైలాస్‌ పర్వతం అంతా శివుడి ఉనికిని, అస్తిత్వాన్ని, ఆయన తేజస్సును విరజిము్మతున్నది.. అక్కడికి వెళ్లే భక్తులందరికీ ఇదే అనుభూతి కలుగుతోంది.. హేతువాదులకు సైతం ఆధ్యాత్మిక భావనను కల్పించే వాతావరణం అక్కడిది.                   
కైలాసాలు ఒకటి కంటే ఎక్కువ ఉండటం ఏమిటి? ఎలా ఏర్పడ్డాయి ఇవి..? వీటికి స్థానిక కథనాలు చాలానే ఉన్నాయి. రుద్రుడు హిమాలయాలను సృష్టించినప్పుడు ఆయన తన గణాలకోసం ప్రత్యేక స్థానాలను ఏర్పాటు చేశాడు.. అందులో కిన్నెరుల కోసం ఏర్పాటు చేసిన ఆవాస స్థలమే కిన్నెర కైలాసం.. ఇక్కడ కిన్నెరులు తనను ఆరాధించటం కోసం స్వయంభువుగా లింగరూపుడై అవతరించాడని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం..

శివుడి నిజనివాసం టిబెట్‌లోని కైలాస పర్వతం.. దీని చుట్టూ బయటి నుంచి ప్రదిక్షణ  చేయటమే గొప్ప సాహసం.. కిన్నెర కైలాసం అలాంటిది కాదు.. ఇక్కడికి శివలింగం వరకు వెళ్లి స్పృశించి వచ్చే అవకాశం ఉంది.. కాకపోతే కిన్నెర కైలాసం ఒక్కోసారి మౌంట్‌  కైలాస్‌నే తలపిస్తుంది. కొన్ని వేళల్లో కిన్నెర కైలాసాన్ని చూస్తే, మౌంట్‌ కైలాస్‌కు, దీనికి అస్సలు తేడా కనిపించదు.. కైలాస పర్వతం, కిన్నెరకు వచ్చేసిందా? అన్నంత కన్ఫూ్యజన్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఈ ప్రకృతి వింతను చూసి తీరాల్సిందే..

శివుడికి కైలాసాలు కేవలం రెండే కాదు.. మొత్తం అయిదు కైలాసాలు ఉన్నాయని చెప్తారు.. వీటిలో మొదటిది మౌంట్‌ కైలాస్‌..ఇది టిబెట్‌లో ఉంది. రెండవది కిన్నెర కైలాస్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఉన్న గొప్ప పర్వతం ఇది. ఇక మూడవది మౌంట్‌ ఆది కైలాస్‌.. ఇది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ జిల్లాలో ఉంది. దీన్ని చోటా కైలాస్‌ అని కూడా పిలుస్తారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనే రాంపూర్‌ జిల్లాలో శ్రీఖండ్‌ కైలాసం ఉంది. ఇది నాలుగో కైలాసం. ఇదే రాష్ర్టంలో చంబా జిల్లాలో మణి మహేశ్‌ కైలాసం ఉంది.. మొత్తం అయిదు కైలాసాల్లో శివుడు ఆదిపురుషుడిగా, ఈశ్వరుడిగా నెలకొని ఉన్నాడు.
భారత దేశ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో  హిమాలయాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మన దేశానికి సంబంధించి భక్తి ఉద్యమం అంతా కూడా హిమాలయాలనుంచే ప్రారంభం అవుతుంది.. అక్కడే ముగుస్తుంది కూడా.. హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించిన ప్రాంతం అంతా దేవతల భూమిగా, దేవ లోకంగా భారతీయులు గట్టిగా నము్మతారు.. అక్కడి వాతావరణం కూడా అదే విధంగా ఆధ్యాత్మిక వాసనలను వెదజల్లుతుంటుంది.. కిన్నెర కైలాసం అందులో పీక్‌ లెవల్‌లో ఉంది. దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా ఒక్కసారి అక్కడికి వెళ్లి వస్తే మానసికంగా మనిషిలో కలిగే మార్పు మాత్రం తిరుగులేనిది.

Friday, January 10, 2014

గౌరీపతి{నటరాజు}శివతాండవం,మంకణ మహర్షి కథ-శ్రీ శివ మహాపురాణము,అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు{పాణిని మహర్షి}

 గౌరీపతి{నటరాజు}

శివతాండవం

ఏమానందము భుమీతలమున !
శివతాండవమట ! శివలాస్యంబట !
అలలై , బంగారు
కలలై ,పగడపు( బులు(గులవలె మ
బులు విరిసినయవి
శివతాండవమట ! శివలాస్యంబట !
వచ్చిరొయేమొ! వి
యచ్చర కాంతలు
జలదాంగనలై విలోకించుటకు
శివలాస్యంబట !
యేమానందము భుమీతలమున !
పలికెడునవె ప
క్షులు ప్రా(బలుకులొ !
కల హైమావతీ
విలసన్నూపుర
నినాదములకు
న్నునుకరణంబులొ !
కొమ్మల కానం
దొత్సాహమ్ములు
మమ్మరముగ మన
ముల(గదలించెనొ!
తలనూచుచు గు
త్తులుగుత్తులుగా
నిలరాల్చును బూ
వులనికరమ్ములు
రాలెడు బ్రతి సుమ
మేలా నవ్వును !
హైమావతీ కుసు
మాలంకారము లందున ( దానొక
టౌదు నటించునొ !
లలితా మృదు మం
జులమగు కాయము
పూవుల తాకుల
తో వసివాడెదో ! భారతియుట పా
ర్వతికి నలంకా
రము(దీర్చెడునది!
రమణీయాస్మిత ముల( గావించెనొ
యలరులు మృదువులు !
చతురానును(డే
సవదరించునట శర్వనకుత్తమ
సర్పవిభూషులు !
వీచె విశబ్దిత
కీచకములు మృదు
వీచులు గా( ద
ర్పితలోకమ్ములు
మారుతములు గో
టీరి తాబ్జు(డగు
శివునకు సేవలు
జెల్లించుటకై

తకఝుం తకఝుం
తకదిరికిట నా
దమ్ములతో లో
కమ్ముల వేలుపు
నెమ్మిగ వెల(బడి
నృత్యమాడు నెడ
లయానుగతి(గ
మ్రమ్ముగా శ్రుతి(బ
టుటకో! గొంతులు
సవదరించు ను
త్కటభృంగమ్ములు
ఈ సెలకన్నెల కెవ్వరు జెప్పిరొ!
యా సర్వేశ్వరు
నభినయమహమును
కుచ్చెళ్లులెల్లెడ
విచ్చలవిడిగా
దుసికిళ్లాడ(గ
నసమున (బరుగిడు
ఓ హో హో హో !
యూహాతీతం
బీయానందం
బిలాతలంబున !
సంధ్యాసతి ! యీ
సంభ్రమ మేమిటె !
నవకుసుంభరా
గవసనమేమిటె !
ఆకుంచిత తి
ర్యక్రపసారి ల
జ్జామధుర కటా
క్షపాతమేమిటె !
విలాసవక్రిత
విచలన్మధ్యం
బునహ్రీమతి ! నీ
వునువలెనే చిఱు
పలుకని మేఖిల
వాలక మేమిటె !
యెవ్వరికోసర మీబిబ్బోకము !
శివపూజకో ! యో
చెలువా ! యీ కధ
లెవ్వరు జెప్పిరె ?
యిలాతలంబే
ఆడెడునట నా
ర్యాప్రాణేశ్వరు(
డో దినమణి !నిలు
రా ! దినమింతయు(
బడమటీ దేశపు
వారలకీ కధ
నెఱిగించుటకై
పరుగెత్తెదవో !
అల మృగములు క
న్నుల బాష్పమ్ములు
విడిచెడు నెందుకు !
విశ్వేశ్వరునకు
అడుగులుగడుగుట
కై పాద్యంబో !!!
గుసగుసమని యీ
కిసలయములు స
మందపూరముగా
మాటలాదునెదొ!!!
యేమున్నది! లో కేశ్వరునాత్యమే
ఓ హో హో హో
ఊహాతీతం
బీయానందం
బిలాతలంబున!!!
  1. నటరాజు నామవాచకం. వ్యుత్పత్తి. నాట్యములో రాజు-- శివుడు
నటరాజు పరమ శివుని అవతారం. సకల నాట్యాలకు అధిపతి.కుడి వైపున వెనుక ఉండే చేయి ఢమరుకాన్ని కలిగి ఉంటుంది. ముందుకు ఉండే కుడి చేయి అభయ ముద్రను సూచిస్తుంటుంది. వెనుక వైపునున్న వామ హస్తం అగ్ని ని కలిగి ఉంటుంది. ముందువైపు ఉండే ఎడమచేయి గజహస్తం ముద్రలో ఉంటుంది. జులపాలు నలువైపులకు విసిరివేసినట్లు ఉంటాయి. ఝటాజూటంలో గంగాదేవి, అర్థ చంద్రాకారం ఇమిడి ఉంటాయి. ఆయన ఆకారం మొత్తం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది.

శివాలయాలలో "వ్యాకరణ దాన మండప మంటూ ఒక మండపముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను. ఈ శ్లోకం చూడండి :

 నటరాజు

                                       "నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాదినేతత్‌ విమర్శే శివసూత్ర జాలం"
"అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. 
నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది ఈ శ్లోక తాత్పర్యమిది.
నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్యమాడుతూన్నంతసేపూ ఆ జడలు కూడ తిరుగుతూంటాయి. నర్తనమాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు.
నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండేవాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు. పై శ్లోకంలో ""ననాదఢక్కాం అన్న మాటకిదే అర్థం.
వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్‌ వంటివి - తంత్రులనుపయోగించేవి (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి.
చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ""చోపు అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (""నృత్తావసానే) చోపు ధ్వని వినబడింది.
నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, బుుషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థా్యన్ని ""దివ్యదృష్టి అంటారు. దీనినే భగవద్గీతలో ""దివ్య చక్షు వన్నారు.
సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ""చోపు వస్తుంది. పై శ్లోకంలోని ""నవపంచవారం. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది.
డమరుకపు దరువుల విద్యలుకూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజుకూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది బుుషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనత్‌ కుమార,సనత్సుజాతులనే మహర్షులు. ఆ పధ్నాలుగు దరువులూ ఈ బుుషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ""శివభక్తి సూత్రాలంటారు. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.
నర్తనం చివరిలో డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ""అష్టాధ్యాయి అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించాడు. దీనిలో ఎనిమిది అధ్యాయాలుండటం వల్ల దీనిని ""అష్టాధ్యాయి  అంటారు.
అ పధ్నాలుగు సూత్రాలనీ ""మహేశ్వర సూత్రాలు అంటారు.
    సూత్రాలను శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసేప్పుడు పఠిస్తారు. (ఈ ఉపాకర్మని తమిళంలో ఆవని అవట్టం అంటారు) నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధమిదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.

 శివ మహాపురాణము

శౌనకాది మహర్షులు కోరికమేరకు, శివుడు నటరాజు మూర్తిగా మారుటకు ప్రేరకుడైన మంకణ మహర్షిలవారి కథ చెప్పాడు సూత పౌరాణికుడు.

"ఆర్యావర్తము అనే పుణ్యభూమిలో సప్తసారస్వతము అనే మహాతీర్థం ఉంది. అక్కడ తపస్సు చేస్తే, శివజ్ఞానం తపస్సిద్ధిగా కలుగుతుంది. అది తెలుసుకున్న పరమశివభక్తుడు మంకణ మహాముని మహర్షుల ఉపదేశానుసారం, అతీర్థాన్ని చేరి, స్నానమాచరించి, ఆవొడ్డునే తపోనిష్ఠలో మునిగి పోయాడు. పంచాక్షరీజపం (ఓం నమశ్శివాయః)తో అతని శరీరం సూర్యసమాన తేజోవిరాజితం కాసాగింది. క్రమంగా భక్తిపారవశ్యంలో తాండవంచేయ సాగాడా మహర్షి. అంతటి భక్తికి మెచ్చి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ - మంకణుడు తాండవం ఆపడే!? శివుడు ఆమహర్షిని ఆపడానికి ప్రయత్నించి, ప్రశ్నలవర్షం కురిపించాడు ఎవరికోసం నీతపం? ఈ తాండవం ఏమిటి? నీ కోరిక లేమిటి? దేనికీ జవాబు చెప్పడాయె ముని. తాండవం ఆపడు.

దాంతో శివుడు ఉగ్రుడై - సహస్రశిర, కర, చరణ, సహస్రనేత్రాది విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా మహాతాండవం ప్రారంభించాడు. ఆయనతో బాటూ ఒక స్త్రీమూర్తి కూడా ఉన్నది. ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దాంతో అతడికి జ్ఞానోదయం కలిగి "మహా నటరాజమూర్తి! శరణు! శరణు!" అంటూ సాష్టాంగ దండప్రణామం ఆచరించాడు. అంతట శివుడు శాంతించి, విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీమూర్తి కూడా అంతర్హితురాలైంది.

మంకణుడు ఆయనకు నమస్కరించి, "దేవాధిదేవా! మహాశివా! ఈ మహాతాండవమేమిటి? ఇంతవరకు మీ పక్కన నిలిచిన ఆ దేవీమూర్తి ఎవరు?" అని ప్రార్ధించగా "ఇది పరమేశ్వరుని దివ్యరూపం ! ఆ దివ్య మూర్తిని నేనే! నాతో ఉన్న దేవి ప్రకృతిరూపిణి. బ్రహ్మరూపుడనై నేను సకల చరాచరాలను పంచవింశతి (ఇరవైఐదు) తత్త్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వప్రాణుల యందూ నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈతత్త్వం గ్రహించి, భక్తితో నన్ను ఉపాసించి శివ సాయుజ్యంపొందు" అని ఆనతిచ్చాడు పరమశివుడు.

కనుక - లింగరూపుడైనా, అర్థనారీశ్వరుడయినా, నటరాజు అయినా అంతా శివమయమే!" అని వివరించాడు రోమహర్షణ పుత్రుడు.

బ్రహ్మ, తన సృష్టికి హంగులన్నీ సమకూర్చిన రుద్రమూర్తి చేతనే ప్రేరితుడై తన దేహాన్ని అర్థనారీశ్వరుడిగా మార్చుకున్నాడు. తనలో తానే రమించాడు. ఫలితంగా (మధనం లోంచి) స్వాయం భువ మనువు పుట్టాడు. అతడితో పాటే శతరూప అనే యోగిని జన్మించింది. వారిద్దరికీ సంధానం గావించాడు బ్రహ్మ. వీరివల్ల వరుసగా వారికి ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు సంతానమై జన్మించారు. వీరిలో మూడవస్త్రీ సంతానమైన ప్రసూతిని దక్షప్రజాపతికిచ్చి కట్టబెట్టారు. 'సతీ'దేవిగా - జ్యేష్ఠురాలిగా పార్వతి జన్మించింది - ఈ దక్షునికే. అయితే ఈయన మరొకభార్య అయిన వీరిణి (అసిక్నీ) యందు సతీదేవిగా పార్వతీ జననం జరిగింది. దానికి మూలభూతమైన సంఘటన ఒకటి ఉంది.


మన్మధుణ్ణి ప్రేరేపించి, రెండుసార్లు తపోనిష్ఠా గరిష్ఠుడై వున్న శివునిమీదికి దండయాత్ర చేయించి పరాభూతుడైవున్న బ్రహ్మ, ఏం చెయ్యాలాఅని చతుర్ముఖాలతోనూ ఎన్నెన్నో చతురోపాయాలు వెతికాడు. ఏవీ ఫలిస్తాయన్న నమ్మకం కలగక, నారాయణమూర్తిని ప్రార్థించాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు తలచినదే తడువుగా ప్రత్యక్షమై "కుమారా! ఏమిటి నీకొచ్చిన కష్టం?" అని అరాతీశాడు - ఎంతో వాత్సల్యంగా.

జరిగిందంతా వివరంగా చెప్పి "ఏది ఏమైనా సరే! అ కాలకంఠుని కాంతాదాసునిగా చెయ్యాలి. కామాగ్ని తీవ్రత ఎంతటిదో తెలియచెప్పాలి" అని వేడుకున్నాడు.

"ఇంతేకదా! ఇదేమంత గొప్పసంగతి? గతంలో ఓసారి రుద్రుడు తన పుర్ణావతారం అనీ, తనతోపాటు చరించే మాయను 'సతీ' భావంతో గ్రహించి రుద్రాణిని చేస్తానని అన్నాడు కదా! ఇదంతా మన సంకల్పం కాదు! ఆ పరమమాహేశుని సంకల్పమే! నువ్వు ఆ పరాంబికను వేడుకుని, సతిగా అవతరించమని కోరు. అలాగే - దక్షుడిని కూడా తపస్సు చేయమని చెప్పు!" అంటూ ఉపదేశించి అంతర్థానమయ్యాడు శ్రీహరి.


దక్షుడిని రప్పించాడు పరమేష్టి. "జగన్మాతయైనట్టి మహామాయ గూర్చి తపస్సు చేసి, నీ కుమార్తెగా అవతరించమని కోరుకో!" అని అదేశించి, తానుకూడా ఆ జగజ్జననిని ప్రార్థించాడు - ప్రజాపతి.

అమ్మవారు ప్రత్యక్షమై, శివసంకల్పాన్ని ఆకళింపు చేసుకుని బ్రహ్మ కోరిన విధంగా - శివదీక్షకు మంగళాంతం చెప్పించి, తాను అతని పత్నిగా అవతరించ నిర్ణయించుకుంది సర్వమంగళ. బ్రహ్మకు అభయ ప్రదానం చేసి, అక్కడ తపస్సు చేస్తున్న దక్షుని ఎదుట ప్రత్యక్షమైంది. తన కుమార్తెగా పుట్టవలసిందనీ - అదే తనకు మహాభాగ్యమనీ బ్రహ్మాదేశానువర్తిగా కోరుకున్నాడు దక్షుడు. తథాస్తు! అని ఆమె అంతర్హితురలైంది.

యక్ష రాక్షస గరుడ దంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాలూ ఏ దేవి ఎదుట పాదాక్రాంతమై పాహి పాహి అని శరణువేడుతాయో, ఆ మహాదేవి పాపగా అవతరించి, దక్షునికిచ్చిన వరం ప్రకారం, 'ఉమ' అనే నామధేయంతో పెరగసాగింది.

ఆమెకు యుక్తవయస్స రాగా, బ్రహ్మాదులందరూ, ఇక శివునిచేత గృహస్థాశ్రమం స్వీకరింపజేసే తరుణం వచ్చిందని తలపోసి - ఉమను శివపంచాక్షరీ మంత్రస్మరణ ద్వారా, సర్వకాల సర్వావస్థల యందూ శివాయత్త చిత్తతతో ఉండమని వేడుకుని, శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళారు.

దేవతలంతా తమ మానసాన్ని అ పరమశివుని ఎదుటపరిచి, పరిపరి విధాల ప్రార్థించగా, ఎట్టకేలకు అంగీకరించాడు శివుడు. అదే పరమవరం అనుకున్నారందరూ.

కానీ, శివుడు ఒక షరతు విధించాడు -

తాను నిరంతరం ఆత్మధ్యానంలో ఉంటాననీ; తనను వరించబోయే లలనామణి, ఏనాడూ తన సాధనకు అడ్డుకారాదనీ; తాను కాముకుడిగా సంచరించువేళ మాత్రమే ఆమె కాముకి కావాలనీ; తనకు సానుకూలంగా వర్తిల్లగలిగే పిల్లనే పెళ్లాడగలననీ పరమశివుని వాక్యసారాంశం. సరే నన్న దేవతా సమితి క్రమక్రమంగా దాక్షాయణి విషయాన్ని, శివుని చెవిన వేసి - ఔననిపించుకున్నాక గాని, వారి హృదయాలు తేలికపడలేదు.
 అష్టాధ్యాయి

3.అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు

అష్టాధ్యాయి అనగా అష్టానాం అధ్యాయ్యానాం సమహారము అని అనెదరు. ఆ గ్రంధమున ఎనిమిది (8)అధ్యాయములు కలవు. దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు కలవు.

 4.పాణిని మహర్షి:

సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

1) ఎనిమిది దేవతలు
2) ఎనిమిది పండితులతో రాయబడినది
3) ఎనిమిది అధ్యాయాలు            
పాణిని అనే మహర్షి వ్రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణం గ్రంథం. ఈయన క్రీ.పూ. 7వ శతాబ్దికి చెందినవాడు. మాహుర్ అనే పట్టణంలో జన్మించాడు. ప్రస్తుతమిది పాకిస్థాన్లో ఉంది. ఇతడు పుట్టుకతోనే తెలివైన వాడు కాదట. మందమతిగా ఉండేవాడు. తండ్రి ఇతనిని విద్యాభ్యాస నిమిత్తం గురుకులంలో చేర్పించాడు. మందమతి కావడం వల్ల చదువొచ్చేది కాదు. అతనిని భరించలేక, అతడి వల్ల మిగతా పిల్లలు కూడా పాడవుతారని గురువుగారు అతడిని ఆశ్రమం నుండి పంపిచేశారు. అతడు బాధతో ఇంటికి వెళ్ళక హిమాలయాలకు పోయి శివుని కోసం తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శివ దర్శనం అయి ఆయన 14సార్లు మ్రోగించిన ఢమరుక నాదము అతడికి 14 సూత్రాలుగా వినిపించాయి. దానితో అతడు కావ్య రచన చేశాడు. అలా అతడు వ్రాసినదే అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణ గ్రంథం. 

Thursday, January 9, 2014

గంగాధరుడు

 గంగాధరుడు

గంగను ధరించిన వాడు..... శివుడు.
గంగ + ధరుడు=గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.
గంగాదేవి హిమవంతుని పెద్దకూతురు. (చిన్న కూతురు - పార్వతి). భగీరథుడు గంగను భువికి తరలించే ప్రయత్నంలో శివుని జటలలో చిక్కుకొనుటవలన, శివున్ని గంగాధరుడు అంటారు. కొందరు కవులు, గంగా-శంకరుల సమాగముగా వర్ణిస్తారు. ఈవిధంగా గంగ, శివుని రెండవ ఇల్లాలు అని ఒక భావం.

 శివుని జటాజూటములలో చిక్కుబడినపిమ్మట, భగీరథుని ప్రార్థనమేరకు గంగను బిందు సరోవరంలోనికి విడుస్తాడు. అక్కడనుంచి గంగ 7 అంశలతో (పాయలతో) ప్రవహిస్తుంది. హ్లాదిని, పావని, నళిని (బ్రహ్మపుత్ర) పాయలు తూర్పు ముఖముగా; సుచక్షు, సీత, సింధు పశ్చిమాభిముఖముగా; ఏడవపాయ భగీరథున్ని అనుసరిస్తాయి. భగీరథున్ని అనుసరించిన సప్తమి మార్గమధ్యమున జహ్నుమహర్షి యఙ్ఞశాలను ముంచేస్తుంది. కృద్ధుడైన మహర్షి భాగీరథీ జలమంతటినీ మ్రింగేస్తాడు. భగిరథుని, దేవతల ప్రార్థన మేరకు చెవుల ద్వారా గంగని విడుస్తాడు. ఈ విధంగా గంగ, జాహ్నవిగా సరికొత్త అవతారము ఎత్తినది.

ఈ విధంగా భూమ్మీద నదీ జలాలన్నీ గంగా దేవి స్వరూపాలే.

1.మేన-హిమవంతుల జ్యేష్ట పుత్రిక - శివుని రెండవ ఇల్లాలు.
2.బిందుసరోవరమున పుట్టిన ఏడుగురు అక్కచెల్లెళ్ళు: హ్లాదిని, పావని, నళిని, సుచక్షు, సీత, సింధు, సప్తమి.
3.భగీరథుని పుత్రిక - భాగీరథి (సప్తమి).
4.జహ్ను మహర్షి పుత్రిక - జాహ్నవి.

మహాభారతమున ప్రతీపుని కోడలు, శంతనుని భార్య అయిన గంగ జాహ్నవి. అష్టవసువులను భూమ్మీద జన్మించమని వశిష్టమహర్షి శపించగా, వారు హిమవంతుని పుత్రిక అయిన గంగాదేవిని ప్రార్థిస్తారు. గంగాపుత్రులుగా జన్మించిన వెనువెంటనే దేహవిముక్తిని కోరతారు. ఎనిమిదవ వసువు ప్రభాసుడు -శాపానికి మూలకారణమైనవాడు కావున, గంగా పుత్రునిగా చిరకాలం జీవిస్తాడు. గంగ జాహ్నవిగా అవతరించిన పిమ్మట, అష్ట వసువులు జాహ్నవీ-శంతనుల పుత్రులుగా జన్మిస్తారు. ప్రభాసుడు దేవవ్రతునిగా (భీష్ముడు) పెరుగుతాడు.

విశ్వనాథాష్టకం - తాత్పర్యం


  గంగాధరుడు
ఆది శంకరులు నుతించిన కాశీ విశ్వనాథుని అష్టకం
గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం: గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

తాత్పర్యం: ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.  

శ్రీ రుద్ర నమకమ్

శ్రీ రుద్ర నమకమ్

ఓం శారతి శ్శాంతి శ్శాంతిః || 
రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి - లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ఇలా. ఆ నమక చమకాల్లోని నమకం, దాని తాత్పర్యము మీకోసం.
 శ్రీ రుద్ర నమకమ్
శ్రీ రుద్రప్రశ్నః నమకమ్

అథ ప్రథమోఽనువాకః
          
ఓం నమో భగవతే రుద్రాయ

ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః

యాత ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయా

యా తే రుద్ర శివా తనూరఘోరాపాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి

యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్‍ంసీః పురుషం జగత్

శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్‍ం సుమనా అసత్

అధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీగ్‍ంశ్చ సర్వాం జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగలః
యే చేమాగ్‍ం రుద్రా అభితో దిక్షు
శ్రితాః సహస్రశోవైషాగ్‍ం హేడ ఈమహే

అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అథో యే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః

ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం
యాశ్చ తే హస్త ఇషవః
పరా తా భగవో వప

అవతత్య ధనుస్త్వగ్‍ం సహస్రాక్ష శతేషుధే
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్‍ం ఉత
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషన్గథిః

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః
తయాఽస్మాన్విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే

పరి తే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తం

హస్తే దిక్ష్విషవ ఉభాభ్యాం ద్వావిగ్‍ంశతిశ్చ

ఇతి ప్రథమోఽనువాకః

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓమ్

అథ ద్వితీయోనువాకః

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో నమో
హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహంత్యాయ వనానాం పతయే నమో

నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః

వనానాం పతయే నమో నమ ఏకాన్నత్రిగ్‍ంశచ్చ

ఇతి ద్వితీయోనువాకః
అథ తృతీయోనువాకః

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో
నమః కకుభాయ నిషంగిణే స్తేనానాం పతయే నమో
నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః
సృకావిభ్యో జిఘాసద్భ్యో ముష్ణతాం పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తం చరధ్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో
నమః ఇషుమధ్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛధ్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్ధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమ స్తిష్ఠధ్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః

కులు ఞ్చానాం పతయే నమో నమోశ్వపతిభ్య స్త్రీణి చ

ఇతి తృతియోఽనువాకః
అథ చతుర్థోఽనువాకః

నమ ఆవ్యధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో నమ
ఉగణాభ్యస్తృగ్‍ంహతీభ్యశ్చ వో నమో నమో
గృత్సేభ్యో గ్రుత్సపతిభ్యశ్చ వో నమో నమో
వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో
గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో
మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో
రథిభ్యోరథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యః

రథపతిభ్యశ్చ వో నమో నమః
సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమః
క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమ
స్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః
కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః
పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమ
ఇషుకృద్భ్యో ధన్వకృధ్భ్యశ్చ వో నమో నమో
మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో నమః
శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః

రథేభ్యః శ్వపతిభ్యశ్చ ద్వేచ

ఇతి చతుర్థోఽనువాకః
అథ పంచమోఽనువాకః  

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ
నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్ధ్వనే చ

నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ్ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ

సంవృద్ధ్వనే చ పంచవిగ్‍ం శతిశ్చ

ఇతి పంచమోఽనువాకః  

అథ షష్ఠోఽనువాకః

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ
నమః పూర్వజాయ చాపరజాయ చ
నమో మధ్యమాయ చాపగల్భాయ చ
నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ
నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ
నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ
నమః శ్లోక్యాయ చావసాన్యాయ చ
నమో వన్యాయ చ కక్ష్యాయ చ
నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ
నమః శూరాయ చావభిన్దతే చ
నమో వర్మిణే చ వరూథినే చ
నమో బిల్మినే చ కవచినే చ
నమః శ్రుతాయ చ  శ్రుతసేనాయ చ

ప్రతిశ్రవాయ చ పంచవిగ్‍ంతిశ్చ

ఇతి షష్ఠోఽనువాకః
అథ సప్తమోఽనువాకః 

నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ ఈఘ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ

వైశన్తాయ చ త్రిగ్‍ం శచ్చ

ఇతి సప్తమోఽనువాకః

అథ అష్టమోఽనువాకః

నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ
నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమస్తారాయ నమః శంభవె చ మయోభవె చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ  చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చావార్యాయ చ
నమః ప్రతరణాయ చోత్తరణాయ చ
నమ ఆతార్యాయ చాలాద్యాయ చ
నమః శష్ప్యాయ చ ఫేన్యాయ చ నమః
సికత్యాయ చ ప్రవాహ్యాయ చ

శివతరాయ చ త్రిగ్‍ంశచ్చ

ఇతి అష్టమోఽనువాకః
అథ నవమోఽనువాకః

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్‍ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్‍ంసవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ

నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్‍ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః

ఉలప్యాయ చ త్రయస్త్రిగ్‍ంశచ్చ

ఇతి నవమోఽనువాకః
అథ దశమోఽనువాకః

ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మారో మో ఏషాం కిన్చనామమథ్

యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహ భేషజీ
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే

ఇమాగ్‍ంరుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం
యథా నః శమసధ్ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే ఆస్మిన్ననాతురం

మృడా నో రుద్రోతనో మయస్కృధి క్షయద్వీరాయ నమసా విధేమ తే
యచ్ఛం చ యోశ్చ మనురాయజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ

మా నో మహాన్తముత మా నో అర్భకం
మా న ఉక్షంత ముత మా న ఉక్షితం
మా నో వధీః పితరం మోత మాతరం ప్రియా మానస్తనువో రుద్ర రీరిషః

మానస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః
వీరాన్మా నో రుద్ర భామితోఅవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే

ఆరాత్తే గోఘ్న ఉత్త పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మే తే అస్తు
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ నః శర్మ యచ్ఛ ద్విబర్హాః

స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం
మ్రుడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః

పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతిరఘాయోః
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ

మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ
పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం విభ్రదాగహి

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః
యాస్తే సహస్రగ్‍ం హేతయోఽన్యమస్మన్నివపన్తు తాః

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హ్తయః
తాసామీశానో భగవః పరాచీనానా ముఖా కృధి

అస్మిగ్గ్‍ం స్తనువ స్తుహి పినాక మేకాన్న త్రిగ్‍ం శచ్చ

ఇతి దశమోఽనువాకః
అథ ఏకాదశోఽనువాకః

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యాం
తేషాగ్‍ంసహస్రయోజనేఽధన్వాని తన్మసి

అస్మిన్ మహత్యర్ణవేఽంతరిక్షే భవా అధి
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్‍ం రుద్రా ఉపశ్రితాః
యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషంగిణః
య ఏతావంతశ్చ భూయాగ్‍ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే
తేషాగ్‍ంసహస్రయోజనే  అవధన్వాని తన్మసి
నమో రుద్రేభ్యో యే పృథివ్యాం యేఽంతరిక్షే
యే దివి యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ
ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో
నమస్తే నో మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి
తం వో జంభే దధామి

తీర్థాని యశ్చ షట్చ

ఇతి ఏకాదశోఽనువాకః

త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు
యో రుద్రో విశ్వా భువనాఽఽవివేశ
తస్మై రుద్రాయ నమో అస్తు

తముష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నభోభి ర్దేవమసురం దువస్య

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః
అయం మే విశ్వాభేషజోఽయం శివాభిమర్శనః

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి
ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ
నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి

!!ఓం శాంతిః శాంతిః శాంతిః!!

ఇతి శ్రీకృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహితాయాం
తాత్పర్యము:

మొదటి అనువాకము: 

భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక.

రెండవ అనువాకము:

జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు. స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.

మూడవ అనువాకము:

శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

నాలుగవ అనువాకము:

దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

అయిదవ అనువాకము:

సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో  ఉన్నరుద్రునికి నా నమస్కారములు.

ఆరవ అనువాకము:

అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు,   వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు,  గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

ఏడవ అనువాకము:

పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు,  మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను,  వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.

ఎనిమిదవ అనువాకము:

ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు,  రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు

తొమ్మిదవ  అనువాకము:

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు,  ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో,  మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు,  ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు,  కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.  

పదవ అనువాకము:

పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు.  మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక.  నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక.  ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము.  భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా!  శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర!  నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.

పదకొండవ అనువాకము: 

ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
!!ఓం శాంతిః శాంతిః శాంతిః!!